సింహాచలం: సింహగిరి మాస్టర్ప్లాన్ మార్పులు–చేర్పులపై దేవదాయశాఖ టెక్నికల్ అడ్వైజర్ కొండలరావు బుధవారం పరిశీలన జరిపారు. 2000 సంవత్సరం నుంచి సింహగిరి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులు ప్రారంభమవగా, ఆరేళ్ల క్రితం వరకు జరిగిన అభివృద్ధి పనులతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ తర్వాత సింహగిరిపై కొన్ని అభివృద్ధి పనుల్లో మార్పులు చేర్పులతోపాటు, ఏడాదిన్నర కిందట ప్రసాద్ పథకం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులతో పాటు ఇంకా దేవస్థానం తరఫున చేయాల్సిన అభివృద్ధి పనుల వివరాలను చేర్చి మాస్టర్ ప్లాన్ని పక్కాగా తయారుచేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ టెక్నికల్ అడ్వైజర్ తన బృందంతో వచ్చి ప్రసాద్ పథకం పనులను పరిశీలించారు. సింహగిరిపై గంగధార, అన్నప్రసాదం, బస్టాండ్, కొండదిగు వ పలు ప్రదేశాల్లో తిరిగారు. కొండపైనున్న ప్రాచీన రామాలయం, శివాలయాల అభివృద్ధిపై చర్చించారు. ఏయే అభివృద్ధి పనులు అవసర మో అధికారులు, వైదికులతో చర్చించి పక్కాగా మాస్టర్ ప్లాన్ని రూపకల్పనకు నివేదికలను దేవదాయశాఖ కమిషనర్కు పంపిస్తామన్నారు. ఆయన వెంట దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, రాంబాబు, టూరిజం ఈఈ రమణ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment