పసుపు, పిప్పళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పసుపు, పిప్పళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలి

Published Sat, Mar 8 2025 2:18 AM | Last Updated on Sat, Mar 8 2025 2:13 AM

పసుపు, పిప్పళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలి

పసుపు, పిప్పళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలి

గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి

సురేంద్ర

పెదబయలు: గిరిజన రైతులు పండించిన పసుపు, పిప్పళ్ల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు పండించిన పసుపు, పిప్పళ్ల పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. ప్రస్తుతం కిలో పసుపు ధర రూ.130 ఉందని, పిప్పళ్ల ధర రూ.340 ఉందని చెప్పారు. పసుపు రూ.300 , పిప్పళ్లు రూ.500 గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, పోరా త్రినాఽఽథ్‌, రాందాసు, బొండా గంగాధరం, బుజ్జిబాబు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement