చికిత్స పొందుతూ గిరిజనుడు మృతి
మారేడుమిల్లి : చెట్టుపై నుంచి జారిపడి గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు. మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామానికి చెందిన కుండ్ల సురేష్ రెడ్డి గ్రామ సమీపంలోని చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తుండగా, ప్రమాదవశాతుత్త కింద జారి పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలైయ్యాయి. అతని మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించగా, అక్కడ నుంచి రంపచోడవరం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు బంధవులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment