త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి బొత్స | AP Minister Botsa Satanarayana Comments On Tidco Houses In Amaravati | Sakshi
Sakshi News home page

త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి బొత్స

Jul 28 2021 1:30 PM | Updated on Jul 28 2021 1:32 PM

AP Minister Botsa Satanarayana Comments On Tidco Houses In Amaravati - Sakshi

అమరావతి: టిడ్కో, మెప్మా, బ్యాంక్ సమన్వయకర్తలతో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో  2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా, మౌళిక వసతుల కల్పన పనులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

లబ్ధిదారులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పనుల పురోగతిపై ప్రతివారం సమీక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు చేసే ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement