
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన కుడికాలుకు గాయం అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మళ్లీ వాపు రావటంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లారు.
ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు డాక్టర్ అనిల్కుమార్, మణిపాల్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో సీఎం జగన్కు సాధారణ వైద్యపరీక్షలు, స్కానింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు.