రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్‌కు వాయిదా | Revenue Conferences Postponed to September: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్‌కు వాయిదా

Published Wed, Aug 14 2024 6:03 AM | Last Updated on Wed, Aug 14 2024 6:03 AM

Revenue Conferences Postponed to September: Andhra Pradesh

సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు రెవె­న్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడు­తూ.. ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్‌ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సదస్సుల్లో మొదటి 45 రోజులు భూ వివా­దాలు, రీ–సర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజు­ల్లో అర్జీ­లపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామ­న్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభు­త్వం దృష్టికి వచ్చిందన్నారు. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకో­వచ్చనే’ పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి నిజమైన అసైనీలకు న్యాయం చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement