
సాక్షి, తిరుపతి : ఎస్వీబీసీ నూతన భవనాలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2007 లో ఎస్వీబీసీ కి రూపకల్పన చేశారని, ఆయన అనుమతితోనే ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. 2008 ఏప్రిల్ 7 న టెస్ట్ సిగ్నల్ నిర్వహించగా, అదే ఏడాది జులైలో పూర్తి ప్రసారాలు ప్రారంభం అయ్యాయని గుర్తుచేశారు. తక్కువ కాలంలోనే ఎస్వీబీసీ భక్తుల మన్నన్నలు పొందిందని, తదనంతరం 2017లో తమిళ చానల్ కూడా ప్రారంభం అయినట్లు వెల్లడించారు.
ఇక నూతన భవనాల్లో రెండు స్టూడియోలు , టేలి పోర్టులు ఉన్నాయని తెలిపారు. ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ చానల్ గా ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు కోరామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 4 కోట్ల రూపాయలు రాగా, భక్తుల కోరిక మేరకు త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా చానళ్లు పెడుతున్నట్లు వెల్లడించారు. ఎస్వీబీసీ ని పూర్తి హెచ్డి చానల్ గా మార్చుతున్నామని స్పష్టం చేశారు. (ఆమె జాతీయ నాయకురాలో లేక జాతి నాయకురాలో..)