
మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి. త్రివేణి సంగమంలో తమ పాపాలను కడుక్కోవడానికి కొందరు వస్తుంటే మరికొందరు ఎప్పుడో దూరమైన తమ కుటుంబాలతో తిరిగి కలుస్తున్నారు. కొందరికి మాత్రం పెద్ద జనసమూహాల మధ్య కొత్త వ్యాపార ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది యాత్రికులను ఆకర్షించింది. అయితే ప్రయాణం చేయలేని వారి కోసం, స్థానిక ఔత్సాహిక ఎంట్రాప్రెన్యూర్ దీపక్ గోయల్ 'డిజిటల్ స్నాన్' (Digital Snan) సర్వీస్ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భక్తులు సంగమంలో స్నానం కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపవచ్చు. ఇందుకోసం అతను ఒక్కొక్కరికి రూ.1,100 ధర నిర్ణయించాడు.
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
మహా కుంభమేళాలో డిజిటల్ స్నానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమర్శలతోపాటు ఉత్సుకతనూ రేకెత్తించింది. కొంతమంది యూజర్లు ఈ ఆలోచనను విశ్వాస దోపిడీ అంటూ విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు అక్కడికి వెళ్లలేని వారికి ఇది అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: ‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!
ఆధునిక సాంకేతికతతో విశ్వాసం ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆన్లైన్లో దాని గురించి ఒక కరపత్రాన్ని పంచుకున్నప్పుడు ఇలాంటి 'వాట్సాప్ సాల్వేషన్' సర్వీస్ దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి సర్వీస్లు ఆధ్యాత్మికపరమైన ప్రామాణికతను పలుచన చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్రపంచంలోనూ సంప్రదాయానికి ప్రాధాన్యత ఎలా కొనసాగుతోందో కూడా అవి తెలియజేస్తున్నాయి.
Digital Kumbh Snan 😭😭 and people are even paying him 👇
pic.twitter.com/qGBr168p0f— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 21, 2025
Comments
Please login to add a commentAdd a comment