bath
-
ఐస్ బాత్ థెరపీ అంటే ఏమిటి? వ్యాయామం తరువాత ఎందుకు చేస్తారు?
గత కొంతకాలంగా ‘ఐస్ బాత్’(Ice bath) క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆరోగ్యం కోసం చాలామంది ఐస్ బాత్ థెరపీని ఆశ్రయిస్తున్నారు. గతంలో అథెట్లు మాత్రమే ఐస్ బాత్ చేసేవారు. ఐస్ బాత్ అంటే చిన్నపాటి ఐస్ ముక్కలను బాత్ టబ్లో నింపి, ఆ నీటితో కాసేపు ఉండి, స్నానం చేయడం.ఐస్ బాత్ సమయంలో ఆ నీటి ఉష్ణోగ్రత(Temperature) 15 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. కొందరు ముంచు ముక్కలను అధికంగా వేసిన నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. గత కొంతకాలంగా ఐస్ బాత్ను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను పలువురు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.ఐస్ బాత్ చేస్తున్న చాలామంది వ్యాయామం తరువాత వచ్చే అలసట నుంచి ఇది ఉపశమనం(Relief) కల్పిస్తుందని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు. శారీరక నొప్పులను తగ్గించేందుకు ఐస్ బాత్ ఉపయుక్తమవుతుందని పలువురు వ్యాయామ నిపుణులు తెలిపారు. వ్యాయామం చేసిన తరువాత ఐస్ బాత్ చేస్తే శరీర కండరాలకు తిరిగి శక్తి లభిస్తుందని, వాటికి ఫ్లెక్సిబులిటీ వస్తుందని చెబుతారు. అలాగే వ్యాయమం అనంతరం వచ్చే వాపులను ఐస్ బాత్ తగ్గిస్తుంది.ఐస్ బాత్ వలన ప్రయోజనాలు ఉన్నట్లు గానే, హాని కూడా ఉంది. తరచూ ఐస్బాత్ చేయడం వలన శరీరానికి వ్యాయామం ద్వారా అందే శక్తి మందగిస్తుంది. అత్యంత చల్లని నీటిలో స్నానం చేస్తే కోల్డ్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్ బాత్ చేస్తున్న సమయంలో వేగంగా గాలి పీల్చుకోవడం వలన బ్లడ్ ప్రజర్ పెరిగే అవకాశం ఉంది. ఇది అనారోగ్యానికి దారి తీయవచ్చు. ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: Madhya Pradesh: ఆస్పత్రిలో పేలిన ఏసీ.. వ్యాపించిన మంటలు -
మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం! వీడియో వైరల్
మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి. త్రివేణి సంగమంలో తమ పాపాలను కడుక్కోవడానికి కొందరు వస్తుంటే మరికొందరు ఎప్పుడో దూరమైన తమ కుటుంబాలతో తిరిగి కలుస్తున్నారు. కొందరికి మాత్రం పెద్ద జనసమూహాల మధ్య కొత్త వ్యాపార ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది యాత్రికులను ఆకర్షించింది. అయితే ప్రయాణం చేయలేని వారి కోసం, స్థానిక ఔత్సాహిక ఎంట్రాప్రెన్యూర్ దీపక్ గోయల్ 'డిజిటల్ స్నాన్' (Digital Snan) సర్వీస్ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భక్తులు సంగమంలో స్నానం కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపవచ్చు. ఇందుకోసం అతను ఒక్కొక్కరికి రూ.1,100 ధర నిర్ణయించాడు.సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలుమహా కుంభమేళాలో డిజిటల్ స్నానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమర్శలతోపాటు ఉత్సుకతనూ రేకెత్తించింది. కొంతమంది యూజర్లు ఈ ఆలోచనను విశ్వాస దోపిడీ అంటూ విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు అక్కడికి వెళ్లలేని వారికి ఇది అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: ‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!ఆధునిక సాంకేతికతతో విశ్వాసం ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆన్లైన్లో దాని గురించి ఒక కరపత్రాన్ని పంచుకున్నప్పుడు ఇలాంటి 'వాట్సాప్ సాల్వేషన్' సర్వీస్ దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి సర్వీస్లు ఆధ్యాత్మికపరమైన ప్రామాణికతను పలుచన చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్రపంచంలోనూ సంప్రదాయానికి ప్రాధాన్యత ఎలా కొనసాగుతోందో కూడా అవి తెలియజేస్తున్నాయి.Digital Kumbh Snan 😭😭 and people are even paying him 👇pic.twitter.com/qGBr168p0f— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 21, 2025 -
ఇంటి నుంచే కుంభమేళా స్నానం.. ఎలాగంటే..
మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అయితే పలు కారణాల దృష్ట్యా అందరికీ కుంభమేళాకు వెళ్లే అవకాశం లభించదు. అలాంటప్పుడు చింతించకుండా ఉండేందుకు ఒక మార్గాన్ని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు.కుంభమేళాకు వెళ్లే అవకాశం లేనివారు ఈ మేళాకు వెళ్లినవారిని అడిగి కుంభమేళా జలాలను తీసుకోవాలని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ఆ నీటిని మీ ఇంటిలోని నీటి బకెట్లో వేసుకుని, ఆ నీటితో స్నానం చేయాలని తెలిపారు. ఇలా చేయడం ద్వారా కుంభస్నానం చేసినంతటి ఫలితాలనే పొందుతారని శంకరాచార్య స్వామి అన్నారు. మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నుంచి నీటిని, ప్రసాదాన్ని పంపేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటిని సంప్రదించి మన ఇంటికి నీటిని తెప్పించుకోవచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ‘త్రివేణి సంగమ్ వాటర్ డెలివరీ సర్వీస్’ కుంభమేళా నుండి నీటిని ఇంటికి నేరుగా డెలివరీ చేస్తోందని తెలిపారు.ఏదైనా కారణం చేత మహా కుంభమేళా నీటిని మీరు పొందలేకపోతే మీ ఇంట్లో ఉంచుకున్న గంగా జలంలోని కొన్ని చుక్కలను బకెట్లో కలుపుకుని స్నానం చేయడం ద్వారా కూడా పుణ్యం పొందవచ్చని శంకరాచార్య స్వామి తెలిపారు. ఇలా స్నానం చేసిన తరువాత దానధర్మాలు చేయడం ఉత్తమఫలితాలనిస్తుందని తెలియజేశారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం -
మూడ్ని బట్టి స్నానం చేయిస్తుంది!
అద్భుతమైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన జపాన్ తాజాగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి.. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆవిష్కరించింది. వామ్మో..! ఏంటిది అనుకోకండి. మాములుగా మనమే స్నానం చేయడం అనేది పాత ట్రెండ్. దీన్ని కూడా మిషన్ సాయంతో తొందరగా పనికానిస్తే.. అనే వినూత్న ఆలోచనతో జపాన్ చేసిన ఆవిష్కరణ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మాదిరి "హ్యూమన్ వాషింగ్ మెషిన్" అన్నమాట. ఏంటీ మిషన్తో స్నానమా అని విస్తుపోకండి. ఇది వెల్నెస్ని దృష్టిలో ఉంచుకుని, అత్యాధుని ఫీచర్లతో రూపొందించారు. అసలేంటీ మిషన్ ? ఎలా పనిచేస్తుంది..? తదితరాల గురించి తెలుసుకుందామా..!ఈ "హ్యూమన్ వాషింగ్ మెషిన్"ని ఒసాకాకు చెందిన సైన్స్ కో కంపెనీ ఏఐ సాంకేతికతో రూపొందించింది. దీన్ని జపాన్లో మిరాయ్ నింగెన్ సెంటకుకిగా పిలుస్తారు. ఈ మిషన్ కేవలం 15 నిమిషాల్లోనే మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తుందట. అలాగే మంచి విశ్రాంతితో కూడిన మానసిక ఆనందాన్ని అందిస్తుందట. దీంట్లో కేవలం స్నానమే కాదు మనసు రిలాక్స్ అయ్యేలా చక్కటి వేడినీళ్ల మసాజ్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే ఐఏ సెన్సార్లు మానవుల బాడీ మూడ్ ఎలా ఉందో టెస్ట్ చేసి దానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత ఆటోమెటిక్గా సెట్ అవుతుందట. అలాగే మన భావోద్వేగా పరిస్థితికి అనుకుణంగా మంచి విజువల్స్ని కూడా ప్రొజెక్ట్ చేస్తుందట. కేవలం పరిశుభ్రత మాత్రేమ గాక మంచి వెల్నెస్ అనుభవాన్ని కూడా అందిస్తుందని ఈ ఒసాకా కంపెనీ చైర్మన్ యసుకి అయోమా చెబుతున్నారు. ముఖ్యంగా అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ మిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇది కొత్తదేం కాదు..ఇంతకు ముందే ఈ మానవ వాషింగ్ మిషన్ని రూపొందించారు. దీని తొలి వర్షన్ని 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పోలో సాన్యో ఎలక్ట్రిక్ కో పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ..కమర్షియల్ ప్రొడక్ట్గా ప్రజల్లోకి బాగా వెళ్లలేదు. కానీ ప్రస్తుతం ఏఐ సాంకేతికతో కూడిన ఈ మిషన్ని అత్యాధునిక ఫ్యూచర్లతో డిజైన్ చేశారు. ఈ ప్రొడక్ట్ని పానాసోనిక్ హోల్డింగ్స్ కార్పోరేషన్ కంపెనీ తీసుకురానుంది. ఈ ఏడాది ఒసాకా కన్సాయ్ ఎక్స్పోలో ఈ సరికొత్త సాంకేతిక హ్యూమన్ వాషింగ్ మిషన్ని ప్రదర్శించనున్నారు. అక్కడ దాదాపు వెయ్యిమందికి పైగా అతిథులు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో.. ప్రత్యక్షం అనుభవం ద్వారా తెలుసుకోనున్నారు. అలాగే ఈ మిషన్ పనితీరు వారెంటీల గురించి సంకిప్త సమాచారం గురించి వివరింనుంది సదరు కంపెనీ ఒసాకా. అయితే సదరు కంపెనీ దీని ధర ఎంతనేది ఇంక ధృవీకరించలేదు. కాగా, ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆఖరికి వ్యక్తిగత శుభ్రతను కూడా హై-టెక్ లగ్జరీగా మార్చడం జపాన్కే చెల్లిందని ఒకరూ, ఇంత చిన్న పనికోసం అంతప్రయాస పడ్డారా మీరు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. 🚨AI-POWERED HUMAN WASHING MACHINE: BECAUSE WHO HAS TIME TO SCRUB?Japan’s "Mirai Ningen Sentakuki" is here to wash your...everything. A 15-minute AI-powered bath capsule uses jets, microbubbles, and calming videos to cleanse bodies and soothe egos.Chairman Yasuaki Aoyama… pic.twitter.com/0GBwOtCV9r— Mario Nawfal (@MarioNawfal) December 3, 2024 (చదవండి: ‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!) -
సమ్మర్లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్ప్రైజింగ్ విషయాలు తెలుసా?
ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా స్నానం చేయడం దాదాపు అందరికీ అలవాటు. కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడి నీటి ( మరీ వేడి నీళ్లు కాదు) స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి సీజన్ ఏదైనా వామ్ వాటర్తో స్నానంతో శరీరం, మనస్సు సేద తీరుతాయి. మరి వేడి నీటి స్నానంతో ఇంకా ఎలాంటి ప్రయో జనాలున్నాయో చెక్ చేద్దామా? చలికాలంలో వేడి స్నానం చేయడం కామన్. కానీ వేసవిలో కూడా వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అన్ని సీజన్లలో వేడి స్నానం చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుండెజబ్బులు, అధిక బీపీ ఉన్న వారు కొంచెం అప్రతమత్తంగా ఉండాలి. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి, కండరాలకు వేడి నీటి స్నానం హాయినిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు. కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోసహాయపడుతుంది ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి చాలా కామన్ అయిపోయింది. అందువల్ల, మనస్సు ప్రశాంతంగా, పూర్తిగా రిలాక్స్గా ఉండాలంటే వేడి స్నానం ఉత్తమం. ఇందులో ఎప్సమ్ లవణాలు, మంచి సువాసన గల నూనెలు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల వల్ల చర్మ రంధ్రాలు తెరుచు కుంటాయి .పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అందరికీ ఆరోగ్యకరమైన చర్మాన్నే కోరుకుంటారు. ఇందుకోసం కొంతమంది సౌందర్య సాధనాలు ఆశ్రయిస్తారు. కానీ, రోజువారీ వేడి స్నానంలో రహస్యాన్ని మర్చిపోకూడదు. వేడినీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మ కణాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మృదువైన స్కిన్ సొంతమవుతుంది. ఏర్పడుతుంది. రక్త ప్రసరణకు: శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర భాగాల సరైన పనితీరు సరైన రక్తప్రసరణచాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది కీలకం. మంచి నిద్రకు: వేడి నిటి షవర్ కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ప్రశాంతమైన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు: జుట్టుకు చాలా ప్రయోజనకరం. స్కాల్ప్ లోని సూక్ష్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి, తేమ లోపలికి వెళ్లేలా చేస్తుంది. స్కాల్ప్ను శుభ్రనడుతుంది. బాగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకే కాదు, చుండ్రు లాంటి నిరోధానికి కూడా కీలకం. ఇక శీతాకాలంలో అయితే జలుబు , ఫ్లూ బారిన పడటం చాలా సాధారణం. అందుకే వేడి షవర్ తలనొప్పి, ముక్కు దిబ్బడ, జలుబుకి మంచి ఉపశమనం. టిప్: ఎప్సమ్ లవణాలు, 10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్,అర కప్పు బేకింగ్ సోడా కలుపుకొని వారానికి ఒకసారి 20 నిమిషాలు, హాట్ బాత్ టబ్లో కూర్చోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది. ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గిస్తుంది, శరీర pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. -
USA: ‘ఈసారి నేను గెలవకపోతే’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికల్లో తన గెలుపునకు సంబంధించి దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ తనతోనే సాధ్యమని, బైడెన్తో కాదని చెప్పారు. ఒహియోలో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి బెర్నీ మొరినో తరపున ప్రచారం చేస్తూ శనివారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Here’s the whole clip of Donald Trump talking about the bloodbath. pic.twitter.com/pu8M35B5MR — Molly Pitcher (@AmericanMama86) March 17, 2024 ‘నేను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేను గనుక గెలవకపోతే ఈ దేశంలో మళ్లీ మీకు ఎన్నికలు ఉంటాయో లేదో చెప్పలేను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బైడెన్ క్యాంపెయిన్ టీమ్ స్పందించింది. ‘ట్రంప్ మళ్లీ జనవరి 6 (2021లో వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్పై దాడి జరిగిన రోజు)ను కోరుకుంటున్నాడు. ట్రంప్ తీవ్రవాద, కక్షపూరిత వైఖరికిగాను నవంబర్లో ప్రజలు అతడికి మళ్లీ ఓటమిని రుచి చూపించనున్నారు’ అని బైడెన్ టీమ్ ఎక్స్(ట్విటర్) పోస్టు చేసింది. Biden-Harris campaign statement on Trump tonight promising a “bloodbath” if he loses pic.twitter.com/8mBYh4QKnf — Biden-Harris HQ (@BidenHQ) March 17, 2024 కాగా, ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ పడ్డ జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల ప్రైమరీ బ్యాలెట్లలో వీరిద్దరే అధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్ అయ్యారు. 1952, 1956లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఒకసారి పోటీపడ్డ ఇద్దరు అభ్యర్థులు తిరిగి రెండోసారి పోటీపడ్డారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికాలో గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మళ్లీ ఈ ఏడాది ఎన్నికల్లో పోటీపడనుండటం విశేషం. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్ను పేల్చేసిన అమెరికా -
దేశవ్యాపంగా సంక్రాంతి సందడి
ఈరోజు మకర సంక్రాంతి. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees took a holy dip in the river Ganga in Haridwar, on the occasion of Makar Sankranti. pic.twitter.com/EpVlAdUKjS — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 వారణాసిలోని గంగా ఘాట్కు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.‘హర్ హర్ గంగా’ అని నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు ఖిచ్డీ సమర్పించారు. #WATCH | Uttar Pradesh: Devotees take a holy dip in the Ganga River in Varanasi on the occasion of Makar Sankranti. pic.twitter.com/IOQ6ernWSc — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఈ రోజున గంగా నదిలో స్నానమాచరించిన తర్వాత దానం చేయడం వల్ల సాధకునికి ఇహలోకం, పరలోకం రెండింటిలోనూ మంచి జరుగుతుందని చెబుతారు. #WATCH | West Bengal: Devotees take a holy dip and perform aarti in Gangasagar on the occasion of Makar Sankranti. pic.twitter.com/ywIq41tNz9 — ANI (@ANI) January 15, 2024 ఈ రోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి, వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | Uttar Pradesh: A large number of people gathered at the Gorakhnath Temple to offer 'Khichdi' on the occasion of Makar Sankranti pic.twitter.com/39nhmYFZ0L — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఇది కూడా చదవండి: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "Today is the auspicious occasion of Makar Sankranti. I extend my wishes of Makar Sankranti to all the devotees...It is celebrated across the country in different forms and names..." https://t.co/lAADGZSLZr pic.twitter.com/NAm4xa9BLd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 -
గంగా నదిలో స్నానానికి పోటెత్తిన జనం!
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ధార్మిక నగరమైన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుండే వివిధ గంగా ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. మకర సంక్రాంతి వేళ గంగాస్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితోపాటు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. అందుకే మకర సంక్రాంతి నాడు స్నానం చేయడం విశేషమైనదిగా భావిస్తారు. పురాణాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తరాయణ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పర్వదినాన మరణించిన వారికి మరుజన్మ ఉండదని చెబుతారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినంతనే ఉత్తరాయణ పర్వదినం ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు పేర్లతో జరుపుకుంటారు. కొన్నిచోట్ల మకర సంక్రాంతిగా, కొన్నిచోట్ల పొంగల్గా, మరికొన్ని చోట్ల ఉత్తరాయణ పండుగగా జరుపుకుంటారు. ఉత్తరాయణంలో పూర్వీకులకు పిండప్రదానం చేస్తే, వారు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతారు. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
శీతోష్ణస్నానం
వసంతకాలమే ఋతువుల రాణి అనుకుంటాం కానీ, హిమానీ నిబిడ హేమంతమూ, చలి వణి కించే శిశిరకాలం మాత్రం ఏం తక్కువ? ఆమాటకొస్తే ఏ ఋతువుకా ఋతువు జీవజాలాన్ని ఏకచ్ఛత్రంగా శాసించే మహరాణియే! మహరాణి అన్నప్పుడు ఆగ్రహానుగ్రహాలు సమపాళ్లలో ఉండకతప్పదు. అసలు మనం అల్లుకునే ఊహలు, కల్పించుకునే భావనలు, సృష్టించుకునే మాటల ఇరుకులో మనమే ఎలా బందీలమవుతామంటే; చన్నీళ్ళ, వేణ్ణీళ్ళ స్నానాలూ; పర్వదినాల్లో నదీ, సముద్రస్నానాలే తప్ప ఏటేటా నిండా మునిగే ఋతుస్నానాలు మనకు స్ఫురించవు. జ్యేష్ఠ – ఆషాఢమాసాల మహోష్ణంలోనూ, శ్రావణ – భాద్రపదాల కుంభవృష్టుల్లోనూ స్నానించినట్టే మార్గ శిర – పుష్యమాసాల్లో నిలువునా కోతపెట్టే శీతలస్నానాలే మనకు రాసిపెట్టి ఉంటాయి. ఇది ఋతు వుల రాణి ఆగ్రహపార్శ్వమైతే; హేమంత – శిశిరాలలో మిట్టమధ్యాహ్నం వేళ ఆరుబయటికో, డాబా మీదికో తరిమి శీతోష్ణస్నానంతో హాయిగొలపడం అనుగ్రహపార్శ్వం. హేమంతం కలిగించే ఆ హాయి ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటుందంటే, భక్త పోతన అంతటి వాడిలో కూడా అది రక్తిని రంగరించి రసికతను రాశిపోస్తుంది. శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసరికి చేమంతులు ధరించిన పూబంతుల కౌగిలిలో ఎందరో చలి భయాన్ని జయించారు కానీ; విరహులకు ఆ యోగం లేకుండా మన్మథుడు వేధించాడట. ఉత్తరపు గాలి అదే పనిగా విసురుతూ చీకాకు పెట్టే హేమంతరాత్రులలో మంచుకిరణాల రేరాజు మహాశత్రువయ్యాడట. ఎడమొహం, పెడమొహంగా ఉన్న దంపతులు కూడా రాజీపడిపోయి జంటగా చలిని జయించడానికి సిద్ధమ య్యారట. పగటి సమయం తగ్గి, అగ్ని ఆప్తమిత్రుడైపోయాడట. అతి శీతల దీర్ఘరాత్రుల పాలబడి లోకమంతా గడగడా వణికిపోయిందట. హిమం తాకిడికి కమలాలు బెదిరి తరిగి పోయాయట. ఆదికవి వాల్మీకి హేమంత చిత్రణలూ హృద్యంగా ఉంటాయి. పృథివి విరగబండుతుంది కానీ మంచు కసిపట్టినట్టు మనుషుల్ని కాల్చుకుతింటుంది. నీరూ, నీడా దుస్సహమవుతాయి. మధ్యా హ్నాలు సుఖసంచార సమయాలవుతాయి. సూర్యుడు దూరంగా జరిగిపోవడం వల్ల హిమాల యాలు మంచుతో పూర్తిగా గడ్డకట్టి సార్థకనామలవుతాయి. ఆకాశం కప్పు కింద నిద్రించడం మాని అందరూ ఇంటికప్పు కింద ముడుచుకుంటారు. సమస్త జనాన్ని ఇళ్ళల్లో బంధింపజేయగలిగిన హేమంత రుతురాజు యశస్సు దిక్కులను ఆవరించిందా అన్నట్టుగా మంచు సర్వత్రా కమ్ముకుందని మరో కవి వర్ణిస్తాడు. శీతఘాతానికి అన్ని జీవులూ సొమ్మసిల్లినా తను మాత్రం అచలంగాఉండి అందగించే భూదేవిని మెచ్చి ఆ హేమంత ప్రభువే వజ్రాలు కానుక చేశాడా అన్నట్టుగా ప్రాతర్వేళల లేత పచ్చికలపై మంచుబిందువులు రహించాయని ఇంకో కవి అభివర్ణన. నిత్యనూతనమవుతూ, ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు ఋతుచక్రం ఒక్కలానే తిరుగుతూ ఉంటుంది. ‘ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై; ఎప్పుడు కూడా ఇవాళ లాగే గాలులు వీచును, పూవులు పూచును’ అంటూ శిశువులకు హామీపత్రం రాసిస్తాడు మహాకవి. ‘రాత్రంతా మంచుముక్కలా బిగుసుకున్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండి తెరల కాంతిలోంచి జారుకుంటూ గడ్డిపరకలపై కన్ను తెరిచే’ దృశ్యమూ; ఉదయం తొడుక్కున్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్త సంతకాలు చేయడ’మూ (బి.వి.వి. ప్రసాద్) నేటి కవి దృష్టినీ సమానంగా ఆకర్షిస్తాయి. అలాంటిదే, ‘పటిక ముక్కల్లాంటి మంచుబిందువుల శీతాకాలంలో చెరువు తేటపడడమూ, అప్పుడే అడవి, ఆకాశం, చెరువు ఒకదాని సౌందర్యాన్ని ఒకటి ఆస్వా దించడమూ’ (కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ) కూడా! సంగీతాన్ని వాయుశిల్పంలా దర్శించిన మరో కవి (పసునూరు శ్రీధర్ బాబు) స్వనస్నానమాచరించి శీతాకాలపు గదిలో చుబుకంకింద వణికే పిడికెళ్లేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవలసిందేనంటాడు. ఏ ఋతువూ మరో ఋతువులా ఉండదు; ఒక ఋతువులోంచి మరో ఋతువులోకి మారి పోయే మన అనుభవమూ, అనుభూతీ ఒక్కలా ఉండవు. ప్రతి ఋతువులోనూ మనం పునర్జ న్మిస్తాం. ప్రతి ఋతువూ మనకు శైశవం నుంచి వార్ధక్యం వరకూ అన్ని దశలనూ చవిచూపి మరీ నిష్క్రమిస్తుంది. ప్రతి ఋతువులోకీ ఒక శిశువుగా కళ్ళు తెరుస్తాం. ఏటా పునర్జీవించే ఈ ఋత జన్మలను గణించకుండా ఒక్క జన్మనే ఊహించుకోవడం కూడా మనకు మనం విధించుకునే అజ్ఞానమే. అసలు జీవితమంటేనే ఋతువుల మధ్య నిరంతర సంచారం. సందర్భం వేరైనా మరో కవి(సిద్ధార్థ) అన్నట్టు, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి ‘అందరూ ఎవరికివారే కొత్తగా పుట్టి నడచుకుంటూ వెళ్లిపోతారు’. ఋతువులు, మాసాలు, సంవత్సరాలతో మన కేలండర్ మనకున్నట్టే ఈ విశ్వానికీ, అందు లోని ఈ భూగోళానికీ, అందులో మనం కూడా భాగమైన ప్రకృతికీ తనదైన కేలండర్ ఉంది.వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో భూమి ఎన్నో హిమప్రళయాలను చూసింది. వాటిలో చివరిదైన మంచుయుగం ఇరవయ్యారు లక్షల సంవత్సరాల క్రితం మొదలై పదకొండు వేలసంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని కూడా మంచు యుగపు అంతర్దశగానే చెబుతారు. శీతోష్ణాల నిరంతర సంఘర్షణ నుంచే జీవం పుట్టి నేటి రక రకాల రూపాల్లోకి పరివర్తన చెందింది. ఆ వైశ్విక ఋతుభ్రమణం మన చేతుల్లో లేనిది కనుక దాని నలా ఉంచితే; మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా భాగమైన ఋతుభ్రమణాన్ని మన చేతులారా గతి తప్పించకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే! -
వేడి నీళ్లు Vs చన్నీళ్లు.. ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది? మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది. -
4 డిగ్రీల చలిలో సమంత ఐస్బాత్.. ఎందుకలా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ మోడ్లో ఉన్నారు. స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి వింత ప్రదేశాలను సందర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్బాత్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ‘మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ ఐస్బాత్ థెరపీ చేసుకున్నారా?’అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా, గతంలో కూడా సామ్ ఐస్బాత్ చేసింది. ఐస్ గడ్డలు ఉన్న టబ్లో కూర్చొని ‘ఈ ఐస్ బాత్ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది’అని అప్పట్లో పేర్కొంది. (చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) ఐస్ బాత్ ఎందుకు చేస్తారు? చల్లటి నీటిలో కాసేపు అలానే ఉండటం ఐస్బాత్. క్రీడాకారులు, అధికంగా జిమ్ చేసేవారు అప్పుడప్పుడు ఐస్బాత్ చేస్తుంటారు. అలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల వ్యాయామం చేసి అలసిపోయిన కండరాలు త్వరగా రిలాక్స్డ్ స్థితిలోకి వస్తాయి. అలాగే రక్త ప్రసరణ సులభతరం అవుతుంది. హృదయ స్పందన రేటు సరిగా ఉంటంది. శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమంత ఎక్కువగా వ్యాయామం చేస్తుంది. అందుకే ఆమె ఐస్బాత్ చేసి ఉండోచ్చు. సినిమాలకు బ్రేక్ సమంత దాదాపు ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సమంత తరచూ అనారోగ్యానికి గురవుతుంది. అందుకే కొంతకాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సమంత నిర్ణయించుకున్నారట. అందుకే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి నిర్మాతలకు అప్పగిస్తున్నారట. ఏడాది కాలం పూర్తిగా తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటడెల్ వెబ్ సిరీస్తో పాటు ఖుషి సినిమా విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే. -
ఎండకు తట్టుకోలేక రోడ్డుమీద స్నానం చేసిన యువకుడు
-
రూ.10 పందెం గెలవడానికి నడిరోడ్డుపై యువకుడి స్నానం.. భారీ జరిమానా..!
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం కొందరికి మహా సరదా. వాటికి వచ్చిన లైక్స్ను చూసి తెగ మురిసిపోతుంటారు. తమను చాలా మంది ఆదరిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే రూ.10 బెట్ గెలవడానికి ఓ యువకుడు చేసిన పని ట్రాఫిక్ పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. అతనికి రూ.3500 జరిమానాను విధించారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. ఎమ్. ఫారూక్(24) సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి రకరకాల వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తుండేవాడు. తన పోస్టులకు మరిన్ని లైక్స్ను రాబట్టడానికి తన స్నేహితునితో పందెం వేశాడు. ఇందుకు రూ.10 ని పందెంలో వేశారు. గెలిచినవారు ఆ డబ్బులను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన వీడియోకు ఎక్కువ లైక్స్ రావడానికి ఫారూక్.. రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేశాడు. ఒంటిపై నీటిని పోసుకున్నాడు. కారణం అడగగా.. వేడిని తట్టుకోవడానికి అలా చేసినట్లు స్థానికులకు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన జిల్లా డీఎస్పీ జీ.జే. జవార్.. స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితునికి రూ.3500 జరిమానా విధించారు. చదవండి:కొంపముంచిన టిక్టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది! -
నడిరోడ్డుపై స్నానం.. నవ్వులపాలే కాదు జైలుపాలు కూడా!
వైరల్ వీడియో: సోషల్ మీడియాలో ఓవర్నైట్ సెలబ్రిటీగా, టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయేందుకు కొందరు చేసే ప్రయత్నాలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తి, ఓ యువతితో కలిసి స్కూటీపై స్నానం చేసిన వీడియో వైరల్ కాగా, దానికి పోలీసులు అంతే లెవల్లో రిప్లై ఇచ్చారు. థానే(మహారాష్ట్ర) ఉల్లాస్నగర్లోని ఓ సిగ్నల్ వద్ద ఆ ఇద్దరూ ఈ చేష్టలకు దిగారు. వెనక కూర్చున్న యువతి బకెట్లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తూ కనిపించింది. దారినపోయేవాళ్లంతా వాళ్ల వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. అయితే.. ఆ వీడియో వైరల్ కావడం, అది కాస్త థానే పోలీసుల దాకా చేరడం, వాళ్లూ స్పందించడం చకచకా జరిగిపోయాయి. వీ డిజర్వ్ బెటర్ గవర్నమెంట్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది. దీంతో స్పందించిన పోలీసులు.. సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే.. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు ఆ వీడియోను షేర్ చేసి మరీ చర్యలు తీసుకోవాలని కోరారు. నడిరోడ్డుపై పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడడిన కారణంగా అతనిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు సైతం అతనిపై కేసు నమోదు చేసి ఛలానా విధించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్ ఆదర్శ్ శుక్లా అట. తాను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్చేశాడతను. అయినా కూడా చర్యలు తప్పవని థానే పోలీసులు చెబుతున్నారు. @DGPMaharashtra @ThaneCityPolice This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa — WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023 -
బికినీలో రకుల్ ప్రీత్ బోల్డ్ ట్రీట్.. వీడియో అదిరిపోయిందిగా!
-
Viral Video: సబ్బు పెట్టి మరీ పాముకు స్నానం చేయించాడు
-
వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు!
ఇంతవరకు పాములకు సంబంధించిన భయానక స్టంట్లు చూశాం. వాస్తవానికి ఇది స్టంట్ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది కూడా. కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్ స్టంట్ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇన్స్ట్రాగామ్ వినియోగదారుడు ఎందుకు మహిళలు పురుషులకంటే ఎక్కవ కాలం జీవిస్తారో తెలుసా! అంటూ "చన్నీటితో కోబ్రాకి బాత్ " అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg) (చదవండి: ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా!) -
ప్రాంక్ పేరిట వెకిలి పని.. పోలీసుల రియాక్షన్
నలుగురికి ఇబ్బంది కలిగించకుండా.. నవ్వించేదే ప్రాంక్ అంటే. అలాంటిది.. ప్రాంక్ పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడే వాళ్లనే ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం. అభ్యంతకరంగా ఉండే కంటెంట్తోనూ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో వాళ్లను అనుసరించే వాళ్ల సంఖ్య సైతం పెరిగిపోతోంది. తాజాగా కేరళలో ప్రాంక్ పేరిట ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బైక్ మీద వెళ్తునే.. జోరువానలో అర్థనగ్నంగా స్నానం చేశారు. పైగా స్నానానికి సోప్ను సైతం ఉపయోగించారు. సిగ్నల్స్ దగ్గర కూడా వాళ్ల వెకిలి చేష్టలు కొనసాగాయి. అయితే.. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. యువకులను భరణిక్కవుకు చెందిన అజ్మల్, బాదుషాలుగా గుర్తించి.. కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన నేరానికి కేసు నమోదు చేసి.. ఐదువేల రూపాయల జరిమానా విధించారు. తాము నవంబర్ 1న సాయంత్రం ఓ స్పోర్ట్స్ ఈవెంట్కు హాజరై వస్తున్నామని, వాన కురుస్తుండడంతో సరదా కోసం అలా ప్రాంక్ వీడియో చేశామని ఇద్దరు యువకులు వెల్లడించారు. -
షాకింగ్ ఘటన: మగ సంతానం కోసమని.. భార్యకు అందరి ముందు..
పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త. మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్ఘడ్కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ ! -
ఎమ్మెల్యే కళ్లెదుటే.. బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం, యోగా..
నిత్యం వందలు, వేల సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారులు దాదాపు రాత్రింబవళ్లు రద్దీగా ఉంటాయి. అలాంటి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం పడుతున్నంత సేపు వరద నీటితో రోడ్లు నిండిపోతే.. వాన వెలిసిన తర్వాత ఎక్కడ చూసినా సగం కొట్టుకుపోయిన రోడ్లు, గుంతలు, గతుకులే దర్శనమిస్తాయి.. ఇలాంటి రహదారులపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదని తాజాగా కేరళలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇటీవల కురిసిన వర్షానికి మలప్పురం ప్రాంతంలోని రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అయితే దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఓ వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగాడు. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ముందు ఎమ్మెల్యే ఎదురుగానే గుంతల్లోని నీటిలో స్నానం చేశాడు. ఎమ్మెల్యే కారు సంఘటనా స్థలానికి చేరుకోగానే గుంతలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో యోగా చేశాడు. చెప్పులు శుభ్రం చేసుకొని, బట్టలు కూడా ఉతుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలోని వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు. #WATCH | Kerala: A man in Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga in a water-logged pothole in front of MLA on the way pic.twitter.com/XSOCPrwD5f— ANI (@ANI) August 9, 2022 కాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి వ్యతిరేకంగా కేరళలో గత వారం అనేక నిరసనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఏ రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇదిలా ఉండగా అయిదు రోజుల క్రితం ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంతల కారణంగా 52 ఏళ్ల వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతనిపై ట్రక్కు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో వారం రోజుల్లోగా తమ ఆధీనంలోని ప్రతి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. -
నదీస్నానంలో భార్యకు ముద్దు.. చితకబాదిన జనం
లక్నో: పవిత్ర నదీస్నానంలో భార్యకు ముద్దు పెట్టాడంటూ ఓ వ్యక్తిని తిడుతూ.. చితకబాదారు ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో. సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగగా.. భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న వ్యక్తులు రికార్డు చేయగా.. కొందరు అతన్ని బయటకు లాగేసి చెయ్యి చేసుకున్నారు. ఇది పవిత్రమైన నేల. అయోధ్యలో ఇలాంటి పనులు సహించం అంటూ రామ భక్తుడిగా ఓ వ్యక్తి మాట్లాడడం ఆ వీడియోలో చూడొచ్చు. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO — Suneet Singh (@Suneet30singh) June 22, 2022 -
వార్నీ.. ఇదేం స్నానంరా బాబూ? తేడాలొస్తే మాత్రం..
కాస్త వేడిగానో, చల్లగానో నీళ్లతో స్నానం ఎవరైనా చేస్తారు.. మరి కరెంట్తో స్నానం చేస్తారా?.. వామ్మో ఇదేం పిచ్చి? ప్రాణాలు తీసే కరెంట్తో స్నానం చేయడం ఏమిటి? అంటారా.. ఇది నిజమే! జపాన్లో చాలా మంది అప్పుడప్పుడూ ఇట్లా కరెంట్ స్నానాలు చేస్తూనే ఉంటారు. దానికి ప్రత్యేకంగా ‘డెంకి బురో (ఎలక్ట్రిక్ బాత్)’ అని పేరు కూడా ఉంది. దీని సంగతేంటో తెలుసుకుందామా?.. నీళ్లకు, కరెంట్కు లింకు పెట్టొద్దని చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. వాటర్ హీటర్లు, గీజర్లు వంటివాటితో ప్రమాదాలు జరగడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ అదంతా హైఓల్టేజీ (ఎక్కువ తీవ్రత ఉన్న) కరెంట్. మరి డెంకి బురో స్నానాలకు వాడేది లోఓల్టేజీ కరెంట్. అంటే కొద్దిగా షాకి చ్చినట్టు అనిపిస్తూ.. మరీ పెద్దగా ఇబ్బంది కలగని కరెంట్ అన్నమాట. మన ఇళ్లలో వాడే ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలకు సరఫరా అయ్యే విద్యుత్ 220 నుంచి 240 వోల్టుల మధ్య ఉంటుంది. డెంకి బురోలో 5 నుంచి 15 వోల్టేజీల మధ్య తీవ్రత ఉండే కరెంటును ఉపయోగిస్తారు. ఇంటా, బయటా.. ప్రత్యేక పూల్స్.. జపాన్లో డెంకి బురో స్నానాల కోసం ప్రత్యేకంగా బాత్టబ్లు, చిన్నపాటి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. వాటిలో రెండు వైపులా లోహపు పట్టీలను అమర్చి.. విద్యుత్ వైర్లో ఉండే రెండు తీగలను వాటికి అనుసంధానం చేస్తారు. ఆ లోహపు పట్టీలు మునిగేదాకా నీటిని నింపి, విద్యుత్ సరఫరా చేస్తే.. ఓ వైపు నుంచి మరోవైపునకు కరెంటు సరఫరా అవుతుంది. కొందరు వీటిని ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటారు. బయట పబ్లిక్ బాత్ హౌజ్లలో కూడా డెంకి బురో సౌకర్యం ఉంటుంది. మనం బయటికి వెళ్లినప్పుడు ఏదో హోటల్కు వెళ్లి కాఫీ, చాయ్ తాగుతుంటాం కదా. అలా జపాన్లో కొందరు రిలాక్సేషన్ కోసం బాత్హౌజ్లకు వెళ్లి కరెంట్ స్నానాలు చేస్తుంటారు. జపాన్లో ఇలా కరెంట్ స్నానాల అలవాటు 18వ శతాబ్దం నుంచే ఉందట. ఎందుకిలా.. ఏమిటి లాభం? ఈ బాత్టబ్, మినీ స్విమ్మింగ్ పూల్స్లో స్నానం చేసేవారికి స్వల్పంగా కరెంట్ షాక్ తగులుతూ ఉంటుంది. ఇది నాడుల ద్వారా వ్యాపిస్తూ.. కండరాల్లో సన్నగా వణుకు (జలదరింపు) పుట్టిస్తుంది. అలసిపోయిన కండరాలు దీనితో రిలాక్స్ అవుతాయని.. ముఖ్యంగా కీళ్లు, వెన్ను, మెడ నొప్పి (రుమాటిజం, స్పాండిలైటిస్) వంటి సమస్యలున్న వారికి మంచి రిలీఫ్ను ఇస్తుందని చెప్తారు. ► అమెరికా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు ఉపశమనం కోసం డెంకి బురో తరహాలో ఎలక్ట్రోథెరపీ ఇవ్వడం గమనార్హం. ► ఇప్పటికీ పలు రకాల వైద్య చికిత్సల్లో వివిధ వోల్టేజీల్లో విద్యుత్ షాక్ను ఇస్తుంటారు. స్వల్ప స్థాయి కరెంట్ షాక్ వల్ల శరీరంలో నాడులు స్పందించి మెదడుకు సిగ్నల్స్ పంపుతాయని, ఈ క్రమంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుం దని కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు. ► మరో పరిశోధన ప్రకారం.. స్వల్పస్థాయి కరెంట్ ప్రవాహంతో శరీరంలో ఎండార్ఫిన్లుగా పిలిచే సహజ పెయిన్ కిల్లర్లు విడుదలవుతాయి. దానితో కీళ్లు, వెన్ను, మెడ నొప్పుల వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ► కరెంట్ వోల్టేజీని తట్టుకునే సామర్థ్యం ఒక్కొక్క రిలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు కొంద రిలో 10 వోల్టుల కరెంటు షాక్ను, నొప్పిని కలి గిస్తే.. మరికొందరికి మాత్రం హాయిగా, విశ్రాం తిగా ఉంటుంది. అందుకే అవసరమైనట్టుగా ఓల్టేజీని తగ్గిస్తూ, పెంచుకుంటూ ఉంటారు. దయచేసి ఇళ్లల్లో ప్రయత్నించకండి అసలే కరెంటు, నీళ్ల జోడీ డేంజర్. వోల్టేజీలో తేడా వచ్చిందంటే ప్రాణాలకు ప్రమాదమే. అంతేకాదు.. మనకు ఎంత వోల్టేజీ అవసరమన్నది కూడా తెలియదు. పైగా సర్జరీలు జరిగినవారు, శరీరంలో రాడ్లు, ప్లేట్లు వంటివి అమర్చుకున్నవారు, గుండె జబ్బులున్నవారి విషయంలో మరింత అప్రమత్తత అవసరమని.. మొదట వైద్యులను సంప్రదించాకే డెంకి బురోకు వెళ్లాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్లో కొందరు డాక్టర్లు ప్రత్యేకంగా డెంకి బురో కోసం సలహాలు కూడా ఇస్తుంటారట. ఇది కేవలం సమాచారం ఇచ్చిన కథనం. దయచేసి ఎవరూ ఇంటా బయట ఇలాంటివి ప్రయత్నించకండి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
స్నానం పూర్తి చేసుకున్న భర్త.. టవల్ త్వరగా ఇవ్వలేదని భార్య తలపై...
భోపాల్: స్నానం చేసిన తరువాత అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ దారుణం బాలాఘాట్ జిల్లా కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపుర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన ఉద్యోగి రాజ్కుమార్ బాహే శనివారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత. భార్య పుష్పా బాయ్ (45)ను టవల్ అడిగాడు. చదవండి: స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి! అయితే ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని తువ్వాలు కోసం కాసేపు ఆగాలని భార్య చెప్పింది. ఆ సమయంలో ఆమె వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై అక్కడే ఉన్న పారతో పదే పదే కొట్టాడని కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. భర్త దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి.. కాగా తండ్రి ఘాతుకాన్ని 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను కూడా అడ్డొస్తే చంపేస్తాడని ఆమెను కూడా ఆ రాక్షసుడు బెదిరించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. -
భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త!
లక్నో: భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే భర్త విడాకులు కావాలని అడగడం పక్కన పెడితే ఇందుకు అతను చెప్పిన కారణం మాత్రం వింతంగా ఉంది. భార్య రోజూ స్నానం చేయడం లేదని చెబుతూ తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్లో చోటుచేసుకుంది. క్వార్సీ గ్రామానికి మహిళకు చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అవ్వగా.. ఏడాది వయసున్న పాప ఉంది. ఈ క్రమంలో రోజూ భార్య స్నానం చేయడం లేదని, స్నానం చేయాలని అడిగిన ప్రతిసారి ఆమె తనతో గొడవ పడుతుందని ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. అయితే భర్తపై వ్యతిరేకంగా భార్య వుమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వివాహిత వెల్లడించింది. ప్రస్తుతం ఈ జంటకు అలీగఢ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలింగ్ అందిస్తోంది. చదవండి: లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి ప్రతిరోజూ స్నానం చేయడం లేదనే సాకుతో భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని ఒక మహిళ తమకు వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిందని వుమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలర్ తెలిపారు. వారి వివాహ బంధాన్ని కాపాడటానికి భర్తభర్తలిద్దరితోపాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తున్నామన్నారు. వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని, భర్తతో ఆమె సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు కౌన్సిలర్ తెలిపారు. అయితే భర్త మాత్రం తనకు విడాకులు కావాలనే పదేపదే చెబుతున్నాడని, భార్య నుంచి విడాకులు తీసుకోవడంలో సాయం చేయాలని తమకు ఓ అప్లికేషన్ కూడా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. కానీ చిన్న చిన్న సమస్యలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని తాము సూచించినట్లు తెలిపారు. విడాకులతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెప్పి అతన్ని నచ్చజేప్పుతున్నట్లు పేర్కొన్నారు. వారికి ఆలోచించడానికి మహిళా రక్షణ సెల్ కొంత సమయం ఇచ్చింది. అంతేగాక విడాకుల దరఖాస్తుకు భర్త చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి, పిటిషన్ ముందుకు సాగదన్నారు. కౌన్సిలింగ్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చదవండి: హెయిర్ కటింగ్లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్ -
మాఘ మాసం ఆరోగ్య స్నానాలు
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింప చేసేది అన్నది పండితోక్తి. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఈ మాసంలో సూర్యుని ఆరాధి స్తారు. తెల్లవారుజామునే స్నానం చేయటాన్ని ఒక నియమంగా పెట్టుకుంటారు. నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భావిస్తారు. శరీరాన్ని చలికి అలవాటు చేయటం కోసమే ఈ నియమాన్ని పెట్టి ఉంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అందుకే చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయటం ఉత్తమం. ♦ ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్ఠమైనదని శాస్త్రం చెబుతోంది. మృకండు ముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అందుకే ఈ మాసానికి అంత విశిష్టత ఉంది. ప్రతిరోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం లేదా శ్రవణం చేయడం సకల పాపహరణం అని మాఘపురాణం చెబుతోంది. ♦ మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆసమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటారు. ♦ మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాలఅఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉండే మాసం ‘మాఘాది పంచకం’ అంటే మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ ఐదు మాసాలు శుభకార్యాలకు ప్రసిద్ధి. ఇల్లు కట్టుకోవటానికి మాఘమాసం అనుకూలం. ఆత్మ కారకుడు, ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉండే కాలం. మఖ నక్షత్రంలో, పూర్ణిమ తిథి నాడు చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది. మాఘమాసం ఉత్తరాయణం ప్రారంభమై సూర్యుడు మకరరాశిలో సంచరించే కాలం. అటు చాంద్రమానంలోను, ఇటు సౌర మానంలోనూ సూర్యునికి ప్రాధాన్యత ఉన్న మాసంగా చెబుతారు. సూర్యుడి ఆరాధన వేద కాలం నుంచి ఉంది. ప్రపంచం యావత్తు ఆరాధించకపోయినా, ఆయన గమనాన్ని గమనిస్తూనే ఉంది. భౌతికంగా ఈ భూమి మీద ప్రాణం నిలచి ఉండటానికి కారణం సూర్యుడు. అన్ని శక్తులూ ఆయన నుంచే లభ్యమవుతున్నాయనీ, సమస్త శక్తులకు సూర్యకిరణాలే కారణమని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ప్రాతఃకాలంలో స్నానం చేస్తే సూర్యుడు సంతృప్తి చెందుతాడని అంటారు. అంటే ఆరోగ్యమనే కదా అర్థం. నిలవ ఉన్న చల్లని నీళ్లతోకంటె గోరు వెచ్చని నీళ్లతో తలారా ఈ నెలంతా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఇలా ఎందుకు అనుకోవచ్చు. ఎవరినైనా మనం గౌరవించటమంటే ఏంటి? వాళ్లు మన ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా స్నానం చేసి ఆహ్వానించాలి కదా. అందుకే సూర్యోదయానికి ముందే శుచిగా ఉండి, మనం సూర్యుడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయనను ఎందుకు ఆరాధించాలి అనుకోవచ్చు. మనం సూర్యుడి నుంచే ఆరోగ్యాన్ని కోరుకోవాలి. పాండవులు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు పాండవులను వెంటనంటి వచ్చిన వారందరికీ అన్నం పెట్టడానికి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడని ఒక కథ. ఇక కీచకుడు ద్రౌపది వెంటపడినప్పుడు ఆమె ఒక్క చేతితో అతడిని తోసేసరికి పక్కకు పడిపోతాడు. అంత శక్తి ఆవిడకు సూర్యారాధన వల్ల వచ్చిందని మరో కథ. సూర్యమంత్రాన్ని అగస్త్య మహాముని రాముడికి ప్రసాదించిన మరుసటి రోజున రావణ వధ జరిగిందని ఇంకో కథనం ఉంది. ఆయన వల్ల ఆరోగ్యం, ఆహారం, బలం, శక్తి సమకూరతాయని భావించడం వలనే వేద కాలం నుంచి సూర్యారాధన జరుగుతోంది. ఆయన పుట్టిన రోజు ఈ మాఘమాసంలోనే వస్తుంది. ఆయనను ఆరాధించటానికి మొదటిమెట్టుగా, స్నానం చేసి, అరుణోపాసనం చేసి, సూర్యభగవానుడిని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉండాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త -
ఆ ఒక్కటి అడక్కండి..!
ముంబై : ప్రస్తుతం మహారాష్ట్రలో కొన్ని గ్రామాల్లో ఇంటి ద్వారం మీద మరాఠీలో ‘దయచేయండి.. భోజనం చేయండి.. కానీ మంచి నీళ్లు మాత్రం అడక్కండి’ అని రాసి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ కరువు ఎంత తీవ్రంగా ఉందో. మహారాష్ట్రలోని మరఠ్వాడాలో గత 32 వారాల నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ ప్రాంతానికి నీరు అందించే రిజార్వయర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు, బావులు ఎండిపోయాయి. ప్రస్తుతం ఔరంగబాద్, మధ్య మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరవు కోరలు చాచింది. దాంతో ప్రజలు నీటిని అతి జాగ్రత్తగా, పొదుపుగా ఒక్క చుక్క కూడా వృథా కాకుండా వాడుకుంటున్నారు. దానిలో భాగంగా ఒంటికి సబ్బు పెట్టి స్నానం చేయడం మానేశారు. ఓ నులక మంచంలో కూర్చుని.. కింద మరో టబ్బు పెట్టుకుని స్నానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీరు వృథా కాకుండా టబ్బులో పడుతుంది. తర్వాత ఆ నీటితోనే మిగతా కుటుంబ సభ్యులు స్నానం చేయడం ఆఖరున వాటిని బట్టలు ఉతకడానికి వినియోగించడం వంటివి చేస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో ఇదే తంతు. దీని గురించి ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ.. ‘ఇది మీకు షాకింగ్గా.. చండాలంగా అనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇదే సరైన మార్గంగా తోస్తుంది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు మీ ముందు రెండే మార్గాలుంటాయి. ఒకటి చావడం రెండు బతకడం. చావలేం కాబట్టి మాకు తోచిన రీతిలో ఉన్న నీటినే ఇలా వాడుకుంటున్నాం’ అని తెలిపారు. ఈ ప్రాంతాలకు ప్రభుత్వం వారంలో మూడు రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. అలా పట్టుకున్న నీటినే అతి జాగ్రత్తగా.. పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. లేదంటే డబ్బు చెల్లించి నీళ్లు కొనుక్కోవాలి. పది లీటర్ల నీటికి రూ. 12, వంద లీటర్ల నీటిని రూ. 80 చెల్లించాల్సిందే. కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఇక్కడి జనాలకు లేదు. దాంతో ప్రభుత్వం సరఫరా చేసే నీటిని పట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటారు. -
ఋషి
అవి వినాయక నవరాత్రులు. నవరాత్రులలో మూడోరోజులాగే సాయంత్రం అవుతుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులే ఆరోజూ జరుగుతున్నాయి. పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి. పశువులు కల్లం వైపు కదులుతున్నాయి. తెల్లనైన సూర్యుడు పడమటి కొండకు చేరి ఎరుపెక్కుతున్నాడు. మేత నుండి కల్లంకి పశువులకు పుల్లని కుడితిలో చిట్టేసి కలిపి తొందరగా పెడుతున్నాడు అప్పలరాములు.లేగదూడలను ఒక్కొక్కటిగా విప్పి, ఆవు సేపిన తరువాత దూడను తల్లి కట్టు వద్ద కట్టి పాలు పితికాడు. బయట ఉన్న ఆవులను శాలలో కట్టి రాత్రికి సరిపడినంత వరిగడ్డిని వాటి ముందు వేసాడు.పాలు గుడిసిన లేగదూడలను కూడా కట్టేసి, పాలను పట్టుకొని ఇంటికి వడివడిగా అడుగులు వేశాడు. చెమటతో ఉన్న వంటిని స్నానంతో శుభ్రం చేసి, తెల్లపంచె కట్టుకుని, రాత్రి భోజనం పెట్టేయ్యమని భార్యను తొందర చేశాడు అప్పలరాములు. ‘‘నాయనా మళ్లీ ముఖానికి రంగెయ్యటానికెలిపోతున్నావా ఏటి? ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి ఈ నాటకాలెక్కడి నుంచి మరిగినావో!’’ అని తిడుతూనే అప్పుడే అన్నం ఓర్చిన కుండను పైకెత్తి జిబ్బిలో ఉన్న అన్నాన్ని కొంత ఓరిమి తీసి, పళ్లెంలో రెండు ముద్దలు వడ్డించి అప్పలరాముని ముందు పెట్టింది భార్య.చిన్న చిరునవ్వు నవ్వి ‘‘ఇంట్లో ఎవ్వరికి తెలియనియ్యకే’’ అంటూ తొందర తొందరగా కుండ బరువును గుండెకి దించేసి కమీజు తొడుక్కొని, తువ్వాలు భుజంపై వేసుకున్నాడు అప్పలరాములు.ఇంట్లో ఎవరికీ కనబడకుండా వెనుక దొడ్డి నుండి పరుగులాంటి నడకందుకున్నాడు.రాజాం బస్టాండ్ చేరుకునేసరికి తన సమాజం సభ్యులందరూ తన కోసమే ఎదురుచూస్తున్నారు.‘‘ఏటి అప్పలరాములు ఎప్పుడూ లేటే నువ్వు...ఇప్పటికే రెండు బస్సులెళ్లిపోనాయి...పోనీలే ఈ బస్సుకేనందినావు...లేకపోతే ఆ వూరోల్తోటి మాట కాసిద్దుము’’ అని నాటక సమాజపు గురువు శ్రీనుబాబు అప్పలరాముని చనువుగా తిట్టాడు.‘‘మరేటి పర్లేదులే వచ్చేన్ను కదా శీనుబాబు...ఎక్కండి ఎక్కండి’’ అని తనను పలకరిస్తున్న సభ్యులని తొందరపెట్టాడు అప్పలరాములు. బస్సు గమ్యాన్ని చేరుకుంది. ఆ వూళ్లో కమిటీ వారు నాటక సమాజాన్ని ఆహ్వానించి వాళ్లకు భోజన వసతి కల్పించారు.‘‘మరి కొద్దిసేపట్లో...మరికొద్ది క్షణాల్లో...మన గ్రామంలో రాష్ట్రస్థాయి కళాకారులచే హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడుతుంది’’ అంటూ కమిటీలోని మైకువీరులు జనాలను ఉదరగొడుతున్నారు.చెక్క బల్లలతో స్టేజిని వేశారు.కమిటీ వాళ్లు పైన ఒక పరజాగుడ్డను కట్టారు.ముందు పొట్టి, పొడుగు వాళ్లకు కూడా అందేటట్టు మైకులు కట్టారు.స్టేజు వెనుక నాలుగు పక్కలా దుప్పట్లు, పరదాల సాయంతో గ్రీన్రూమ్ కట్టారు.గ్రీన్రూమ్ చుట్టూ రంగు వేయక ముందు పాత్రధారుల రూపాలను చూడాలనే ఆతృత కనబరుస్తున్న ఆ వూరి యువజనులు...స్టేజ్ ముందు మంచు పడకుండా తలపాగాలు చుట్టి, దుప్పట్లు కప్పుకుని, తోడుగా తెచ్చుకున్న దుడ్డుకర్రలను భుజాలకు చేరవేసి, చుట్టలు, బీడీలు కాల్చుకుంటూనాటక ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు...వారి వెనకాల చుట్టలు, బీడీలు, టీలు అమ్ముతూ రెండు కొట్లు.‘‘ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నాటకం మరి కొద్దిక్షణాల్లోనే’’ కమిటీలోని మైకువీరుడు మరొక్కమారు మైకు ముందు తన కంఠాన్ని ప్రదర్శించాడు.నాటకం సిద్ధమయ్యిందోచ్ అన్నట్లుగా శీనుబాబు హార్మోనియంలో కొత్త సినిమా పాటలను వాయిస్తూ ప్రేక్షకును నాటకవీక్షణానికి సిద్ధం చేశాడు. కర్టెన్ వెనుక నుంచి ప్రార్థన గీతాన్ని ఆలపించి తమ గొంతులను శుద్ధి చేసుకున్నారు నాటక సభ్యులంతా.తెర తొలగించారు.ఆగ్రహోదగ్రుడైన విశ్వామిత్ర మహర్షి వేదిక మీదకు వచ్చి...‘‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట’’ అంటూ పేజీల డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే ముందున్న ప్రేక్షకులు నిజంగా మనల్ని శపించేసినట్లున్నాడీ విశ్వామిత్రుడని భయపడుతూ తమ శ్వాసలను నిలబెట్టేశారు.తరువాత హరిశ్చంద్ర, చంద్రమతుల ప్రవేశం, మాతంగి నృత్యం, అటుపిమ్మట విశ్వామిత్రుడు మరలా వేదిక పైకి రావటం, హరిశ్చంద్రుని కిరీటమెగరేసి తన్నటం, ప్రేక్షకులకు ఒక విధమైన గగుర్పాటు. ఆ తరువాత వారణాసి సీనులో వచ్చిన కాలకౌశికుడు భార్యావిధేయుడిగా ప్రేక్షకులందరినీ హాస్యంలో ముంచెత్తాడు.అటుపిమ్మట హరిశ్చంద్రుని కొనటానికి వచ్చిన వీరబాహుడు నిజంగా కర్కోటకుడేమో అంటూ ప్రేక్షకులు తమ అసహ్యాన్ని ఆ పాత్రపై ప్రదర్శించారు.ఈవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని రసస్థాయికి తీసుకువెళ్లి, భయపెట్టి, ఆనంద పెట్టి, అసహ్య పెట్టించిన పాత్రధారుడు ఒక్కడే...అతడే ఇందాకటి అప్పలరాములు.తన వేషాన్ని తీసేసిన తరువాత ఏమీ తెలియని వాడిలాగా గ్రీన్రూమ్లో ఉన్న మేకప్ సామానుల పక్కన కూర్చున్నాడు. నాటకం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము అయింది.‘‘శీను బాబూ...సాయంత్రం రూమ్కొచ్చి కలుస్తాను. పొలములో పనులున్నాయి. ఫస్ట్ బస్సెక్కి పోతాను’’ అంటూ సెలవు తీసుకొని ఆ వూరిలో ఉన్న నైటాల్ట్ బస్సెక్కి పూర్తిగా తెల్లారేసరికి కల్లానికి సేరుకున్నాడు. మరలా పశువుల్ని బయటకట్టి, పేడలు తీసి కసవ తుడిచి పెంటలో వేసేశాడు.పాలు తీసి ఇంటికి చేరుకొని భార్యకు అందించాడు.‘‘నాటకం తగిలితే ఇంటిపట్టునుండవు. ఏమి పుట్టుక పుట్టినావో’’ అంటూ భార్య అప్పలరాముడిని తిడుతూ టీ సుక్కలు కాసి యిచ్చింది.పాపం రాత్రంతా నిద్రలేక నాటకమాడొచ్చిన భర్తను తిట్టడం తనకూ ఇష్టం లేదు. తనుంటున్నది ఉమ్మడి కుటుంబం...తోడికోడళ్లు, బావలు, అత్తమామలు అందరూ రాత్రిపూట కలిసి భోజనాలు చేసినప్పుడు మాట్లాడుకుంటారు.తన భర్త నాటకాలకు వెళ్లిన రోజున...‘‘ఈడికి పనులు సెయ్యడానికి వొళ్లొంగక నాటకాలు మరిగినాడు’’ అంటూ బావలంటుంటే...‘‘మీరు లేరేటి పనులు సెయ్యడానికి’’ అని పుల్లిరుపు మాటలంటున్నారు తోడికోడళ్ళు.అవన్నీ వింటూ ఏమీ అనలేక అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అప్పలరాములుని తిట్టేది భార్య.రైతువారి యిళ్లలో నాటకాలేసే వాళ్లంటే ఉన్న చులకన భావాన్ని అప్పలరాముడు అనుభవించాడు. కానీ నాటకాన్ని విడిచిపెట్టలేదు.‘ఎన్నాళ్లున్నా ఏరు పాట్లు తప్పవు కదా’ అంటూ తండ్రి తనకున్న చెక్క ముక్కలను ముగ్గురు కొడుకులకి సమంగా పంచేశాడు. అప్పలరాములుకు కొత్త సంసారం బరువు, బాధ్యతలు, పిల్లల చదువు బాధ్యతలు పైన బడ్డాయి. అయినా తనకిష్టమైన నాటకాన్ని వదల్లేదు.ఈడొచ్చిన ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకును విజయనగరం మహారాజు కాలేజీలో చదివించాడు. కొడుకు కాలేజీలో సాంఘిక నాటకాల్లో హీరో యేషాలేత్తండని తెలసి....‘‘మన రక్తమెటిపోద్దే’’ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్యను ఆటపట్టించేవాడు.కొడుకు చదువు పూర్తిచేసుకుని టీచర్ కొలువులో చేరాడు.తండ్రిలానే పౌరాణిక నాటకాలలో ప్రవేశం కూడా చేశాడు.కొడుకు నాటికి నాటకరంగ పరిస్థితి పూర్తిగా దిగజారింది. పౌరాణిక నాటకం ఆడించే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా సాహసం చేసి పెట్టించినా నాటకం చూడటానికి జనాలు రావడం లేదు. వినోదసాధనాలు మారినాయి...మార్కెట్లోకి సినిమా వచ్చింది. ఇంట్లోకి టీవీ వచ్చింది. జనాలు ఈదిలోకి రావడం మానేశారు. ఈ స్థితిలో నాటకం అంటే అభిమానమున్న కొడుకు ఈ స్థితిని జీర్ణించుకోలేకపోయాడు.ఒకసారి అప్పలరాములికి మలేరియా జ్వరం వచ్చింది. కొడుకు ఆసుపత్తిరికి తీసుకెళ్లి మందు, యింజప్షన్లు ఇప్పించాడు. భార్య పత్తెము చక్కగా పెట్టింది. వారం రోజ్లో అప్పలరాములు కోలుకున్నాడు. డాక్టరుగారు మరొక పదిరోజులు విశ్రాంతి తీసుకోమ్మన్నారు.అవి దేవి నవరాత్రులు. అప్పుడప్పుడే సత్తువందుకుంటున్న అప్పలరాములుకు శీనుబాబు నాటకముందని కబురెట్టాడు. ఆ మాట సెవిలో పడగానే యిన్ని రోజులు మంచం మీద పడిన బాధలు మరిచిపోయాడు. యింట్లో తెలిస్తే నాటకాలకెల్లనివ్వరని కళ్లంకెళ్లోస్తాని అటునుంచటే నాటకానికి చెక్కేశాడు.ఉదయాన్నే ఇంటికి చేరేసరికి కొడుక్కి తండ్రి మీద ఉన్న ప్రేమ కోపంగా మారింది.నాటకం హీనస్థితిని చూశాడు ఒకపక్క....విశ్రాంతి తీసుకోవాల్సిన తండ్రి రాత్రంతా నిద్ర లేకుండా నాటకం వేసి వచ్చాడు. అది తట్టుకోలేక...‘‘మీరు నాటకాలు వేసి మమ్మల్నేమీ ఉద్దరించియక్కర్లేదు...ఎవరూ మీకు బంగారు కంకణాలు తొడిగీరులే...ఇంకోసారి నాటకాలూసెత్తితే ఊరుకునేది లేదు’’ అంటూ చెడామడా తిట్టేశాడు.తన తోటి కళాకారుల ఇళ్లలో కూడా పిల్లలు నియంత్రిస్తున్నారని విన్నాడు. యిది తనకు కూడా వచ్చేసింది అంటూ ఆదుర్దాపడ్డాడు.‘‘నన్ను కన్న తండ్రినే ఒప్పించాను. నా కడుపున పుట్టిన కొడుకునొప్పించలేనా’’ అని సమాధాన పరుచుకున్నాడు.మరుసటిరోజు కొడుకున్నప్పుడే శీనుబాబు నుంచి నాటకముందని కబురు వచ్చింది.కొడుకున్నాడని కన్నుకొట్టి ‘‘నేనే నాటకానికి రాను’’ అని కుబురు తెచ్చిన మనిషిని పంపేశాడు.ఇదంతా గమనించాడు కొడుకు.‘విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రిపూట మంచులో పడి నాటకాలు వేస్తే మళ్లీ జ్వరం తిరగబడుతుంది. ఈ ముసలోడికిలా కాదు’ అంటూ పడుకున్నట్లు నటిస్తున్న తండ్రిని ఇంట్లో పెట్టి బయట గడియ పెట్టేశాడు కొడుకు.అప్పలరాములు కొడుక్కి తన మీద ఉన్న ప్రేమను గమనించాడు.కానీ నాటకం మీద తనకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. చేసేదేమి లేక మంచం మీద చేరబడ్డాడు. ఆరోజు తాను వెళ్లవలసిన నాటకం ఎలా జరుగుతుందో...శీనుబాబేటనుకుంతాడో...నిజంగా కొడుకు చెప్పినట్లుగా నాటకరంగమంత దిగజారిపోయిందా...ఒకప్పుడు తన పరువపు వయసులో...నాటకమంటే పడిచచ్చే జ్ఞాపకాలు...తన కళ్ళ ముందు అలా అలా అలల్లా కదులుతున్నాయి.అప్పలరాములు పార పట్టుకొని దమ్ము మడిలో ఒంగితే గెనకు గెన పూర్తయ్యేవరకు నడుమెత్తేవాడు కాదు. పనులన్నీ పూర్తయ్యాక సాయంత్రం అయ్యేసరికి తోటివాళ్లతో కూడి చెక్క భజనలు, రామభజనలు...అప్పలరాములు గొంతెత్తి ముందు పాట పాడుతుంటే మారాము చేస్తున్న పిల్లలు మగతలోకి జారుకునేవారు. మనువుకు సిద్ధమైన యువతులు గిలిగింతలు పడేవారు. ఆనాడు సినిమా వినోద సాధనంగా మొదలైంది కానీ అది తమలాంటి పల్లెలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దపెద్ద పండగలు, ఉత్సవాల సమయాల్లో పెద్ద పెద్ద కూడల్లలో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఒకరోజు ఒక రిక్షా బండి ‘ఆలసించిన ఆశాభంగం నేడే...ఈరోజే...మన రాజాంలో ఈలపాట మొదలగు నటులతో పౌరాణిక నాటకం ప్రదర్శించబడును’ అంటూ దండోరా వేసుకుంటూ వెళ్ళిపోయింది.ఎలాగైనా నాటకం చూడాలనుకున్నాడు.నాటకం చూడాలంటే టికెట్ ఉండాలి.టికెట్ ఉండాలంటే డబ్బులు కావాలి.అమ్మ దగ్గరకు చేరాడు...అమ్మ ఇంట్లో బియ్యపుగింజలు ఊర్లో షావుకారుకిచ్చి డబ్బులు తెచ్చింది...అప్పలరాములు పొంగిపోండు. పనులన్నీ వేరము పూర్తి చేసుకుండు. జతగాళ్లతో కలిసి నాటకం చూడటానికి బయలుదేరాడు.నాటకం మొదలైంది...జనాలు ఈలలు, కేకలు...ఈలపాట మొదలగు నటులంతా పద్యాలతో రాగాలు పంపుతుంటే చెవులో అమృతమే పోయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. రెండుమూడు రోజులు పద్యాలు తన చెవుల్నొగ్గలేదు...సివరకు ఒకరోజు సాయంత్రం పనులన్నీపెందరాళే పూర్తి చేసి నాటకాలు నేర్పుతున్న గురువు దగ్గరకు చేరుకున్నాడు.‘‘పొలంలో పండిన కూరో నారో ఇచ్చుకుంటాను. నాటకం నేర్పు గురువా’’ అని ప్రాధేయపడ్డాడు.గురువు కనికరించి పౌరాణిక నాటకాల్లోని మైనర్ పాత్రలను నేర్పించాడు. ఊరి బడిలో తెలుగు సదవడం, రాయడం వచ్చినంత వరకు సదువుకున్నాడు. అది ఇప్పుడుపయోగపడింది.రోజూ రాత్రి రెండు మైళ్ళ దూరం నడిచి గురువు దగ్గర పద్యం చెప్పించుకునేవాడు. ఉదయం అరక తోలునప్పుడో, పశువులు మేపుతూనో, గడ్డి కోస్తూనో సాధన చేసేవాడు. ప్రదర్శనలు కూడా ఇవ్వడంమొదలెట్టాడు. మొదట ప్రదర్శన ఇచ్చిన రోజు తను ఏదో రాజ్యాన్ని జయించినంత సంబరపడ్డాడు....ఇలా గ్యాపకాలు గుర్తొస్తుంటే కళ్ళంబడి నీళ్ళు రాలుతున్నాయి.వ్యవసాయం, సంసారం, సమాజం...ఇవ్వేమి ఇవ్వలేని సంతోషం మనసుకు నాటకం ఇచ్చింది. ఆరోజులు మరలా మోము మీద చిరునవ్వును చిందించాయి. మళ్లీ గతపు ఆలోచనలు...నాటకాలేస్తున్నయిషయం ఆ నోటా ఈ నోట తండ్రికి తెలిసింది. ఆరుగాలం శ్రమించాల్సిన రైతోడు నాటకాల్లో పడితే యివతల యవసాయం ఉట్టెక్కిపోతాది....అవతల మనిషి సెడు యసనాలకుబానిసైపోతాడు. రెంటికి సెడ్డ రేవడైపోతాది గాలా ఈడి బతుకు’’ అని తల్లి సమక్షంలో పరోక్షంగా మందలించాడు తండ్రి.‘‘పనులకు డోకా రాకుండా సూసుకుంతానులే. యసనాల జోలికి పోను’’ అని తల్లికి నచ్చచెప్పి తన మనసుకు ఇష్టమైన నాటకాలను విడవకుండా ముందుకెళ్లాడు.నాటకరంగ గొప్పస్థితిని చూశాడు...ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నాడు...నాటకం మీద తనకున్న ప్రేమ అలాంటిది. అనేకమైన ఆలోచనలు. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో...మళ్లీ కోడి కూయగానే మెలుకువొచ్చింది. గోళ్లోకెల్లోద్దామని లేవబోయాడు. యెడమసేయికి సెతన తగల్లేదు. యెడమ కాలు కూడా తన సెతనలో లేదు...‘పోనిలే పిల్లల కోరిక తీరిందిలే’ అనుకొని చిన్న చిరునవ్వు నవ్వాడు. నదికి ఆనకట్ట నీరును పొంగించి ఊర్లను ముంచెత్తది. నటనకి ఆనకట్ట తన రక్తాన్ని పొంగించి మనసును ముంచేసింది. అదెల్లి ఎక్కడో నరాలను తెంపేసింది. ‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట...’ అంటూ అందరినీ భయపెట్టే ఆ కంఠం మూగబోయి అప్పుడప్పుడు రుషి వలే నవ్వును మాత్రమే చిందిస్తుంది. అల్తి మోహనరావు -
టొమాటో కొబ్బరి బాత్
తయారి సమయం: 45 నిమిషాలు కావలసినవి: బియ్యం – ఒకటిన్నర కప్పులు; కరివేపాకు – రెండు రెబ్బలు; లవంగం – 1; దాల్చిన చెక్క – 1; ఉల్లిపాయ – 1; టొమాటోలు – 3; తరిగిన కొత్తిమీర – అర టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి సరిపడా; నూనె– టేబుల్ స్పూన్, నెయ్యి – అర టేబుల్ స్పూన్; నీళ్లు – రెండున్నర కప్పులు పేస్ట్ కోసం:వేయించిన ధనియాలు – అర టేబుల్ స్పూన్; వేయించిన జీలకర్ర – అర టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; లవంగాలు – 3; దాల్చినచెక్క – 1, ఏలకులు – 2; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – 1 పై పదార్థాలన్నింటికీ కొద్దిగా నీటిని చేర్చి గ్రైంyŠ చేసి పేస్ట్ చేసుకోవాలి. తయారి: ∙పాత్రలో నూనె, నెయ్యి వేడయిన తరవాత లవంగాలు, దాల్చిన చెక్క వేసి అర నిమిషం వేయించాలి. తరవాత ఉల్లిపాయముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు జత చేసి నాలుగు నిమిషాలు వేయించాలి. ∙దీంట్లో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి 10 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఉప్పు, బియ్యం జత చేసి నిమిషంపాటు కలపాలి. ∙రెండున్నర కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి కలపాలి. ∙మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిన తరవాత దింపేయాలి. ∙చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇష్టమయిన గ్రైవీతో వేడివేడిగా వడ్డిస్తే రుచిగా ఉంటుంది. -
ఆవిరి స్నానంతో గుండెపోటుకు చెక్!
లండన్ : తరచూ ఆవిరి స్నానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని కేంబ్రిడ్జ్ , యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ తదితర వర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దాదాపు 15 ఏళ్ల పాటు నిర్వహించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికోసం 53 నుంచి 74 ఏళ్ల లోపు వయసున్న 1,628 స్త్రీ, పురుషులు వారానికి చేసే ఆవిరి స్నానాల సంఖ్య ఆధారంగా విభజించి పరిశీలించింది. ఇందులో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసేవాళ్లతో పోలిస్తే రెండు, మూడు సార్లు చేసేవాళ్లలో 14శాతం, నాలుగు నుంచి ఏడుసార్లు చేసేవాళ్లలో 61శాతం గుండెపోటు ముప్పు తక్కువైనట్లు తేల్చింది. దీనికి కారణం ఆవిరి స్నానంతో బీపీ తగ్గడం, రోగ నిరోధకత, నాడీ వ్యవస్థ, హృదయ స్పందనల తీరు మెరుగుపడడం అని గుర్తించింది. కాగా, అంతకుముందు ఇదే పరిశోధకుల బృందం చేసిన మరో అధ్యయనంలోనూ బీపీ, హృదయ స్పందనలపై ఆవిరి స్నానం ప్రభావం చూపుతుందని వెల్లడి కావడం గమనార్హం. -
ముఖం కాంతిమంతంగా ఉండాలంటే...
బ్యూటిప్స్ ⇒ రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది. ⇒ టీ స్పూన్ బొప్పాయి గుజ్జులో అయిదారు చుక్కల తేనె, టీ స్పూన్ కమలాపండు రసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపుగా మెరుస్తూ ఉంటుంది. ⇒ స్నానానికి 20 నిమిషాల ముందు చర్మానికి నిమ్మరసం పట్టించి, ఆ తర్వాత వేపాకులు వేసి మరిగిం చిన నీటితో స్నానం చేస్తే చర్మం చాలా మృదువుగా, కాంతివంతం గా తయారవుతుంది. ⇒ తాజా గులాబీ రేకులలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కోమలంగా ఉంటుంది. -
స్నానానికి ముందు!
చర్మంపై మృతకణాలు చేరినప్పుడు కాంతి తగ్గిపోతుంది. చర్మం నిస్తేజంగా, ముడతలుగా కనిపిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి... ⇔ ఆలివ్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు, సీ సాల్ట్ (రాతి ఉప్పు) టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని, శరీరానికి పట్టించి, మృదువుగా రాయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. చర్మకాంతి పెరుగుతుంది. ⇔ బాడీ బ్రష్ మార్కెట్లో లభిస్తుంది. ఈ బ్రష్ కుచ్చులు చాలా మెత్తగా ఉంటాయి. స్నానం చేసే సమయంలో ఈ బ్రష్తో మృదువుగా చర్మంపై రబ్ చేస్తే మురికి, మృతకణాలు తొలగిపోతాయి. ⇔ టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ⇔ టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. స్నానం చేయడానికి అరగంట ముందు శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. -
పుష్కరాల్లో పనికి వచ్చి..
* నీటమునిగి ఇద్దరు మృతి * స్వీట్షాపులో పనిచేసేందుకు వచ్చిన గుడివాడ యువకులు * కూలి డబ్బు తీసుకొని తిరుగు పయనం * స్నానం కోసం నదిలో దిగి మృత్యువాత అమరావతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా స్వీట్షాపులో పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని జిల్లా దాటి వచ్చిన ఆ యువకులకు ఇవే చివరి పుష్కరాలయ్యాయి. దాదాపు రెండు వారాల తర్వాత తమ ఇంటికి వెళ్లేందుకు ఉత్సాహంగా బయల్దేరిన వీరిని మృత్యువు కబళించింది. మండల పరిధిలోని ధరణికోట గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా గుడివాడ చెందిన గరిక వెంకట మహేష్ (24), తోట దుర్గారావు (22) పుష్కరాల సందర్భంగా అమరావతిలో ఓ స్వీట్షాపులో పనిచేసేందుకు వచ్చారు. మంగళవారంతో పుష్కరాలు పూర్తవడంతో బుధవారం తమ కూలి డబ్బు తీసుకుని స్నానం చేసి వెళదామని ధరణికోటలోని అల్లుళ్లపేట సమీపంలో కృష్ణానది తీరానికి చేరుకుని స్నానానికి దిగారు. ఈ నేపథ్యంలో వీరు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించి వారి సమక్షంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారికి అప్పగించారు. చేతికందివచ్చిన పిల్లలు చనిపోవటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
పుష్కరం.. పరవశం
నెహ్రూనగర్ ఘాట్, ముచ్చుమర్రిలోని రాయలసీమ కృష్ణా పుష్కర ఘాట్ సోమవారం భక్తులతో పోటెత్తాయి. కృష్ణానదిలో పుష్కర స్నానం చేసి పరవశవులయ్యారు. పిల్లల కేరింతలు, పెద్దల భక్తిభావంతో ఘాట్లలో ఆధ్యాత్మిక ఆనందం వెల్లివెరిసింది. రాయలసీమ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి 108 మట్టి శివలింగాలతో పురోహితుల మంత్రోచ్ఛరణల మధ్య మహా రుద్రయాగం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెహ్రూనగర్ ఘాట్ వద్ద టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాండ్ర శివానందరెడ్డి తన మాతృమూర్తికి పుష్కర స్నానం చేయించిన అనంతరం పితరులకు పిండ ప్రదానం చేశారు. కులమతాలకు అతీతంగా నందికొట్కూరు పట్టణానికి చెందిన రబ్బాని గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ హాజీ మాబుసాహెబ్ రాయలసీమ పుష్కర ఘాట్ను సందర్శించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. – పగిడ్యాల -
ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలి : ఎస్పీ
నల్లగొండ క్రైం : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాకు వచ్చే భక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలని ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి సూచించారు. ఘాట్లకు దూరంగా వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని పేర్కొన్నారు. ఆదివారం కాచరాజుపల్లి ఘాట్ సమీపంలో ఘాట్ లేని చోట స్నానానికి వెళ్లి హైదరాబాద్కు చెందిన హార్దిక్ (12) మృత్యువాత పడిన ఘటనపై ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. -
‘జన’తరంగిణి
· అన్ని పుష్కరఘాట్లలో భక్తుల సందడి · సంగమేశ్వరం, నెహ్రూనగర్లో కొనసాగిన రద్దీ · శనివారం జిల్లా వ్యాప్తంగా 1,28,205 భక్తుల పుష్కర స్నానాలు శ్రీశైలం : కృష్ణవేణీ నమస్తుభ్యం సర్వపాపప్రక్షాళిని ! త్రిలోకే పావన జలే రంగత్తుంగ తరంగిణి !! అంటూ సకల పాపాలను హరించి ముల్లోకాలను పావనం చేసే జలాలను కలిగి అందమైన అలలతో నాట్యమాడే కష్ణవేణీమాతకు నమస్కారం చేస్తూ భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో శనివారం పుష్కర స్నానాలను చేసుకున్నారు. పుష్కరాల్లో తొమ్మిదో రోజు శనివారం.. అన్ని పుష్కర ఘాట్లలో భక్తి రద్దీ కనిపించింది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ తదితర అన్ని ఘాట్లు భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. వేకువజామున 4గంటల తరువాత ప్రారంభమైన భక్తులరద్దీ మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మందగించింది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది భక్తులు మధ్యాహ్నం 12గంటల్లోగానే పుష్కర స్నానాలు ముగించుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట తరువాత అన్ని ఘాట్ల వద్ద రద్దీ తగ్గి ఆ తరువాత సాయంత్రం వేళ 5.30గంటల నుంచి 7గంటల వరకు సాధారణస్థాయిలో ఉంటుంది. శ్రీశైలంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, ఆర్డీఓ రఘుబాబులు పాతాళగంS, లింగాలగట్టుఘాట్లను సందర్శించి ఏర్పాట్లను. లింగాలగట్టు వద్ద యర్రగొండపాలెం ఎంఎల్ఏ డేవిడ్ రాజు పుష్కరస్నానాలు ఆచరించుకున్నారు. శనివారం రాత్రి 8గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 1,28,205 మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించుకున్నట్లు అధికారుల అంచనా. రెండుగంటల పాటు భ్రమరాంబ ఘాట్ మూసివేత పాతాళగంగ వద్ద కొత్తగా నిర్మించిన భ్రమరాంబ పుష్కర ఘాట్ను సుమారు రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశాల మేరకు మూసివేశారు. శుక్రవారం రాత్రి ఆ ఘాట్కు సమీపంలో ఉన్న కొండ చరియల నుంచి రాళ్లు జారిపడడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో విరిగిపడ్డ కొండచరియల రాళ్లు తిరిగి పడకుండా ఐరన్ మెష్ఏర్పాటు చేసి హైటెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ ద్వారా దిగ్బంధం చేసే ప్రక్రియ సగం వరకు కొనసాగింది. ఆ మిగిలిన సగం భాగం నుంచే రాళ్లు పడడంతో రెండు గంటల పాటు ఘాట్ మూసివే సి పూర్తిస్థాయిలో కొండ చర్యలు విరిగిపడకుండా హైటెన్షన్ వైర్లను వినియోగించి మిగిలిన పని పూర్తి చేశాక తిరిగి భక్తులను ఆ మార్గం ద్వారా అనుమతించారు. దీంతో మల్లికార్జునఘాట్కు భక్తుల తాకిడి పెరిగింది. అయితే అక్కడి నుంచి పిండప్రదానం మార్గం ద్వారా భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సివచ్చింది. మొదట నాపరాళ్లు వేసి ఆ తరువాత వెట్మిక్స్ర్ వేసి మళ్లీ అది గుంతలు పడడంతో తిరిగి దానిపై నాపరాళ్లను వేయడం ప్రారంభించారు. దీంతో భక్తులు బ్రమరాంబా ఘాట్ నుంచి పిండప్రదానం స్టేజీ మీదుగా వెళ్లడానికి నానా కష్టాలు పడ్డారు. -
కృష్ణవేణి తరంగిణిలో పవిత్ర స్నానం
-
పసి మొగ్గలకు కృష్ణమ్మ లాల!
-
శిరస్నానం..పవిత్రత ప్రధానం
కృష్ణా పుష్కరాల్లో నదీస్నానమాచరించండానికి చాలా మంది ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. స్నానమెలా ఆచరించాలో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు.. – పవిత్రమైన హృదయంతో నది దగ్గరకు చేరుకోవాలి. – తీరం నుంచి నదికి నమస్కరించాలి – నదిని, తీరాన్ని పవిత్రంగా ఉంచాలి.. – మొదటగా పవిత్ర నదీ జలాలను శిరస్సుపై చల్లుకొని స్నానానికి ఉపక్రమించాలి. – వీలైతే సమంత్ర పూర్వకంగా సంకల్పం చెప్పుకొని (చెప్పించుకొని) స్నానం చేయాలి. – లేదంటే తమ గోత్రనామాలను చెప్పుకుని ‘‘కృష్ణా కృష్ణా కృష్ణా’’ అని మూడుసార్లు నదిని స్మరించి స్నానం చేయాలి. –ఖచ్చితంగా శిరస్నానం చేయాలి. – నదిలో సూర్యుడికి మూడు అర్ఘ్యములనివ్వాలి. – స్నానమైన తర్వాత శుభ్రమైన పొడిబట్టలను కట్టుకొని కుంకుమ ధరించాలి. – కృష్ణానదీమ తల్లిని పూజించి వాయనం సమర్పించాలి. – ఒడ్డున ఉన్న లేదా దగ్గరలో ఉన్న దేవాలయాలను తప్పక దర్శించాలి. – యథాశక్తి ధానధర్మాలను ఆరచించాలి. – పుష్కర సమయంలో పెద్దలకు పిండప్రదానము ఆచరించాలి. – పిండ ప్రదానినికి ఆకులతో తయారు చేసిన విస్తరాకులనే ఉపయోగించాలి. – శ్రాద్ధమైన తదుపరి తప్పక పిండములను నదిలో నిమజ్జనం చేయాలి. – నది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. – పవిత్ర కృష్ణాపుష్కర జలాలను ఇంటికి తీసుకెళ్లి పూజా మందిరంలో ఉంచి నిత్యం పూజించాలి. – కర్నూలు(న్యూసిటీ) -
ఎమ్మెల్సీ బాలసాని దంపతుల పుష్కరస్నానం
భద్రాచలం గోదావరి స్నానఘట్టాల రేవులో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బుధవారం సతీ సమేతంగా పుష్కర స్నానమాచరించారు. తీరంలో ప్రత్యేక పూజలనంతరం ఆయన స్నానం చేసి రామాలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారు, అభయాంజనేయస్వామి వారి ఆలయాలనూ దర్శించుకున్నారు. ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, టీఆర్ఎస్నియోజకవర్గ ఇన్చార్జ్ మానె రామకృష్ణ, యశోద నగేష్ తదితరులు ఎమ్మెల్సీ వెంట ఉన్నారు. – భద్రాచలం -
పుష్కల స్నానం
–పుష్కరఘాట్లకు జలకళ –నిండుకుండలా జూరాల జలాశయం –నారాయణపూర్ నుంచి భారీగా వరద –జిల్లాలో ప్రధాన జలాశయాలకు జలకళ –14గేట్ల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్కు నీటివిడుదల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఆల్మటి, నారాయణపూర్, జూరాలను దాటి శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. నిన్నమొన్నటి వరకు బోసిపోయిన పుష్కరఘాట్లు జలకళను సంతరించుకున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : వరుణుడు కరుణ కురిపించాడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రప్రథమంగా ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు కొత్త శోభ తీసుకొచ్చాడు.. జిల్లాలో ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలకు వారంరోజుల ముందే జిల్లాకు పుష్కరశోభ సంతరించుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఘాట్లకు చాలినన్ని నీళ్లురాకపోతే స్నానాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని భావించారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక పుష్కరస్నానాలకు ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూరాల జలాశయంలో 8.377టీఎంసీల నీరు నిల్వ ఉంది. 14గేట్ల ద్వార 2.63 లక్షల క్కూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దిగువకు వరద ఉధృతి జూరాలకు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దాదాపు లక్షన్నర క్యూసెక్కుల నీటిని గురువారం జూరాలకు విడుదల చేశారు. శుక్రవారం నారాయణపూర్ ఎగువ ప్రాంతంలో భారీ వరదలు వస్తుండడంతో జూరాలకు మరో లక్ష క్యూసెక్కుల నీటి వదిలిపెట్టారు. దీనికి అనుగుణంగానే నీటిపారుదల శాఖ అధికారులు జూరాల ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉండకుండా శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 52పుష్కరఘాట్లలో కొన్ని మినహా అన్నికూడా పూర్తిస్థాయి నీటిమట్టంతో భక్తులు పుష్కరస్నానాలు ఆచరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించి పుణ్యస్నానం ఆచరించే అలంపూర్ మండలం గొందిమళ్ల వీఐపీ పుష్కరఘాట్లో నీళ్లు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోలేదు. శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు మళ్లాల్సి ఉండడంతో ఈనెల 10వ తేదీ వరకు గొందిమళ్ల ఘాట్కు నీళ్లొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుష్కరఘాట్లకు జలకళ ఇప్పటికే మక్తల్, గద్వాల, వనపర్తి నియోజకరవర్గాల్లోని అన్ని ఘాట్లు, బీచుపల్లి ప్రధాన పుష్కరఘాట్లోకి పూర్తిస్థాయికి నీళ్లు చేరుతున్నాయి. మరో ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని ఘాట్లకు కృష్ణమ్మ వరద రానుందని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో మరో వీఐపీ ఘాట్ సోమశిలకు శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి నీళ్లు రావాల్సి ఉంది. సామర్థ్యానికి అనుగుణంగా జలాశయం నిండకపోవడంతో ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కృష్ణా పుష్కరాలకు జిల్లాలో రూ.250కోట్లతో అన్ని ఏర్పాట్లుచేసిన అధికారులు పుష్కర స్నానానికి నీటికొరత తీర్చడం ఎలాగని కొంత ఆందోళనకు గురయ్యారు. కృష్ణానదికి పుష్కలంగా నీళ్లు రావడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
అంత్యపుష్కరాలు ఆరంభం
భరత భూమి వేద భూమి, కర్మ భూమి. ఇక్కడ జనం సృష్టికర్తపై విశ్వాసముంచుతారు. పాపపుణాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాలలో స్నానమాచరించి పునీతులవుతారు. పుష్కరాలు పూర్తి అయిన ఏడాదికి అంత్య పుష్కరాలు వస్తాయి. పుష్కరాలలో భక్తులు పవిత్ర గోదావరిలో మునిగి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. వారి ఆత్మల శాంతి కోసం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. వేద పండితులు గోదారమ్మకు మంగళహారతులు ఇస్తారు. రైతు పొలంలో జీవమై నిలచే జలం... సామాన్యుడి దాహం తీర్చే ‘అమృతం’ వరం జలం... పురాణాల్లో, ఇతిహాసాల్లో నదులను దేవతలుగా కీర్తించారు. దేశవ్యాప్తంగా గోదావరి, కృష్ణా నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాల్లో కోట్లాది భక్త జనం భక్తిప్రపత్తులతో పాల్గొంటారు. చెన్నూర్లో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కాశీ అంతటి ప్రాశస్త్యం గల పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదిలో భక్తులు భక్తి భావంతో స్నానమాచరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. నియోజకవర్గంలోని మండలాలైన కోటపల్లి, జైపూర్, మందమర్రి పట్టణాల నుంచి భక్తులు వచ్చారు. ఉదయం 5 గంటల నుంచే నదీతీరానికి చేరుకొని పూజలు చేశారు. పుష్కరఘాట్ వద్ద అధికారులు ఏర్పాట్లను చేశారు. తొలి రోజు వేలాది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. పూజారులు భక్తులచే వారి పూర్వీకులకు పిండప్రదానం చేయించారు. మొదటి రోజు పలువురు ప్రజాప్రతినిధులు సైతం పుష్కర స్నానం ఆచరించారు. – చెన్నూర్ -
వేడినీటి స్నానం ఎక్సర్సైజుతో సమానం!
లండన్: రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే వేడి నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అలసట నుంచి శరీరం, ఒత్తిడి నుంచి మనసు ఉపశమనం పొందుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ వేడినీటితో స్నాన్నం.. చిన్నపాటి ఎక్సర్సైజుతో సమానమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటామని, రక్తపోటు, మధుమేహం వంటివి కూడా తగ్గుతాయంటున్నారు. 2,300 మందిపై పరిశోధన చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. పరిశోధన కోసం ఎంపికచేసిన వారితో 30 నిమిషాలు బ్రిస్క్వాక్ చేయించారు. దీంతో వారిలో 140 కేలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. ఆ తర్వాత వేడినీటితో సంపూర్ణ స్నానం చేయమన్నారు. ఈసారి కూడా 140 కేలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. అంటే ఓ వేడి నీటి స్నానం.. 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్తో సమానమని తేల్చారు. అయితే అరగంట సైక్లింగ్ చేస్తే 630 కేలరీలు ఖర్చవుతాయని, వేడి నీటి స్నానంతో ఇంత పెద్దమొత్తంలో కేలరీలు ఖర్చు కాలేవని గుర్తించారు. -
వేసవిలో కూల్గా ప్యాక్స్...
బ్యూటిప్స్ ఎండ వేడిమి, దుమ్ము.. చర్మపు రంగును, తాజాదనాన్ని తగ్గిస్తాయి. వేసవి కాలంలో చర్మం నిగారింపు కోల్పోకుండా, వేడి నుంచి ఉపశమనం పొందాలంటే... పుదీనా ప్యాక్: ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. తర్వాత టీ స్పూన్ పుదీనా ఆకుల పేస్ట్లో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. బాదం నూనెలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం మీద, కళ్లకింద, మెడ, గొంతు, చేతులపై మృదువుగా రాయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.50 గ్రాముల ఎర్రకందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బాలి. దీంట్లో పచ్చిపాలు, బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మేనికంతా పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దోసకాయ గుజ్జులో టేబుల్ స్పూన్ పంచదార కలిపి, ఫ్రిజ్లో చల్లబడేవరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. -
స్నానం చేసేముందు ఎవరున్నా ఊరుకోదు
తీరిక లేని కారణంగా స్నానం చేసేటప్పుడు ఉండే అనుభూతిని గుర్తించలేరేమోగానీ.. దానివల్ల కలిగే ఉపశమనం అంతా ఇంత కాదు. ఇలాంటి ఉపశమనం మనుషులే కాదు.. జంతువులు కూడా కోరుకుంటాయి. ఇక స్నానం చేసేసమయంలో అవి తమను తాము మరిచిపోతాయి. పూర్తిగా స్నానం చేయడాన్ని ఆస్వాదిస్తాయి. ఇక గుర్రాల విషయంలో ఇది మరీ ప్రత్యేకం. స్నానానికి వెళ్లే ముందు మనం ఎలా దుస్తులు విప్పేస్తామో.. గుర్రాలు కూడా తమ శరీరానికి బట్టలు ఉన్నట్లుగా భావించి వాటిని తీసేసినట్లుగా.. వాటి వీపుపై చిన్న పురుగును కూడా ఉండనివ్వవు. అలా చేసుకున్న తర్వాతే స్నానానికి వెళతాయి. ఇదే విషయాన్ని ఓ గుర్రం నిరూపించింది. తన బాస్ కుమారుడిని వీపుపై ఎక్కించుకొని వచ్చిన ఓ తెల్ల గుర్రం పచ్చిక బయళ్లగుండా వెళుతూ ఓ నీటి గుంటను చూసింది. దాన్ని చూడగానే మెల్లగా వడివడిగా అడుగులు వేసుకుంటూ అందులోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే నీళ్లను చూసిన సంబరంలో కాళ్లతో ముందుకు వెనక్కూ ఆ నీళ్లను చిమ్మింది. మరింత పారవశ్యానికి లోనై వీపుపై తన యజమాని కుమారుడు ఉన్నాడని కూడా చూడకుండా అమాంతం మొకాళ్లతో నీళ్లలోకి కూర్చుంది. ఆ వెంటనే ఒక్క విదుల్పు విదిల్చింది. అంతే ఆ బుడతడు వెళ్లి బురద నీళ్లలో పడ్డాడు. ఆ తర్వాత ఆనందంగా ఆ గుర్రం చక్కగా నీళ్లలో పొర్లి మళ్లీ సవారీకి సిద్ధమైంది. ఇదంతా చూసిన ఆ బుడతడు తొలుత కంగారు పడినా తిరిగి ప్రేమగా దానిపైకి ఎక్కాడు. -
ఎండాకాలం..
సహజ సౌందర్యంతో మెరిసిపోవాలంటే... స్నానం చేయడానికి ముందు అరోమా ఆయిల్స్ రాసుకొని, కాసేపు సేదతీరాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.బయటకు వెళ్లి వచ్చాక క్లెన్సింగ్ మిల్క్లో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులు తుడిచేయాలి. ఇలా చేస్తే దుమ్ము త్వరగా వదిలిపోతుంది. ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. షాంపూ వాడిన తర్వాత కండిషనర్ని వాడాలి. -
బాత్రూం సైజు ఇళ్లలో వేలమంది నివాసం!
తీవ్రవాద చర్యలకు భయపడి పారిపోతున్న శరణార్థులు... సహాయ శిబిరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న బాత్రూం పరిమాణంలో ఉన్న ఇళ్లలో వేలమంది నివసిస్తున్నారు. తాజాగా బయటపడ్డ కొన్ని ఫొటోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయినవారంతా మఫ్ రాక్ నగరానికి దగ్గరలోని అల్ జతారి క్యాంప్లో తలదాచుకుంటున్నారు. జోర్డాన్లోని ఆ శిబిరాలే ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. తీవ్రవాదానికి దూరంగా.. మెరుగైన జీవితం గడపడం కోసం సిరియా, ఇరాక్ దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు సుమారు ఆరు లక్షల మంది జోర్డాన్లో ఆశ్రయం పొందుతున్నారు. లక్షల మంది ఈ అగ్గిపెట్టెల్లాంటి శిబిరాల్లో తల దాచుకొని కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి అందుబాటులో కాఫీ, పిజ్జా, బార్బర్ షాప్లు కూడా వెలిశాయి. ఇప్పుడీ ప్రాంతం.. వారి సొంత నగరంగానే మారిపోయినా, సమస్యలు మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజుకు శరణార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ నివపిస్తున్నట్లు గుర్తింపు పొందిన మొత్తం 6 లక్షల మంది శరణార్థులకే కాక, లెక్కల్లో లేని సుమారు మరో 10 లక్షల మంది సిరియన్లకు కూడా సహాయం అందించాలని కోరుతున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మాత్రం తమ విద్యావ్యవస్థ, ఆరోగ్య విషయాల్లో శరణార్థులకు హాని ఏమీ లేదని అంటున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని నిర్మించడంలో తాము సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ప్రతిరోజూ 15.5 టన్నుల బ్రెడ్ను శిబిరానికి పంపిణీ చేస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో శరణార్థ శిబిరాల్లో రద్దీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావాలని భావించినా.. సిరియాలో సంక్షోభం వల్ల అది సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా శరణార్థుల సమస్య తీరి.. యూరోపియన్ దేశాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలని అంతా కోరుకుంటున్నారు. -
కొవ్వూరులో విషాద ఛాయలు
సెలవు రోజు కావడంతో గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతైన నందిగం జయదేవ్ (15), గాలింకి సూర్యసుమంత్ (15) మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. జయదేవ్ తండ్రి లక్ష్మీమాధవ్ రెండు నెలల క్రితం మరణించారు. జయదేవ్ ఆ ఇంటికి పెద్ద కుమారుడు. అతనికి తమ్ముడు ఉన్నాడు. భర్త పోరుున దుఃఖం నుంచి తేరుకోకుండానే కుమారుడు దూరం కావటంతో జయదేవ్ తల్లి హేమలత గుండెలవిసేలా రోదిస్తోంది. దేవరపల్లికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు కుమారుడు సూర్యసుమంత్ కొవ్వూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో పనిచేస్తున్న పెదనాన్న సుముద్రగుప్తుడు ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఆయనకు మగపిల్లలు లేకపోవడంతో సోదరుడి కుమారుడిని రెండేళ్ల నుంచి తన దగ్గరే ఉంచుకుని చదివిస్తున్నారు. సుమంత్ మరణంతో తండ్రి శ్రీనివాసరావు, పెదనాన్న సముద్రగుప్తుడు కన్నీరు మున్నీరవుతున్నారు. కొవ్వూరులో విషాద ఛాయలు కొవ్వూరు : గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదే హాలను సోమవారం వెలికితీశారు. ఆదివారం సాయంత్రం గల్లంతైన వీరికోసం అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు రాత్రి పొద్దుపోయే వరకు నదిలో ముమ్మరంగా గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో నదిలో ఆక్సిజన్ సహకారంతో గాలించే ప్రత్యేక ఈతగాడి సాయంతో సోమవారం ఉదయం నందిగం జయదేవ్(15), గాలింకి సూర్య సుమంత్(15)ల మృతదేహాలు బయటకి తీశారు. గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో నిత్యం వందలాది మందిస్నానాలు ఆచరిస్తుంటారు. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన అందర్నీ కలచివేసింది. ఇద్దరు చిన్నారులు నదిలో మునిగిన గల్లంతవడంతో వారి బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో గోష్పాదక్షేత్రానికి చేరుకున్నారు. మొదటి సుమంత్ మృతదేహం లభ్యం అయింది. ఉదయం 11 గంటల సమయంలో జయదేవ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతులిద్దరూ కొవ్వూరు పట్టణంలో 21వ వార్డులోని వేగివారి వీధికి చెందినవారే కావడంతో ఆ వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుమంత్ స్వగ్రామం దేవరపల్లి. రెండేళ్ల నుంచి కొవ్వూరు 21వార్డులో ఉంటున్న పెద్దనాన్న సముద్ర గుప్తుడు వద్ద ఉండి చదువు కుంటున్నాడు. జయదేవ్కి కొవ్వూరు పట్టణానికి చెందినవాడే. ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్సై ఎస్.పవన్కుమార్ కేసు నమోదు చేశారు. -
కూరగాయలతో కాంతి
బ్యూటిప్స్ క్యాబేజీ ఆకులను గుజ్జులా చేసి, అందులో బాదం నూనె కొద్దిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దేహానికి పట్టించి, మృదువుగా రుద్ది, ఆ తర్వాత శుభ్రపరచాలి.కీరా ముక్కలను మెత్తగా రుబ్బి, అందులో కొద్దిగా పంచదార, కొబ్బరినూనె కలిపి శరీరానికి పట్టించి మృదువుగా రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి. టొమాటో గుజ్జులో కొద్దిగా తేనె కలిపి శరీరానికి పట్టించి, రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి. -
సెల్ చార్జింగ్తో జర భద్రం
నాణ్యమైన చార్జర్లను వాడండి పిల్లలకు అందుబాటులో ఉంచకండి శ్రీనివాస్ ఒక సేల్స్ ఎక్సిక్యూటివ్. ఉద్యోగంలో భాగంగా సెల్ఫోన్లో నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఒక రోజు శ్రీనివాస్ సెల్ ఛార్జింగ్లో పెట్టి స్నానానికని వెళ్లాడు. స్నానం చేస్తుండగా సెల్ మోగింది. దీంతో అతను తడితోనే బయటకు వచ్చి చార్జింగ్లో ఉన్న సెల్ను పట్టుకుని మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు తక్షణం హాస్పటల్కు తీసుకువెళ్లారు. అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ తగు జాగ్రత్తలు పాటించాలనే స్ప ృహ చాలా మందిలో ఉండదు. అల్లిపురం : సెల్ఫోన్ లేనిదే నేడు ఎవరికీ రోజు గడవదు. 24 గంటలు సెల్ఫోన్ను అంటిపెట్టుకుని ఉంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క కాలకృత్యాల సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో సెల్ చేతిలో ఉండాల్సిందే. దీంతో సెల్ ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి సమయం కూడా కేటాయించలేక పోతున్నారు. దీంతో సెల్ ఛార్జింగ్లో ఉండగానే మాట్లాడుతుంటారు...ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? నకిలీల వల్లే ప్రమాదాలు.. నకిలీ చార్జర్ల వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు గానూ నకిలీ, నాణ్యత లేని వస్తువులు కొనకపోవడమే మంచిదని, కాస్త ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు కొనడం వల్ల సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నారు. సెల్ఫోను, ల్యాప్టాప్, ట్యాబ్ల వంటి గాడ్జెట్స్ను అతి సున్నితమైన పరికరాలతో తయారు చేస్తారు. వీటిలో వివిధ రకాల మెటల్స్తో కలగలిపి ఉంటాయి. వాటి చార్జింగ్కు 5 ఓల్టులు విద్యుత్ సరిపోతుందని ఆ పరికరాల చార్జర్లు, గాడ్జెట్లపై సంబంధిత కంపెనీలు ముద్రించి ఉంచుతాయి. సాధారణంగా ఇళ్ళలోను, కార్యాలయాల్లోను 220 ఓల్టులు వస్తుంటుంది. మన ఇళ్ళలో ప్లగ్ల నుంచి వచ్చే 220 ఓల్టులు విద్యుత్ను చార్జర్లు 5 ఓల్టులుకు తగ్గించి పంపుతాయి. దీంతో గాడ్జెట్లు చార్జింగ్ అవుతుంటాయి. ఒక్కోసారి చార్జర్లో సాంకేతిక లోపాలు కలిగినపుడు 5 ఓల్టులకు బదులు 220 ఓల్టులు విద్యుత్ గాడ్జెట్లకు సరఫరా అవుతుంది. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. తడి కాళ్ళు, చేతులతో వాటిని ముట్టుకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►గాడ్జెట్లకు సంబంధించిన కంపెనీ చార్జర్లు పోయినపుడు నాణ్యమైన విడి చార్జర్లు మాత్రమే కొనుక్కోవాలి. ►చార్జరు వైర్లు తెగిన సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని తెగిన చోట ఇన్సులేషన్ టేపుతో అతికించాలి. లేదా నాణ్యమైన చార్జర్ కొనుక్కోవడం మంచిది. ►సెల్ఫోను చార్జర్ల నుంచి ఎటువంటి ద్రవాలు, పౌడర్లు వంటివి బయటకు పొక్కినట్లు కనిపిస్తే వాటిని విడిచిపెట్టడం ఉత్తమం. ►ఇంట్లో పాకే పిల్లలు ఉన్నట్లయితే చార్జర్లు వారికి దూరంగా ఉంచడంగాని, వారికి అందనంత ఎత్తులో ఉంచడం మంచిది. లేకుంటే వారు పాక్కుంటూ వెళ్లి చార్జర్ నోట్లో పెట్టుకుంటే ప్రమాదాలు సంభవించే వీలుంది. ►ఛార్జింగ్లో ఉన్న సెల్ఫోన్లు పిల్లల చేతికి అందకుండా ఉంచాలి. పెద్దలు కూడా ఛార్జింగ్లో ఉన్న గాడ్జెట్స్ను తాకకుండా ఉండడమే ఉత్తమం. ►నాణ్యత లేని చార్జర్లు వినియోగించడం వల్ల ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. లేదా షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ►ముఖ్యంగా రాత్రి పూట పడుకునే సమయంలో సెల్ఫోన్లు చార్జింగ్లో పెట్టి తలకింద పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. దీనివల్ల నిద్రలో వాటిపై ఒత్తిడి పెరిగి ఛార్జర్, చార్జర్ పిన్ విరిగిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ వేడెక్కి పోయి పేలిపోయే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో చార్జింగ్లో పెట్టుకోకపోవడమే మంచిది. పడుకునే వరకు చార్జింగ్లో ఉంచి పడుకున్న తరువాత వాటిని ఆఫ్ చేసి పెట్టుకోవడం ఉత్తమం. -
మెడకు స్టీమ్.. ముఖానికి క్యాబేజీ...
బ్యూటిప్స్ మెడ నల్లగా ఉందని ఎంతోమంది బాధపడుతుంటారు. కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు మాత్రమే మెడ కడుక్కుంటారు. అలా కాకుండా రోజు కచ్చితంగా రెండుసార్లు సబ్బుతో మెడను శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా వారానికి మూడుసార్లు పాటించాల్సిన చిట్కా ఒకటుంది. వేడి వేడి నీళ్లలో ఒక టవల్ను ముంచాలి. కొద్దిగా ఆ టవల్ను పిండి మెడపై నల్లగా ఉన్న ప్రాంతంలో బాగా రుద్దాలి. అలా చేస్తే మెడకు స్టీమ్ అందడంతో క్రమంగా నలుపు రంగు పోతుంది. అంతేకాకండా ఈ చిట్కాతో మెడ దగ్గర ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. ముఖంపై చర్మం లూజ్గా ఉండటం వల్ల కొందరు తక్కువ వయసులోనే పెద్దవాళ్లలా కనిపిస్తారు. అందుకు స్కిన్ టైటనింగ్ చిట్కా పాటిస్తే సరి. ముందుగా క్యాబేజీని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొద్దిగా బియ్యం పిండి, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. క్యాబేజీలోని విటమిన్-ఏ,బి, పొటాషియం, పాస్పరస్ల ప్రభావం వల్ల చర్మం లూజ్గా అయ్యే అవకాశాలు తగ్గుతాయి.. -
కరీంనగర్లో 8లక్షలమంది పుష్కరస్నానం
-
పుష్కరస్నానం చేస్తే తరతరాల పాపాలుపోతాయి
-
స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి
నల్గొండ(వలిగొండ): మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ పట్టణానికి చెందిన జోగు సైదులు(24) అనే వ్యక్తి ఓ ఫంక్షన్ నిమిత్తం తన కుటుంబం సభ్యులతో కలిసి పొద్దుటూరు గ్రామంలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లాడు. మూసీనదిలో స్నానానికి దిగిన సైదులు నీటిలో మునిగి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
వెనిగర్... సూపర్!
విదేశాల్లో వెనిగర్ను విరివిగా ఉప యోగిస్తారు కానీ మన దగ్గర చాలామందికి వెనిగర్ ఎందుకు వాడతారో కూడా సరిగ్గా తెలియదు. నిజానికి ఇంట్లో ఒక్క వెనిగర్ డబ్బా ఉంటే... చాలా పనులు చిటికెలో అయిపోతాయి. వెనిగర్లో ముంచిన బట్టతో తుడిస్తే టైల్స్, అల్మరాలు, ఫ్రిజ్ వంటివన్నీ కళకళలాడతాయి! బట్టలపై పడిన మరకల్ని తేలికగా వదిలిస్తాయి కాస్త వెనిగర్ను జుట్టుకు పట్టించి, కాసేపాగి తలస్నానం చేస్తే, కండిషనర్తో పని ఉండదిక! ఫ్లవర్ వాజ్లోని నీటిలో కాస్త వెనిగర్ వేస్తే పూలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి ఓ చెంచాడు వెనిగర్ వెక్కిళ్లను చప్పున ఆపేస్తుంది నీటిలో వెనిగర్ను కలిపి చల్లితే, చీమలు దరిదాపుల్లోకి కూడా రావు! వెనిగర్లో ముంచిన బట్టతో బాగా రుద్ది, ఆ తర్వాత లాగేస్తే, కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు తేలికగా ఊడి వస్తాయి కూరల్లో కారం, మసాలా ఎక్కువైన ప్పుడు కాస్త వైట్ వెనిగర్ కలిపితే ఘాటు తగ్గు తుంది! వెనిగర్ కలిపిన నీటిని చల్లితే మొక్కలకు పురుగు పట్టదు. -
నాన్న పంచె
కథ తమిళ మూలం: ప్రభంజన్ అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ నాన్న దగ్గర ఒక పంచె ఉండేది. నాన్న దగ్గర పట్టు పంచెలు ఎన్నో ఉన్నప్పటికీ, చిన్న పిల్లలమైన మాకు ఆయన కట్టుకునే ఎరుపు రంగులోని పంచె అంటేనే అద్భుతంగా అనిపించేది. ఎరుపంటే అంత చిక్కటి ఎరుపేమీ కాదు. అలాగని కుంకుమ రంగేమీ కాదు. ఉదయకాలంలోని సూర్యకిరణాలు అరుణవర్ణంలో కనిపిస్తాయే, అలాంటి రంగులో ఉండే పంచె అది! పంచె అంతా పూర్తిగా అదే వర్ణం కాదు. అంచు మాత్రం పచ్చ రంగు. నాలుగు వేళ్ల వెడల్పున్న సరిగతో ఉంటుంది. అంచున ఒకదాని వెంట ఒకటి నడిచి వెళ్లే బాతుల బొమ్మలు. అవి బాతులు కావు, హంసలని చెప్పేది అమ్మ. మేము హంసల్ని నిజంగా చూడలేదు. ఆ పంచెలోని అంచులోనే చూడగలిగాం. ఏదైతే ఏం? ప్రాణమున్న జీవరాశులేగా?! ఆ పంచె మామూలు రోజుల్లో చూద్దామంటే కనిపించదు. నాన్న దాన్ని తన అల్మైరాలో భద్రపరిచి ఉంచేవారు. అలాంటి అల్మైరాలన్నీ ఇప్పుడు దొరకటం లేదు. ఇప్పుడన్నీ చిన్న చిన్నవేగా! నాన్న అల్మైరా నుండి దాన్ని బయటికి తీసే సందర్భం మాకు తెలుసు నాకూ మా చెల్లెలు రాజేశ్వరికీ! పండగ దినాలు లేక తాతయ్య ఆబ్దికం మొదలైన రోజుల్లోనే అది బయటికొస్తుంది. ఆ రోజుల్లో మాత్రం మాకు ముందే చెబుతారుగా! నాన్న స్నానం చేసొచ్చి ఆ పంచెను తీసి కట్టుకునేవారు. నాన్న ఎప్పుడు స్నానం చేసొస్తారా అని ఎదురుచూసేవాళ్లం, అల్మైరా ముందు నిలబడి. నాన్నకు స్నానం చేయటానికి గంట సమయం పట్టేది. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారనిపించేది. అది పసిప్రాయం. ప్రశ్నలు మాత్రమే వేసే వయస్సు. ఇప్పుడు అర్థమవుతోంది. స్నానం చెయ్యటం మురికి పోవటానికా? మురికిపోవటానికా స్నానం చేసేది? స్నానం చెయ్యటమన్నది ఒక సుఖం. నడినెత్తిన పడ్డ చల్లదనంపాకుతూ పాదాల దాకా వచ్చే సుఖం కోసమేగా స్నానం చెయ్యటం. స్నానం చేశాక ఏర్పడే నూతనోత్తేజం కోసమేగా స్నానం చెయ్యటం! నాన్న ఒక గంటసేపు స్నానం చెయ్యటం న్యాయమేననిపించింది. సరే! స్నానం పూర్తయ్యాక గబగబ పంచెను తీసి కట్టుకుంటారని అనుకుంటున్నారా? అదేం కాదు! స్నానం చేశాక, కౌపీనంతో (గోచీ) గుమ్మం దగ్గరకొచ్చి నిలబడేవారు. సగం తడిని ఆయనా, మిగతా సగాన్ని సూర్యభగవానుడూ తుడవాలి. మేము నాన్ననే చూస్తుండేవాళ్లం. నీటిబొట్లు ఆయన వీపుమీద గీతలు గీస్తూండటం చూడ్డానికి అబ్బురంగా ఉండేది. ఆయన వీపే ఒక పెద్ద తామరాకులాగానూ, నీళ్లు ముత్యాల్లాగానూ అనిపించేది. నిదానంగానూ, అంగుళం అంగుళంగానూ తుడుస్తూంటే తడి దూరమయ్యేది. నాన్న ఒళ్లంతా బాగా కందిపోయేది. అసలే ఆయన ఒళ్లు ఎరుపు! స్నానమయ్యాక శరీరం పండిపోయినట్టు అయిపోయేది. ‘‘సమయమౌతోంది. తొందరగా వచ్చి కట్టుకుంటే ఏంటట?’’ అనేది అమ్మ. దీన్ని కోపంగానూ, నేరారోపణ చేస్తున్నట్టుగానూ చెప్పేదనుకుంటున్నారా? కానే కాదు! ఇంకాసేపు ఆలస్యమైనా పర్లేదు అన్నట్టూ, ఆయన్ను ప్రోత్సహించే విధంగానూ ఉండేది. గుడిసె చూరు మీద ఒక చెయ్యి వేసి ఒంగొని, గుమ్మం బయట నిలబడున్న నాన్నను చూసి నవ్వుతూ అమ్మ ఆ మాటల్ని అనగానే మాకు కోపం ముంచుకొచ్చేది. అమ్మయ్య, అయింది! ఒక రకంగా స్నానం పూర్తిచేసి పై పంచెను నడుముకు చుట్టుకుని, గోచీని తీసి, పిండి, పదిసార్లు విదిలించి, బయటున్న దండెం మీద ఆరేసేవారు. విదిలించినప్పుడు ఎగిరే నీటిబొట్లు సన్నని దోమల గుంపుల్లా ఉండేవి. తర్వాత లోపలికొచ్చేవారు నాన్న! గబగబ వస్తే పరవాలేదుగా! అలా రారు. అరికాలికి అంటుకున్న మట్టిని మెట్టుకు అటు ఇటు రాస్తూ తుడిచేవారు. కాలికి ఒక్క రవ్వ కూడా మట్టి ఉండేది కాదు. మట్టి, మసి ఆయన ఆజన్మ శత్రువులు కదా! మాకు తెలుసుగా! ఆ తర్వాతే అల్మైరాను తెరిచేవారు. ఆ వాసన ఓ అపూర్వమైన సువాసన! తలుపు తియ్యగానే పచ్చకర్పూరం వాసన గుప్పుమని వీచేది. ఒళ్లంతా తుళ్లిపడేలా చేసేది ఆ సువాసన. అందుకోసమేగా ఎదురుచూస్తున్నాం. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాం. ముక్కూ, నోరూ రెంటినీ... ఒడ్డునపడ్డ చేపలా తెరుస్తూ మూస్తూ ఆ సువాసనను అనుభవించేవాళ్లం. అల్మైరాలో ఒక చిన్న జాజికాయ పెట్టె భద్రపరిచేవాడు. ఆ పెట్టెలో ఏముంది? ఒకరోజు, ‘నాన్నా... నాన్నా... ఆ పెట్టెను నాకివ్వు నాన్నా!’ అన్నాను. నాన్న నవ్వుతూ నన్ను పెకైత్తి పట్టుకుని పెట్టెలోకి చూపించారు. ఒక తెల్లటి వస్త్రంలో చుట్టిన పంచె, బొత్తుగా పేర్చిన కాగితాలు (అవి దస్తావేజులని తర్వాత తెలుసుకున్నాను), రాజా రాణీ బొమ్మలు గీసిన నోట్లూ, బంగారు కాసులూ, నాన్నగారి ఎర్ర తెల్లరాళ్లతో చేసిన ఉంగరాలూ అన్నీ ఉన్నాయి. రాజీ ఊరుకుంటుందా, ఏం? ‘నేనూ చూస్తాను నాన్నా’ అంది. నాన్నగారు దానికీ పెట్టె దర్శనం చేయించారు. నాన్నగారు ఇప్పుడు ఆ పెట్టెను తెరిచారు. జాగ్రత్తగా ఆ ఎర్ర పంచెను తీసుకుని గదిలోకి వెళ్లారు. ఉతికి ఆరబెట్టిన అండర్ డ్రాయర్లు నాన్న గదిలో దారం మీద వేలాడుతుండేవి. అవన్నీ ఎంతో పెద్దవిగా ఉండేవి. ఒకదాన్ని చించి రాజీకి పావడ, జాకెట్టు కుట్టీయచ్చు అనేట్టుండేవి. నాన్నగారికి మోకాళ్లదాకా వచ్చేవి. ఒక అండర్ డ్రాయర్ను తొడుక్కుని, దానిమీద పంచెను కట్టుకుంటేనే నాన్నగారికి నిలుస్తుంది. నాన్నగారు పంచెను కట్టుకుని బయటికొచ్చేవారు. అబ్బబ్బా... నిప్పును కట్టుకుని వచ్చినట్టేగా ఉండేది. ఆ పంచెలో నాన్నగారు ఎంతో అందంగా ఉండేవారు. ఆయన వల్ల ఆ పంచెకు గొప్పతనమా? లేక ఆ పంచె వల్ల నాన్నగారికి గొప్పతనమా? అప్పుడు నాన్నగారిని గట్టిగా కౌగిలించుకోవాలనిపించేది. కౌగిలించుకునేవాణ్ని. పచ్చ కర్పూరం వాసనతో, ఆ ‘పట్టు’ చల్లగా, వెచ్చగా, పాపాయి చెక్కిలిలా మెత్తగా, మృదువుగా ఉండేది. దాన్ని తడిమి తడిమి చూస్తూ సంతోషించేవాణ్ని. ఆ పంచెతోనే పండగ దినాల్లోనూ, ఆబ్దికం చేసేటప్పుడూ నాన్నగారు పూజలన్నీ చేసేవారు. పూజలంటే నాకు గుర్తుండేవి రెండు విషయాలే! ఒకటి భోజనం. ఆ రోజు తొందరగా కాదు. రెండవది, ఆ దినాల్లో తీపి పదార్థాలు తప్పకుండా చేస్తారు. అంతేకాక బంధువులు చాలామంది వస్తారు. బాల్యంలో నాకు ఓ లక్ష్యం ఉండేది. పెద్దవాళ్లు... ‘నువ్వు పెద్దవాడివయ్యాక ఏం చెయ్యాలనుకుంటున్నావ్?’ అని అడిగేవాళ్లు. అమ్మా, నాన్నా నాకు ముందుగానే చెప్పి ఉంచారు. ఠక్కున బదులిచ్చేవాణ్ని. ‘నేను డాక్టరునవుతాను’ - లేదంటే ‘ఇంజనీరునవుతాను’ అని చెప్పేవాణ్ని. విన్నవాళ్లు ఆశ్చర్యంతో కనుబొమల్ని పైకి లేపి నన్ను చూసేవాళ్లు. నాన్నకు, అమ్మకు గొప్పగా అనిపించేది. అయితే, ఈ డాక్టరు, ఇంజనీరు గొప్పతనం నా మనసులో లేదు. పెద్దవాళ్ల ముందు నేను అబద్ధం చెప్పాను. ఈ అబద్ధం ఆస్వాదించే అబద్ధం. పెద్దవాళ్లు చెప్పిచ్చినదాన్ని వాళ్లకే మళ్లీ అప్పగించేశాను. ఆనందంగా తోకనూపుతూ వాళ్లు దాన్ని దిగమింగారు. దీన్ని చెప్పటానికి సిగ్గెందుకు? నేను పెద్దవాణ్నయ్యాక నాన్నగారి పంచెను కట్టుకోవాలి. ఇదీ నా లక్ష్యంగా ఉండేది. నేను పెద్దవాడయ్యాక ఆశపడ్డది దీనికోసమే! పెద్దవాడైతే నాన్నగారిలా మీసాలు మొలుస్తాయిగా. ముఖ్యమైన రోజుల్లో ఆ ఎర్రని పట్టు పంచెను కట్టుకుని నేను దేవుడికి మొక్కుతానుగా... నేను పెద్దవాణ్ని కావాలిగా! మడిచి పెట్టే ఉంటే, ఆ పంచె ఎప్పటికీ మడత నలగకుండా ఉంటుంది. మడతలు విప్పలేనట్టుగా ఉంటుంది. సరిగ ఊడిపోదు. నేత అలాంటిది. ఆనాటి చేనేత ప్రత్యేకత అలాంటిది. ‘దీన్నెక్కడ కొన్నారు?’ అని నాన్నగారిని నేను అడిగి తెలుసుకోలేదు. మాయవరం, కూరైనాడు, తిరుభువనం అంటూ ఏదో ఒక ఊరిదై ఉండొచ్చు! నాకు పెండ్లిండ్లకు పోవటమంటే ఆ రోజుల్లో మహా సరదాగా ఉండేది. కారణం ఇదే! పెండ్లికొడుకు పట్టు పంచె కట్టుకుని ఉండేవాడు. పట్టు పంచెను చూడ్డమే ఒక అందమైన అనుభవంగా ఉండేది. ఎన్నో రకాల పట్టు చీరలు కట్టుకుని ఆడవాళ్లు పెండ్లిండ్లకు వచ్చేవాళ్లు. పట్టు చీరలు ఇంట్లో దాచుకుని పెండ్లిండ్లకు వెళ్లటానికి తపించేవారు ఆడవాళ్లు. పెండ్లిండ్లే ఈ ప్రపంచంలో లేకపోతే, ఈ ఆడవాళ్లు కన్నీళ్లు కార్చేవాళ్లు. పట్టు చీరలు ధరించి ఎవరికి చూపించి పారవశ్యం పొందగలరు? నా కలలు కూడా ఆ రోజుల్లో పట్టు బట్టలపైనే ఉండేవి. కలల్లో హంసలు గుంపులు గుంపులుగా వచ్చేవి. ఆకాశం అరుణ వర్ణంలో, కత్తిలా మెరిసేది. ఆ ఎర్రనైన ఆకాశంలో పచ్చని రంగులో ఒక పొడవైన ఏరు, ఆ ఏట్లో ఆ హంసలు ఈదులాడేవి. ఆ పంచెను నాన్న ఉతకటం నేను రెండుసార్లు చూశాను. పసిపాపకు స్నానం చేయించేలా ఉండేది. దానికి వేణ్నీళ్లు సరిపడవు. చన్నీళ్లతోటే దానికి స్నానం చేయించేవారు. మామూలు సబ్బు దానికి పడదట! అందుకని చందనం సబ్బునే నాన్న వాడేవారు. నాన్న స్నానం చేసేది మైసూర్ చందనం సోపుతో. దానికి? కదంబం సోపుతో! ఫ్రాన్స్ నుండి వచ్చిన కదంబం సోపు. మేము కదంబం సోపు అనేవాళ్లం. దిగుమతులు ఆగిపోయాక మైసూరు చందనం సోపు. దాన్నే దానికి వాడేవారు. సోపు వేయటం అంటే మృదువుగా రాస్తున్నట్టుగా ఉండేది. అమ్మ మాకు కొబ్బరినూనె రాస్తున్నంత మొరటుగా ఉండేది కాదు. అంత మృదుత్వం. గట్టిగా నొక్కేవారు కారు. మృదువుగా నీటిలో, పంచె కొసలను పట్టుకుని పిండేవారు. తర్వాత నీటిబొట్లు మాపైన పడేలా జాడించేవారు. కానీ ఎక్కువ జాడించేవారు కారు. పాతబడ్డ వస్త్రం చిరిగిపోవచ్చు. జాడిస్తున్నప్పుడు వర్షపు చినుకుల్లో తడుస్తున్నట్టుగా ఉండేది మాకు! తర్వాత నీడ పట్టున ఆరేసేవారు. ఎండ తగిలితే, రంగు వెలిసిపోతుంది. ఆరాక, నాన్నకు చెప్పటం నా బాధ్యత. మేము ఒకరి తర్వాత ఒకరం ఐదు నిమిషాలకో మారు బట్టను తాకి చూస్తుండేవాళ్లం. ఆరిందో లేదో చూడ్డానికే! మాకు అదొక సాకు. ఆ సాకులో పంచెను తాకి చూస్తూ ఉండొచ్చు! సాయంత్రం కావస్తుండగా పంచె ఆరిపోయి ఉంటుంది. నాన్నతో చెప్పటానికి పరుగెత్తేవాళ్లం. నాన్నే వచ్చి నిదానంగా దాన్ని దండెం మీద నుండి తీసి, అంచుల్లో ముడతలు లేకుండా సాగదీసి, మడిచి, మళ్లీ ఆ పెట్టెలో పెట్టేవారు. ఇక దాని ఉపయోగం మరొక శుభప్రదమైన రోజే! కాలక్రమంలో నాకూ మీసాలు మొలిచాయి. ఒక స్నేహితుడి సోదరికి ప్రేమలేఖ రాశాను. దెబ్బలు తిన్నాను. న్యాయమేగా? తర్వాత కాలేజీలో చేరాను. ఏమేమో చదివాను. నా బుర్రను ఆక్రమించుకోవటానికి ఎన్నో విషయాలున్నాయి. నా దృష్టిని ఆకర్షించటానికి ఎన్నో సంఘటనలు. అన్నిటికన్నా మిన్నగా వకీలు జగన్నాథయ్యర్ కుమార్తె ఉమామహేశ్వరి నన్ను పూర్తిగా మార్చేసింది. మధ్యమధ్యలో ఆ ఎర్రని పంచె నాకు గుర్తొచ్చేది. ‘‘నువ్వెక్కడ, ఎలా ఉన్నావ్?’’ దాన్ని కట్టుకుని ఆనందించి, ఉతికి, ఆరబెట్టి దాచుకోవటానికి నాన్న లేరు. పెట్టెలో ఉండే పాములా పడగెత్తి ఉంటుందని నాకు తెలుసు. ఎన్నో ఏళ్లు గడిచాక, ఒకసారి సొంత ఊరికి వచ్చినప్పుడు, ఒక సంఘటన జరిగింది. అప్పుడు వినాయక చవితి పండగొచ్చింది. బాగా గుర్తుంది. రాజీ, పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నేనే గణపతి ప్రతిమను తీసుకొచ్చాను. అచ్చుపోసిన గణపతే! ముక్కూ, కళ్లూ అన్నీ బావున్నాయి. ఈ స్వామి ఎంత అందమైన కల్పన. నన్నే పూజచెయ్యమంది అమ్మ. మనసులో ఒక గుబులు ఏర్పడింది. ఆ పెట్టెలో ఉన్న పంచెను గుర్తుచేసుకునే! పరాకుగానే స్నానం చేశాను. తడి పోకుండా తుడుచుకుని నాన్న అల్మైరాను తెరిచాను. ఆ పచ్చ కర్పూరం వాసన ఇంకా అలాగే ఉంది. వాసన పోదేమో?! అనుభవించాను. తోడు రాజీ లేదే అని బాధగా అనిపించింది. జాగ్రత్తగా పెట్టెను తెరిచాను. నాన్న ఉంగరాలు తప్ప మిగతావన్నీ ఎక్కడికెళ్లాయి? ఉంగరాలు నా కాలేజీ ఫీజులుగానూ, హాస్టల్ భోజనాల ఖర్చులుగానూ అప్పటికే అవి మారిపోయాయి. పంచెను బయటికి తీశాను. దానిమీద చుట్టిన గుడ్డను విప్పదీశాను. అదే పసిదాని మృదుత్వం. అదే కత్తిలోని మెరుపు. అదే వాసన. కొంచెం కూడా రంగు వెలిసిపోలేదు. నడుముకు చుట్టుకున్నాను. మనసు నాన్నను గుర్తుచేసుకుంది. కాళ్లు తిన్నగా నిలబడ్డాయి. అరటి ఆకును చుట్టుకున్నట్టుగా ఉంది. అంతటి మెత్తదనం. పీటను ముందేసుకుని వినాయకుడి ముందు కూర్చున్నాను. ఒక శబ్దం, సణుగుడుతో పంచె ప్రాణం విడిచింది. నా వెనుక వైపున మడత పూర్తిగా పొడవుగా చిరిగిపోయింది. లేచి నిలబడ్డాను. చీకట్లో పసిబిడ్డ చేతిని తొక్కినట్టు అనిపించింది. వంటింట్లో నుండి అమ్మ కుడుముల పాత్రతో వచ్చింది. ‘‘ఏమిట్రా! చిరిగిపోయిందా? పోతే పోనీ! నాన్న కాలపు పంచె! నీకెలా ఉపయోగపడుతుంది! వెళ్లి నీ పంచెను కట్టుకుని వచ్చి పూజ పని చూడూ!’’ అంది అమ్మ. నా టెరికాటన్ పంచెను తీసి కట్టుకుని, వినాయకుడి ముందు కూర్చున్నాను. టెరికాటన్ పంచె నాకు సరిపోయిందనిపించింది. అయినా మనసులో ఎక్కడో బాధగానే ఉంది. -
జలకాలడుతూ జర్నీ
-
ఆజన్మం: చిందిపోయే కాంతి
స్నానం ఆలస్యం కావడానికి కారణాన్ని ఒక్కోసారి ఏం చెప్పీ నమ్మించలేం; వినేవాళ్లు మరీ చిన్నపిల్లలైపోతే తప్ప. అలా ఎగిరిపడిన నీళ్లు గుండ్రాలు గుండ్రాలుగా కిందికి జారుతూవుంటాయా! మూలన ఉన్న ఆరెంజ్ కలర్ జీరో బల్బ్ చూస్తుండగా నారింజ అవుతుంది; అది నిజమేనా అని తల కాస్త పెకైత్తగానే పొప్పడికాయ అవుతుంది; మళ్లీ తల వంచితే అరటిపండై కూర్చుంటుంది. అదే వరుసలో బిరడా కాగలుగుతుంది; ఇదేంటో చిత్రం అనుకునేంతలో ఈ ముడి అవతలి ముడిని తాకి ఎనిమిదై వయ్యారాలు పోతుంది; పాతరాతి యుగపు పనిముట్టు అవుతుంది; అంతలోనే నిండు చంద్రుడిని తలపిస్తుంది. నీడల నిష్పత్తులు మారినకొద్దీ ముద్దగా, ముద్దుగా, అప్పుడే ద్రవంలాగా, ద్రవపు కాంతిలాగా రూపాంతరం చెందుతూవుంటుంది. ఒక నీడ కూడా అంత అందంగా ఉండగలదని కొత్తగా నిరూపితమవుతూ ఉంటుంది. వెలుగంతా కింద చిందిపోయినట్టుగా, నీటి బిందువులుగా కాంతి విడిపోతుంది. పైనొక్కటే; కింద అనేకంగా దర్శనమిస్తుంది. చేపపిల్లలాగా ఈ బుడగ కాంతిని మోసుకుంటూ మరో కాంతిలో ఐక్యమైపోతుంది. నీళ్లన్నీ చుక్కలేకుండా కిందికి జారిపోయాక, మళ్లీ ఆ ఒక్కటే మిగిలిపోతుంది. ఇదొక వెలుగు నీడల క్రీడ! మనసులోకి జొరబడిపోయిన పెద్దరికాన్ని నీటిబుడగలు ఇట్టే చిట్లిస్తూవుంటాయి. మోకాళ్ల నొప్పుల జాడల్లేని చిన్నతనంలోకి లాక్కెళ్తూవుంటాయి. ఇది కదా సృజన, అనుకుంటాను పొద్దున. రాత్రెప్పుడో, విద్యుద్దీపాల వెలుగును ఆపేసి, నిద్రకోసం చీకటిని బతిమాలుతున్నప్పుడు, ‘బయ్యమైతుంది నానా,’ అని మా చిన్నోడు నాలోకి ఒదిగిపోతాడు. కనిపించే వెలుగులో కనబడనిది చూడటంలో ఏముంది? ఏమీలేని చీకటిలో ఏదో ఒకటి ఊహించడం కదా అసలైన సృజన! భయపడటం కూడా అంత అగౌరవ పరిచే అంశం ఏమీ కాదు సుమా! - పూడూరి రాజిరెడ్డి అరేయ్.. తురేయ్.. చిన్నప్పుడు నిజంగానే చిన్నగా ఉండివుంటాంగదా! ఆ వయసులోనే, దోస్తుల్ని ‘అరేయ్’ అని పిలుచుకునే ఆప్షన్ ఒకటి ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది! స్నేహం కోసం ఒక మర్యాద సరిహద్దును చెరిపేసుకోవాలన్న నియమాన్ని అప్పుడే ఎలా గ్రహించివుంటాం? మా రమేశ్ గాడు, హరీశ్ గాడు పరిచయమైన కొత్తలో నాతో మామూలుగా మాట్లాడుతూనే, ఎవరితోనైనా నా గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ ‘వీడు’ అనేవాళ్లు. ‘‘చందానగర్ల మన రాజిగాడు కనవడ్డడ్రా.’’ ‘నన్ను అరేయ్ అనగలిగేంత గొప్పోళ్లారా మీరు’ అని, ఆ సంబోధనను ఒప్పుకోలేక, నిరాకరించలేక సతమతమైమైమై... ఇక చివరకు, ‘నేను కూడా నిన్ను అంటాన్రోయ్’ అని చాటి చెప్పాలనుకుని, ముందు వినీ వినబడనట్టుగా ‘(అరే)య్’ అని, తర్వాత (అ)రేయ్ అని, అటుపై అరేయ్ దాకా వాళ్ల చెవుల్ని ట్యూన్ చేస్తూ వచ్చాను. పెద్దిరాజుగాడితో నాకు పరిచయం తక్కువ. అయినా వాడితో మాట్లాడిన ఒకట్రెండు సార్లకే మేము ‘అరేయ్’ ‘అరేయ్’ అని పిలుచుకోవడం మొదలుపెట్టాం. అలాగే కృష్ణారావుగాడు. ఇంకొందరుంటారు. వాళ్లతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంటుంది. చెప్పాలంటే పైవాళ్లతోకంటే ఒక లక్షరెట్లు ఎక్కువ పరిచయం ఉంటుంది, అయినా ఆ స్నేహం రేయ్లోకి పురోగమించదు; ఒకే వయసు అనే ప్రాథమిక అర్హత ఉన్నప్పటికీ. ఏ సంకోచం ఇక్కడ పనిచేస్తుంది? మర్యాద ముసుగును తొలగించి పారేసే ఏ కీలకం అక్కడ పనిచేసివుంటుంది? బహుశా, ఎవరో ఒకరు ఆ హద్దును తొలిసారి దాటడానికి అమర్యాదకర సాహసం చేయాలేమో! అసలు అలాంటి ప్రయత్నం కూడా జరిగినట్టు తెలియనంతగా గుట్టుచప్పుడు కాకుండా గుండె కోటలోకి దిగబడాలేమో!