
జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టంతో 65918 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో 19654 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఎథేర్ మోటార్స్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్,లార్సెన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, హీరో మోటో కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అపోలో హాస్పిటల్, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)