
Today Stock Markets Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతోముగిసాయి. ఆరంభంలాభాలను కొనసాగించిన సూచీలు చివరివరకూ లాభాలను నిలబెట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 213 పాయింట్లు ఎగిసి 65433 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 19444 వద్ద స్థిరపడ్డాయి.బ్యాంకు, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి.
యాక్సిస్బ్యాంకు, హిందాల్కో, ఎస్బీఐ, ఐసీఐసీఐబ్యాంకు, దివీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి.
రూపాయి: మంగళవారం నాటి ముగింపు 82.93తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 25 పైసలు పెరిగి 82.68 వద్ద ముగిసింది.
(Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment