Stockmarket
-
సూచీలు అక్కడక్కడే..!
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో స్టాక్ సూచీలు మంగళవారం అక్కడిక్కడే ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ రెండు పాయింట్ల లాభంతో 81,510 వద్ద నిలిచింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 24,610 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రథమార్థంతా లాభాల్లో కదిలాయి. మిడ్సెషన్లో లాభాల స్వీకరణతో నష్టాలు చవిచూశాయి.ట్రేడింగ్ చివర్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు రాణించడంతో నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 543 పాయింట్ల పరిధిలో 81,508 – 81,726 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 24,678 వద్ద కనిష్టాన్ని, 24,511 గరిష్టాన్ని తాకింది. రియలీ్ట, ఐటీ, మెటల్, కమోడిటీ, ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్విసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్లో ఈ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
ట్రేడింగ్లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్ఫామ్ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,401 వద్దకు చేరింది. సెన్సెక్స్ 72 పాయింట్లు ఎకబాకి 73,878 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) శనివారం జరిగిన ప్రత్యేక సెషన్లో నికరంగా రూ.82 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.45 కోట్ల స్టాక్స్ను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: 20,100 పైనే నిఫ్టీ.. లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు నెలవారీ గడువు ముగింపు, ఐదు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ఫెడ్ఛైర్మన్ పావెల్ సమావేశం ఉండడంతో కూడా మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ నెన్సెక్స్ 87 పాయింట్ల లాభంలో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల పుంజుకుని 20,133కు చేరింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్ల నష్టపోయినప్పటికీ.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్ల మేర లాభంలో నెల చివరి రోజు ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, విప్రో, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్ కంపెనీలతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..
ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్సోల్డ్ జోన్లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ గడిచిన ట్రేడింగ్తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్ బ్యారెల్ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.32శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 30 లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా అన్ని స్టాక్లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్ ఎం, బజాజ్ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్లు నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్లో ఫీచర్ ప్లాట్ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్ఇంక్!
గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్ఇంక్ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్పిచాయ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్కటింగ్ పేరిట్ క్లౌడ్ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్ అమ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్ఓ రూత్ పోరట్ తెలిపారు. గూగుల్క్లౌడ్ ప్లాట్ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్ల కోసం ఇతర ఎంటర్ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది. -
సాక్షి మనీ మంత్ర: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది. ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
సాక్షి మనీ మంత్రా: వచ్చే వారం మార్కెట్, ఏయే సెక్టార్లు బావుంటాయి?
రానున్న వారంలో మార్కెట్ మూమెంటం ఎలా ఉండబోతోంది. ఈ వారం భారీ నష్టాలనుంచి పుంజుకుని ముందుకొచ్చాయి. ఆర్బీఐ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచిన నేపథ్యంలో నెక్ట్స్ ఎలా ఉండ బోతోంది.. తదితర విషయాలపై అశిక ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ లీడ్ ఎనలిస్ట్ కౌశిక్ మోహన్తో సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ.. గ్లోబల్ పరిణామాలు ఎఫ్ఐఐ సెల్లింగ్, ఆయిల్ ధరలు బలమైన డాలర్ నేపథ్యంలో మార్కెట్లో పరిణామాలు చూశాం. రానున్నది ఎలక్షన్ సీజన్, అలాగే పండుగ సీజన్ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం కాలేదు. దేశీయ స్టాక్మార్కెట్లు ఎందుకు బలంగా ఉన్నాయంటే భారత్ అందిస్తున్న పీఎల్ఐ ప్రయోజనాల మూలంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి.పురోగతి ఆకర్షణీయంగా ఉంది. వినియోగం పెరిగింది. అలా మనదేశంలో యంగస్టర్, నిపుణులు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే చైనాతో పోలిస్తే ఇండియాపై పరిశ్రమలు మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేటు బాంక్స్, పీఎస్యూ బ్యాంక్స్ ఫలితాలు, క్రెడిట్ గ్రోత్ బావుంది. ఎస్బీఐ కొనుక్కోవచ్చు. హెచ్డీఎఫ్సీ గ్లోబల్గా టాప్-5 లో బ్యాంకుగా ఉంది. కోటక్, ఐసీఐసీఐ, కర్నాటక బ్యాంక్ పాజిటివ్గానే ఉన్నాయి. కనుక ఫైనాన్సియల్ రంగంలోనే ఎల్ఐసీ లాంటి ఇన్సూరెన్స్ సెక్టార్ బుల్లిష్గా ఉంది. అమెరికా ట్రెజరీ, ఇండియా బాండ్స్కి తేడా ఏంటి? ఇండియా డెఫిసిట్ ఎక్కువగాఉంటే గవర్నమెంట్స్ ట్రెజరీ బాండ్స్ను జారీ చేస్తుంది. టాక్స్ సేవింగ్స్ లాంటి వాటికోసం వాటిని కొనుగోలు చేస్తాం. లాంగ్ టర్న్ క్యాపిటల్ గెయిన్స్ కోసం కూడా వీటిని బై చేయవచ్చు. యూఎస్ ట్రెజరీ బాండ్స్లో వడ్డీ ఎక్కువ ఇస్తే.. అక్కడ రిటర్న్స్ ఎక్కువ వుంటాయి. కానీ డాలర్ చిక్కులుంటాయి. ఏదైనా లాంగ్ టెర్మ్లో బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇస్తాయి. ప్రస్తుతం పీఎస్యూ, ఇన్ఫ్రా, సిమెంట్ షేర్లు బలహీనంగా ఉన్నాయి. కానీ ఇవీ ఫ్యూచర్ గైడెన్స్ ఆధారంగా ట్రేడింగ్ కావడం లేదు. అందుకే బలహీనత. కానీ బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్, టెండర్స్ చూస్తే మనం చాలా పటిష్టంగా ఉన్నాం. సెప్టెంబరు క్వార్టర్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే.. మేజర్గా నిఫ్టీలోనే కాకుండా ఫార్మా,కెమికల్ బావుండే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో డిఫ్లేషన్ ఉంది. చైనా డంపింగ్ కారణంగా కెమికల్, ఫార్మా ధరలు పడిపోయాయి. ఇపుడు మెల్లిగా కోలుకుంటున్నాయి. లోయర్ లెవల్స్ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు క్యాపిటల్ గూడ్స్ సెక్టార్కూడా బలంగా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్)సెక్టార్ కూడా బాగా పెర్ఫాం చేయబోతోంది. ముఖ్యంగా మేడిన్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. వీటికి మళ్లీ బ్యాంకింగ్ సహకారం కచ్చితంగా అవసరం.. వీటిని కూడా మనం చూడాలి. ఆటో, ఆటో యాంగ్జీలరీస్లో ఇన్వెంటరీమీద దృష్టిపెట్టాలి. క్యూ 3లోఫెస్టివ్ సీజన్తో వస్తుంది కాబట్టి ఇపుడు కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది. క్యూ2 ప్రొడక్ట్స్ను క్యూ3లో కొంటారు. ఇదొక సైకిల్. అలాగే రీసెంట్గా ఆటో కంపెనీల సేల్స్ బావున్నాయి. భారత్ను ట్రేడింగ్ కాగా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలి. క్యాష్ ఎర్నింగ్స్ను పరిశీలించి, షేర్లను కొనుగోలుకు ఎంపిక చేసుకోవాలి. రానున్న పదేళ్లలో ఇండియా గ్రోత్ కూడా శరవేగంగా పెరగబోతోంది. దాదాపు రెండు మూడు రెట్లు పుంజుకోతోంది. 6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవ బోతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఆర్బీఐ బూస్ట్, సెన్సెక్స్ హైజంప్
Today Stock Market Closing Bell: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల నార్జించిన సూచలు ఆర్బీఐ వడ్డీరేటు నిర్ణయంతో మరింత చీరప్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా వరుసగా రెండో సెషన్లో లాభాలతో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 19,653.50 వద్ద ముగిసాయి. క్యూఐపీ ద్వారా 10కోట్ల నిధుల సమీకరణ ప్లాన్ల నేపథ్యంలోబజాజ్ ఫిన్ సర్వ్ , బజాజ్ ఫైనాన్స్ షేర్లు జోరు నెలకొంది. రియల్టీ ఇండెక్స్ 3 శాతం, ఐటీ, ఎఫ్ఎమ్సిజి, మెటల్, ఆటో, పవర్, హెల్త్కేర్ 0.4-1 శాతం చొప్పున పెరిగాయి. BSE మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ , టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్గా ఉండగా, నష్టపోయిన వాటిలో హెచ్యుఎల్, ఒఎన్జిసి, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ , ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 83.25తో పోలిస్తే డాలర్కు రూపాయి 83.24 వద్ద ఫ్లాట్గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఐటీ, ఆటో జోరు, భారీ లాభాలు
Today Stockmarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెప్పి భారీ లాభాలతోముగిసాయి.ముగింపులో, సెన్సెక్స్ 406 పాయింట్లు లేదా 0.62 శాతం పెరిగి 65,632 వద్ద, నిఫ్టీ 108పాయింట్ల లాభంతో 19,544 వద్ద ముగిసాయి. రెండు రోజుల నష్టాల పరంపరను అధిగమించిన నిఫ్టీ 19,550పైన స్థిరపడింది. ఆటో, బ్యాంక్, ఐటీ క్యాపిటల్ గూడ్స్ లాభపడగా, ఫార్మా, పవర్ , పిఎస్యు బ్యాంకింగ్ పేర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, లార్సెన్ అండ్ టూబ్రో, టైటాన్ కంపెనీ, M&M , TCS టాప్ గెయినర్స్గా ఉండగా, నష్టపోయిన వాటిలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిండాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, NTPC, నెస్లే ఇండియా ఉన్నాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది. రూపాయి: బుధవారం నాటి ముగింపు 83.23తో పోలిస్తే భారత రూపాయి గురువారం డాలర్కు 83.25 వద్ద ఫ్లాట్గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఇన్వెస్టర్ల అప్రమత్తత వరుసగా రెండో రోజూ నష్టాలు
Stock Market Closing bell: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుసగా రెండో సెషన్లో ఆరంభంలోనే నష్టాల నెదుర్కొన్న సూచీలు తరువాత మరింత దిగజారాయి. ఒక దశలో నిఫ్టీ 19,450 స్థాయిని కూడా కోల్పోయింది. ఎఫ్ఎంసిజి, ఐటీ మినహా అన్ని రంగాల్లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, పిఎస్యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్,హెల్త్కేర్, మెటల్, రియాల్టీ 1-3 శాతం పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 65,226 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టంతో 19,436 వద్ద ముగిసాయి. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా నష్టపోగా, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, ఐషర్ మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూ మీట్- ఇన్వెస్టర్ల అప్రమత్తత గ్లోబల్ మార్కెట్ల సంకేతాలకు తోడు ద్రవ్య విధాన ఫలితాల ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC (ద్రవ్య విధాన కమిటీ) సమావేశాలు ప్రారంభమైనాయి. శుక్రవారం (అక్టోబర్ 6) న గవర్నర్ శక్తి కాంత్ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.20తో పోలిస్తే 83.23 వద్ద స్థిరపడింది. -
సాక్షి మనీ మంత్రా: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు FPI అమ్మకాల నేపథ్యంలో ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు చివరి దాకా అదే ధోరణి కొనసాగించాయి. చివరికి సెన్సెక్స్ 316 పాయింట్లు కోల్పోయి 65,512 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పడి 19,528 వద్ద ముగిసింది. ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. దీంతో నిఫ్టీ 19,500 దిగువకు చేరింది. అయితే క్యాపిటల్ గూడ్స్ , పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్లలో కొనుగోళ్లతో మిడ్ సెషన్లో నష్టాల తగ్గాయి.నిఫ్టీలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ టాప్ లూజర్గా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫిన్సర్వ్ అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. రూపాయి: అటు డాలరుమారకంలో రూపాయి కూడా 83.20వద్ద నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వారాంతంలో లాభాలు జోరు
Today StockMaket Closing Bell: దేశీయ స్టాక్మార్కెట్లు వారంతాంలో పాజిటివ్గా ముగిసాయి. ఆరంభంలోనే లాభాలతో మురిపించిన సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ 19,600 ఎగువకుచేరింది. చివరికి 320పాయింట్లు పెరిగి 65,828 వద్ద,నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 19,638.వద్ద ముగిసాయి. ఐటీ మినహా దాదాపుఅన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్, పీఎస్యూ బ్యాంక్ హెల్త్కేర్ సూచీలు 1-2.7 శాతం ఎగిసాయి. కాగ్నిజెంట్ ఫలితాల నిరాశాజనకంగా ఉండటంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. కానీ చివర్లో నష్టాలనుంచి తేరు కున్నాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టిపిసి, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, దివీస్ ల్యాబ్లు టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్టిమైండ్ట్రీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి గత ముగింపు 83.18తో పోలిస్తే డాలర్కు 14 పైసలు పెరిగి 83.04 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ట్రేడింగ్పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్ఎస్డీఎల్లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు సీడీఎస్ఎల్లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్ సంస్థలు డీమ్యాట్ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు) అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఈ యాక్టివ్ క్లయింట్లకు సంబంధించి టాప్ 5 డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల (జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది. -
సాక్షి మనీ మంత్రా: ఐటీ దెబ్బ, ఫ్లాట్గా ముగిసిన మార్కెట్
Today Stock Market Closing bell: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఉదయం నుంచీ లాభ నష్టాల మధ్య ఒడిదుడుకుల ట్రేడింగ్లో సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 66,024, నిఫ్టీ 19,675 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ 1.5 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ స్వ్పలంగా నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, టాటా క న్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా టాప్ గెయనర్స్గా నిలిచాయి. మరోవైపు హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, హీరోమోటో, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారంనష్టాల్లో ముగిసింది. మరియు శుక్రవారం ముగింపులో 82.93 వద్ద డాలర్కు 21 పైసలు తగ్గి 83.14 వద్ద ముగిసింది. -
వచ్చే వారం మార్కెట్లలో ర్యాలీ? నిఫ్టీ 20 వేలు దాటేస్తుందా?
దేశీయ స్టాక్మార్కెట్లు ఈ వారాంతంలో నష్టాల్లో ముగిసాయి.గతవారం చీర్పుల్గా మార్కెట్లు ఈ వారం షాక్ ఇచ్చాయి. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శుక్రవారం నాటి ట్రేడింగ్లో కనిష్టాల వద్ద రికవరీని సాధించాయి. ఈనేపథ్యంలో తదుపరి వారం పాజిటివ్గా ట్రేడ్లో ఉండవచ్చు. నియోట్రేడర్ కో-ఫౌండర్ రాజా వెంకటరామన్ సాక్షిబిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ విందాం. వచ్చే వారం మార్కెట్ ధోరణి ఎలా ఉండబోతోంది. బ్యాంకింగ్ షేర్లలో ఏవి బెటర్. ముఖ్యంగా నిఫ్టీ సపోర్ట్ లెవల్స్ ఏంటి అనేది ఒక సారి చూద్దాం. నిఫ్టీ 50 కచ్చితంగా 20000-20200, కానీ 202600 వద్దకు వెళ్లే ఛాన్స్ వుంది. లోయర్స్ లెవల్స్లో కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పటివరకూ పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి. అయితే నిఫ్టీ19600-19500 వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ లెవల్ బ్రేక్ అవ్వనంత వరకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఈ లెవల్స్లో కొనుగోలు చేస్తే మళ్లీ నిఫ్టీ 20వేలకు చేరే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ బలహీనంగా ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్లో ప్రభుత్వ బ్యాంకులా, ప్రైవేటు బ్యాంకులా అనేది ఎలా చూడాలి. కచ్చితంగా పీఎస్యూ బ్యాంకులే పటిష్టంగా ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీభారీగా నష్టపోయినప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. రికమెండెడ్ స్టాక్స్: టీవీఎస్ మోటార్స్, టీసీఎస్ కొనుగోలు చేయవచ్చుని రాజా వెంకటరామన్ సూచిస్తున్నారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ
Today StockMarket Closin: దేశీయ స్టాక్మామార్కెట్లు వారాంతంలో కూడా నష్టాల ఇన్వెస్టర్లను నిరాశ పర్చాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ లాభ నష్టాల ఒడిదుడుకులకు లోనైంది. పీఎస్యూ బ్యాంకులు, ఐటీ, మెటల్స్, ఫార్మా ఒత్తిడికి లోనయ్యాయి. చివరి 221 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్ 66,009 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 19,674 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వరుస నష్టాలతో నిఫ్టీ వారాంతంలో 19700 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేవలం నాలగు ట్రేడింగ్ సెషన్ల నష్టాలతో లక్ష కోట్ల మార్కెట్లు కోల్పోయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, ఎం అండ్ఎం ఎస్బీఐ, కోల్ ఇండియా టాప్ గెయనర్స్గా నిలవగా, డా.రెడ్డీస్, విప్రో,యూపీఎల్, బజాజ్ ఆటో, సిప్లా టాప్ లూజర్స్గా ఉన్నాయి. రూపాయి: గురువారం ముగింపు 83.09 పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 19పైసలు ఎగిసింది. 82.93 ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో బ్లడ్ బాత్..రోజంతా నష్టాలే
Bloodbath in Today StockMarket: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా పతనమైన మార్కెట్ రోజంతానష్టాలతోనే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 620 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 19,730 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్ 571 పాయింట్టు కుప్పకూలి 66,230 వద్ద నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19742 వద్ద ముగిసింఇ. ఆటో, బ్యాంక్, ఫార్మా సూచీలుతోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కొనసాగింది. యాక్సిస్; హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండస్,కోటక్ మహీంద్ర, పీఎన్బీ, ఫెడలర్, ఎస్బీఐ, తదితర బ్యాంకింగ్ షేర్ల నష్టాలో నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇండా ఎంఅండ్ఎం, సిప్లా, హీరో మోటో కార్ప్ ఇతర టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు అదానీ పోర్ట్స్,టెక్ మహీంద్ర, ఏసియన్ పెయింట్స్, డా. రెడ్డీస్ బీపీసీఎల్, లాభపడ్డాయి. రూపాయి: బుధవారం ముగింపు 83.07తోపోలిస్తే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయి 83.09 వద్ద ముగిసింది -
సాక్షి మనీ మంత్రా : భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్
Today Stock Market Opening: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు కుప్పకూలగా నిఫ్టీ 19900 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ , హెచ్సీఎల్టెక్, రిలయన్స్, గ్రాసిం ప్రధానంగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం 276 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 66515 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు నష్టంతో 198258 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్, హిందాల్కో లాభపడుతున్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా తగ్గి 83.09 వద్ద ప్రారంభమైంది. డాలర్ ఇండెక్స్ ఆరు నెలల గరిష్ట స్థాయి 105.68కి చేరింది. రెండు దశాబ్దాల గరిష్టానికి చేరిన ప్రధాన వడ్డీ రేటును విస్తృతంగా ఊహించినట్లుగానే యధాతథంగా ఉంచింది ఫెడ్. అయితే ఈ ఏడాది మరోసారి రేటు పెంపు ఉండ వచ్చని నిపుణుల అంచనా. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: అదే నష్టాల బాట.. నేలచూపుతో ప్రారంభమైన సూచీలు
Today Stockmarket Opening: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పండగ వేళ వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కీలక సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 67,196 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 117 పాయింట్లు క్షీణించి 20,016 వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజస్ టాప్ గెయినర్స్గా కొనుసాగుతుండగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జియో ఫినాన్సియల్ కంపెనీ షేర్లు టాప్ లూజర్స్గా నష్టాల బాట పట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: కొనసాగిన నష్టాలు, మెరిసిన టైటన్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ బలహీన సంకేతాలతో భారీ నష్టాలతో ఈ వారాన్ని ఆరంభించిన సూచీలు వెంటనే కోలుకున్నాయి. అయినప్పటికీ దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రోజుంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 67,596.84 వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 20,133 వద్ద ముగిసింది. పవర్ గ్రిడ్, టైటన్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీలైఫ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్గా, జియో ఫైనాన్షియల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. రూపాయి: డాలరుమారకంలో రూపాయి రికార్డు కనిష్టానికి చేరింది. 8 పైసలు నష్టంతో 83.27 వద్ద రికార్డు కనిష్టంతో ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంక్స్, ఆటో, ఐటీ జోరు, నిఫ్టీ రికార్డ్ క్లోజింగ్
Today Stock Market Closing: దలాల్ స్ట్రీట్లో రికార్డుల మోత మోగింది. దేశీయ సూచీలు రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకు, ఐటీ, ఆటో షేర్లు భారీ లాభాల నార్జించాయి. గత కొన్ని సెషన్లుగా దూకుడుగా ఉన్న నిఫ్టీ తగ్గేదేలే అంటూ 20200 స్థాయిని దాటింది.చివరవకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగిసి 67,838.63 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభంతో 20,192 వద్ద ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, పవర్ , రియల్టీ 0.4-1 శాతం క్షీణించగా, ఆటో, బ్యాంక్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు సానుకూలంగా ముగిశాయి. బజాజ్ ఆటో, గ్రాసిం, ఎం అండ్ ఎం, హీరోమోటో, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్స్గా ఉండగా, జియో ఫైనాన్షియల్, బీపీసీఎల్, ఆసియన్స్ పెయింట్స్, హెచ్యూఎల్, టాటా కన్జ్యూమర్ టాప్ లూజర్స్ నిలిచాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: రికార్డ్ ముగింపు! 20,100 ఎగువకు నిఫ్టీ..
Today StockMarket closing: దలాల్స్ట్రీట్లో బుల్ పరుగులు కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తూ సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 67,543 వద్ద ముగియగా, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 20,102 వద్ద ముగిసింది. క్రితం రోజు ఆల్టైమ్ హై 20,000 పాయింట్లను దాటిన నిఫ్టీ ఈరోజు మరింత ఎగబాకి 20,100 పాయింట్లను దాటి రికార్డ్ సృష్టించింది. యూపీఎల్, హిందాల్కో, ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా సంస్థల నష్టాలను మూటగట్టుకుని లాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
స్కామ్స్టర్ ‘బాబు’ సెగ: హెరిటేజ్ షేర్లు ఢమాల్
రూ. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్మాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్తో హెరిటేజ్ స్టాక్ ఢమాల్ అంది. వరుసగా మూడు రోజుల పాటు ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు పాతాళానికి పడియింది. ముఖ్యంగా చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్తుపై ఆశలో కోల్పోయి, షేర్ల అమ్మకానికి ఎక్కువశాతం మొగ్గు చూపిస్తుండటం గమనార్హం. సోమవారం బీఎస్ఈ హెరిటేజ్ ఫుడ్స్ స్క్రిప్ 7 శాతం నష్టంతో రూ.253 వద్ద ముగిసింది. మంగళవారం కూడా ఈ నష్టాలు కొనసాగాయి. ఏకంగా 13 శాతం కుప్పకూలి 221.45 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్టం రూ. 287.35 , 52 వారాల కనిష్ట ధర రూ.135.15. కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి డెయిరీ సంస్థ వైస్-ఛైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్గాను, కుమారుడు లోకేశ్ భార్య బ్రాహ్మణి నారా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే. -
సాక్షి మనీ మంత్రా: మార్కెట్ల యూటర్న్, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి
Today Market Closing: దేశీయ మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులమధ్య సాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలకు పరిమితమై నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలతో 380 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి సెన్సెక్స్ 94 పాయింట్లు లాభంతో 67,221.13 వద్ద ముగిసింది. అలాగే 20వేలకు ఎగువన మొదలైన నిఫ్టీ ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టంతో 19,993.20 వద్ద ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, మెటల్ , రియాల్టీ ఒక్కొక్కటి 1-3 శాతం చొప్పున నష్టపోయాయి. తద్వారా వరుసగా 7 రోజుల లాభాలకు చెక్ పడింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లోని రూ.324.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.318.7 లక్షల కోట్లకు పడిపోయింది.అంటే ఒక్క సెషన్లోనే దాదాపు రూ. 5.6 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.మిడ్, స్మాల్ క్యాప్లు ఈరోజు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం క్షీణించి 32,084.93 వద్దకు చేరుకోగా, బిఎస్ఇ స్మాల్క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం క్షీణించి 36,982.74 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్లో బీపీసీఎల్ ,ఎన్టీపీసీ ,పవర్ గ్రిడ్ ,షేర్లు టాప్ లూజర్లుగా ముగిశాయి. మరోవైపు టిసిఎస్ , లార్సెన్ అండ్ టూబ్రో ,ఇన్ఫోసిస్ ,షేర్లు టాప్ గెయినర్లుగా ముగిశాయి. అటు యుఎస్ ద్రవ్యోల్బణం డేటా ,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , యుఎస్ ఫెడ్ ద్రవ్య విధాన సమావేశాలపై దృష్టి సారించడంతో గ్లోబల్ సూచనలు కూడా బలహీనంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు తవెల్లడి కానున్న ఆగస్ట్లో భారత ద్రవ్యోల్బణం డేటా , జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు ఎగిసింది. -
సాక్షి మనీ మంత్రా: బుల్ దౌడు, నిఫ్టీ సరికొత్త రికార్డు
Today Nifty hits fresh record hig: దేశీయస్టాక్మార్కెట్లు లాభాల్లోముగిసాయి. ముఖ్యంగా నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి 20వేల మార్క్ను తాకింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది. చివరికి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,992 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్లో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు ఒక్కరోజులో రూ 3 లక్షల కోట్లను ఆర్జించారు. సెన్సెక్స్ తిరిగి 67,000 మార్కును చేసింది. 528 పాయింట్ల లాభంతో 67,127 వద్ద ముగిసింది. ఇటీవలి మార్కెట్ టర్న్అరౌండ్ గ్లోబల్ సూచనలు, స్థిరమైన నిధుల ప్రవాహం , G20 విజయానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. వరుసగా కొనుగోళతో వరుసగా ఏడో రోజు కూడా బుల్ రన్ కొనసాగడం విశేషం. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్గా నిలవగా జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ టాప్ టూజర్స్గా ఉన్నాయి. -
సాక్షి మనీ మంత్రా: వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలే!
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే స్థబ్దుగా ఉన్న మార్కెట్లు ఆ తరువాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 200 పాయింట్లకు పైగా నష్టపోయాయి. కానీ ఆఖరి సెషన్లో కొనుగోళ్లతో నష్టాలనుంచి కోలుకుని పాజిటివ్గా ముగిసాయి.సెన్సెక్స్ 100.26 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 65,880.52 వద్ద, నిఫ్టీ 36.10 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 19,611 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19,600కి ఎగువన భారత బెంచ్మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్లో సానుకూలంగా ముగియడం విశేషం. ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 1 శాతం పెరగగా, ఫార్మా, ఆయిల్ & గ్యాస్ , పవర్ ఇండెక్స్లు ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు మెటల్, రియాల్టీ, బ్యాంక్ సూచీలు 0.4-1 శాతం క్షీణించాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, దివీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, సిప్లా మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉండగా, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టిపిసి టాప్ లూజర్స్గానూ నిలిచాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. రూపాయి: మంగళవారం ముగింపు 83.03తో పోలిస్తే బుధవారం డాలర్ మారకంలో రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: లాభాలతో శుభారంభం, కోల్ ఇండియా జోరు
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ఈ వారాన్ని శుభారంభం చేశాయి. ఆరంభ లాభాలనుంచి పుంజుకుని రోజంతా లాభాలతోనే ఉత్సాహంగా కొనసాగాయి. చివరికి సెన్సెక్స్ 240.98 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 65,628.14 వద్ద,నిఫ్టీ 93.50 పాయింట్లు లేదా 0.48 శాతం పెరిగి 19,529 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19500 ఎగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. పవర్, మెటల్, ఆటో, రియల్టీ, ఆయిల్ & గ్యాస్ , PSU బ్యాంక్ 1 , 2.8 శాతం మధ్య ఎగిసాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ , స్మాల్క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ షేరు వరుసగాసెషన్లు లాభపడుతూ లిస్టింగ్ ప్రైస్ను అధిగమించడం విశేషం. కోల్ ఇండియా, విప్రో, హెచ్సీఎల్టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్, టాటా స్టీల్ లాభపడగా, ఎం అండ్ఎం, యాక్సిస్ బ్యాంకు,ఐటీసీ, నెస్లే, ఆసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఆగస్టులో 52.3 మిలియన్ టన్నుల (MT) ఉత్పత్తిలో సంవత్సరానికి 13 శాతం వృద్ధిని నమోదు చేయడంతో కోల్ ఇండియా టాప్ గెయినర్గా నిలిచింది. రూపాయి: శుక్రవారం ముగింపు 82.71తో పోలిస్తే సోమవారం డాలర్తో రూపాయి 82.74 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) 301 reads -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ దెబ్బ, ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. రోజంతా ఒడిదుడులకు మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 650,87వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభాలకు పరిమితమై 19,347 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 19400 దిగువకు చేరింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో, ఎఫ్ఎంసిజి, ఐటీ మెటల్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు, పవర్, ఆయిల్ & గ్యాస్ ,బ్యాంకింగ్ రంగ షేర్లు 0.5 శాతం తగ్గాయి. టాటా స్టీల్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గాఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బీపీసీఎల్, డా. రెడ్డీస్, హీరోమోటోకార్ప్ భారీ నష్టాల్ని ఎదుర్కొన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ కూడా నష్టపోయింది. మంగళవారం నాటి ముగింపు 82.70తో పోలిస్తే బుధవారం రూపాయి 82.73 వద్ద స్థిరపడింది. -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ షేర్ల అండ లాభాల ముగింపు
Today Stock Markets Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతోముగిసాయి. ఆరంభంలాభాలను కొనసాగించిన సూచీలు చివరివరకూ లాభాలను నిలబెట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 213 పాయింట్లు ఎగిసి 65433 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 19444 వద్ద స్థిరపడ్డాయి.బ్యాంకు, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్బ్యాంకు, హిందాల్కో, ఎస్బీఐ, ఐసీఐసీఐబ్యాంకు, దివీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. రూపాయి: మంగళవారం నాటి ముగింపు 82.93తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 25 పైసలు పెరిగి 82.68 వద్ద ముగిసింది. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: లాభాలకు చెక్, అయ్యో,జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
Today StockMarketClosing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 3.94 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 65,220వద్ద, నిఫ్టీ 2.90 పాయింట్లు లేదా 0.01 శాతం లాభంతో 19,396.50 వద్ద ముగిశాయి. తద్వారా సోమవారం నాటి లాభాలకు చెక్ చెప్పాయి. ఐటీ, ఫార్మా , పీఎస్యు బ్యాంక్ మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ , పవర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి. మెటల్ , ఎఫ్ఎంసిజి ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. అలాగే నేటి ట్రేడింగ్ సెషన్లో బిఎస్ఇ మిడ్క్యాప్ , స్మాల్క్యాప్ రెండు సూచీలు తాజా రికార్డు గరిష్టాలను అధిగమించాయి. ఇది కీలక సూ చీలకు ఊతమిచ్చాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ,ఎన్టీపీసీ, హీరోమోటో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ టాప్ లూజర్స్గాఉన్నాయి. మరోవైపు సోమవారం మార్కెట్లో లిస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా రెండో రోజు కూడా 5 శాతం కుప్పలకూలడం గమనార్హం.ఎన్ఎస్ఇలో రూ.236.45 వద్ద లోయర్ సర్క్యూట్ అయింది. రూపాయి: డాలర్తో పోలిస్తే భారత రూపాయి 17 పైసల లాభంతో ముగిసింది. గత ముగింపు 83.11తో పోలిస్తే 82.94 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: లాభాల మెరుపులు, జియో ఫైనాన్సియల్ లిస్టింగ్ నీరసం
TodayStockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. గత వారం నష్టాలనుంచి కోలుకున్న సూచీలు ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేశాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్న సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 267 పాయింట్ల లాభంతో 65, 216వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 19394 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ,ఫైనాన్షియల్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్గ్రిడ్, హిందాల్కో టాప్ విన్నర్స్గా నిలవగా, రిలయన్స్, ఎంఅండ్ఎం, బ్రిటానియా, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్గా మిగిలాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి ఆరంభంలో ఆల్ టైం కనిష్టం నుంచి కోలుకుంది. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. నిరాశపర్చిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్లో కస్టమర్లకు షాకిచ్చింది. సోమవారం ఈ షేరు ధరబీఎస్ఈలో రూ.265 నిఫ్టీ రూ. 262 వద్ద లిస్ట్ అయింది . అయితే ఇంట్రాడే కనిష్ట స్థాయికి జారిపోయింది. రెండు ఎక్స్ఛేంజీలలో 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లో ముగిసిన మార్కెట్, అదానీ జోరు
TodayStockMarketClosingదేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సేచీలు చివరికి వారాంతంలో నెగిటివ్గానే ముగిసాయి. సెన్సెక్స్ 202.36 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 64,949వద్ద, నిఫ్టీ 55.10 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 19,310 ముగిసాయి. ఎఫ్ఎంసిజి, పవర్ మినహా దాదాపుఅన్ని రంగాలునష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 1.5 శాతం, మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలుప్రతికూలంగా ముగిశాయి. అయితే పెట్టుబడుల జోష్తో అదానీ గ్రూపు షేర్లుభారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ దాదాపు 3 శాతం ఎగిసాయి. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు లాభాలనార్జించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ డేట్ ప్రకటించడంతో రిలయన్స్ లాభపడింది. ఇంకా ఐషర్ మోటార్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంకు లాభపడిన వాటిల్లోఉండగా కోల్ ఇండియా, హీరోమోటో కాప్, టెక్ మహీంద్ర, టీసీఎస్, హిందాల్కో టాప్ లూజర్స్గా ఉన్నాయి. (ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?) అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.15తో పోలిస్తే స్వల్పంగా పెరిగి 83.10 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఐటీ జోరు, కోలుకున్న సూచీలు
దేశీయస్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభంలోనే భారీ నష్టాలతో ఉన్నప్పటికీ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగింపులో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 65,401.92 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 19,434 వద్ద ముగిసాయి. దాదాపు 1509 షేర్లు పురోగమించగా, 2101 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో ఎల్టిఐఎండ్ట్రీ, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, రిలయన్స్ ప్రధానంగా లాభాలను ఆర్జించగా, నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి. ఐటీ, ఎఫ్ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం నష్టపోయాయి. పవర్, రియాల్టీ , సీఎస్యు బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం నష్టపోయింది. శుక్రవారం నాటి 82.85 ముగింపుతోపోలిస్తే 82.95 వద్ద ముగిసింది.బలహీన దేశీయ మార్కెట్లు బలమైన డాలర్ కారణంగా భారత రూపాయి తాజా 10 నెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనమైన ఐఐపీ గ్రోత్ కూడా ప్రభావం చూపింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకుల దెబ్బ, భారీ నష్టాలు
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. బలహీనమైన ప్రపంచ సూచనల మధ్యరోజంతా అమ్మకాలు కనిపించాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల సుదీర్ఘ ఎఫ్ఐఐ విక్రయాలు దేశీయ మార్కెట్లో జోష్ మూడ్కు అంతరాయంగా మారాయి. చివరకి సెన్సెక్స్ 542 నష్టంతో 65,240.68 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు కుప్పకూలి 19,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19,400 దిగువకు చేరింది. సెక్టార్ల పరంగా చూస్తే ఫార్మా ఇండెక్స్ 1 శాతం లాభపడగా, బ్యాంక్, మెటల్, ఆయిల్ & గ్యాస్,రియల్టీ 1-2 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. ఫార్మా , మీడియా మాత్రమే లాభపడ్డాయి. అదానీ స్టాక్స్ , సన్ ఫార్మా దూసుకుపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ , దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలచాయి. యూపీఏ టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లూజర్స్గా మిగిలాయి. క్యూ1 ఫలితాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాలనార్జించింది. నికర లాభం గతంలోని రూ. 469 కోట్లతో పోలిస్తే 44శాతం పెరిగి రూ. 674 కోట్లగా ఉంది. కానీ ఆదాయం మాత్రం పడిపోయింది. రూ. 40,844 కోట్ల పోలిస్తే 38శాతం తగ్గి రూ. 25,438 కోట్లకు చేరుకుంది. రూపాయి: డాలరు పుంజుకోవడంతో రూపాయి బలహీనత కొనసాగుతోంది. గురువారం మరో రూ 0.18 తగ్గింది. చివరికి గత ముగింపు 82.58తో పోలిస్తే డాలర్ మారకంలో 15 పైసలు తగ్గి 82.73 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
కొనసాగుతున్న ఆసియా మార్కెట్ నష్టాలు
-
సాక్షి మనీ మంత్రా: కుప్పకూలిన స్టాక్మార్కెట్
Sensex tanks, Nifty down: దేశీయస్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు చివరల్లో కాస్త కోలుకున్నాయి. ఒక దశలో 1000 పాయింట్లు దాకా కుప్పకూలింది మార్కెట్. చివరకు సెన్సెక్స్ 677 పాయింట్ల మేర పతనమై 65783వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో 19,514 వద్ద ముగిసింది. అయితే ఇంట్రా-డే కనిష్ట స్థాయిలనుంచి కోలుకుంది. ముఖ్యంగా అమెరికా సావరిన్ రేటింగ్ను ఫిచ్ కోత పెట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా మారాయి. దీనికితోడు జూలై నెల ఆటోసేల్స్ ఆటో రంగ షేర్లను ప్రభావితం చేశాయి. దివీస్, నెస్లే, హెచ్యూఎల్, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర టాప్ గెయినర్స్గా ఉండగా, హీరోమోటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్గా మిగిలాయి. నిఫ్టీ బ్యాంక్ 597 పాయింట్లు పడిపోయి 44,996 స్థాయికి, మిడ్క్యాప్ ఇండెక్స్ 501 పాయింట్లు 37,233కి పడిపోయింది. ఫలితంగా దాదాపు రూ. 2.61 లక్షల కోట్ల బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది. అటు డాలరుమారకంలో రూపాయి 82.58 వద్ద నెగిటివ్గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: తేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాలతో ముగింపు
Today stockmarket closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 66,508 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 94 పాయింట్ల లాభంతో 19,740 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభాలను అందుకోగా కోటక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్రా: వారాంతంలో నష్టాలు
దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి తెప్పరిల్లినప్పటికీ వారాంతంలో నష్టాలలోనే ముగిసాయి. మిశ్రమ గ్లోబల్ సూచనల మధ్య, సూచీలు ఆగస్టు సిరీస్ను ప్రతికూల నోట్తో ప్రారంభించాయి. ఐటీ బ్యాంకింగ్ , ఆయిల్ & గ్యాస్ పేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పవర్ , రియాల్టీ పేర్లలో చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్ నష్టాలు చాలా వరకు పరిమితమైనాయి. చివరికి (జూలై 28) వరుసగా రెండో సెషన్లో నష్టాలతోనే ముగిసాయి సెన్సెక్స్ 106.62 పాయింట్లు లేదా 0.16 శాతం క్షీణించి 66,160 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు లేదా 0.07 శాతం క్షీణించి 19,64 ముగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బిపిసిఎల్, టాటా మోటార్స్ మరియు హెచ్సిఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్గా ఉండగా, ఎన్టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ , ఎం అండ్ ఎం టాప్ గెయినర్లుగా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్బుకింగ్, 440 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ మిడ్సెషన్నుంచి ప్రాఫిట్ బుకింగ్తో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్ నిర్ణయం, జూలై సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల గడువు ఈరోజున ముగియనుండటంతో దాదాపు అన్ని రంగాలు రెడ్లోకి జారుకోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆటో, ఆయిల్ & గ్యాస్, మెటల్, ఎఫ్ఎంసిజి పేర్లలో అమ్మకాల ప్రభావితం చేశాయి. అయితే ఫార్మా ఇండెక్స్ 3 శాతం, రియల్టీ ఇండెక్స్ 2 శాతం పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 440.38 పాయింట్లు లేదా 0.66 శాతం క్షీణించి 66,267 వద్ద, నిఫ్టీ 118.40 పాయింట్లు లేదా 0.60 శాతం క్షీణించి 19,660 వద్ద ముగిసాయి. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి నిఫ్టీ టాప్ లూజర్స్లో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిప్లా, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్ ,భారతీ ఎయిర్టెల్ లాభపడ్డాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: మూడు రోజుల నష్టాలకు చెక్, సరికొత్త రికార్డు
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. మూడు రోజుల వరుస నష్టాలనుచెక్ చెప్పిన దలాల్ స్ట్రీట్ భారీ లాభాలతో కొత్త రికార్డులను తాకింది. ఆరంభంలో నష్టాలను చేసిన సూచీలు చివర్లో బాగా పుంజుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, FMCG, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఫార్మా, ఐటీ షేర్లు నష్ట పోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 19750కి ఎగువన ముగిసింది. సరికొత్త ఆల్-టైమ్ హై జూలై 26న ఈక్విటీ బెంచ్మార్క్లు సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 351 పాయింట్లుఎగిసి 66,707 నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,979 వద్ద ముగిశాయి. దాదాపు 1,718 షేర్లు పురోగమించగా, 1,574 క్షీణించాయి. టాటా మెటార్స్, వొడాఫోన్ఇండియా, లార్సెన్, ఐటీసీ, బ్రిటానియీ, రిలయన్స్,సన్ఫార్మ టాప్ గెయినర్స్గా నిలవగా, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ ఎం,టెక్ మహీంద్ర, అపోలో భారీగా నష్టపోయాయి. రూపాయి: మంగళవారం నాటి ముగింపు 81.87తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 13 పైసలు తగ్గి 82 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా : రోజంతా ఒడిదుడుకులు, చివరికి మిశ్రమంగా ముగిసిన మార్కెట్
Today Stock Market Closing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్ నోట్తో ముగిశాయి. ఆరంభం నుంచి లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్ ముగింపులో మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 29 పాయింట్లు క్షీణించి 66,356 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 19,681 వద్ద స్థిరపడ్డాయి. దీంతో నిఫ్టీ 19700 దిగువకు చేరింది. సెక్టార్ల పరంగా మెటల్ పవర్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరగగా, పీఎస్యూ బ్యాంక్, క్యాపిటల్, FMCG , రియల్టీ 0.5-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, జెఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎన్టిపిసి ,అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లు కాగా, నష్టపోయిన వాటిలో ఏషియన్ పెయింట్స్, ఐటిసి, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ , లార్సెన్ అండ్ టూబ్రో ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 81.82తో పోలిస్తే డాలర్తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా తగ్గి 81.87 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతో ముగిసిన సూచీలు.. రిలయన్స్, ఐటీసీ షేర్లు పతనం
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 19,672 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలాగే టెక్ మహీంద్ర, బ్రిటానియా వంటి కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్బుకింగ్, కుప్పకూలిన స్టాక్మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలనుమూట గట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ప్రతికూల సంకేతాలు, రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతోపాటు, ఐటీ షేర్లు ప్రధానంగా ఇన్ఫోసిస్ , అలాగే రిలయన్స్ హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలను బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలను ప్రభావితం చేసింది. సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లు కుప్పకూలింది. ఇటీవల మార్కెట్ భారీగా ఎగిసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ మార్చి 24 నాటి 57,527 తో పోలిస్తే 67,500 వేలకు ఎగువన ఏకంగా 10వేల పాయింట్లు ఎగిసింది. ఒక్క ఆయిల్ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోను అమ్మకాలు వెల్లువెత్తాయి చివరికి సెన్సెక్స్ 888 పాయింట్ల పతనమై 66,684 వద్ద 234 కుప్పకూలిన నిఫ్టీ 19,745 వద్ద ముగిసింది. అలా నిఫ్టీ 19800 దిగువన ముగిసింది. లార్సెన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, బీపీసీఎల్ లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్మహీంద్ర, హెచ్సీఎల్టెక్, హెచ్యూఎల్, రిలయన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అదరగొట్టిన రిలయన్స్ మరోవైపు రిలయన్స్ నికర లాభం 100 శాతం పెరిగి రూ.281.7 లక్షలకు చేరుకుంది.గత ఏడాది రూ. 1,832 కోట్లతో పోలిస్తే ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ. 2,062.66 లక్షలుగా నమోదైంది. రూపాయి: గత ముగింపు 81.99తో పోలిస్తే డాలర్ మారకంలో భారత కరెన్సీ రూపాయి స్వల్పంగా పెరిగి 81.95 వద్ద ముగిసింది -
సాక్షి మనీ మంత్రా : రికార్డు స్థాయిలో మార్కెట్ దూకుడు..తగ్గేదేలే!
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తగ్గేదెలే అన్నట్టు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 474.46 పాయింట్లు లేదా 0.71శాతం లాభంతో 67,572 వద్ద, నిఫ్టీ 146.00 పాయింట్లు లేదా 0.74శాతం ఎగిసి 19,979.20 ముగిసింది. వరుస రికార్డులతో దూసుకుపోతున్న సూచీలు గురువారం కూడా రెండూ ఆల్ టైం హైని నమోదు చేయడమే కాదు, రికార్డ్ క్లోజింగ్ వద్ద స్థిరపడ్డాయి. అలాగే ఎనలిస్టుల అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 20వేల దిశగా పరుగులు తీస్తోంది. సెక్టార్లలో, ఎఫ్ఎంసిజి, బ్యాంక్ ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.8 శాతం, పవర్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. ఐటీసీ, కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, డా. రెడ్డీస్, సిప్లా టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు రిలయన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్ , బజాజ్ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10 పైసలు ఎగిసి 81.99 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో కొనసాగుతున్న బుల్ జోరు
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలు మరింత ఎగిసిన సె న్సెక్స్, నిఫ్టీ మరో ఆల్ టైం రికార్డు స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 67,094 వద్ద, నిఫ్టీ పాయింట్లు ఎగిసి 19846 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిసాయి. విదేశీ నిధుల ప్రవాహం, యూఎస్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్నాయి. అలాగే ఇండెక్స్ మేజర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు జోష్నిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 67 వేలకు ఎగువన, నిఫ్టీ కూడా రికార్డ్ క్లోజింగ్ను నమోదు చేసింది. నిఫ్టీ 19,850 సమీపంలో ముగిసింది. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, టాప్ ఇండెక్స్ గెయినర్లుగా . మరోవైపు హిందాల్కో, బజాజ్ఆటో, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, హీరో మోటో టాప్ లూజర్లుగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 82.04తో పోలిస్తే బుధవారం డాలర్కు రూపాయి స్వల్పంగా తగ్గి 82.09 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
దలాల్ స్ట్రీట్లో బుల్ రన్, సరికొత్త రికార్డులు నమోదు
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభంలోనే సరికత్త రికార్డుస్థాయిలను తాకాయి.వాల్ స్ట్రీట్ లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. చరిత్రలో తొలిసారి 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 67వేల స్టాయిని తాకింది. నిఫ్టీ 19,800 స్థాయిని అధిగమించి సరికొత్త ఆల్-టైమ్ శిఖరాలకు చేరుకుంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభపడగా, మెటల్ షేర్లు బాగా నష్టపోయాయి. రికార్డ్ స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో 66,795 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఫ్టాట్గా మారిన నిఫ్టీ చివర్లోపుంజుకుని 38 పాయింట్లు ఎగిసి 19,749 వద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. 2 బిలియన్ల డాలర్ల డీల్ కారణంగా ఇన్ఫోసిస్ షేరు టాప్ గెయినర్గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, హీరో మోటోకార్ప్ ఎ క్కువగా లాభపడగా, ఫలితాల నేపథ్యంలో ఎల్టీఐ మైండ్ ట్రీ భారీగా నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి రూపాయి: మంగళవారం నాడు డాలర్తో రూపాయి 82.04 వద్ద స్థిరంగా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్రా: లాభాల ప్రారంభం, రికార్డ్ స్థాయికి దలాల్ స్ట్రీట్
Today Stock Market: దేశీయ స్టాక్మార్కెట్లు ఈ వారం ఆరంభంలో లాభాలతొ మొదలైనాయి. కానీ గ్లోబల్ సంకేతాలతో సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో 66091 నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 19590 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందనే అంచనాలతో ట్రేడర్ల అప్రమత్తంగా వ్యవహరించే చాన్స్ ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభాలతో, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. అయితే ఫలితాలు, నిపుణుల వ్యాఖ్యలు నిరాశాజనకంగా ఉనప్పటికీ ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. ఈ నెలలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం ఎగిసింది. టీసీఎస్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్, ఎల్టీఐ మైండ్ట్రీ ఎక్కువగా లాభ పడుతుండగా హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిట్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, నష్టపోతున్నాయి. దీనికి తోడు మరిన్ని కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. హెచ్డీఎఫ్సీ, ఎల్టీఐ మైండ్ట్రీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా నిఫ్టీ 50, సెన్సెక్స్లు శుక్రవారం రికార్డు స్థాయిలో ముగిసిన సంగతి తెలిసిందే.. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: ఐటీ జోరు, రికార్డుల హోరు
Today Market Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిసాయి.రోజంతా పాజిటివ్గా కదలాడిన సూచీలు వారాంతంలో కూడా రికార్డు స్థాయిలను టచ్ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 502 పాయింట్లు ఎగిసి 66,061 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 19,564 వద్ద స్థిరపడ్డాయి. విశేషాలు ♦ గత రికార్డు గరిష్ట స్థాయి 19,567ను అధిగమించిన నిఫ్టీ 19,570 వద్ద సరికొత్త రికార్డును తాకింది ♦ సెన్సెక్స్ 66159.79 రికార్డు స్థాయిని టచ్ చేసింది ♦ ముఖ్యంగా ఐటీ ఇండెక్స్ ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ♦ గత రెండు సెషన్లలో దాదాపు 2,000 పాయింట్లు లాభపడింది ♦ టీసీఎస్, టెక్ మహీంద్ర ఇన్ఫోసిస్, ఎల్టీఐమైండ్ట్రీ, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్స్ ♦ హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, డా.రెడ్డీస్, టైటన్, రిలయన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. గత ముగింపు 82.07తో పోలిస్తే డాలర్కు రూపాయి 10 పైసలు తగ్గి 82.17 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయినుంచి వెనక్కి, ఐటీ జోరు
దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే దేశీయ ద్రవ్యోల్బణం ఆందోళన కుదుట పడిన నేపథ్యంలో ఆరంభంలో భారీగా ఎగిసింది. ఫలితంగా ఆల్ టైం గరిష్టానికి చేరిన సూచీలు డే హై నుంచి వెనక్కి తగ్గాయి. లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 165 పాయింట్ల లాభానికి పరిమితమై 65,559 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో పెరిగి 19,414 వద్ద ముగిసింది. ప్రధానంగా ఐటీ, రియల్టీ షేర్లు మార్కెట్ లాభాలను నిలబెట్టాయి. ఫలితంగా నిఫ్టీ 19400 ఎగువన, సెన్సెక్స్ 65500 కి ఎగువన స్థిరపడడటం విశేషం. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఎల్టిఐఎండ్ట్రీ, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్గా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బిపిసిఎల్, యుపిఎల్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, హెల్త్కేర్, ఆయిల్ & గ్యాస్, పవర్ రంగాలలో అమ్మకాలు కనిపించగా, బ్యాంక్, మెటల్, రియాల్టీ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేర్లలో బైయింగ్ కనిపించింది. విశేషాలు - సెన్సెక్స్ తొలిసారిగా చారిత్రాత్మక 66,000 మార్క్ను అధిగమించింది. - సెన్సెక్స్ డే హై నుంచి 600 పాయింట్లు పతనమైంది - 19567 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్ టైం హై - నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి, ఒక దశలో 19,400 దిగువకు జారిపోయింది. చివరికి ఈ స్థాయిని నిలబెట్టుకుంది. - నిఫ్టీ బ్యాంక్ రోజు గరిష్టం నుండి 400 పాయింట్లకు పైగా క్షీణించింది. రూపాయి రూపాయి మార్కెట్ల మద్దతుతో ఆరంభంలో 21పైసలు ఎగిసింది. చివరికి గత ముగింపు 82.24తో పోలిస్తే డాలర్ మారకంలో రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద ముగిసింది. Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు -
సాక్షి మనీ మంత్రా: నష్టాల ముగింపు, జీఎస్టీ సెగ, డెల్టా కార్ప్ ఢమాల్!
దేశీయ స్టాక్మార్కెట్లు వరుస లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు లాభాల స్వీకరణతో ఫ్లాట్గా మారాయి. ఆ తరువాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 65394 వద్ద,నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 19384 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19400దిగువకు చేరింది. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐషర్ మోటార్స్,సన్ఫార్మా టాప్ విన్నర్స్గా నిలిచాయి. మరోవైపు ఎల్టిఐఎండ్ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, హెచ్సీఎల్ నష్టపోయాయి. జీఎస్టీ పెంపు: కుప్పకూలిన డెల్టా కార్ప్ మరోవైపు క్యాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్ లిమిటెడ్ ఏకంగా 25 శాతం కుప్పకూలింది. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కాసినోలపై జీఎస్టీ 18-28 శాతానికిపెంచడంతో25 లోయర్ సర్క్యూట్లో లాక్ అయింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. రికార్డులో స్టాక్కి ఇదే అతిపెద్ద సింగిల్ డే డ్రాప్ కూడా. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1,600 కోట్లు నష్టపోయింది. ఈ క్షీణత దాని మొత్తం ఆర్థిక సంవత్సరం 2023 ఆదాయం రూ.1,021 కోట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం. అటు మంగళవారం నాటి ముగింపు 82.36తో పోలిస్తే బుధవారం డాలర్తో రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: పీఎస్యూ బ్యాంకింగ్,మెటల్ బలహీనం
దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. కన్సాలిడేషన్ టోన్కు కొనసాగింపుగా, రోజంతా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభ నష్టాల మధ్య కదులాడుతూ నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. చివర్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరికి సెన్సెక్స్ 274 పాయింట్లు ఎగిసి 65,617 వద్ద,నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 19,448వద్ద ముగిసాయి. మెటల్ , PSU బ్యాంకులు మినహా అన్ని రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి. ఆటో, పవర్, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్,హెల్త్కేర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి సన్ఫార్మా, ఐషర్మోటార్స్, అపోలో హాస్పిటల్స్ , టాటా కన్జ్యూమర్, మారుతి టాప్ గెయినర్స్గా నిలవగా, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్సీఎల్ టెక్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభాలతో ముగిసింది. సోమవారం నాటి ముగింపు 82.57తో పోలిస్తే డాలర్కు రూపాయి 21 పైసలు పెరిగి 82.36 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: లాభాల ముగింపు: అదరగొట్టిన రిలయన్స్
దేశీయ స్టాక్మార్కెట్లు పాజిటివ్గా ముగిసాయి.సెన్సెక్స్ 64 పాయింట్లు ఎగిసి 65344 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 19355 వద్ద స్థిర పడ్డాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్ రెండు రంగాలు మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్ఎమ్సిజి, కన్స్యూమర్ డ్యూరబుల్ , ఆటో , ఐటీ నష్ట పోయాయి. రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్,భారతి ఎ యిర్టెల్ టాప్ గెయినర్స్, హెచ్సీఎల్ టెక్, టైటన్, పవర్ గ్రిడ్, టీసీఎస్, నెస్లే టాప్ లూజర్స్గా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతిపెద్ద సంస్థ తన ఆర్థిక సేవల డీమెర్జ్ వార్తలతో భారీగా లాభపడింది. మూడు నెలల్లో లేనంత అత్యధికంగా లాభపడింది. వరుస లాభాలతో రిలయన్స్ మార్కెట్ క్యాప్లో రూ. 70వేల కోట్లు వచ్చి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: మీ డబ్బుకు మరింత వాల్యూ పెంచుకోండిలా!
చాలా మంది ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు సంపాదించిన దాంట్లో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఎలా ఖర్చుపెట్టాలి? లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలని సతమతమవుతూ ఉంటారు. మీ డబ్బుకు మరింత విలువను పెంచుకోవాలనుకునే వారి కోసం ఈ రోజు సాక్షి మంత్రా కొన్ని టిప్స్ వెల్లడించింది. నిజానికి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాక లోన్స్, బిల్స్ చెల్లించడం వంటివి చేస్తారు. అలా చేసిన తరువాత మిగిలిన డబ్బును ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. మీకు కావలసినదాని మీద లేదా అవసరమైనదాని మీద ఖర్చు పెట్టడం మంచిదే. అయితే తప్పకుండా కొంతవరకు సేవ్ చేయడం అవసరం. అయితే మీరు సేవ్ చేసిన డబ్బుకు మరింత విలువ పెంచుకోవాలనుకుంటే పెట్టుబడి పెట్టడం ఉత్తమం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా మా బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావు' మాటల్లో తెలుసుకోవచ్చు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: కొత్త ఇన్వెస్టర్లకు సానుకూలమేనా?
కొన్ని రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళుతూ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన దేశీయ సూచీలు వారంతంలో నష్టాలు చవిచూశాయి. అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీ మార్కెట్లు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నప్పటీకి దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బాటలోనే నడిచాయి. ముఖ్యంగా దేశంలో తయారీ రంగం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆ రంగంపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ వారంలో దేశీయ స్టాక్మార్కెట్లో పరిణామాలు, లాభాలు అందుకున్న స్టాక్లు, వివిధ రంగాల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది.. తదితర అంశాలను అషికా బ్రోకింగ్ సంస్థకు చెందిన కౌశిక్ మోహన్తో కలిసి సాక్షి బిజినెస్ కరెస్పాండెంట్ కారుణ్య రావు విశ్లేషించారు. ఇప్పటికే ఉన్న మదుపర్లతోపాటు కొత్త ఇన్వెస్టర్లకు తమ సూచనలు అందించారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: వరుస లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాల్లో ముగిసాయి. తద్వారా ఎనిమిది రోజుల వరుస లాభాలకు చెక్ చెప్పింది. సెన్సెక్స్ 505 పాయింట్లు కుప్పకూలి 65,280 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు నష్టంతో 19,332 వద్ద ముగిసాయి. దీంతో నిఫ్టీ కీలకమైన 19350 మార్క్ దిగువకు చేరింది. టాటా మోటార్స్, టైటన్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్ టాప్ గెయినర్స్గా, అదానీ పోర్ట్స్, పవర్గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బ్రిటానియా టాప్ లూజర్స్గానూ నిలిచాయి. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో రికార్డుల మోత
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న ర్యాలీని నిలబెట్టుకున్నాయి. మిడ్ అండ్ స్మాల్-క్యాప్ సెగ్మెంట్లు బెంచ్మార్క్ ఇండెక్స్ను అధిగమించాయి, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ కన్జ్యూమర్ స్టాక్లు సెక్టోరియల్ ర్యాలీ అయ్యాయి. మరోవైపు ఆటో, ఐటీ నష్టపోయాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు ఎగిసి 65,785 వద్ద, నిఫ్టీ 99పాయింట్లు లాభంతో 19497 వద్ద స్థిరంగా ముగిసాయి. తద్వారా మరో ఆల్ టైం రికార్డ్ హైని నమోదు చేశాయి. ఎం అండ్ఎం, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ భారీ లాభాలతో ముగియగా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, మారుతి, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్ జోరు, రికార్డు స్థాయికి సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. గురువారం ఉదయం సరికొత్త రికార్డు స్థాయిని నమోదు దిశగా కదులుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్నప్పటికీ తరువాత లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 65,609 వద్దస్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 19,450 కి చేరువలో ఉంది. రిలయన్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 65,586 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 19,435వద్ద ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, అపోలో, పవర్ గ్రిడ్, రిలయన్స్, కోల్ ఇండియా టాప్ విన్నర్స్గా కొనసాగుతుండగా, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, దివీస్లేబ్స్ , బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి 13 పైసలు కుప్పకూలి 82.36 వద్ద ఉంది. మరోసారి ఫెడ్ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే అంచనాల మధ్య డాలర్ బలం పుంజుకుంది. మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
రికార్డ్ ర్యాలీకి బ్రేక్, అదరగొట్టిన మారుతి సుజుకి
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతోనైనా పటిష్టంగానే ముగిసాయి. నిఫ్టీ 50 వరుసగా ఐదవ రోజు రికార్డు స్థాయి సెషన్ను కొనసాగించింది. 10 పాయింట్ల లాభంతో 19,398.50 వద్ద ముగియగా, సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 65,446 వద్ద ముగిసింది. ప్రాఫిట్-బుకింగ్ కారణంగా గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న ర్యాలీకి బ్రేక్ పడింది. బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్ల నష్టం పోయింది. సెన్సెక్స్లో ఎంపీవీ ఇన్విక్టో లాంచ్ తరువాత మారుతీ సుజుకి షేర్లు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఫలితంగా బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (m-క్యాప్) తొలి సారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్లే టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐషర్ మోటార్స్, టాటా కన్జ్యూమర్, యూపీఎల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ షాక్: ఫ్లాట్గా స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.రికార్డు స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప లాభాలకు పరిమితమవుతున్నాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో 65,485 వద్ద,నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 19397 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం నష్టల్లోనూ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ ఇండెక్స్లు 0.5-1 శాతం లాభాల్లో ఉన్నాయి. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు లాభాల్లో టాప్లో ఉండగా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ,టాటా కన్జ్యూమర్, డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి. -
వరుస రికార్డులు, ఇన్వెస్టర్లకు సుమారు 2 లక్షల కోట్ల లాభాలు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు బుల్ రన్ను కొనసాగించాయి. ద్వారా మరోసారి రికార్డ్ క్లోజింగ్ను నమోదు చేశాయి. సెన్సెక్స్ 486 పాయింట్లు లేదా 0.75 శాతం లాభపడి 65,205 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 133.50 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 19,322.55 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడ్లో సెన్సెక్స్ తాజా రికార్డు గరిష్ట స్థాయి 65,300ని తాకగా, నిఫ్టీ 19,345 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. బీఎస్సీ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో 296.5 లక్షల కోట్ల నుంచి రూ.298.2 లక్షల కోట్లకు పెరిగింది. ఫలితంగా పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో రూ.1.7 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. జూన్ నెల జీఎస్టి వసూళ్లు పటిష్టంగా ఉండటంతో మార్కెట్ రికార్డు-బ్రేకింగ్కి స్థాయికి చేరిందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాలను రుతుపవనాలపై అందిన శుభవార్త కూడా పెట్టుబడిదారులకు ఉత్సాహం వచ్చింది. దీనికి తోడు బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ర్యాలీ కొనసాగుతోందని అంచనా. నిఫ్టీ పీఎస్యు బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4 శాతం , నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడింది. అలాగే మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎమ్సిజి సూచీలు ఒక్కొక్కటి ఒక్కో శాతం ఎగిసాయి. ఇక ఫార్మా ,హెల్త్కేర్ ఐటీ, ఆటో ,కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్లు వెనుకబడ్డాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ , ఐటీసీ ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పెరిగింది. ఇంకా బీపీసీఎల్ బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హెచ్డిఎఫ్సి, అల్ట్రాటెక్ సిమెంట్ , ఒఎన్జిసి టాప్ విన్నర్స్ లిస్ట్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా 2 శాతం చొప్పున క్షీణించగా, సిప్లా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక్కో శాతం చొప్పున నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా , ఎల్ అండ్టీ టాప్ లూజర్స్గా నిలిచాయి. -
రిలయన్స్ జోరు: దూసుకుపోతున్న స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సరికొత్త గరిష్టాలను రికార్డ్ చేస్తూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. సెన్సెక్స్ 519 పాయింట్లు ఎగిసి 65,239 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 19,327 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లాభాలు మార్కెట్కు మద్దతిస్తున్నాయి. ఇదీ చదవండి: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్ అటు ఆటో రంగ షేర్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ లాభాల్లో కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా నష్టపోతున్నాయి. గ్రాసిం, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎస్బీఐ, హిందాల్కొ, విప్రో, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, యూపీఎల్ బ్రిటానియా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
దలాల్ స్ట్రీట్లో లాభాల హోరు, రికార్డు ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంనుంచి లాభాలతో కళకళలాడిన సూచీలు చివరికి రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి.సెన్సెక్స్ 803 పాయింట్లు ఎగబాకి 64,719 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 19,189వద్ద ముగిసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2.5 శాతం, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి. ఎంఅండ్ ఎం, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్, సన్ఫార్మ, హీరోమోటో టాప్ విన్నర్స్గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ , అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ఆటో, దివీస్ ల్యాబ్స్ భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.03 వద్ద ఫ్లాట్గా ముగిసింది. -
జోరుగా దలాల్ స్ట్రీట్: బ్యాంకింగ్, ఐటీ టాప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లోకొనసాగుతున్నాయి. వరుసగా లాభాలను కొనసాగుతున్న సూచీలు వారాంతంలో కూడా జోష్గా ఉన్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగాఎగిసింది. నిఫ్టీ 19,100ను తాకింది. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాలు, ప్రధానంగా ఐటీ, పీఎస్యూ బ్యాంకు షేర్ల లాభాలు మార్కెట్కు మద్దతిస్తున్నాయి. సెన్సెక్స్ 460 పాయింట్ల లాభంతో 64,376 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగిసి 19,095 వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ బ్రిటానియా టాప్ లూజర్స్గా ఉండగా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ ఎం, టెక్ ఎం, హీరో మోటో, ఇండస్ బ్యాంకు భారీగా లాభపడుతున్నాయి. -
సెన్సెక్స్ ఆల్-టైం రికార్డ్: ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ సూచీ సెన్సెక్స్ బుదవారం ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 63,588 వద్ద సెన్సెక్స్ రికార్డ్ స్థాయికి చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దలాల్ స్ట్రీట్లో 9 బిలియన్ల డాలర్ల బలమైన వాలెట్ను ప్రారంభించడంతో, సెన్సెక్స్ రికార్డు స్థాయిని టచ్ చేసింది. దాదాపు 137 రోజుల తరువాత ఆల్టైం హైని తాకింది. గత ఏడాది డిసెంబర్ 1న గత ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 53,523వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి 18,857 రికార్డు గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. పటిష్టంగా ఉన్నజీడీపీ ఔట్లుక్, ద్రవ్యోల్బణం తగ్గు ముఖం, విదేశీ పెట్టుబడిదారుల బలమైన కొనుగోళ్లతో సహా బలమైన ఫండమెంటల్స్ మార్కెట్లను ఆల్ టైంకి చేర్చాయని మార్కెట్ పండితుల మాట. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు సెన్సెక్స్ కొత్త శిఖరానికి చేరడంతో ఇకపై మార్కెట్ నెమ్మదిగా, స్థిరంగా సాగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. యోగాలో, బాహ్య ప్రపంచం కంటే లోపలి ప్రపంచంపైనే దృష్టి ఉంటుంది. మార్కెట్లో కూడా పెట్టుబడిదారులు ఇండెక్స్ స్థాయి కంటే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. యోగాలో, సుదీర్ఘ కాల వ్యవధిలో ప్రయోజనాలుంటాయి. మార్కెట్లో దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కోటక్ మ్యూచువల్ ఫండ్కు చెందిన నీలేష్ షా వ్యాఖ్యానించడం విశేషం. అటు నిఫ్టీ కూడా అదే స్థాయిలో ట్రేడ్ అయింది. ఫ్టాట్గా ప్రారంభమైనప్పటికీ, వెంటనే లాభాల్లోకి మళ్లాయి. కానీ తరువాత లాభాల స్వీకరణ కారణంగా సూచీలు ఫ్లాట్ జోన్లోకి మారాయి. ఫైనాన్స్, మీడియా, రియల్టీ లాభాల్లో ఉండగా, ఫార్మా, హెల్త్కేర్ సూచీలు నష్ట పోతున్నాయి. పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లాభాల్లో ఉండగా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, దివీస్, యాక్సిస్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ నష్ట పోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టాలతో 82.10 వద్ద కొనసాగుతోంది. (మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
స్మార్ట్ రికవరీ! లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలనుంచి కోలుకుని లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ , నిఫ్టీ మిడ్సెషన్ తరువాత కోలుకుని డే గరిష్టం వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు ఎగిసి 63,323 వద్ద, నిఫ్టీ 61పాయింట్ల లాభంతో 18,817 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ లాభపడగా, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, రిలయన్స్ షేర్ల లాభాలు సూచీల స్మార్ట్ రికవరీకి తోడ్పడ్డాయి. టాటా మోటార్స్,హెచ్సీఎల్టెక్,పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, బజాజ్ఆటో టాప్ గెయినర్స్గా ఉండగా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్ నష్ట పోయాయి. అటు మిడ్క్యాప్ఇండెక్స్ వరుసగా ఏడో సెషన్లో కూడా రికార్డు హైని తాకింది. -
ప్రాఫిట్ బుకింగ్తో నష్టాలు: అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారం ఆరంభంలోనే బలహీనంగా ముగిసింది. బలహీన గ్లోబల్ సంకేతాలున్నప్పటికీ, మార్కెట్ సానుకూలంగా ప్రారంభమై, రికార్డు స్థాయిని టచ్ చేసింది. కానీ హై స్టాయిలో నిలదొక్కు కోవడంలో విఫలమైంది.ముఖ్యంగా బ్యాంకింగ్,రియల్టీ ఇతర హెవీవెయిట్ షేర్లలో ఒత్తిడి, ప్రాఫిట్ బుకింగ్తో సెన్సెక్స్ 216 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 63,168, వద్ద నిఫ్టీ 70.50 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 18,756 వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, పవర్, రియల్టీ,ఎఫ్ఎంసిజి నష్టపోగా, పిఎస్యు బ్యాంక్స్, ఐటీ స్వల్పంగా పెరిగాయి. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు డిఫెన్స్ షేర్లు లాభపడటం విశేషం. టాప్ లూజర్ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు సోమవారం 4 శాతం నష్టాలతో నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ లూజర్గా నిలిచింది. గత మూడు నెలలో ఇదే అతిపెద్ద నష్టం. మే 2023 తర్వాత ఇంత కనిష్ట స్థాయికి చేరడం తొలిసారి. మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.12,000 కోట్లను నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ ఎం, టీసీఎస్ లాభపడగా, కోటక్ మహీంద్ర, హీరో మోటో, యాక్సిస్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.94 వద్ద ఫ్లాట్గా ముగిసింది. -
భారీ లాభాలు: రికార్డ్ క్లోజింగ్, ఇన్వెస్టర్లకు పండగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో మురిపించింది. భారీ లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డు క్లోజింగ్న నమోదు చేశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగా సూచీలు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. సెన్సెక్స్ 467 పాయింట్లు ఎగిసి 63,385, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 18,826 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు తప్ప మిగతా రంగాలు లాభాలనార్జించాయి నెస్లే ఇండియా, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, మారుతీ, హెచ్సీఎల్ షేర్లు టాప్ విన్నర్స్గా, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అటు డాలరుతోపో లిస్తే రూపాయి మారకం విలువ 81.94గా నిలిచింది. రూ. 2 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 290.7 లక్షల కోట్ల నుండి రికార్డు స్థాయిలో రూ. 292.7 లక్షల కోట్లకు పెరిగింది, ఈఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. -
మార్కెట్ బౌన్స్ బ్యాక్, ఐటీ ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి నష్టాలనుంచి బౌన్స్ బ్యాక్ అయిన సూచీలు కీలక మద్దతు స్తాయిలను అధిగమించాయి. ఐటీ తప్ప అన్ని రంగాలు, ముఖ్యంగా మెటల్, ఫార్మా, బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు తిరిగి 63 వేల మార్క్ పైకి ఎగిసింది. నిఫ్టీ 18,750 పైన బలంగా ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ఫిన్సర్వ్, డా. రె డ్డీస్, హిందాల్కో యూపీఎల్ తదితర షేర్లు లాభాల్లోనూ, బజాజ్ఆటో, టాటా కన్జ్యూమర్, విప్రో, టీసీఎస్ బీపీసీఎల్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. -
మూడు రోజుల లాభాలు పాయే: సెన్సెక్స్ పతనం, ఫార్మా జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మూడు రోజుల లాభాలకు చెక్ చెప్పాయి. ఆరంభంనుంచీ స్తబ్ధుగా ఉన్న సూచీలు చివరికి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమై 62,922వద్ద, 72 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,684 వద్ద 18,700 మార్క్ దిగువన ముగిసింది. సెక్టార్లలో, బ్యాంకింగ్ , రియల్టీ సూచీలు దాదాపు 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. మేజర్గా ఫార్మా ఇండెక్స్ 1.4 శాతం ఎఫ్ఎంసిజి 0.5 పెరిగాయి. అపోలో హాస్పిటల్స్ ,దివీస్ , రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్ టాప్ విన్నర్స్గా నిలిచాయి.అలాగే హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు, విపప్రో, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 14పైసలు నష్టపోయి 82.19 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ అప్డేట్స్, బిజినెస్ వార్తల కోసం చదవండి : సాక్షి బిజినెస్ -
మెటల్స్ షైన్, మూడో రోజు లాభాల్లో,రికార్డు స్థాయికి దగ్గర్లో
సాక్షి ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లోముగిసాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయంప ఎదురు చూస్తున్న క్రమంలో ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 85.35 పాయింట్ల లాభపడి 63,229 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 18,756 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్, మీడియాలో షేర్లు నష్టపోయాయి టాటా కన్యూమర్స్ ప్రొడక్ట్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటామోటార్స్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ టాప్ విన్సర్స్గానూ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ టూప్లూజర్స్గానూ నిలిచాయి. అటు డాలరుమారకంలో భారత కరెన్సీ రూపాయి 27 పైసలు బలపడి 82.11 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!
ఉలి దెబ్బలు తింటేనే.. శిల శిల్పంగా మారుతుంది. నిప్పుల కొలిమిలో కాలితేనే ఇనుము కరిగేది. దాదాపు మనిషి జీవితం కూడా అంతే.. కష్టాల కడిలిని ఈదితేనే...జీవితంలో పైకి రావాలనే కసి పట్టుదల పెరుగుతుంది. మనసు పెడితే... దానికి సంకల్పం తోడైతే కాలం కూడా కలిసి వస్తుంది. విజయం దాసోహమంటుంది. దాదాపు ఇపుడు మనం చదవబోయే కూడా అలాంటిదే. ఒకపుడు బిడ్డకు పాలుకొనడానికి 14 రూపాయలకు వెతుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. మరిపుడు 800కోట్లకు అధిపతి. ప్రముఖ పెట్టుబడిదారుడు విజయ్ కేడియా సక్సెస్ స్టోరీ చూద్దాం రండి..! కోల్కతాకు విజయ్ కేడియా ఐఐటీ, ఐఐఎం లాంటి ఫ్యాన్సీ డిగ్రీలేమీ లేవు. ఉన్నదల్లా స్మార్ట్ బ్రెయిన్ జీవితంలో ఎదగాలనే సంకల్పం. మార్కెట్పై లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిలియనీర్గా అవతరించాడు. విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్. 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చని పోయాడు. తండ్రిని కోల్పోయిన షాక్తో 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. దీనికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. వెంటనే ఒక బిడ్డ కూడా పుట్టింది. అలా ఒక్కో బాధ్యత, అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కష్టాల్లోకి నెట్టేసింది. కుటుంబం గడవడానికి తల్లి బంగారు ఆభరణాలను అమ్ముకున్నారు. కానీ అది మాత్రం ఎన్నాళ్లు ఆదుకుంటుంది. కనీసం కుమారుడికి పాలు కొనేందుకు రూ.14 కూడా లేక ఇబ్బందులు పట్టాడు. ఏదో ఒకవిధంగా ఒక్కో పైసా వెతికి అతని భార్య బిడ్డకు పాలు పట్టేది ఇది చూసి చలించిపోయిన విజయ్ కేడీ. కోల్కతా వదిలి ముంబైకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తండ్రి ఇచ్చిన వారసత్వ నేపథ్యం, పరిస్థితులతో షేర్ మార్కెట్లో మెల్లిగా పెట్టుబడులు పెట్టాడు. బుర్రకు పదును బెట్టి, మార్కెట్ను స్టడీ చేశాడు. దలాల్ స్ట్రీట్లో బుల్లిష్రన్ కారణంగా 1992లో అదృష్టం కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలకషేర్లలో పెట్టుబడల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) ఆ తర్వాత ముంబైలో ఇల్లు కొని కోల్కతా నుంచి తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. అయితే షేర్ మార్కెట్ పెట్టుబడులు అంటే వైకుంఠపాళి. నిచ్చెనలూ ఉంటాయి, కాటేసే పాములూ ఉంటాయి. అచ్చం ఇలాగే మళ్లీ మార్కెట్ కుప్పకూలడంతో సర్వం కోల్పోయాడు. అయినా ధైర్యం కోల్పో లేదు. 2002-2003లో మార్కెట్ మరో బుల్లిష్ రన్. చక్కటి పోర్ట్ఫోలియోతో లాభాలను ఆర్జించాడు. ఫలితంగా విజయ్ నికర విలువ ఇప్పుడు రూ. 800 కోట్లకు చేరుకుంది. దేశంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడిదారులలో ఒకడిగా నిలిచాడు. కేడియా సెక్యూరిటీస్ అనే కంపెనీని ప్రారంభించి కోటీశ్వరుడిగా రాణిస్తున్నాడు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) పెట్టుబడి ప్రపంచంలో విజయ్ కేడియాది ప్రతిష్టాత్మకమైన పేరు. అనేక ఆటుపోట్లతోనిండి వున్న విజయ్ జర్నీ ఇన్వెస్టింగ్ కెరీర్లో విజయం సాధించాలని ఆలోచిస్తున్న వారికి ఆయన స్ఫూర్తి. స్టాక్ మార్కెట్లో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. ఓపిక ముఖ్యం. అలాగే మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు రిస్క్ తీసుకునే ధైర్యం,సామర్థ్యం ఉండి తీరాలి. నోట్: ముందే చెప్పినట్టుగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు అంటే అంత ఆషామాషీ కాదు. సరియైన అవగాహన, లోతైన పరిజ్ఞానం చాలా అవసరం. -
లాభాల జోరు: ఎంఆర్ఎఫ్ రికార్డ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభంనుంచీ లాభాల్లో కొనసాగిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ప్రధానంగా రియల్టీషేర్లు లాభాలు మార్కెట్కు ఊతమిచ్చాయి. 418 పాయింట్లు లాభంతో 63,143వద్ద 119 పాయింట్ల లాభంతో నిఫ్టీ 18,720 వద్ద ముగిసాయి. దాదాపు టాటా కన్జ్యూమర్స్, టైటన్, సిప్లా, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడగా, కోటక్ మ హీంద్ర, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రూపాయి 8 పైసలు పెరిగింది. ఏప్రిల్ 2023లో 4.7శాతంగా సీపీఐ ద్రవ్యోల్బణం మే 2023లో 4.25శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. విశేషం ఏమిటంటే , ఎంఆర్ఆఫ్ రికార్డ్ ప్రఖ్యాత రబ్బరు టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మరోసారి ఆకాశానికి దూసుకుపోయింది. ఎంఆర్ఎఫ్ షేరు తొలిసారి లక్ష మార్క్ను టచ్ చేసింది. అంతేకాదు రానున్న కాలంలో షేర్ ధర రూ.1.47 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్గా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, మార్కెట్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
నష్టాల్లో ముగిసిన మార్కెట్, బ్యాంకు, ఐటీ షేర్ల దెబ్బ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్న సూచీలు తొలి రెండు గంటలపాటు గ్రీన్లో కొనసాగాయి. కానీ మిడ్ సెషన్నుంచి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 223.01 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 62,625.63 వద్ద ముగిసింది.అలాగే నిఫ్టీ 71.10 పాయింట్లు లేదా 0.38 శాతం క్షీణించి 18,563.40 వద్ద స్థిరపడింది. క్యాపిటల్ గూడ్స్ లాభపడగా,బ్యాంకు, ఐటీ, మెటల్ , ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లునష్టపోయాయి. ఇండస్ ఇండ్, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, అదానీ లాభపడగా, హీరోమోటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ, దివీస్, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. గత ముగింపు 82.57తో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి 11 పైసలు పెరిగి 82.46 వద్ద ముగిసింది. -
కొనుగోళ్ల జోరు: సింగిల్ డేలో రూ. 2.4 లక్షల కోట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. దాదాపు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ఆరంభంలో 125 పాయింట్ల లాభంతో ఎగిసిన సెన్సెక్స్ చివరికి 350 పాయింట్లు లేదా 0.56 శాతం ఎగిసి 63,143 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభంతో 18,726 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 63వేలకు ఎగువన, నిఫ్టీ 18,700కి ఎగువన బలమైన నోట్తో ముగిశాయి. అంతర్జాతీ సంకేతాలకు తోడు, ఆర్బీఐ రానున్న పాలసీ రివ్యూలో వడ్డీరేటు పెంపు ఉండదనే అంచనాల మధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బిపిసిఎల్, నెస్లే ఇండియా మరియు హెచ్డిఎఫ్సి లైఫ్ అత్యధికంగా లాభపడగా, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 286.6 లక్షల కోట్ల నుండి రూ. 289 లక్షల కోట్లకు పెరిగింది, పెట్టుబడిదారులు ఒకే రోజులో రూ 2.4 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం ) -
ఫ్లాట్ ముగింపు, ఐటీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది. ఫ్లాట్ ఆరంభంనుంచి బలహీనమైన అంతర్జాతీయ ప్రతికేల సంకేతాలతో ప్రధాన సూచీలు మందకొడిగా కొనసాగాయి. మిడ్సెషన్లో భారీగా నష్టపోయింది. చివరి 30 నిమిషాల్లో కొనుగోళ్లతో నష్టాలనుంచి తేరుకుంది. స్వల్ప లాభాలకు పరిమితమైనా కీలక మద్దతుస్థాయిలకుపైన ముగసింది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) 5 పాయింట్ల లాభంతో 62,793 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 18599 వద్ద ముగిసింది. ఆటో, బ్యాంకు రంగ షేర్లు లాభపడగా ఐటీ అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్కు దారితీసింది. అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టైటన్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి. అటు డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 29 పైసలు పతనమై 82.68 దగ్గర నిలిచింది.