Stockmarket
-
సూచీలు అక్కడక్కడే..!
ముంబై: ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో స్టాక్ సూచీలు మంగళవారం అక్కడిక్కడే ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ రెండు పాయింట్ల లాభంతో 81,510 వద్ద నిలిచింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 24,610 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ప్రథమార్థంతా లాభాల్లో కదిలాయి. మిడ్సెషన్లో లాభాల స్వీకరణతో నష్టాలు చవిచూశాయి.ట్రేడింగ్ చివర్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు రాణించడంతో నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 543 పాయింట్ల పరిధిలో 81,508 – 81,726 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 24,678 వద్ద కనిష్టాన్ని, 24,511 గరిష్టాన్ని తాకింది. రియలీ్ట, ఐటీ, మెటల్, కమోడిటీ, ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, పవర్, సర్విసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్లో ఈ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
ట్రేడింగ్లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్ఫామ్ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,401 వద్దకు చేరింది. సెన్సెక్స్ 72 పాయింట్లు ఎకబాకి 73,878 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) శనివారం జరిగిన ప్రత్యేక సెషన్లో నికరంగా రూ.82 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.45 కోట్ల స్టాక్స్ను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: 20,100 పైనే నిఫ్టీ.. లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు నెలవారీ గడువు ముగింపు, ఐదు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ఫెడ్ఛైర్మన్ పావెల్ సమావేశం ఉండడంతో కూడా మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ నెన్సెక్స్ 87 పాయింట్ల లాభంలో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల పుంజుకుని 20,133కు చేరింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్ల నష్టపోయినప్పటికీ.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్ల మేర లాభంలో నెల చివరి రోజు ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, విప్రో, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్ కంపెనీలతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లోకి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మొదటి రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 90 పాయింట్లు దిగజారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 145 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ట్రేడయ్యాయి. మార్కెట్లు నష్టాల్లో కొనసాగినప్పటికీ ఫార్మా, రియల్టీ రంగాల షేర్లు మాత్రం లాభాల్లో కదలాడాయి. వరుసగా రెండో రోజు కూడా బెంచ్ మార్క్ సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో నిఫ్టీ 19,000 మార్కుకు దిగువన ముగిసింది. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, హిందాల్కొ, బజాజ్ ఆటో, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, యూపీఎల్, నెస్లే, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఎల్ టీఐఎమ్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రోతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాల్లో స్టాక్మార్కెట్లు..రికవరీ ఎప్పుడంటే..
ఈక్విటీ మార్కెట్లు గురువారం సైతం నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ గత పది ట్రేడింగ్ సెషన్ల్లో తొమ్మిదింటిలో నష్టాల్లోకి లాగబడ్డాయి. దాంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ఈవెంట్కు మార్కెట్ ఎల్లప్పుడూ ముందే స్పందిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే నెలల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని భావిస్తున్నారు. దాంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. డాలర్ పెరుగుతుడడంతో రూపాయి పతనం కొనసాగవచ్చనే భయాలు ఉన్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్లు గరిష్ఠస్థాయికి చేరుతున్నాయి. విదేశీ, రిటైల్ మదుపరులు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు ఇంకా దిగజారిపోతున్నాయి. మార్కెట్లు ఓవర్సోల్డ్ జోన్లోకి చేరుకోవడంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సద్దుమనుగుతే తప్పా మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని తెలుస్తుంది. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ గడిచిన ట్రేడింగ్తో పోలిస్తే 264 పాయింట్లు నష్టపోయి 18857 వద్దకు చేరింది. సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63148 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.210కు చేరింది. క్రూడ్ బ్యారెల్ ధర 84.36డాలర్లకు చేరింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.32శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.06శాతం నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 30 లో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా అన్ని స్టాక్లు నష్టాల్లోకి వెళ్లాయి. అధికంగా ఎం అండ్ ఎం, బజాజ్ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్లు నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్లో ఫీచర్ ప్లాట్ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్ఇంక్!
గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్ఇంక్ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్పిచాయ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్కటింగ్ పేరిట్ క్లౌడ్ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్ అమ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్ఓ రూత్ పోరట్ తెలిపారు. గూగుల్క్లౌడ్ ప్లాట్ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్ల కోసం ఇతర ఎంటర్ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది. -
సాక్షి మనీ మంత్ర: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 800 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 19,300 దిగువకు చేరింది. ప్రారంభంలో 65,419.02 పాయింట్ల వద్ద ప్లాట్గా మొదలైన సెన్సెక్స్.. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 65వేల స్థాయిలో కదలాడిన సూచీ.. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 825.74 పాయింట్లు నష్టపోయి 64,571.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు నష్టపోయి 19,281.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.19గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాలు చవిచూశాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతుండడంతో మదుపరుల్లో కలవరం వ్యక్తమవుతోంది. గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటనతో ఆసియా, యూరప్ మార్కెట్లపై ప్రభావం పడింది. ఫలితంగా మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి చాలా ఏళ్ల తర్వాత 5 శాతం దాటడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. 2007 జులై తర్వాత అమెరికా బాండ్ల రాబడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీని ప్రభావం మిగిలిన ప్రపంచ మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధికంగా ఉండడమూ మరో కారణం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర పీపా 90 డాలర్లకు పైనే ట్రేడవుతోంది. ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్పై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం మార్కెట్ సెలవు: దసరా పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవుదినంగా ప్రకటించారు గమనించగలరు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ICICI Results: అంచనాలను మించిన ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 36 శాతం వృద్ధి
దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాల్ని ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,558 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. స్టాండలోన్ పద్దతిలో రూ.10,261 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో నికర వడ్డీ మార్జిన్ 4.31 శాతం నుంచి 4.53 శాతానికి పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 2.76 శాతం నుంచి 2.48 శాతానికి పరిమితమయ్యాయని బ్యాంక్ తెలిపింది. -
సాక్షి మనీ మంత్రా: వచ్చే వారం మార్కెట్, ఏయే సెక్టార్లు బావుంటాయి?
రానున్న వారంలో మార్కెట్ మూమెంటం ఎలా ఉండబోతోంది. ఈ వారం భారీ నష్టాలనుంచి పుంజుకుని ముందుకొచ్చాయి. ఆర్బీఐ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచిన నేపథ్యంలో నెక్ట్స్ ఎలా ఉండ బోతోంది.. తదితర విషయాలపై అశిక ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ లీడ్ ఎనలిస్ట్ కౌశిక్ మోహన్తో సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ.. గ్లోబల్ పరిణామాలు ఎఫ్ఐఐ సెల్లింగ్, ఆయిల్ ధరలు బలమైన డాలర్ నేపథ్యంలో మార్కెట్లో పరిణామాలు చూశాం. రానున్నది ఎలక్షన్ సీజన్, అలాగే పండుగ సీజన్ నేపథ్యంలో పెద్దగా నష్టపోయే అవకాశం కాలేదు. దేశీయ స్టాక్మార్కెట్లు ఎందుకు బలంగా ఉన్నాయంటే భారత్ అందిస్తున్న పీఎల్ఐ ప్రయోజనాల మూలంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి.పురోగతి ఆకర్షణీయంగా ఉంది. వినియోగం పెరిగింది. అలా మనదేశంలో యంగస్టర్, నిపుణులు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే చైనాతో పోలిస్తే ఇండియాపై పరిశ్రమలు మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేటు బాంక్స్, పీఎస్యూ బ్యాంక్స్ ఫలితాలు, క్రెడిట్ గ్రోత్ బావుంది. ఎస్బీఐ కొనుక్కోవచ్చు. హెచ్డీఎఫ్సీ గ్లోబల్గా టాప్-5 లో బ్యాంకుగా ఉంది. కోటక్, ఐసీఐసీఐ, కర్నాటక బ్యాంక్ పాజిటివ్గానే ఉన్నాయి. కనుక ఫైనాన్సియల్ రంగంలోనే ఎల్ఐసీ లాంటి ఇన్సూరెన్స్ సెక్టార్ బుల్లిష్గా ఉంది. అమెరికా ట్రెజరీ, ఇండియా బాండ్స్కి తేడా ఏంటి? ఇండియా డెఫిసిట్ ఎక్కువగాఉంటే గవర్నమెంట్స్ ట్రెజరీ బాండ్స్ను జారీ చేస్తుంది. టాక్స్ సేవింగ్స్ లాంటి వాటికోసం వాటిని కొనుగోలు చేస్తాం. లాంగ్ టర్న్ క్యాపిటల్ గెయిన్స్ కోసం కూడా వీటిని బై చేయవచ్చు. యూఎస్ ట్రెజరీ బాండ్స్లో వడ్డీ ఎక్కువ ఇస్తే.. అక్కడ రిటర్న్స్ ఎక్కువ వుంటాయి. కానీ డాలర్ చిక్కులుంటాయి. ఏదైనా లాంగ్ టెర్మ్లో బాండ్స్ మంచి ఈల్డ్స్ ఇస్తాయి. ప్రస్తుతం పీఎస్యూ, ఇన్ఫ్రా, సిమెంట్ షేర్లు బలహీనంగా ఉన్నాయి. కానీ ఇవీ ఫ్యూచర్ గైడెన్స్ ఆధారంగా ట్రేడింగ్ కావడం లేదు. అందుకే బలహీనత. కానీ బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్, టెండర్స్ చూస్తే మనం చాలా పటిష్టంగా ఉన్నాం. సెప్టెంబరు క్వార్టర్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే.. మేజర్గా నిఫ్టీలోనే కాకుండా ఫార్మా,కెమికల్ బావుండే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనాలో డిఫ్లేషన్ ఉంది. చైనా డంపింగ్ కారణంగా కెమికల్, ఫార్మా ధరలు పడిపోయాయి. ఇపుడు మెల్లిగా కోలుకుంటున్నాయి. లోయర్ లెవల్స్ని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు క్యాపిటల్ గూడ్స్ సెక్టార్కూడా బలంగా ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్)సెక్టార్ కూడా బాగా పెర్ఫాం చేయబోతోంది. ముఖ్యంగా మేడిన్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. వీటికి మళ్లీ బ్యాంకింగ్ సహకారం కచ్చితంగా అవసరం.. వీటిని కూడా మనం చూడాలి. ఆటో, ఆటో యాంగ్జీలరీస్లో ఇన్వెంటరీమీద దృష్టిపెట్టాలి. క్యూ 3లోఫెస్టివ్ సీజన్తో వస్తుంది కాబట్టి ఇపుడు కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది. క్యూ2 ప్రొడక్ట్స్ను క్యూ3లో కొంటారు. ఇదొక సైకిల్. అలాగే రీసెంట్గా ఆటో కంపెనీల సేల్స్ బావున్నాయి. భారత్ను ట్రేడింగ్ కాగా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలి. క్యాష్ ఎర్నింగ్స్ను పరిశీలించి, షేర్లను కొనుగోలుకు ఎంపిక చేసుకోవాలి. రానున్న పదేళ్లలో ఇండియా గ్రోత్ కూడా శరవేగంగా పెరగబోతోంది. దాదాపు రెండు మూడు రెట్లు పుంజుకోతోంది. 6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవ బోతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఆర్బీఐ బూస్ట్, సెన్సెక్స్ హైజంప్
Today Stock Market Closing Bell: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలోనే లాభాల నార్జించిన సూచలు ఆర్బీఐ వడ్డీరేటు నిర్ణయంతో మరింత చీరప్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాలు షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా వరుసగా రెండో సెషన్లో లాభాలతో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 65,996 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 19,653.50 వద్ద ముగిసాయి. క్యూఐపీ ద్వారా 10కోట్ల నిధుల సమీకరణ ప్లాన్ల నేపథ్యంలోబజాజ్ ఫిన్ సర్వ్ , బజాజ్ ఫైనాన్స్ షేర్లు జోరు నెలకొంది. రియల్టీ ఇండెక్స్ 3 శాతం, ఐటీ, ఎఫ్ఎమ్సిజి, మెటల్, ఆటో, పవర్, హెల్త్కేర్ 0.4-1 శాతం చొప్పున పెరిగాయి. BSE మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ , టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ గెయినర్స్గా ఉండగా, నష్టపోయిన వాటిలో హెచ్యుఎల్, ఒఎన్జిసి, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ , ఏషియన్ పెయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 83.25తో పోలిస్తే డాలర్కు రూపాయి 83.24 వద్ద ఫ్లాట్గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఐటీ, ఆటో జోరు, భారీ లాభాలు
Today Stockmarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలకు చెక్ చెప్పి భారీ లాభాలతోముగిసాయి.ముగింపులో, సెన్సెక్స్ 406 పాయింట్లు లేదా 0.62 శాతం పెరిగి 65,632 వద్ద, నిఫ్టీ 108పాయింట్ల లాభంతో 19,544 వద్ద ముగిసాయి. రెండు రోజుల నష్టాల పరంపరను అధిగమించిన నిఫ్టీ 19,550పైన స్థిరపడింది. ఆటో, బ్యాంక్, ఐటీ క్యాపిటల్ గూడ్స్ లాభపడగా, ఫార్మా, పవర్ , పిఎస్యు బ్యాంకింగ్ పేర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీలో బజాజ్ ఆటో, లార్సెన్ అండ్ టూబ్రో, టైటాన్ కంపెనీ, M&M , TCS టాప్ గెయినర్స్గా ఉండగా, నష్టపోయిన వాటిలో ప్రధానంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిండాల్కో ఇండస్ట్రీస్, సిప్లా, NTPC, నెస్లే ఇండియా ఉన్నాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది. రూపాయి: బుధవారం నాటి ముగింపు 83.23తో పోలిస్తే భారత రూపాయి గురువారం డాలర్కు 83.25 వద్ద ఫ్లాట్గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఇన్వెస్టర్ల అప్రమత్తత వరుసగా రెండో రోజూ నష్టాలు
Stock Market Closing bell: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుసగా రెండో సెషన్లో ఆరంభంలోనే నష్టాల నెదుర్కొన్న సూచీలు తరువాత మరింత దిగజారాయి. ఒక దశలో నిఫ్టీ 19,450 స్థాయిని కూడా కోల్పోయింది. ఎఫ్ఎంసిజి, ఐటీ మినహా అన్ని రంగాల్లో ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, పిఎస్యు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్,హెల్త్కేర్, మెటల్, రియాల్టీ 1-3 శాతం పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 65,226 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టంతో 19,436 వద్ద ముగిసాయి. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా నష్టపోగా, అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, ఐషర్ మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూ మీట్- ఇన్వెస్టర్ల అప్రమత్తత గ్లోబల్ మార్కెట్ల సంకేతాలకు తోడు ద్రవ్య విధాన ఫలితాల ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MPC (ద్రవ్య విధాన కమిటీ) సమావేశాలు ప్రారంభమైనాయి. శుక్రవారం (అక్టోబర్ 6) న గవర్నర్ శక్తి కాంత్ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.20తో పోలిస్తే 83.23 వద్ద స్థిరపడింది. -
సాక్షి మనీ మంత్రా: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు FPI అమ్మకాల నేపథ్యంలో ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు చివరి దాకా అదే ధోరణి కొనసాగించాయి. చివరికి సెన్సెక్స్ 316 పాయింట్లు కోల్పోయి 65,512 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పడి 19,528 వద్ద ముగిసింది. ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. దీంతో నిఫ్టీ 19,500 దిగువకు చేరింది. అయితే క్యాపిటల్ గూడ్స్ , పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్లలో కొనుగోళ్లతో మిడ్ సెషన్లో నష్టాల తగ్గాయి.నిఫ్టీలో ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ టాప్ లూజర్గా, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫిన్సర్వ్ అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. రూపాయి: అటు డాలరుమారకంలో రూపాయి కూడా 83.20వద్ద నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వారాంతంలో లాభాలు జోరు
Today StockMaket Closing Bell: దేశీయ స్టాక్మార్కెట్లు వారంతాంలో పాజిటివ్గా ముగిసాయి. ఆరంభంలోనే లాభాలతో మురిపించిన సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ 19,600 ఎగువకుచేరింది. చివరికి 320పాయింట్లు పెరిగి 65,828 వద్ద,నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 19,638.వద్ద ముగిసాయి. ఐటీ మినహా దాదాపుఅన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.మెటల్, పవర్, ఆయిల్ & గ్యాస్, పీఎస్యూ బ్యాంక్ హెల్త్కేర్ సూచీలు 1-2.7 శాతం ఎగిసాయి. కాగ్నిజెంట్ ఫలితాల నిరాశాజనకంగా ఉండటంలో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. కానీ చివర్లో నష్టాలనుంచి తేరు కున్నాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్టిపిసి, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, దివీస్ ల్యాబ్లు టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్టిమైండ్ట్రీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి గత ముగింపు 83.18తో పోలిస్తే డాలర్కు 14 పైసలు పెరిగి 83.04 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ట్రేడింగ్పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్ఎస్డీఎల్లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు సీడీఎస్ఎల్లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్ సంస్థలు డీమ్యాట్ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు) అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఈ యాక్టివ్ క్లయింట్లకు సంబంధించి టాప్ 5 డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల (జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది. -
సాక్షి మనీ మంత్రా: ఐటీ దెబ్బ, ఫ్లాట్గా ముగిసిన మార్కెట్
Today Stock Market Closing bell: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఉదయం నుంచీ లాభ నష్టాల మధ్య ఒడిదుడుకుల ట్రేడింగ్లో సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 66,024, నిఫ్టీ 19,675 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ 1.5 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ స్వ్పలంగా నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, టాటా క న్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా టాప్ గెయనర్స్గా నిలిచాయి. మరోవైపు హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, హీరోమోటో, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారంనష్టాల్లో ముగిసింది. మరియు శుక్రవారం ముగింపులో 82.93 వద్ద డాలర్కు 21 పైసలు తగ్గి 83.14 వద్ద ముగిసింది. -
వచ్చే వారం మార్కెట్లలో ర్యాలీ? నిఫ్టీ 20 వేలు దాటేస్తుందా?
దేశీయ స్టాక్మార్కెట్లు ఈ వారాంతంలో నష్టాల్లో ముగిసాయి.గతవారం చీర్పుల్గా మార్కెట్లు ఈ వారం షాక్ ఇచ్చాయి. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శుక్రవారం నాటి ట్రేడింగ్లో కనిష్టాల వద్ద రికవరీని సాధించాయి. ఈనేపథ్యంలో తదుపరి వారం పాజిటివ్గా ట్రేడ్లో ఉండవచ్చు. నియోట్రేడర్ కో-ఫౌండర్ రాజా వెంకటరామన్ సాక్షిబిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు సంభాషణ విందాం. వచ్చే వారం మార్కెట్ ధోరణి ఎలా ఉండబోతోంది. బ్యాంకింగ్ షేర్లలో ఏవి బెటర్. ముఖ్యంగా నిఫ్టీ సపోర్ట్ లెవల్స్ ఏంటి అనేది ఒక సారి చూద్దాం. నిఫ్టీ 50 కచ్చితంగా 20000-20200, కానీ 202600 వద్దకు వెళ్లే ఛాన్స్ వుంది. లోయర్స్ లెవల్స్లో కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పటివరకూ పాజిటివ్ సంకేతాలే ఉన్నాయి. అయితే నిఫ్టీ19600-19500 వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. ఈ లెవల్ బ్రేక్ అవ్వనంత వరకు పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఈ లెవల్స్లో కొనుగోలు చేస్తే మళ్లీ నిఫ్టీ 20వేలకు చేరే అవకాశం ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ బలహీనంగా ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్లో ప్రభుత్వ బ్యాంకులా, ప్రైవేటు బ్యాంకులా అనేది ఎలా చూడాలి. కచ్చితంగా పీఎస్యూ బ్యాంకులే పటిష్టంగా ఉన్నాయి. అలాగే హెచ్డీఎఫ్సీభారీగా నష్టపోయినప్పటికీ కనిష్టాల వద్ద కొనుగోళ్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. రికమెండెడ్ స్టాక్స్: టీవీఎస్ మోటార్స్, టీసీఎస్ కొనుగోలు చేయవచ్చుని రాజా వెంకటరామన్ సూచిస్తున్నారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ
Today StockMarket Closin: దేశీయ స్టాక్మామార్కెట్లు వారాంతంలో కూడా నష్టాల ఇన్వెస్టర్లను నిరాశ పర్చాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ లాభ నష్టాల ఒడిదుడుకులకు లోనైంది. పీఎస్యూ బ్యాంకులు, ఐటీ, మెటల్స్, ఫార్మా ఒత్తిడికి లోనయ్యాయి. చివరి 221 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్ 66,009 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 19,674 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వరుస నష్టాలతో నిఫ్టీ వారాంతంలో 19700 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కేవలం నాలగు ట్రేడింగ్ సెషన్ల నష్టాలతో లక్ష కోట్ల మార్కెట్లు కోల్పోయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, ఎం అండ్ఎం ఎస్బీఐ, కోల్ ఇండియా టాప్ గెయనర్స్గా నిలవగా, డా.రెడ్డీస్, విప్రో,యూపీఎల్, బజాజ్ ఆటో, సిప్లా టాప్ లూజర్స్గా ఉన్నాయి. రూపాయి: గురువారం ముగింపు 83.09 పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 19పైసలు ఎగిసింది. 82.93 ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో బ్లడ్ బాత్..రోజంతా నష్టాలే
Bloodbath in Today StockMarket: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 500పాయింట్లకు పైగా పతనమైన మార్కెట్ రోజంతానష్టాలతోనే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 620 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 19,730 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్ 571 పాయింట్టు కుప్పకూలి 66,230 వద్ద నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 19742 వద్ద ముగిసింఇ. ఆటో, బ్యాంక్, ఫార్మా సూచీలుతోపాటు దాదాపు అన్ని రంగాల షేర్లలోఅమ్మకాల ఒత్తిడి కొనసాగింది. యాక్సిస్; హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండస్,కోటక్ మహీంద్ర, పీఎన్బీ, ఫెడలర్, ఎస్బీఐ, తదితర బ్యాంకింగ్ షేర్ల నష్టాలో నిఫ్టీ బ్యాంకు దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇండా ఎంఅండ్ఎం, సిప్లా, హీరో మోటో కార్ప్ ఇతర టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు అదానీ పోర్ట్స్,టెక్ మహీంద్ర, ఏసియన్ పెయింట్స్, డా. రెడ్డీస్ బీపీసీఎల్, లాభపడ్డాయి. రూపాయి: బుధవారం ముగింపు 83.07తోపోలిస్తే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయి 83.09 వద్ద ముగిసింది -
సాక్షి మనీ మంత్రా : భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్
Today Stock Market Opening: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు కుప్పకూలగా నిఫ్టీ 19900 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ , హెచ్సీఎల్టెక్, రిలయన్స్, గ్రాసిం ప్రధానంగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం 276 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 66515 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు నష్టంతో 198258 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్, హిందాల్కో లాభపడుతున్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా తగ్గి 83.09 వద్ద ప్రారంభమైంది. డాలర్ ఇండెక్స్ ఆరు నెలల గరిష్ట స్థాయి 105.68కి చేరింది. రెండు దశాబ్దాల గరిష్టానికి చేరిన ప్రధాన వడ్డీ రేటును విస్తృతంగా ఊహించినట్లుగానే యధాతథంగా ఉంచింది ఫెడ్. అయితే ఈ ఏడాది మరోసారి రేటు పెంపు ఉండ వచ్చని నిపుణుల అంచనా. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: అదే నష్టాల బాట.. నేలచూపుతో ప్రారంభమైన సూచీలు
Today Stockmarket Opening: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పండగ వేళ వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. కీలక సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 67,196 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 117 పాయింట్లు క్షీణించి 20,016 వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజస్ టాప్ గెయినర్స్గా కొనుసాగుతుండగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జియో ఫినాన్సియల్ కంపెనీ షేర్లు టాప్ లూజర్స్గా నష్టాల బాట పట్టాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: కొనసాగిన నష్టాలు, మెరిసిన టైటన్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ బలహీన సంకేతాలతో భారీ నష్టాలతో ఈ వారాన్ని ఆరంభించిన సూచీలు వెంటనే కోలుకున్నాయి. అయినప్పటికీ దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో రోజుంతా నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్ 242 పాయింట్ల నష్టంతో 67,596.84 వద్ద ముగియగా, నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయి 20,133 వద్ద ముగిసింది. పవర్ గ్రిడ్, టైటన్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీలైఫ్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్గా, జియో ఫైనాన్షియల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. రూపాయి: డాలరుమారకంలో రూపాయి రికార్డు కనిష్టానికి చేరింది. 8 పైసలు నష్టంతో 83.27 వద్ద రికార్డు కనిష్టంతో ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంక్స్, ఆటో, ఐటీ జోరు, నిఫ్టీ రికార్డ్ క్లోజింగ్
Today Stock Market Closing: దలాల్ స్ట్రీట్లో రికార్డుల మోత మోగింది. దేశీయ సూచీలు రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకు, ఐటీ, ఆటో షేర్లు భారీ లాభాల నార్జించాయి. గత కొన్ని సెషన్లుగా దూకుడుగా ఉన్న నిఫ్టీ తగ్గేదేలే అంటూ 20200 స్థాయిని దాటింది.చివరవకు సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగిసి 67,838.63 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు లాభంతో 20,192 వద్ద ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్, పవర్ , రియల్టీ 0.4-1 శాతం క్షీణించగా, ఆటో, బ్యాంక్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 0.3-1 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు సానుకూలంగా ముగిశాయి. బజాజ్ ఆటో, గ్రాసిం, ఎం అండ్ ఎం, హీరోమోటో, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్స్గా ఉండగా, జియో ఫైనాన్షియల్, బీపీసీఎల్, ఆసియన్స్ పెయింట్స్, హెచ్యూఎల్, టాటా కన్జ్యూమర్ టాప్ లూజర్స్ నిలిచాయి. రూపాయి: డాలరు మారకంలో రూపాయి నష్టాల్లోముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: రికార్డ్ ముగింపు! 20,100 ఎగువకు నిఫ్టీ..
Today StockMarket closing: దలాల్స్ట్రీట్లో బుల్ పరుగులు కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తూ సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 67,543 వద్ద ముగియగా, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 20,102 వద్ద ముగిసింది. క్రితం రోజు ఆల్టైమ్ హై 20,000 పాయింట్లను దాటిన నిఫ్టీ ఈరోజు మరింత ఎగబాకి 20,100 పాయింట్లను దాటి రికార్డ్ సృష్టించింది. యూపీఎల్, హిందాల్కో, ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా సంస్థల నష్టాలను మూటగట్టుకుని లాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
స్కామ్స్టర్ ‘బాబు’ సెగ: హెరిటేజ్ షేర్లు ఢమాల్
రూ. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్మాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్తో హెరిటేజ్ స్టాక్ ఢమాల్ అంది. వరుసగా మూడు రోజుల పాటు ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు పాతాళానికి పడియింది. ముఖ్యంగా చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్తుపై ఆశలో కోల్పోయి, షేర్ల అమ్మకానికి ఎక్కువశాతం మొగ్గు చూపిస్తుండటం గమనార్హం. సోమవారం బీఎస్ఈ హెరిటేజ్ ఫుడ్స్ స్క్రిప్ 7 శాతం నష్టంతో రూ.253 వద్ద ముగిసింది. మంగళవారం కూడా ఈ నష్టాలు కొనసాగాయి. ఏకంగా 13 శాతం కుప్పకూలి 221.45 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్టం రూ. 287.35 , 52 వారాల కనిష్ట ధర రూ.135.15. కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి డెయిరీ సంస్థ వైస్-ఛైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్గాను, కుమారుడు లోకేశ్ భార్య బ్రాహ్మణి నారా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే. -
సాక్షి మనీ మంత్రా: మార్కెట్ల యూటర్న్, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి
Today Market Closing: దేశీయ మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులమధ్య సాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలకు పరిమితమై నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలతో 380 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి సెన్సెక్స్ 94 పాయింట్లు లాభంతో 67,221.13 వద్ద ముగిసింది. అలాగే 20వేలకు ఎగువన మొదలైన నిఫ్టీ ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టంతో 19,993.20 వద్ద ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, మెటల్ , రియాల్టీ ఒక్కొక్కటి 1-3 శాతం చొప్పున నష్టపోయాయి. తద్వారా వరుసగా 7 రోజుల లాభాలకు చెక్ పడింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లోని రూ.324.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.318.7 లక్షల కోట్లకు పడిపోయింది.అంటే ఒక్క సెషన్లోనే దాదాపు రూ. 5.6 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.మిడ్, స్మాల్ క్యాప్లు ఈరోజు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం క్షీణించి 32,084.93 వద్దకు చేరుకోగా, బిఎస్ఇ స్మాల్క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం క్షీణించి 36,982.74 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్లో బీపీసీఎల్ ,ఎన్టీపీసీ ,పవర్ గ్రిడ్ ,షేర్లు టాప్ లూజర్లుగా ముగిశాయి. మరోవైపు టిసిఎస్ , లార్సెన్ అండ్ టూబ్రో ,ఇన్ఫోసిస్ ,షేర్లు టాప్ గెయినర్లుగా ముగిశాయి. అటు యుఎస్ ద్రవ్యోల్బణం డేటా ,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , యుఎస్ ఫెడ్ ద్రవ్య విధాన సమావేశాలపై దృష్టి సారించడంతో గ్లోబల్ సూచనలు కూడా బలహీనంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు తవెల్లడి కానున్న ఆగస్ట్లో భారత ద్రవ్యోల్బణం డేటా , జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు ఎగిసింది. -
సాక్షి మనీ మంత్రా: బుల్ దౌడు, నిఫ్టీ సరికొత్త రికార్డు
Today Nifty hits fresh record hig: దేశీయస్టాక్మార్కెట్లు లాభాల్లోముగిసాయి. ముఖ్యంగా నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి 20వేల మార్క్ను తాకింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది. చివరికి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,992 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్లో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు ఒక్కరోజులో రూ 3 లక్షల కోట్లను ఆర్జించారు. సెన్సెక్స్ తిరిగి 67,000 మార్కును చేసింది. 528 పాయింట్ల లాభంతో 67,127 వద్ద ముగిసింది. ఇటీవలి మార్కెట్ టర్న్అరౌండ్ గ్లోబల్ సూచనలు, స్థిరమైన నిధుల ప్రవాహం , G20 విజయానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. వరుసగా కొనుగోళతో వరుసగా ఏడో రోజు కూడా బుల్ రన్ కొనసాగడం విశేషం. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్గా నిలవగా జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ టాప్ టూజర్స్గా ఉన్నాయి. -
సాక్షి మనీ మంత్రా: వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలే!
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోనే స్థబ్దుగా ఉన్న మార్కెట్లు ఆ తరువాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 200 పాయింట్లకు పైగా నష్టపోయాయి. కానీ ఆఖరి సెషన్లో కొనుగోళ్లతో నష్టాలనుంచి కోలుకుని పాజిటివ్గా ముగిసాయి.సెన్సెక్స్ 100.26 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 65,880.52 వద్ద, నిఫ్టీ 36.10 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 19,611 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19,600కి ఎగువన భారత బెంచ్మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్లో సానుకూలంగా ముగియడం విశేషం. ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 1 శాతం పెరగగా, ఫార్మా, ఆయిల్ & గ్యాస్ , పవర్ ఇండెక్స్లు ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు మెటల్, రియాల్టీ, బ్యాంక్ సూచీలు 0.4-1 శాతం క్షీణించాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, దివీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, సిప్లా మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉండగా, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టిపిసి టాప్ లూజర్స్గానూ నిలిచాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. రూపాయి: మంగళవారం ముగింపు 83.03తో పోలిస్తే బుధవారం డాలర్ మారకంలో రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: లాభాలతో శుభారంభం, కోల్ ఇండియా జోరు
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ఈ వారాన్ని శుభారంభం చేశాయి. ఆరంభ లాభాలనుంచి పుంజుకుని రోజంతా లాభాలతోనే ఉత్సాహంగా కొనసాగాయి. చివరికి సెన్సెక్స్ 240.98 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 65,628.14 వద్ద,నిఫ్టీ 93.50 పాయింట్లు లేదా 0.48 శాతం పెరిగి 19,529 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19500 ఎగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. పవర్, మెటల్, ఆటో, రియల్టీ, ఆయిల్ & గ్యాస్ , PSU బ్యాంక్ 1 , 2.8 శాతం మధ్య ఎగిసాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ , స్మాల్క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ షేరు వరుసగాసెషన్లు లాభపడుతూ లిస్టింగ్ ప్రైస్ను అధిగమించడం విశేషం. కోల్ ఇండియా, విప్రో, హెచ్సీఎల్టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్, టాటా స్టీల్ లాభపడగా, ఎం అండ్ఎం, యాక్సిస్ బ్యాంకు,ఐటీసీ, నెస్లే, ఆసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. ఆగస్టులో 52.3 మిలియన్ టన్నుల (MT) ఉత్పత్తిలో సంవత్సరానికి 13 శాతం వృద్ధిని నమోదు చేయడంతో కోల్ ఇండియా టాప్ గెయినర్గా నిలిచింది. రూపాయి: శుక్రవారం ముగింపు 82.71తో పోలిస్తే సోమవారం డాలర్తో రూపాయి 82.74 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) 301 reads -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ దెబ్బ, ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. రోజంతా ఒడిదుడులకు మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 650,87వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభాలకు పరిమితమై 19,347 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 19400 దిగువకు చేరింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో, ఎఫ్ఎంసిజి, ఐటీ మెటల్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు, పవర్, ఆయిల్ & గ్యాస్ ,బ్యాంకింగ్ రంగ షేర్లు 0.5 శాతం తగ్గాయి. టాటా స్టీల్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గాఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బీపీసీఎల్, డా. రెడ్డీస్, హీరోమోటోకార్ప్ భారీ నష్టాల్ని ఎదుర్కొన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ కూడా నష్టపోయింది. మంగళవారం నాటి ముగింపు 82.70తో పోలిస్తే బుధవారం రూపాయి 82.73 వద్ద స్థిరపడింది. -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ షేర్ల అండ లాభాల ముగింపు
Today Stock Markets Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతోముగిసాయి. ఆరంభంలాభాలను కొనసాగించిన సూచీలు చివరివరకూ లాభాలను నిలబెట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 213 పాయింట్లు ఎగిసి 65433 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 19444 వద్ద స్థిరపడ్డాయి.బ్యాంకు, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్బ్యాంకు, హిందాల్కో, ఎస్బీఐ, ఐసీఐసీఐబ్యాంకు, దివీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. రూపాయి: మంగళవారం నాటి ముగింపు 82.93తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 25 పైసలు పెరిగి 82.68 వద్ద ముగిసింది. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: లాభాలకు చెక్, అయ్యో,జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
Today StockMarketClosing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 3.94 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 65,220వద్ద, నిఫ్టీ 2.90 పాయింట్లు లేదా 0.01 శాతం లాభంతో 19,396.50 వద్ద ముగిశాయి. తద్వారా సోమవారం నాటి లాభాలకు చెక్ చెప్పాయి. ఐటీ, ఫార్మా , పీఎస్యు బ్యాంక్ మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ , పవర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి. మెటల్ , ఎఫ్ఎంసిజి ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. అలాగే నేటి ట్రేడింగ్ సెషన్లో బిఎస్ఇ మిడ్క్యాప్ , స్మాల్క్యాప్ రెండు సూచీలు తాజా రికార్డు గరిష్టాలను అధిగమించాయి. ఇది కీలక సూ చీలకు ఊతమిచ్చాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ,ఎన్టీపీసీ, హీరోమోటో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ టాప్ లూజర్స్గాఉన్నాయి. మరోవైపు సోమవారం మార్కెట్లో లిస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా రెండో రోజు కూడా 5 శాతం కుప్పలకూలడం గమనార్హం.ఎన్ఎస్ఇలో రూ.236.45 వద్ద లోయర్ సర్క్యూట్ అయింది. రూపాయి: డాలర్తో పోలిస్తే భారత రూపాయి 17 పైసల లాభంతో ముగిసింది. గత ముగింపు 83.11తో పోలిస్తే 82.94 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్రా: లాభాల మెరుపులు, జియో ఫైనాన్సియల్ లిస్టింగ్ నీరసం
TodayStockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. గత వారం నష్టాలనుంచి కోలుకున్న సూచీలు ఈ వారాన్ని లాభాలతో శుభారంభం చేశాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్న సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 267 పాయింట్ల లాభంతో 65, 216వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 19394 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఐటీ,ఫైనాన్షియల్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ , బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్గ్రిడ్, హిందాల్కో టాప్ విన్నర్స్గా నిలవగా, రిలయన్స్, ఎంఅండ్ఎం, బ్రిటానియా, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్గా మిగిలాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి ఆరంభంలో ఆల్ టైం కనిష్టం నుంచి కోలుకుంది. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. నిరాశపర్చిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్లో కస్టమర్లకు షాకిచ్చింది. సోమవారం ఈ షేరు ధరబీఎస్ఈలో రూ.265 నిఫ్టీ రూ. 262 వద్ద లిస్ట్ అయింది . అయితే ఇంట్రాడే కనిష్ట స్థాయికి జారిపోయింది. రెండు ఎక్స్ఛేంజీలలో 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాల్లో ముగిసిన మార్కెట్, అదానీ జోరు
TodayStockMarketClosingదేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతోముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సేచీలు చివరికి వారాంతంలో నెగిటివ్గానే ముగిసాయి. సెన్సెక్స్ 202.36 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 64,949వద్ద, నిఫ్టీ 55.10 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 19,310 ముగిసాయి. ఎఫ్ఎంసిజి, పవర్ మినహా దాదాపుఅన్ని రంగాలునష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 1.5 శాతం, మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలుప్రతికూలంగా ముగిశాయి. అయితే పెట్టుబడుల జోష్తో అదానీ గ్రూపు షేర్లుభారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ దాదాపు 3 శాతం ఎగిసాయి. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లు లాభాలనార్జించాయి. అలాగే జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ డేట్ ప్రకటించడంతో రిలయన్స్ లాభపడింది. ఇంకా ఐషర్ మోటార్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంకు లాభపడిన వాటిల్లోఉండగా కోల్ ఇండియా, హీరోమోటో కాప్, టెక్ మహీంద్ర, టీసీఎస్, హిందాల్కో టాప్ లూజర్స్గా ఉన్నాయి. (ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..ఈ పతనం ఎందాక?) అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి గత ముగింపు 83.15తో పోలిస్తే స్వల్పంగా పెరిగి 83.10 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఐటీ జోరు, కోలుకున్న సూచీలు
దేశీయస్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభంలోనే భారీ నష్టాలతో ఉన్నప్పటికీ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగింపులో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 65,401.92 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 19,434 వద్ద ముగిసాయి. దాదాపు 1509 షేర్లు పురోగమించగా, 2101 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో ఎల్టిఐఎండ్ట్రీ, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, రిలయన్స్ ప్రధానంగా లాభాలను ఆర్జించగా, నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి. ఐటీ, ఎఫ్ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం నష్టపోయాయి. పవర్, రియాల్టీ , సీఎస్యు బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం నష్టపోయింది. శుక్రవారం నాటి 82.85 ముగింపుతోపోలిస్తే 82.95 వద్ద ముగిసింది.బలహీన దేశీయ మార్కెట్లు బలమైన డాలర్ కారణంగా భారత రూపాయి తాజా 10 నెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనమైన ఐఐపీ గ్రోత్ కూడా ప్రభావం చూపింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకుల దెబ్బ, భారీ నష్టాలు
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. బలహీనమైన ప్రపంచ సూచనల మధ్యరోజంతా అమ్మకాలు కనిపించాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల సుదీర్ఘ ఎఫ్ఐఐ విక్రయాలు దేశీయ మార్కెట్లో జోష్ మూడ్కు అంతరాయంగా మారాయి. చివరకి సెన్సెక్స్ 542 నష్టంతో 65,240.68 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు కుప్పకూలి 19,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19,400 దిగువకు చేరింది. సెక్టార్ల పరంగా చూస్తే ఫార్మా ఇండెక్స్ 1 శాతం లాభపడగా, బ్యాంక్, మెటల్, ఆయిల్ & గ్యాస్,రియల్టీ 1-2 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. ఫార్మా , మీడియా మాత్రమే లాభపడ్డాయి. అదానీ స్టాక్స్ , సన్ ఫార్మా దూసుకుపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ , దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలచాయి. యూపీఏ టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లూజర్స్గా మిగిలాయి. క్యూ1 ఫలితాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాలనార్జించింది. నికర లాభం గతంలోని రూ. 469 కోట్లతో పోలిస్తే 44శాతం పెరిగి రూ. 674 కోట్లగా ఉంది. కానీ ఆదాయం మాత్రం పడిపోయింది. రూ. 40,844 కోట్ల పోలిస్తే 38శాతం తగ్గి రూ. 25,438 కోట్లకు చేరుకుంది. రూపాయి: డాలరు పుంజుకోవడంతో రూపాయి బలహీనత కొనసాగుతోంది. గురువారం మరో రూ 0.18 తగ్గింది. చివరికి గత ముగింపు 82.58తో పోలిస్తే డాలర్ మారకంలో 15 పైసలు తగ్గి 82.73 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
కొనసాగుతున్న ఆసియా మార్కెట్ నష్టాలు
-
సాక్షి మనీ మంత్రా: కుప్పకూలిన స్టాక్మార్కెట్
Sensex tanks, Nifty down: దేశీయస్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంనుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు చివరల్లో కాస్త కోలుకున్నాయి. ఒక దశలో 1000 పాయింట్లు దాకా కుప్పకూలింది మార్కెట్. చివరకు సెన్సెక్స్ 677 పాయింట్ల మేర పతనమై 65783వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో 19,514 వద్ద ముగిసింది. అయితే ఇంట్రా-డే కనిష్ట స్థాయిలనుంచి కోలుకుంది. ముఖ్యంగా అమెరికా సావరిన్ రేటింగ్ను ఫిచ్ కోత పెట్టడంతో గ్లోబల్ మార్కెట్లు ప్రతికూలంగా మారాయి. దీనికితోడు జూలై నెల ఆటోసేల్స్ ఆటో రంగ షేర్లను ప్రభావితం చేశాయి. దివీస్, నెస్లే, హెచ్యూఎల్, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర టాప్ గెయినర్స్గా ఉండగా, హీరోమోటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్గా మిగిలాయి. నిఫ్టీ బ్యాంక్ 597 పాయింట్లు పడిపోయి 44,996 స్థాయికి, మిడ్క్యాప్ ఇండెక్స్ 501 పాయింట్లు 37,233కి పడిపోయింది. ఫలితంగా దాదాపు రూ. 2.61 లక్షల కోట్ల బిఎస్ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) తుడిచిపెట్టుకుపోయింది. అటు డాలరుమారకంలో రూపాయి 82.58 వద్ద నెగిటివ్గా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: తేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాలతో ముగింపు
Today stockmarket closing: దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 66,508 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 94 పాయింట్ల లాభంతో 19,740 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్ర, టాటా స్టీల్, టీసీఎస్ సంస్థల షేర్లు లాభాలను అందుకోగా కోటక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.. -
సాక్షి మనీ మంత్రా: వారాంతంలో నష్టాలు
దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి తెప్పరిల్లినప్పటికీ వారాంతంలో నష్టాలలోనే ముగిసాయి. మిశ్రమ గ్లోబల్ సూచనల మధ్య, సూచీలు ఆగస్టు సిరీస్ను ప్రతికూల నోట్తో ప్రారంభించాయి. ఐటీ బ్యాంకింగ్ , ఆయిల్ & గ్యాస్ పేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. పవర్ , రియాల్టీ పేర్లలో చివరి గంట కొనుగోళ్లతో మార్కెట్ నష్టాలు చాలా వరకు పరిమితమైనాయి. చివరికి (జూలై 28) వరుసగా రెండో సెషన్లో నష్టాలతోనే ముగిసాయి సెన్సెక్స్ 106.62 పాయింట్లు లేదా 0.16 శాతం క్షీణించి 66,160 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు లేదా 0.07 శాతం క్షీణించి 19,64 ముగిసాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బిపిసిఎల్, టాటా మోటార్స్ మరియు హెచ్సిఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్గా ఉండగా, ఎన్టిపిసి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ , ఎం అండ్ ఎం టాప్ గెయినర్లుగా ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్బుకింగ్, 440 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ మిడ్సెషన్నుంచి ప్రాఫిట్ బుకింగ్తో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫెడ్ నిర్ణయం, జూలై సిరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల గడువు ఈరోజున ముగియనుండటంతో దాదాపు అన్ని రంగాలు రెడ్లోకి జారుకోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆటో, ఆయిల్ & గ్యాస్, మెటల్, ఎఫ్ఎంసిజి పేర్లలో అమ్మకాల ప్రభావితం చేశాయి. అయితే ఫార్మా ఇండెక్స్ 3 శాతం, రియల్టీ ఇండెక్స్ 2 శాతం పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 440.38 పాయింట్లు లేదా 0.66 శాతం క్షీణించి 66,267 వద్ద, నిఫ్టీ 118.40 పాయింట్లు లేదా 0.60 శాతం క్షీణించి 19,660 వద్ద ముగిసాయి. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి నిఫ్టీ టాప్ లూజర్స్లో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిప్లా, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్ ,భారతీ ఎయిర్టెల్ లాభపడ్డాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: మూడు రోజుల నష్టాలకు చెక్, సరికొత్త రికార్డు
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. మూడు రోజుల వరుస నష్టాలనుచెక్ చెప్పిన దలాల్ స్ట్రీట్ భారీ లాభాలతో కొత్త రికార్డులను తాకింది. ఆరంభంలో నష్టాలను చేసిన సూచీలు చివర్లో బాగా పుంజుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, FMCG, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఫార్మా, ఐటీ షేర్లు నష్ట పోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 19750కి ఎగువన ముగిసింది. సరికొత్త ఆల్-టైమ్ హై జూలై 26న ఈక్విటీ బెంచ్మార్క్లు సరికొత్త ఆల్-టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 351 పాయింట్లుఎగిసి 66,707 నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,979 వద్ద ముగిశాయి. దాదాపు 1,718 షేర్లు పురోగమించగా, 1,574 క్షీణించాయి. టాటా మెటార్స్, వొడాఫోన్ఇండియా, లార్సెన్, ఐటీసీ, బ్రిటానియీ, రిలయన్స్,సన్ఫార్మ టాప్ గెయినర్స్గా నిలవగా, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ ఎం,టెక్ మహీంద్ర, అపోలో భారీగా నష్టపోయాయి. రూపాయి: మంగళవారం నాటి ముగింపు 81.87తో పోలిస్తే భారత రూపాయి డాలర్ మారకంలో 13 పైసలు తగ్గి 82 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా : రోజంతా ఒడిదుడుకులు, చివరికి మిశ్రమంగా ముగిసిన మార్కెట్
Today Stock Market Closing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్ నోట్తో ముగిశాయి. ఆరంభం నుంచి లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్ ముగింపులో మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 29 పాయింట్లు క్షీణించి 66,356 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 19,681 వద్ద స్థిరపడ్డాయి. దీంతో నిఫ్టీ 19700 దిగువకు చేరింది. సెక్టార్ల పరంగా మెటల్ పవర్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరగగా, పీఎస్యూ బ్యాంక్, క్యాపిటల్, FMCG , రియల్టీ 0.5-1 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, జెఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎన్టిపిసి ,అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లు కాగా, నష్టపోయిన వాటిలో ఏషియన్ పెయింట్స్, ఐటిసి, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ , లార్సెన్ అండ్ టూబ్రో ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 81.82తో పోలిస్తే డాలర్తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా తగ్గి 81.87 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతో ముగిసిన సూచీలు.. రిలయన్స్, ఐటీసీ షేర్లు పతనం
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 299 పాయింట్లు నష్టపోయి 66,384 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 19,672 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలాగే టెక్ మహీంద్ర, బ్రిటానియా వంటి కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్రా: ప్రాఫిట్బుకింగ్, కుప్పకూలిన స్టాక్మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలనుమూట గట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ప్రతికూల సంకేతాలు, రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతోపాటు, ఐటీ షేర్లు ప్రధానంగా ఇన్ఫోసిస్ , అలాగే రిలయన్స్ హెవీ వెయిట్ స్టాక్స్ నష్టాలను బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలను ప్రభావితం చేసింది. సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లు కుప్పకూలింది. ఇటీవల మార్కెట్ భారీగా ఎగిసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ మార్చి 24 నాటి 57,527 తో పోలిస్తే 67,500 వేలకు ఎగువన ఏకంగా 10వేల పాయింట్లు ఎగిసింది. ఒక్క ఆయిల్ రంగ షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లలోను అమ్మకాలు వెల్లువెత్తాయి చివరికి సెన్సెక్స్ 888 పాయింట్ల పతనమై 66,684 వద్ద 234 కుప్పకూలిన నిఫ్టీ 19,745 వద్ద ముగిసింది. అలా నిఫ్టీ 19800 దిగువన ముగిసింది. లార్సెన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, బీపీసీఎల్ లాభపడగా, ఇన్ఫోసిస్, టెక్మహీంద్ర, హెచ్సీఎల్టెక్, హెచ్యూఎల్, రిలయన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అదరగొట్టిన రిలయన్స్ మరోవైపు రిలయన్స్ నికర లాభం 100 శాతం పెరిగి రూ.281.7 లక్షలకు చేరుకుంది.గత ఏడాది రూ. 1,832 కోట్లతో పోలిస్తే ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ. 2,062.66 లక్షలుగా నమోదైంది. రూపాయి: గత ముగింపు 81.99తో పోలిస్తే డాలర్ మారకంలో భారత కరెన్సీ రూపాయి స్వల్పంగా పెరిగి 81.95 వద్ద ముగిసింది -
సాక్షి మనీ మంత్రా : రికార్డు స్థాయిలో మార్కెట్ దూకుడు..తగ్గేదేలే!
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తగ్గేదెలే అన్నట్టు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 474.46 పాయింట్లు లేదా 0.71శాతం లాభంతో 67,572 వద్ద, నిఫ్టీ 146.00 పాయింట్లు లేదా 0.74శాతం ఎగిసి 19,979.20 ముగిసింది. వరుస రికార్డులతో దూసుకుపోతున్న సూచీలు గురువారం కూడా రెండూ ఆల్ టైం హైని నమోదు చేయడమే కాదు, రికార్డ్ క్లోజింగ్ వద్ద స్థిరపడ్డాయి. అలాగే ఎనలిస్టుల అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 20వేల దిశగా పరుగులు తీస్తోంది. సెక్టార్లలో, ఎఫ్ఎంసిజి, బ్యాంక్ ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.8 శాతం, పవర్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. ఐటీసీ, కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, డా. రెడ్డీస్, సిప్లా టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు రిలయన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్ , బజాజ్ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10 పైసలు ఎగిసి 81.99 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో కొనసాగుతున్న బుల్ జోరు
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలు మరింత ఎగిసిన సె న్సెక్స్, నిఫ్టీ మరో ఆల్ టైం రికార్డు స్థాయిలను తాకాయి. సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగిసి 67,094 వద్ద, నిఫ్టీ పాయింట్లు ఎగిసి 19846 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిసాయి. విదేశీ నిధుల ప్రవాహం, యూఎస్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు ఆరంభంలోనే ఉత్సాహంగా ఉన్నాయి. అలాగే ఇండెక్స్ మేజర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ , హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు జోష్నిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 67 వేలకు ఎగువన, నిఫ్టీ కూడా రికార్డ్ క్లోజింగ్ను నమోదు చేసింది. నిఫ్టీ 19,850 సమీపంలో ముగిసింది. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, టాప్ ఇండెక్స్ గెయినర్లుగా . మరోవైపు హిందాల్కో, బజాజ్ఆటో, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, హీరో మోటో టాప్ లూజర్లుగా ఉన్నాయి. రూపాయి: గత ముగింపు 82.04తో పోలిస్తే బుధవారం డాలర్కు రూపాయి స్వల్పంగా తగ్గి 82.09 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
దలాల్ స్ట్రీట్లో బుల్ రన్, సరికొత్త రికార్డులు నమోదు
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభంలోనే సరికత్త రికార్డుస్థాయిలను తాకాయి.వాల్ స్ట్రీట్ లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. చరిత్రలో తొలిసారి 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 67వేల స్టాయిని తాకింది. నిఫ్టీ 19,800 స్థాయిని అధిగమించి సరికొత్త ఆల్-టైమ్ శిఖరాలకు చేరుకుంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు లాభపడగా, మెటల్ షేర్లు బాగా నష్టపోయాయి. రికార్డ్ స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 205 పాయింట్ల లాభంతో 66,795 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఫ్టాట్గా మారిన నిఫ్టీ చివర్లోపుంజుకుని 38 పాయింట్లు ఎగిసి 19,749 వద్ద ముగిసింది. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. 2 బిలియన్ల డాలర్ల డీల్ కారణంగా ఇన్ఫోసిస్ షేరు టాప్ గెయినర్గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, రిలయన్స్, హీరో మోటోకార్ప్ ఎ క్కువగా లాభపడగా, ఫలితాల నేపథ్యంలో ఎల్టీఐ మైండ్ ట్రీ భారీగా నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి రూపాయి: మంగళవారం నాడు డాలర్తో రూపాయి 82.04 వద్ద స్థిరంగా ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్రా: లాభాల ప్రారంభం, రికార్డ్ స్థాయికి దలాల్ స్ట్రీట్
Today Stock Market: దేశీయ స్టాక్మార్కెట్లు ఈ వారం ఆరంభంలో లాభాలతొ మొదలైనాయి. కానీ గ్లోబల్ సంకేతాలతో సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో 66091 నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 19590 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందనే అంచనాలతో ట్రేడర్ల అప్రమత్తంగా వ్యవహరించే చాన్స్ ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభాలతో, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. అయితే ఫలితాలు, నిపుణుల వ్యాఖ్యలు నిరాశాజనకంగా ఉనప్పటికీ ఐటీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. ఈ నెలలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం ఎగిసింది. టీసీఎస్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్, ఎల్టీఐ మైండ్ట్రీ ఎక్కువగా లాభ పడుతుండగా హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిట్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, నష్టపోతున్నాయి. దీనికి తోడు మరిన్ని కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. హెచ్డీఎఫ్సీ, ఎల్టీఐ మైండ్ట్రీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా నిఫ్టీ 50, సెన్సెక్స్లు శుక్రవారం రికార్డు స్థాయిలో ముగిసిన సంగతి తెలిసిందే.. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: ఐటీ జోరు, రికార్డుల హోరు
Today Market Closing: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిసాయి.రోజంతా పాజిటివ్గా కదలాడిన సూచీలు వారాంతంలో కూడా రికార్డు స్థాయిలను టచ్ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 502 పాయింట్లు ఎగిసి 66,061 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 19,564 వద్ద స్థిరపడ్డాయి. విశేషాలు ♦ గత రికార్డు గరిష్ట స్థాయి 19,567ను అధిగమించిన నిఫ్టీ 19,570 వద్ద సరికొత్త రికార్డును తాకింది ♦ సెన్సెక్స్ 66159.79 రికార్డు స్థాయిని టచ్ చేసింది ♦ ముఖ్యంగా ఐటీ ఇండెక్స్ ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ♦ గత రెండు సెషన్లలో దాదాపు 2,000 పాయింట్లు లాభపడింది ♦ టీసీఎస్, టెక్ మహీంద్ర ఇన్ఫోసిస్, ఎల్టీఐమైండ్ట్రీ, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్స్ ♦ హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, డా.రెడ్డీస్, టైటన్, రిలయన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. గత ముగింపు 82.07తో పోలిస్తే డాలర్కు రూపాయి 10 పైసలు తగ్గి 82.17 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయినుంచి వెనక్కి, ఐటీ జోరు
దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే దేశీయ ద్రవ్యోల్బణం ఆందోళన కుదుట పడిన నేపథ్యంలో ఆరంభంలో భారీగా ఎగిసింది. ఫలితంగా ఆల్ టైం గరిష్టానికి చేరిన సూచీలు డే హై నుంచి వెనక్కి తగ్గాయి. లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 165 పాయింట్ల లాభానికి పరిమితమై 65,559 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో పెరిగి 19,414 వద్ద ముగిసింది. ప్రధానంగా ఐటీ, రియల్టీ షేర్లు మార్కెట్ లాభాలను నిలబెట్టాయి. ఫలితంగా నిఫ్టీ 19400 ఎగువన, సెన్సెక్స్ 65500 కి ఎగువన స్థిరపడడటం విశేషం. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఎల్టిఐఎండ్ట్రీ, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్గా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, బిపిసిఎల్, యుపిఎల్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, హెల్త్కేర్, ఆయిల్ & గ్యాస్, పవర్ రంగాలలో అమ్మకాలు కనిపించగా, బ్యాంక్, మెటల్, రియాల్టీ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేర్లలో బైయింగ్ కనిపించింది. విశేషాలు - సెన్సెక్స్ తొలిసారిగా చారిత్రాత్మక 66,000 మార్క్ను అధిగమించింది. - సెన్సెక్స్ డే హై నుంచి 600 పాయింట్లు పతనమైంది - 19567 పాయింట్ల వద్ద నిఫ్టీ ఆల్ టైం హై - నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి, ఒక దశలో 19,400 దిగువకు జారిపోయింది. చివరికి ఈ స్థాయిని నిలబెట్టుకుంది. - నిఫ్టీ బ్యాంక్ రోజు గరిష్టం నుండి 400 పాయింట్లకు పైగా క్షీణించింది. రూపాయి రూపాయి మార్కెట్ల మద్దతుతో ఆరంభంలో 21పైసలు ఎగిసింది. చివరికి గత ముగింపు 82.24తో పోలిస్తే డాలర్ మారకంలో రూపాయి 17 పైసలు పెరిగి 82.07 వద్ద ముగిసింది. Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు -
సాక్షి మనీ మంత్రా: నష్టాల ముగింపు, జీఎస్టీ సెగ, డెల్టా కార్ప్ ఢమాల్!
దేశీయ స్టాక్మార్కెట్లు వరుస లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు లాభాల స్వీకరణతో ఫ్లాట్గా మారాయి. ఆ తరువాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 65394 వద్ద,నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 19384 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19400దిగువకు చేరింది. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐషర్ మోటార్స్,సన్ఫార్మా టాప్ విన్నర్స్గా నిలిచాయి. మరోవైపు ఎల్టిఐఎండ్ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, హెచ్సీఎల్ నష్టపోయాయి. జీఎస్టీ పెంపు: కుప్పకూలిన డెల్టా కార్ప్ మరోవైపు క్యాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్ లిమిటెడ్ ఏకంగా 25 శాతం కుప్పకూలింది. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కాసినోలపై జీఎస్టీ 18-28 శాతానికిపెంచడంతో25 లోయర్ సర్క్యూట్లో లాక్ అయింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. రికార్డులో స్టాక్కి ఇదే అతిపెద్ద సింగిల్ డే డ్రాప్ కూడా. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1,600 కోట్లు నష్టపోయింది. ఈ క్షీణత దాని మొత్తం ఆర్థిక సంవత్సరం 2023 ఆదాయం రూ.1,021 కోట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం. అటు మంగళవారం నాటి ముగింపు 82.36తో పోలిస్తే బుధవారం డాలర్తో రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: పీఎస్యూ బ్యాంకింగ్,మెటల్ బలహీనం
దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. కన్సాలిడేషన్ టోన్కు కొనసాగింపుగా, రోజంతా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభ నష్టాల మధ్య కదులాడుతూ నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. చివర్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరికి సెన్సెక్స్ 274 పాయింట్లు ఎగిసి 65,617 వద్ద,నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 19,448వద్ద ముగిసాయి. మెటల్ , PSU బ్యాంకులు మినహా అన్ని రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి. ఆటో, పవర్, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్,హెల్త్కేర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి సన్ఫార్మా, ఐషర్మోటార్స్, అపోలో హాస్పిటల్స్ , టాటా కన్జ్యూమర్, మారుతి టాప్ గెయినర్స్గా నిలవగా, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్సీఎల్ టెక్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభాలతో ముగిసింది. సోమవారం నాటి ముగింపు 82.57తో పోలిస్తే డాలర్కు రూపాయి 21 పైసలు పెరిగి 82.36 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: లాభాల ముగింపు: అదరగొట్టిన రిలయన్స్
దేశీయ స్టాక్మార్కెట్లు పాజిటివ్గా ముగిసాయి.సెన్సెక్స్ 64 పాయింట్లు ఎగిసి 65344 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 19355 వద్ద స్థిర పడ్డాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్ రెండు రంగాలు మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్ఎమ్సిజి, కన్స్యూమర్ డ్యూరబుల్ , ఆటో , ఐటీ నష్ట పోయాయి. రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్,భారతి ఎ యిర్టెల్ టాప్ గెయినర్స్, హెచ్సీఎల్ టెక్, టైటన్, పవర్ గ్రిడ్, టీసీఎస్, నెస్లే టాప్ లూజర్స్గా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతిపెద్ద సంస్థ తన ఆర్థిక సేవల డీమెర్జ్ వార్తలతో భారీగా లాభపడింది. మూడు నెలల్లో లేనంత అత్యధికంగా లాభపడింది. వరుస లాభాలతో రిలయన్స్ మార్కెట్ క్యాప్లో రూ. 70వేల కోట్లు వచ్చి చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: మీ డబ్బుకు మరింత వాల్యూ పెంచుకోండిలా!
చాలా మంది ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు సంపాదించిన దాంట్లో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఎలా ఖర్చుపెట్టాలి? లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలని సతమతమవుతూ ఉంటారు. మీ డబ్బుకు మరింత విలువను పెంచుకోవాలనుకునే వారి కోసం ఈ రోజు సాక్షి మంత్రా కొన్ని టిప్స్ వెల్లడించింది. నిజానికి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాక లోన్స్, బిల్స్ చెల్లించడం వంటివి చేస్తారు. అలా చేసిన తరువాత మిగిలిన డబ్బును ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. మీకు కావలసినదాని మీద లేదా అవసరమైనదాని మీద ఖర్చు పెట్టడం మంచిదే. అయితే తప్పకుండా కొంతవరకు సేవ్ చేయడం అవసరం. అయితే మీరు సేవ్ చేసిన డబ్బుకు మరింత విలువ పెంచుకోవాలనుకుంటే పెట్టుబడి పెట్టడం ఉత్తమం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా మా బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావు' మాటల్లో తెలుసుకోవచ్చు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: కొత్త ఇన్వెస్టర్లకు సానుకూలమేనా?
కొన్ని రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళుతూ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన దేశీయ సూచీలు వారంతంలో నష్టాలు చవిచూశాయి. అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీ మార్కెట్లు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నప్పటీకి దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బాటలోనే నడిచాయి. ముఖ్యంగా దేశంలో తయారీ రంగం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆ రంగంపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ వారంలో దేశీయ స్టాక్మార్కెట్లో పరిణామాలు, లాభాలు అందుకున్న స్టాక్లు, వివిధ రంగాల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది.. తదితర అంశాలను అషికా బ్రోకింగ్ సంస్థకు చెందిన కౌశిక్ మోహన్తో కలిసి సాక్షి బిజినెస్ కరెస్పాండెంట్ కారుణ్య రావు విశ్లేషించారు. ఇప్పటికే ఉన్న మదుపర్లతోపాటు కొత్త ఇన్వెస్టర్లకు తమ సూచనలు అందించారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: వరుస లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాల్లో ముగిసాయి. తద్వారా ఎనిమిది రోజుల వరుస లాభాలకు చెక్ చెప్పింది. సెన్సెక్స్ 505 పాయింట్లు కుప్పకూలి 65,280 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు నష్టంతో 19,332 వద్ద ముగిసాయి. దీంతో నిఫ్టీ కీలకమైన 19350 మార్క్ దిగువకు చేరింది. టాటా మోటార్స్, టైటన్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్ టాప్ గెయినర్స్గా, అదానీ పోర్ట్స్, పవర్గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బ్రిటానియా టాప్ లూజర్స్గానూ నిలిచాయి. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్లో రికార్డుల మోత
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ కొనసాగుతున్న ర్యాలీని నిలబెట్టుకున్నాయి. మిడ్ అండ్ స్మాల్-క్యాప్ సెగ్మెంట్లు బెంచ్మార్క్ ఇండెక్స్ను అధిగమించాయి, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ కన్జ్యూమర్ స్టాక్లు సెక్టోరియల్ ర్యాలీ అయ్యాయి. మరోవైపు ఆటో, ఐటీ నష్టపోయాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు ఎగిసి 65,785 వద్ద, నిఫ్టీ 99పాయింట్లు లాభంతో 19497 వద్ద స్థిరంగా ముగిసాయి. తద్వారా మరో ఆల్ టైం రికార్డ్ హైని నమోదు చేశాయి. ఎం అండ్ఎం, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, రిలయన్స్ భారీ లాభాలతో ముగియగా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, మారుతి, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: దలాల్ స్ట్రీట్ జోరు, రికార్డు స్థాయికి సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చేశాయి. గురువారం ఉదయం సరికొత్త రికార్డు స్థాయిని నమోదు దిశగా కదులుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్నప్పటికీ తరువాత లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 65,609 వద్దస్థాయిని అధిగమించింది. నిఫ్టీ కూడా 19,450 కి చేరువలో ఉంది. రిలయన్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 65,586 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 19,435వద్ద ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, అపోలో, పవర్ గ్రిడ్, రిలయన్స్, కోల్ ఇండియా టాప్ విన్నర్స్గా కొనసాగుతుండగా, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, దివీస్లేబ్స్ , బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి 13 పైసలు కుప్పకూలి 82.36 వద్ద ఉంది. మరోసారి ఫెడ్ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే అంచనాల మధ్య డాలర్ బలం పుంజుకుంది. మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
రికార్డ్ ర్యాలీకి బ్రేక్, అదరగొట్టిన మారుతి సుజుకి
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతోనైనా పటిష్టంగానే ముగిసాయి. నిఫ్టీ 50 వరుసగా ఐదవ రోజు రికార్డు స్థాయి సెషన్ను కొనసాగించింది. 10 పాయింట్ల లాభంతో 19,398.50 వద్ద ముగియగా, సెన్సెక్స్ 33 పాయింట్లు క్షీణించి 65,446 వద్ద ముగిసింది. ప్రాఫిట్-బుకింగ్ కారణంగా గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న ర్యాలీకి బ్రేక్ పడింది. బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్ల నష్టం పోయింది. సెన్సెక్స్లో ఎంపీవీ ఇన్విక్టో లాంచ్ తరువాత మారుతీ సుజుకి షేర్లు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఫలితంగా బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (m-క్యాప్) తొలి సారిగా రూ. 3 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, నెస్లే టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐషర్ మోటార్స్, టాటా కన్జ్యూమర్, యూపీఎల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ షాక్: ఫ్లాట్గా స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.రికార్డు స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప లాభాలకు పరిమితమవుతున్నాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో 65,485 వద్ద,నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 19397 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం నష్టల్లోనూ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ ఇండెక్స్లు 0.5-1 శాతం లాభాల్లో ఉన్నాయి. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు లాభాల్లో టాప్లో ఉండగా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ,టాటా కన్జ్యూమర్, డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి. -
వరుస రికార్డులు, ఇన్వెస్టర్లకు సుమారు 2 లక్షల కోట్ల లాభాలు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు బుల్ రన్ను కొనసాగించాయి. ద్వారా మరోసారి రికార్డ్ క్లోజింగ్ను నమోదు చేశాయి. సెన్సెక్స్ 486 పాయింట్లు లేదా 0.75 శాతం లాభపడి 65,205 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 133.50 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 19,322.55 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడ్లో సెన్సెక్స్ తాజా రికార్డు గరిష్ట స్థాయి 65,300ని తాకగా, నిఫ్టీ 19,345 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. బీఎస్సీ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో 296.5 లక్షల కోట్ల నుంచి రూ.298.2 లక్షల కోట్లకు పెరిగింది. ఫలితంగా పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో రూ.1.7 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. జూన్ నెల జీఎస్టి వసూళ్లు పటిష్టంగా ఉండటంతో మార్కెట్ రికార్డు-బ్రేకింగ్కి స్థాయికి చేరిందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాలను రుతుపవనాలపై అందిన శుభవార్త కూడా పెట్టుబడిదారులకు ఉత్సాహం వచ్చింది. దీనికి తోడు బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ర్యాలీ కొనసాగుతోందని అంచనా. నిఫ్టీ పీఎస్యు బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4 శాతం , నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడింది. అలాగే మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎమ్సిజి సూచీలు ఒక్కొక్కటి ఒక్కో శాతం ఎగిసాయి. ఇక ఫార్మా ,హెల్త్కేర్ ఐటీ, ఆటో ,కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్లు వెనుకబడ్డాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ , ఐటీసీ ఒక్కొక్కటి 3 శాతానికి పైగా పెరిగింది. ఇంకా బీపీసీఎల్ బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హెచ్డిఎఫ్సి, అల్ట్రాటెక్ సిమెంట్ , ఒఎన్జిసి టాప్ విన్నర్స్ లిస్ట్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా 2 శాతం చొప్పున క్షీణించగా, సిప్లా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒక్కో శాతం చొప్పున నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా , ఎల్ అండ్టీ టాప్ లూజర్స్గా నిలిచాయి. -
రిలయన్స్ జోరు: దూసుకుపోతున్న స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సరికొత్త గరిష్టాలను రికార్డ్ చేస్తూ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. సెన్సెక్స్ 519 పాయింట్లు ఎగిసి 65,239 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 19,327 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లాభాలు మార్కెట్కు మద్దతిస్తున్నాయి. ఇదీ చదవండి: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్ అటు ఆటో రంగ షేర్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ లాభాల్లో కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా నష్టపోతున్నాయి. గ్రాసిం, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎస్బీఐ, హిందాల్కొ, విప్రో, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, యూపీఎల్ బ్రిటానియా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
దలాల్ స్ట్రీట్లో లాభాల హోరు, రికార్డు ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. ఆరంభంనుంచి లాభాలతో కళకళలాడిన సూచీలు చివరికి రికార్డు స్థాయిల వద్ద ముగిసాయి.సెన్సెక్స్ 803 పాయింట్లు ఎగబాకి 64,719 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 19,189వద్ద ముగిసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2.5 శాతం, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి. ఎంఅండ్ ఎం, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్, సన్ఫార్మ, హీరోమోటో టాప్ విన్నర్స్గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ , అదానీ ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ఆటో, దివీస్ ల్యాబ్స్ భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.03 వద్ద ఫ్లాట్గా ముగిసింది. -
జోరుగా దలాల్ స్ట్రీట్: బ్యాంకింగ్, ఐటీ టాప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లోకొనసాగుతున్నాయి. వరుసగా లాభాలను కొనసాగుతున్న సూచీలు వారాంతంలో కూడా జోష్గా ఉన్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగాఎగిసింది. నిఫ్టీ 19,100ను తాకింది. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాలు, ప్రధానంగా ఐటీ, పీఎస్యూ బ్యాంకు షేర్ల లాభాలు మార్కెట్కు మద్దతిస్తున్నాయి. సెన్సెక్స్ 460 పాయింట్ల లాభంతో 64,376 వద్ద, నిఫ్టీ 123 పాయింట్లు ఎగిసి 19,095 వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ బ్రిటానియా టాప్ లూజర్స్గా ఉండగా, ఇన్ఫోసిస్, ఎంఅండ్ ఎం, టెక్ ఎం, హీరో మోటో, ఇండస్ బ్యాంకు భారీగా లాభపడుతున్నాయి. -
సెన్సెక్స్ ఆల్-టైం రికార్డ్: ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ సూచీ సెన్సెక్స్ బుదవారం ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 63,588 వద్ద సెన్సెక్స్ రికార్డ్ స్థాయికి చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దలాల్ స్ట్రీట్లో 9 బిలియన్ల డాలర్ల బలమైన వాలెట్ను ప్రారంభించడంతో, సెన్సెక్స్ రికార్డు స్థాయిని టచ్ చేసింది. దాదాపు 137 రోజుల తరువాత ఆల్టైం హైని తాకింది. గత ఏడాది డిసెంబర్ 1న గత ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 53,523వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి 18,857 రికార్డు గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. పటిష్టంగా ఉన్నజీడీపీ ఔట్లుక్, ద్రవ్యోల్బణం తగ్గు ముఖం, విదేశీ పెట్టుబడిదారుల బలమైన కొనుగోళ్లతో సహా బలమైన ఫండమెంటల్స్ మార్కెట్లను ఆల్ టైంకి చేర్చాయని మార్కెట్ పండితుల మాట. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు సెన్సెక్స్ కొత్త శిఖరానికి చేరడంతో ఇకపై మార్కెట్ నెమ్మదిగా, స్థిరంగా సాగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. యోగాలో, బాహ్య ప్రపంచం కంటే లోపలి ప్రపంచంపైనే దృష్టి ఉంటుంది. మార్కెట్లో కూడా పెట్టుబడిదారులు ఇండెక్స్ స్థాయి కంటే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. యోగాలో, సుదీర్ఘ కాల వ్యవధిలో ప్రయోజనాలుంటాయి. మార్కెట్లో దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కోటక్ మ్యూచువల్ ఫండ్కు చెందిన నీలేష్ షా వ్యాఖ్యానించడం విశేషం. అటు నిఫ్టీ కూడా అదే స్థాయిలో ట్రేడ్ అయింది. ఫ్టాట్గా ప్రారంభమైనప్పటికీ, వెంటనే లాభాల్లోకి మళ్లాయి. కానీ తరువాత లాభాల స్వీకరణ కారణంగా సూచీలు ఫ్లాట్ జోన్లోకి మారాయి. ఫైనాన్స్, మీడియా, రియల్టీ లాభాల్లో ఉండగా, ఫార్మా, హెల్త్కేర్ సూచీలు నష్ట పోతున్నాయి. పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్ లాభాల్లో ఉండగా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, దివీస్, యాక్సిస్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ నష్ట పోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప నష్టాలతో 82.10 వద్ద కొనసాగుతోంది. (మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
స్మార్ట్ రికవరీ! లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలనుంచి కోలుకుని లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ , నిఫ్టీ మిడ్సెషన్ తరువాత కోలుకుని డే గరిష్టం వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు ఎగిసి 63,323 వద్ద, నిఫ్టీ 61పాయింట్ల లాభంతో 18,817 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ స్టాక్స్ లాభపడగా, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, రిలయన్స్ షేర్ల లాభాలు సూచీల స్మార్ట్ రికవరీకి తోడ్పడ్డాయి. టాటా మోటార్స్,హెచ్సీఎల్టెక్,పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, బజాజ్ఆటో టాప్ గెయినర్స్గా ఉండగా, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ఫార్మా, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్ నష్ట పోయాయి. అటు మిడ్క్యాప్ఇండెక్స్ వరుసగా ఏడో సెషన్లో కూడా రికార్డు హైని తాకింది. -
ప్రాఫిట్ బుకింగ్తో నష్టాలు: అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారం ఆరంభంలోనే బలహీనంగా ముగిసింది. బలహీన గ్లోబల్ సంకేతాలున్నప్పటికీ, మార్కెట్ సానుకూలంగా ప్రారంభమై, రికార్డు స్థాయిని టచ్ చేసింది. కానీ హై స్టాయిలో నిలదొక్కు కోవడంలో విఫలమైంది.ముఖ్యంగా బ్యాంకింగ్,రియల్టీ ఇతర హెవీవెయిట్ షేర్లలో ఒత్తిడి, ప్రాఫిట్ బుకింగ్తో సెన్సెక్స్ 216 పాయింట్లు లేదా 0.34 శాతం క్షీణించి 63,168, వద్ద నిఫ్టీ 70.50 పాయింట్లు లేదా 0.37 శాతం క్షీణించి 18,756 వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంక్, రియాల్టీ, పవర్, రియల్టీ,ఎఫ్ఎంసిజి నష్టపోగా, పిఎస్యు బ్యాంక్స్, ఐటీ స్వల్పంగా పెరిగాయి. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు డిఫెన్స్ షేర్లు లాభపడటం విశేషం. టాప్ లూజర్ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు సోమవారం 4 శాతం నష్టాలతో నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ లూజర్గా నిలిచింది. గత మూడు నెలలో ఇదే అతిపెద్ద నష్టం. మే 2023 తర్వాత ఇంత కనిష్ట స్థాయికి చేరడం తొలిసారి. మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.12,000 కోట్లను నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ ఎం, టీసీఎస్ లాభపడగా, కోటక్ మహీంద్ర, హీరో మోటో, యాక్సిస్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 81.94 వద్ద ఫ్లాట్గా ముగిసింది. -
భారీ లాభాలు: రికార్డ్ క్లోజింగ్, ఇన్వెస్టర్లకు పండగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో మురిపించింది. భారీ లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ రికార్డు క్లోజింగ్న నమోదు చేశాయి. ఆరంభం నుంచి ఉత్సాహంగా సూచీలు చివరి వరకూ అదే ధోరణిని కొనసాగించాయి. సెన్సెక్స్ 467 పాయింట్లు ఎగిసి 63,385, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 18,826 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు తప్ప మిగతా రంగాలు లాభాలనార్జించాయి నెస్లే ఇండియా, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, మారుతీ, హెచ్సీఎల్ షేర్లు టాప్ విన్నర్స్గా, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అటు డాలరుతోపో లిస్తే రూపాయి మారకం విలువ 81.94గా నిలిచింది. రూ. 2 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద బీఎస్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 290.7 లక్షల కోట్ల నుండి రికార్డు స్థాయిలో రూ. 292.7 లక్షల కోట్లకు పెరిగింది, ఈఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. -
మార్కెట్ బౌన్స్ బ్యాక్, ఐటీ ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి నష్టాలనుంచి బౌన్స్ బ్యాక్ అయిన సూచీలు కీలక మద్దతు స్తాయిలను అధిగమించాయి. ఐటీ తప్ప అన్ని రంగాలు, ముఖ్యంగా మెటల్, ఫార్మా, బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు తిరిగి 63 వేల మార్క్ పైకి ఎగిసింది. నిఫ్టీ 18,750 పైన బలంగా ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ఫిన్సర్వ్, డా. రె డ్డీస్, హిందాల్కో యూపీఎల్ తదితర షేర్లు లాభాల్లోనూ, బజాజ్ఆటో, టాటా కన్జ్యూమర్, విప్రో, టీసీఎస్ బీపీసీఎల్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. -
మూడు రోజుల లాభాలు పాయే: సెన్సెక్స్ పతనం, ఫార్మా జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మూడు రోజుల లాభాలకు చెక్ చెప్పాయి. ఆరంభంనుంచీ స్తబ్ధుగా ఉన్న సూచీలు చివరికి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమై 62,922వద్ద, 72 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,684 వద్ద 18,700 మార్క్ దిగువన ముగిసింది. సెక్టార్లలో, బ్యాంకింగ్ , రియల్టీ సూచీలు దాదాపు 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. మేజర్గా ఫార్మా ఇండెక్స్ 1.4 శాతం ఎఫ్ఎంసిజి 0.5 పెరిగాయి. అపోలో హాస్పిటల్స్ ,దివీస్ , రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్ టాప్ విన్నర్స్గా నిలిచాయి.అలాగే హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు, విపప్రో, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 14పైసలు నష్టపోయి 82.19 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ అప్డేట్స్, బిజినెస్ వార్తల కోసం చదవండి : సాక్షి బిజినెస్ -
మెటల్స్ షైన్, మూడో రోజు లాభాల్లో,రికార్డు స్థాయికి దగ్గర్లో
సాక్షి ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లోముగిసాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయంప ఎదురు చూస్తున్న క్రమంలో ఇన్వెస్టర్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 85.35 పాయింట్ల లాభపడి 63,229 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 18,756 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు బ్యాంకింగ్, మీడియాలో షేర్లు నష్టపోయాయి టాటా కన్యూమర్స్ ప్రొడక్ట్స్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటామోటార్స్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ టాప్ విన్సర్స్గానూ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ టూప్లూజర్స్గానూ నిలిచాయి. అటు డాలరుమారకంలో భారత కరెన్సీ రూపాయి 27 పైసలు బలపడి 82.11 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!
ఉలి దెబ్బలు తింటేనే.. శిల శిల్పంగా మారుతుంది. నిప్పుల కొలిమిలో కాలితేనే ఇనుము కరిగేది. దాదాపు మనిషి జీవితం కూడా అంతే.. కష్టాల కడిలిని ఈదితేనే...జీవితంలో పైకి రావాలనే కసి పట్టుదల పెరుగుతుంది. మనసు పెడితే... దానికి సంకల్పం తోడైతే కాలం కూడా కలిసి వస్తుంది. విజయం దాసోహమంటుంది. దాదాపు ఇపుడు మనం చదవబోయే కూడా అలాంటిదే. ఒకపుడు బిడ్డకు పాలుకొనడానికి 14 రూపాయలకు వెతుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. మరిపుడు 800కోట్లకు అధిపతి. ప్రముఖ పెట్టుబడిదారుడు విజయ్ కేడియా సక్సెస్ స్టోరీ చూద్దాం రండి..! కోల్కతాకు విజయ్ కేడియా ఐఐటీ, ఐఐఎం లాంటి ఫ్యాన్సీ డిగ్రీలేమీ లేవు. ఉన్నదల్లా స్మార్ట్ బ్రెయిన్ జీవితంలో ఎదగాలనే సంకల్పం. మార్కెట్పై లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిలియనీర్గా అవతరించాడు. విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్. 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చని పోయాడు. తండ్రిని కోల్పోయిన షాక్తో 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. దీనికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. వెంటనే ఒక బిడ్డ కూడా పుట్టింది. అలా ఒక్కో బాధ్యత, అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కష్టాల్లోకి నెట్టేసింది. కుటుంబం గడవడానికి తల్లి బంగారు ఆభరణాలను అమ్ముకున్నారు. కానీ అది మాత్రం ఎన్నాళ్లు ఆదుకుంటుంది. కనీసం కుమారుడికి పాలు కొనేందుకు రూ.14 కూడా లేక ఇబ్బందులు పట్టాడు. ఏదో ఒకవిధంగా ఒక్కో పైసా వెతికి అతని భార్య బిడ్డకు పాలు పట్టేది ఇది చూసి చలించిపోయిన విజయ్ కేడీ. కోల్కతా వదిలి ముంబైకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తండ్రి ఇచ్చిన వారసత్వ నేపథ్యం, పరిస్థితులతో షేర్ మార్కెట్లో మెల్లిగా పెట్టుబడులు పెట్టాడు. బుర్రకు పదును బెట్టి, మార్కెట్ను స్టడీ చేశాడు. దలాల్ స్ట్రీట్లో బుల్లిష్రన్ కారణంగా 1992లో అదృష్టం కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలకషేర్లలో పెట్టుబడల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) ఆ తర్వాత ముంబైలో ఇల్లు కొని కోల్కతా నుంచి తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. అయితే షేర్ మార్కెట్ పెట్టుబడులు అంటే వైకుంఠపాళి. నిచ్చెనలూ ఉంటాయి, కాటేసే పాములూ ఉంటాయి. అచ్చం ఇలాగే మళ్లీ మార్కెట్ కుప్పకూలడంతో సర్వం కోల్పోయాడు. అయినా ధైర్యం కోల్పో లేదు. 2002-2003లో మార్కెట్ మరో బుల్లిష్ రన్. చక్కటి పోర్ట్ఫోలియోతో లాభాలను ఆర్జించాడు. ఫలితంగా విజయ్ నికర విలువ ఇప్పుడు రూ. 800 కోట్లకు చేరుకుంది. దేశంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడిదారులలో ఒకడిగా నిలిచాడు. కేడియా సెక్యూరిటీస్ అనే కంపెనీని ప్రారంభించి కోటీశ్వరుడిగా రాణిస్తున్నాడు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) పెట్టుబడి ప్రపంచంలో విజయ్ కేడియాది ప్రతిష్టాత్మకమైన పేరు. అనేక ఆటుపోట్లతోనిండి వున్న విజయ్ జర్నీ ఇన్వెస్టింగ్ కెరీర్లో విజయం సాధించాలని ఆలోచిస్తున్న వారికి ఆయన స్ఫూర్తి. స్టాక్ మార్కెట్లో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. ఓపిక ముఖ్యం. అలాగే మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు రిస్క్ తీసుకునే ధైర్యం,సామర్థ్యం ఉండి తీరాలి. నోట్: ముందే చెప్పినట్టుగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు అంటే అంత ఆషామాషీ కాదు. సరియైన అవగాహన, లోతైన పరిజ్ఞానం చాలా అవసరం. -
లాభాల జోరు: ఎంఆర్ఎఫ్ రికార్డ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభంనుంచీ లాభాల్లో కొనసాగిన సూచీలు చివరి వరకు అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ప్రధానంగా రియల్టీషేర్లు లాభాలు మార్కెట్కు ఊతమిచ్చాయి. 418 పాయింట్లు లాభంతో 63,143వద్ద 119 పాయింట్ల లాభంతో నిఫ్టీ 18,720 వద్ద ముగిసాయి. దాదాపు టాటా కన్జ్యూమర్స్, టైటన్, సిప్లా, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడగా, కోటక్ మ హీంద్ర, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రూపాయి 8 పైసలు పెరిగింది. ఏప్రిల్ 2023లో 4.7శాతంగా సీపీఐ ద్రవ్యోల్బణం మే 2023లో 4.25శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. విశేషం ఏమిటంటే , ఎంఆర్ఆఫ్ రికార్డ్ ప్రఖ్యాత రబ్బరు టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ మరోసారి ఆకాశానికి దూసుకుపోయింది. ఎంఆర్ఎఫ్ షేరు తొలిసారి లక్ష మార్క్ను టచ్ చేసింది. అంతేకాదు రానున్న కాలంలో షేర్ ధర రూ.1.47 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్గా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, మార్కెట్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
నష్టాల్లో ముగిసిన మార్కెట్, బ్యాంకు, ఐటీ షేర్ల దెబ్బ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్న సూచీలు తొలి రెండు గంటలపాటు గ్రీన్లో కొనసాగాయి. కానీ మిడ్ సెషన్నుంచి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 223.01 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 62,625.63 వద్ద ముగిసింది.అలాగే నిఫ్టీ 71.10 పాయింట్లు లేదా 0.38 శాతం క్షీణించి 18,563.40 వద్ద స్థిరపడింది. క్యాపిటల్ గూడ్స్ లాభపడగా,బ్యాంకు, ఐటీ, మెటల్ , ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లునష్టపోయాయి. ఇండస్ ఇండ్, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, అదానీ లాభపడగా, హీరోమోటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ, దివీస్, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. గత ముగింపు 82.57తో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి 11 పైసలు పెరిగి 82.46 వద్ద ముగిసింది. -
కొనుగోళ్ల జోరు: సింగిల్ డేలో రూ. 2.4 లక్షల కోట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. దాదాపు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లు కనిపించాయి. ఆరంభంలో 125 పాయింట్ల లాభంతో ఎగిసిన సెన్సెక్స్ చివరికి 350 పాయింట్లు లేదా 0.56 శాతం ఎగిసి 63,143 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభంతో 18,726 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 63వేలకు ఎగువన, నిఫ్టీ 18,700కి ఎగువన బలమైన నోట్తో ముగిశాయి. అంతర్జాతీ సంకేతాలకు తోడు, ఆర్బీఐ రానున్న పాలసీ రివ్యూలో వడ్డీరేటు పెంపు ఉండదనే అంచనాల మధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బిపిసిఎల్, నెస్లే ఇండియా మరియు హెచ్డిఎఫ్సి లైఫ్ అత్యధికంగా లాభపడగా, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం మారుతీ సుజుకీ నష్టపోయాయి. బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లో రూ. 286.6 లక్షల కోట్ల నుండి రూ. 289 లక్షల కోట్లకు పెరిగింది, పెట్టుబడిదారులు ఒకే రోజులో రూ 2.4 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం ) -
ఫ్లాట్ ముగింపు, ఐటీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది. ఫ్లాట్ ఆరంభంనుంచి బలహీనమైన అంతర్జాతీయ ప్రతికేల సంకేతాలతో ప్రధాన సూచీలు మందకొడిగా కొనసాగాయి. మిడ్సెషన్లో భారీగా నష్టపోయింది. చివరి 30 నిమిషాల్లో కొనుగోళ్లతో నష్టాలనుంచి తేరుకుంది. స్వల్ప లాభాలకు పరిమితమైనా కీలక మద్దతుస్థాయిలకుపైన ముగసింది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) 5 పాయింట్ల లాభంతో 62,793 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 18599 వద్ద ముగిసింది. ఆటో, బ్యాంకు రంగ షేర్లు లాభపడగా ఐటీ అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్కు దారితీసింది. అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టైటన్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి. అటు డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 29 పైసలు పతనమై 82.68 దగ్గర నిలిచింది. -
మార్కెట్ దూకుడు: 63 వేల మార్క్కు చేరువలో సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 363 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 63 వేల మార్క్ వైపు సాగు తుండగా, నిఫ్టీ 98 పాయింట్లు ఎగిసి 18632 వద్ద కొనసాగుతోంది. బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, గ్రాసిం, లార్సెన్ భారీగా లాభపడుతుండగా, దివీస్, ఏసియన్ పె యింట్స్, బీపీసీఎల్, టెక్ మహీంద్ర, హెచ్యూఎల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరిన్ని మార్కెట్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ ఇదీ చదవండి: మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్ -
నష్టాలకు చెక్, వారాంతంలో లాభాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు లాభాలతో కీలక మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 62,547 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 18,534 వద్ద స్థిరపడింది. హిందాల్కో, హీరో మోటో కార్ప్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ విన్నర్స్గా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్,హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 12పైసలు ఎగిసి 82.30 వద్ద ముగిసింది. -
ఊగిసలాడుతున్న స్టాక్మార్కెట్, అదానీ షేర్లకు ఉత్సాహం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. కానీ కొద్దిసేపటికే అమ్మకాల వెల్లువతో 200 పాయింట్ల లాభంతో ఆరంభంమైన సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. 62422 వద్ద, నిఫ్టీ 19490 వద్ద ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. హీరోమోటోకార్ప్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటాస్టీల్, టెక్ మహీంద్ర బాగా లాభపడుతుండగా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, సిప్లా టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. హుషారుగా అదానీ గ్రూపు షేర్లు ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ నుండి అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సెక్యూరిటీలను తొలగించిన తర్వాత శుక్రవారం ట్రేడింగ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ దాదాపు 2 శాతం పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ను మే 24న స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్వర్క్ కింద ఉంచిన సంగతి తెలిసిందే. అదానీ పోర్ట్స్ కూడా స్వల్పంగా లాభపడుతోంది. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 82.32 వద్ద కొనసాగుతోంది. -
నాలుగు రోజుల రన్కు బ్రేక్: మార్కెట్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుస లాభాలకారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకుదిగడంతో భారీ నష్టాలనుమూటగట్టుకుంది. సె న్సెక్స్ 347 కుప్పకూలి 62622 వద్ద 99 పాయింట్ల నష్టంతో 18534 వద్ద నిఫ్టీ 18550 దిగువకుచేరింది. మిడ్ స్మాల్ క్యాప్ భారీగా నష్టపోయాయి. ఐటీ, రియల్టీ, హెల్త్కేర్ తప్ప అన్ని రంగాలషేర్లు నష్టాల్లోనే మగిసాయి. భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, బ్రిటానియా, సన్ఫార్మ టాప్ విన్నర్స్గా , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్ , హెచ్డీఎఫ్సీ బాగా నష్టపోయాయి. -
భారీ లాభాల్లో దలాల్ స్ట్రీట్, లక్షల కోట్లు పెరిగిన సంపద
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 629 పాయింట్లుఎగిసి 62501 వద్ద ముగియగా, నిఫ్టీ 178 పాయింట్లు ఎగిసి 18499 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. దీంతో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్ల సంపద 2. లక్షల కోట్లు పెరిగింది. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్) ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకులు, ఫైనాన్షియల్స్, ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.ప్రధానంగా రిలయన్స్, సన్ఫార్మా, హిందాల్కో, దివీస్, హెచ్యూఎల్ లాభపడగా, ఓఎన్జీసీ, గ్రాసిం, బజాజ్ఆటో, భారతి ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) హైలైట్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలతో నిఫ్టీ శుక్రవారం 2023 ఏడాది తొలిసారి 18,500 మార్క్ను దాటింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.24 లక్షల కోట్లు పెరిగి రూ.282.57 లక్షల కోట్లకు చేరుకుంది. సన్ ఫార్మా శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,984.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 2,277.25 కోట్ల నష్టం నమోదు చేయడం గమనార్హం నిఫ్టీ ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 50,000 మార్క్ను అధిగమించి రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
నష్టాల్లో సూచీలు: అదానీ , బ్యాంకింగ్ షేర్ల దెబ్బ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రతికూల ప్రపంచ సూచనల మధ్య సెన్సెక్స్ ఆరంభంలో 200 పాయింట్లకుపైగా కుప్పకూలింది. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్ల లాభాలతో నష్టాలనుంచి తెప్పరిల్లాయి. కానీ ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అటు అదానీ గ్రూపు షేర్లలో లాభాల బుకింగ్ కనిపిస్తోంది. దీంతో బనిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 18306 వద్ద, 121 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 61864 వద్ద కొనసాగుతున్నాయి. సన్ ఫార్మా, టైటన్, డా.రెడ్డీస్, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్లు ఉండగా, కాఅదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. అటు ఎస్బీఐ,ఐసీఐసీఐ, పీఎన్బీ తదితర బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. -
StockMarketToday: భారీ లాభాల్లో సూచీలు, అదానీ షేర్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు ఎగిసి 62221 వద్ద, నిఫ్టీ పాయింట్ల 77 లాభంతో 18417 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాకింగ్, ఆయిల్ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. (చదవండి: సాక్షిబిజినెస్) అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్ తదితర గ్రూపు షేర్లన్నీ లాభాల్లో జోరుగా ఉన్నాయి. ఇంకా బీపీసీఎల్ , బ్రిటానియా, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా ఉండగా, అపోలో హాస్పిటల్స్, టైటన్, కోటక్ మహీంద్ర, సిప్లా, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. ఇదీ చదవండి : రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు -
Today Market Closing ఐటీ,అదానీ షేర్ల జోష్, వారాంతంలో సెన్సెక్స్ దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో హుషారుగా ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు ఆ తర్వాత పుంజుకున్నాయి. ప్రధానంగా హిండెన్బర్గ్ అదానీ గ్రూపు వివాదంలో సుప్రీం తీర్పు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపర్చింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.దీనికి తోడు ఐటీషేర్లలో ర్యాలీ ఊతమిచ్చింది. ఫార్మా రంగ షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్ 298 పాయింట్ల లాభంతో 61730 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 18203 వద్ద ముగిసాయి. అదానీ కేసులో సుప్రీంకోర్టు నియమించిన ఆరుగురు సభ్యుల ప్రత్యేక ప్యానెల్ ప్రస్తుత దశలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను తారుమారు ఆరోపణలపై నియంత్రణ వైఫల్యం జరిగినట్లు నిర్ధారించటం సాధ్యం కాదని చెప్పింది. అలాగే 13 ఎఫ్పిఐల వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారులకు గ్రూప్తో లింక్ ఉందో లేదో నిర్ధారించేందుకు ఇంకా ఎక్కువ సమయం కావాలని సెబీ కోరింది. దీంతో అదానీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, హిందాల్కొ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. (భారీ ఊరట: తగ్గిన పసిడి ధర, మరింత దిగొచ్చే అవకాశం!) అటు దివీస్ ల్యాబ్, బ్రిటానియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ లైఫ్, హీరో మోటార్స్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, నెస్లే, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసాయి.అటు గురువారం 82.59 ముగింపుతో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి స్వల్పంగా తగ్గి 82.66 వద్ద ముగిసింది. మరిన్ని మార్కెట్ వార్తలు, ఇతర ఇంట్రస్టింగ్ బిజినెస్ న్యూస్కోసం చదవండి: సాక్షి, బిజినెస్ -
కష్టాల్లో అదానీ గ్రూపుషేర్లు: సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. వరుసగా నాలుగో రోజు కూడా లాభ పడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పాజిటివ్గా కొనసాగుతున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 240 పాయింట్లు ఎగిసి 62268 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 18380 వద్ద కొన సాగుతున్నాయి. బలమైన త్రైమాసిక ఫలితాలతో టాటా మోటార్స్ షేరు 4 శాతం ఎగిసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. అపోలో హాస్పిటల్స్, ఐషర్ మెటార్స్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, బంధన్ బ్యాంక్ టాప్ ఇండెక్స్ గెయినర్గా ఉంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) మరోవైపు అదానీ ట్రాన్స్మిషన్, ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు కూడా నష్టాలతో ట్రేడ్ అతున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 3.3 శాతం క్షీణించింది. ఇంకా సిప్లా, దివీస్, మారుతి సుజుకి ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ , ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోతున్నాయి. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు -
సెన్సెక్స్ హైజంప్: కారణాలివే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. సెన్సెక్స్ ఏకంగా 710 పాయింట్లు పెరిగి 61,764 వద్ద, నిఫ్టీ 50 195 పాయింట్లు లాభపడి 18,264 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంక్, ఫైనాన్స్, ఆటో , రియల్టీ షేర్లు లాభాల్లో ముగిసాయి. అటు రెండు అదానీ గ్రూప్ స్టాక్లలో ఫ్రీ ఫ్లోట్ను తగ్గించాలని ఎంఎస్సీఐ నిర్ణయం తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఇండస్ఇండ్ బ్యాంక్ 5 శాతం. బజాజ్ ఫైనాన్స్ ,టాటా మోటార్స్ , బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, , HCL టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ , ఇండెక్స్ హెవీవెయిట్లు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ విన్నర్స్గా నిలిచాయి. కోల్ ఇండియా దాదాపు 2శాతం క్షీణించగా, సన్ ఫార్మా, లార్సెన్ అండ్ టూబ్రో నెస్లే కూడా నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ 2 పైసలు తగ్గి 81.80 వద్ద స్థిరపడింది. లాభాలకు కారణాలు దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, చమురు ధరల పతనం, క్యూ4లో కంపెనీల లాభాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్స్ సూచీలకు ఊతమిచ్చాయి. విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ 777.68 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 1.79 శాతం పెరిగి 76.65 డాలర్లకు చేరుకుంది. -
ఇన్పీ, రిలయన్స్ దన్ను, ఎనిమిదో సెషన్లోనూ లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాల్లో ముగిసింది. ఆరంభ లాభాలను కొనసాగించిన సూచీలు రోజంతా అదే జోష్ను కంటిన్యూ చేశాయి. త్రైమాసిక ఫలితాలకు తోడు ఏప్రిల్లో జీఎస్టీ రికార్డ్ వసూళ్లు, వాహన విక్రయాల్లో జోరు, విమాన ప్రయాణాలు పుంజుకోవడం, తయారీ కార్యకలాపాలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరడం వంటి పరిణామాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. (తీవ్ర ఇబ్బందులు: రెండు రోజులు విమానాలను రద్దు చేసిన సంస్థ) ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్ ,రిలయన్స్ ఇండస్ట్రీస్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 61,355 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లలాభంతో 18,147.65 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, లార్సెన్ అండ్ టూబ్రో, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. (రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్పై భారీ తగ్గింపు) సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ నెస్లే నష్ట పోయాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి ఆరు పైసలు పతనమై 81.88 దగ్గర ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) కాగా ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు ఏటా 12 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్లకు చేరుకుని, ఆల్టైమ్ నెలవారీ గరిష్ట స్థాయిని తాకినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలను వెల్లడించింది. భారత్లో తయారీ కార్యకలాపాలు మరింత వేగవంతమై ఏప్రిల్లో నాలుగు నెలల గరిష్టాన్ని తాకాయి. -
తొమ్మిదినెలల తరువాత 18వేల స్థాయికి నిఫ్టీ, అన్ని రంగాల్లోనూ లాభాలే!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. వారంతంలో కీలక సూచీలు రెండూ పాజిటివ్ నోట్తో ముగిసాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ఊగిసలాడినప్పటికీ, కంపెనీ ఫలితల జోష్తో సెన్సెక్స్ 463 పాయింట్లు ఎగిసి 61112 వద్ద ముగియగా, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 18065 వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ 18000 స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్ 61100 వేల స్థాయికి పైన స్థిరపడింది. గత తొమ్మినెలల కాలంలో ఇదే అదిపెద్ద లాభం. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ప్రధానంగా అదానీ ట్విన్స్ అదానీ పోర్ట్స్, ఎంటర్ప్రైజెస్ భారీగా లాభపడ్డాయి. ఇంకా బ్రిటానియా, నెస్లే, విప్రో ఇతర టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, జేఎస్డబ్ల్యూస్టీల్, టైటన్, హెచ్సీఎల్, ఓఎన్జీసీ నష్టపోయాయి. -
వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలు, 17800పైకి నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బెంచ్మార్క్ సూచీలు ఏప్రిల్ 26న నిఫ్టీ 17800 ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 60,300 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 17,814 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుసగా అయిదో సె షన్లో కూడా లాభాలనార్జించాయి.మెటల్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో, పవర్, ఎఫ్ఎంసిజి, పిఎస్యు బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 0.4-1 శాతం వరకు పెరిగాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి వొడాఫోన్ ఐడియా టాప్ గెయినర్స్ కాగా, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్ , ఎన్టిపిసి నష్టపోయాయి. మంగళవారం ముగింపు 81.91తో పోలిస్తే బుధవారం డాలర్తో రూపాయి 15 పైసలు పెరిగి 81.76 వద్ద ముగిసింది. -
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: ఫార్మా ఢమాల్!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఒక వారం బలహీనత తర్వాత, బెంచ్మార్క్ సూచీలు ఏప్రిల్ 24న పాజిటివ్గా ముగిసాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల మెరుగైన ఫలితాలతో దలాల్ స్ట్రీట్లో లాభాల కళకనిపించింది. సెన్సెక్స్ 401యింట్లు పెరిగి 60,056 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు లాభంతో 17,743 వద్ద క్లోజ్ అయ్యాయి. తద్వారా సెన్సెక్స్ మళ్లీ 60వేల ఎగువకు, నిఫ్టీ 17700 స్థాయిని అధిగమించడం విశేషం. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల లాభపడగా, ఫార్మ రంగ షేర్లు నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జ్యూమర్, విపప్రో, టైటన్, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లాభపడగా, సిప్లా, డా.రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంకు, దివీస్, మారుతి సుజుకి నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ వాటాలుపెంపునకు ఆర్బిఐ అనుమతించడంతో హెచ్డిఎఫ్సి లైఫ్ ఏడు శాతం పెరిగింది. అలాగూ మెరుగైన ఫలితాలతో టాటాకాన్స్, షేర్ల బై బ్యాక్ ప్లాన్ నేపథ్యంలో విపప్రో షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.మరోవైపు సన్ఫార్మా మొహాలి యూనిట్కు సంబంధించిన యూఎస్ఎఫ్డీలే ఆందోళనతో భారీ నష్టపోయింది. -
సెన్సెక్స్ లాభం, నిఫ్టీ అక్కడే
ముంబై: జాతీయ, అంతర్జాతీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేకపోవడంతో స్టాక్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి మెటల్, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లు రాణించడంతో ఆరంభ నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. ఉదయం సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 59,538 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 369 పాయింట్ల పరిధిలో 59,413 వద్ద కనిష్టాన్ని, 59,781 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 23 పాయింట్లు పెరిగి 59,655 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 17,640 ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,554 – 17,663 వద్ద రేంజ్లో కదలాడింది. ఆఖరికి ఎలాంటి లాభనష్టాలకు లోనవకుండా గురువారం ముగింపు 17,624 వద్దే స్థిరపడింది. ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, మీడియా, ఫార్మా షేర్లకు రాణించాయి. మెటల్, ఆటో, ఫైనాన్స్, బ్యాంకింగ్, రియల్టీ, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాలు జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 235 పాయింట్లు పెరిగి 60,393 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు ఎగిసి 17,812.40 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 1-2 శాతం వరకు పెరగగా, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్ పేర్లలో కొంత అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్,ఐషర్ మోటార్స్ అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టిపిసి, నెస్లే ఇండియా, ఒఎన్జిసి , అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. -
స్వల్ప లాభాలకు పరిమితం: ఆటో, రియల్టీ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. సోమవారం ఉదయం ఆరంభం తరువాత 150 పాయింట్ల మేర లాభాల్లోకి మళ్లినప్పటికీ చివరల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 13.54 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 59,847 వద్ద, నిఫ్టీ 27.30 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 17,626 వద్ద ముగిశాయి. ఆటో, రియల్టీ రంగ షేర్ల లాభాలు మార్కెట్కు ఊతమిచ్చాయి. మరోవైపు బ్యాంకులు ఫైనాన్షియల్స్ భారీగా నష్ట పోయాయి. టాటా మోటార్స్, విప్రో మరియు పవర్గ్రిడ్ టాప్ గెయినర్లుగాను, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యుఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. మునుపటి సెషన్లోని 81.88తో పోలిస్తే అమెరికా డాలర్ మారకంలో రూపాయి 81.98 వద్ద ముగిసింది. -
సేల్స్ బూస్ట్ టాటా మోటార్స్ టాప్ విన్నర్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్నుంచి 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 76 పాయింట్లు ఎగిసి 59909 వద్ద, నిఫ్టీ 33పాయింట్లు లాభపడి 17630 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్ అంచనాలకు వ్యతిరేకంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లపై తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోంది. అలాగే 6.5 శాతం జీడీపీ వృద్ది రేటు అంచనాలతో మార్కెట్ సానుకూలంగా స్పందిస్తోంది. దాదాపు అన్ని రంగా షేర్లు లాభపడుతున్నాయి. ప్రధానంగా రియల్టీ షేర్లు జోరుమీదున్నాయి. మరోవైపు సేల్స్ బూస్ట్తో టాటా మెటార్స్ దాదాపు 8 శాతం ఎగిసి టాప్ గెయినర్గా ఉంది. ఓఎన్జీసీ, లార్సెన్, అదానీ ఎంటర్ప్రైజెస్, టైటన్ లాంటివి భారీగా లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్,మారుతి , ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. -
ఆర్బీఐ పాలసీ రివ్యూపై దృష్టి, నష్టాల్లో స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్ఐ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 58588 వద్ద,నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 17526వద్ద కొనసాగుతున్నాయి ఈ ఉదయం RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) బెంచ్మార్క్ వడ్డీ రేటుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ వడ్డన ఉంటుందనేది ప్రధాన అంచనా. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ప్రపంచ మాంద్యం గురించి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ఎస్బిఐ లైఫ్, ఐషర్ మోటార్స్ ,యాక్సిస్ బ్యాంక్ ఒక్కో శాతం చొప్పున ఎగిసి గిటాప్ గెయినర్లుగా ఉండగా, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్ , ఎంఅండ్ ఎం టాప్ లూజర్స్గా ఉన్నాయి. -
లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు, జోరుగా ఆటో
సాక్షి, ముంబై: భారతీయ ఈక్విటీ బెంచ్మార్క్లు సోమవారం సెషన్ను సానుకూలంగా ప్రారంభించాయి. కానీ ఆ తరువాత నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లుకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 99 పాయింట్ల నష్టంతో 58891 వద్ద, నిఫ్టీ19 పాయింట్లు కోల్పోయి 17339 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, ఆయిల్ అండ్గ్యాస్ సెక్టార్లు లాభాల్లోనూ, ఐటీ, బ్యాంకింగ్ నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ లాభ పడుతుండగా, బీపీసీఎల్, అదానీ, హెచ్యూఎల్, టెక్ మహీంద్ర, నెస్లే నష్ట పోతున్నాయి. -
భారీ లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు: 1032పాయింట్ల ర్యాలీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మొదలైన సూచీలు చివరి వరకూ అదో జోష్ను కంటిన్యూ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిసి 59 మార్క్ను తాకింది. చివరకు 1032 పాయింట్ల లాభంతో 58991 వద్ద ముగిసింది. ఎగువకు చేరగా నిఫ్టీ 279 పాయింట్లు ఎగిసి 17 400వద్ద న బలమైన నోట్తో ముగిసింది . (ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) ప్రధానంగా ఐటీ 2 శాతం ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ కాగా, నష్టపోయిన వాటిలో అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ , బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి 15 పైసలు పెరిగి 82.18 వద్ద ముగిసింది -
అదానీ షేర్ల జోరు, సెన్సెక్స్ 620 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయస్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత పుంజుకుని హైజంప్ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 620 పాయింట్లు ఎగిసి 58580 వద్ద,నిఫ్టీ 177పాయింట్ల లాభంతో 17258 వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రధానంగా అదానీ గగ్రూపు షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్య్లూ స్టీల్, ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, దివీస్ల్యాబ్స్ మాత్రమే నష్టపోతున్నాయి. -
సిలికాన్ వ్యాలీ బ్యాంకు సెగ: వరుసగా నాలుగో రోజు నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు కూడా పతనమైనాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభం, అంతర్జాతీయమార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆ తరువాత నష్టాలనుంచి కోలుకున్నప్పటికీ చివరల్లో లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా సెన్సెక్స్ 337.66 పాయింట్లు లేదా 0.58 శాతం క్షీణించి 57,900 వద్ద, నిఫ్టీ 111 పతనంతో 17,043 వద్ద ముగిసాయి. ఒక దశలో నిఫ్టీ 17వేల కిందికి పడిపోయింది. అయితే డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టం వద్ద నమోదు కావడం ఊరట నిచ్చింది. మీడియా, ఫార్మా మినహా ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్లు వరుసగా 8, 4శాతం నష్టపోయాయి. టైటన్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ విన్నర్స్గా, ఎంఅండ్ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. -
అదానీ జోరు: సెన్సెక్స్ హై జంప్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో హుషారుగా ముగిసాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే లాభపడింది. ఆ తరువాత మరింత ఎగిసిన సెన్సెక్స్ 980 పాయింట్లు ఎగిసి 59,888 స్థాయిని, నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 17,619 స్థాయిని తాకాయి. ప్రధానంగా అదానీ గ్రూప్ షేర్ల వరుసగాలాభాలు సూచీలకు ఊతమిచ్చాయి. చివరికి సెన్సెక్స్ 900 పాయింట్లు ఎగిసి 597808 వద్ద, నిఫ్టీ 272 పాయింట్ల లాభంతో 17594 వద్ద ముగిసింది. అదానీ జోరు అదానీ ఎంటర్ప్రైజెస్ 11 శాతం అదానీ పోర్ట్స్ స్టాక్ 7.96 శాతం అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం ర్యాలీ అయ్యాయి. అదానీ పవర్ 4.99 శాతం జంప్ చేసింది. దాదాపు చాలా షేర్లు అప్పర్ సర్క్యూట్ అయ్యాయి. అదానీ విల్మార్ షేర్లు 4.99 శాతం, ఎన్డిటివి (4.98 శాతం), అంబుజా సిమెంట్స్ (4.38 శాతం), ఎసిసి (3.69 శాతం) పెరిగాయి.అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ టాప్ విన్నర్స్గా నిలవగా, టెక్ మహీంద్ర, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, దివీస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి కూడా భారీగా లాభపడింది. ఏకంగా 79 పైసలుఎగిసి 81.97 వద్ద ముగిసింది. -
వరుస నష్టాలు, గ్లోబల్ రిచ్ లిస్ట్లో అదానీ ఎక్కడంటే?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల పెంపుపై ఆందోళనల మధ్య గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్తో గత ఐదు నెలల్లో లేని నష్టాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో విదేశీ నిధుల ప్రవాహం, ఐటీ, ఆటో, ఆయిల్ స్టాక్స్లో నష్టాలు కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీశాయి. చివరికి సెన్సెక్స్ 176 పాయింట్లు లేదా 0.30 శాతం క్షీణించి 59,288 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 526 పాయింట్ల మేర కుప్పకూలింది. నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 17,393 వద్ద ముగిసింది. కాగా ఏడు సెషన్లలో, సెన్సెక్స్ 2,031 పాయింట్లు లేదా 3.4 శాతం క్షీణించగా, నిఫ్టీ 643 పాయింట్లు లేదా 4.1 శాతం నష్టపోయి 17,400 స్థాయికి దిగువన ముగిసింది. అటు డాలరుమారకంలో రూపాయి 9పైసల నష్టంతో 82.84 వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, లార్సెన్ & టూబ్రో, భారతీ ఎయిర్టెల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోగా, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి. 40 బిలియన్ డాలర్ల దిగువకు అదానీ మార్కెట్ క్యాప్ మరోవైపు అమెరికా షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల తరువాత బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 బిలియన్ల డాలర్ల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రధానంగా ఫిబ్రవరి 27న అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 12 శాతం క్షీణించి 1107 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో పుంజుకుని 1188 వద్ద ముగిసింది. దీంతో గ్రూప్ వాల్యుయేషన్ ఆగస్టు 2021 తర్వాత మొదటిసారిగా రూ. 7 లక్షల కోట్ల దిగువకు పడిపోయిందని మార్కెట్ వర్గాల అంచనా. జనవరి 24 నాటికి రూ. 19.19 లక్షల కోట్లతో పోలిస్తే 65 శాతం క్షీణించింది. దీంతో గౌతం అదానీ ఇప్పుడు గ్లోబల్ రిచ్ లిస్ట్లో 39వ స్థానానికి పడిపోయారు. -
ప్రముఖ స్టాక్మార్కెట్ విశ్లేషకుడు ఇకలేరు!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అశ్వనీ గుజ్రాల్ (52) ఇకలేరు. సోమవారం (ఫిబ్రవరి 27న) ఆయన కన్నుమూశారు. భారతీయ స్టాక్ మార్కెట్లో సాంకేతిక విశ్లేషణలో విశేష నైపుణ్యంతో పాపులర్ ఎనలిస్ట్గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా సీఎన్బీసీ టీవీ 18లో,ఈటీ నౌ లాంటి బిజినెస్ చానెళ్లలో రోజువారీ మార్కెట్ ఔట్లుక్, ఇంట్రాడే ట్రేడింగ్ సూచనలు, సలహాలతో ట్రేడర్లను ఆకట్టుకునేవారు. మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ(ఫైనాన్స్) పట్టా పొందిన గుజ్రాల్ 1995 నుండి తన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వృత్తిని ప్రారంభించారు. ఈ క్రమంలో మార్కెట్లో మనీ సంపాదించాలి, ఇంట్రాడే ట్రేడింగ్లో ఎలా చేయాలి అనే అంశాపై మూడు పుస్తకాలను కూడా రాశారు గుజ్రాల్. అలాగే యూఎస్ ఆధారిత మ్యాగజైన్లు , జర్నల్స్లో ట్రేడింగ్ , టెక్నికల్ అనాలిసిస్పై రాశారు. -
మార్కెట్లో రూ.3 లక్షల కోట్లు గోవిందా?
సాక్షి, ముంబై: వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం ట్రేడింగ్లో సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 17700 స్థాయి వద్ద ఊగిసలాడింది. ఆ తరువాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 785 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు చేరింది. అటు కుప్పకూలిన నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో 17600 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 927.74 పాయింట్లు క్షీణించి 59,744.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 272.40 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటికే మంగళవారం నాటి గణాంకాల ప్రకారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.265.21 లక్షల కోట్ల నుంచి రూ.2.79 లక్షల కోట్ల నుంచి రూ.262.41 లక్షల కోట్లకు పడిపోయింది. అటు హిండెన్బర్గ్ ఆరోపణలతో వరుస నష్టాలతో అదానీకి భారీ షాకే తగులుతోంది. అదానీ గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ మంగళవారం రూ.8,07,794 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు పడి పోయింది. ఇది దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం క్యాప్ రూ. 9,12,986 కోట్ల కంటే తక్కువ కావడ గమనార్హం. జనవరి 24న ప్రారంభమైన అమ్మకాల సెగతో అదానీ గ్రూప్ స్టాక్లు గత పంతొమ్మిది సెషన్లలో రూ.11,43,702 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా సంస్థ ఎం క్యాప్ 19,18,058 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ( రూ.16,24,156 కోట్లు) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.12,57,268 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోరర్ట్స్జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫినాన్స్, గగ్రాసిం భారీగా నష్టపోగా, సిప్లా, ఐటీసీ, దివీస్, డా. రెడ్డీస్, బజాజ్ ఆటో లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో 82.85 వద్ద ఉంది. -
TodayStockMarket: ఐటీ, ఆటో తప్ప అన్నింటా నష్టాలే
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిసాయి. మిడ్ సెషన్ నష్టాల కాస్త తేరుకున్నప్పటికీ ప్రధాన సూచీలు కీలక మద్దతు స్థాయిలకు దిగువనే ముగిసాయి.సెన్సెక్స్ 311 పాయింట్లు పతనమై 60692 వద్ద, నిఫ్టీ100 పాయింట్లు నష్టపోయి 17845 వద్ద ముగిసాయి. దివీస్ ల్యాబ్స్,అల్ట్రాటెక్ సిమెంట్, టెక్మహీంద్ర, హిందాల్కో, పవర్గ్రిడ్ టాప్ విన్నర్స్గానూ, అదానీ ఎంటర్పప్రైజెస్, సిప్లా, బీపీసీఎల్, బ్రిటానియ, యూపీఎల్ టాప్ లూజర్స్గానూ స్థిర పడ్డాయి. ఐటీ, ఆటో రంగ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లు ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి12 పైసల లాభంతో 82.73 వద్ద ముగిసింది. గత సెషన్లో 82.83 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
TodayStockMarket: లాభాలకు చెక్, సెన్సెక్స్ 317 పాయింట్లు పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.వరుస లాభాల తరువాత సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ డేటాషాక్తో మళ్లీ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాయి. ఆర్థిక, ఐటీ ,ఎఫ్ఎమ్సిజి షేర్లు అమ్మకాల ఒత్తిడి ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 317 పాయింట్లు నష్టపోయి 61,003 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు క్షీణించి 17,944 వద్ద స్థిరపడింది. అదానీ ఎంటర్ప్రైజెస్, నెస్లే, ఇండస్ఇండ్, ఎస్బిఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా , ఎస్బీఐ టాప్ లూజర్స్గా, మరోవైపు లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రాటెక్, భారత్ పెట్రోలియం, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. హెవీవెయిట్లలో, ఇన్ఫోసిస్, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా భారీగా నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 83 స్థాయి వైపు పయనిస్తోంది. డాలరు బలం పుంజుకోవడంతో రూపాయి 14పైసల నష్టంతో 82.83వద్ద ముగిసింది. -
Today StockMarket: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్గా ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ ఆ తరువాత ఒడిదుడుకులనెదుర్కొన్నాయి. చివరికి 44.4 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 61,320 వద్ద, నిఫ్టీ50 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల లాభాలు మద్దతిచ్చి యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు ఉండకపోవచ్చుననే అంచనాలు ఆందోళనలను తగ్గించింది. ఓఎన్జీసీ, టెక్మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే టాప్ గెయినర్స్గా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్యూఎల్, ఎం అండ్, బజాజ్ ఫినాన్స్ టాప్ లూజర్స్గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు 82.71 వద్ద ముగిసింది. -
TodayStockMarket: రిలయన్స్,టెక్ఎం జోరు, నెల గరిష్టానికి సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఆరంభంలో 200 పాయింట్లకు పైగా నష్టపోయిన మార్కెట్ భారీ ఒడిదుడుకులను ఎదుర్కొంది. చివరికి నష్టాలను తగ్గించుకొని లాభాల్లో ముగిసింది. 243 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 61275వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 18015వద్ద ముగిసింది. పలితంగా నెల గరిష్టంత వద్ద, సెన్సెక్స్ 61 వేలకుఎగువన, నిఫ్టీ 18వేలకు ఎగువన స్థిరపడటం గమనార్హం. మంగళవారం ప్రకటించిన డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం 24 నెలల కనిష్టానికి చేరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారింది. హెచ్యూఎల్, సన్ఫార్మ, ఐటీసీ లార్సెన్, ఓఎన్జీసీ భారీగా నష్టపోగా టెక్ మహీంద్రా దాదాపు 6 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం, ఐషర్ మోటార్స్ అదానీఎంటర్ప్రైజెస్ లాభపడ్డాయి. అటుడాలరు మారకంలో రూపాయి 82.80 వద్ద ముగిసింది. -
Today StockMarket: ఫ్లాట్గా సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్పనష్టాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ కీలక సూచీలు ఒడిదుడుకుల మధ్య ఉన్నాయి. ఐటీ, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోతున్నాయి. రియల్టీ, ఆటో స్టాక్లు లాభాలు మార్కెట్కు సపోర్ట్నిస్తున్నాయి. ఫలితంగా ఆరంభంలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 47 పాయింట్ల నష్టంతో 60977వద్ద ఉంది. , నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 17917 వద్ద ట్రేడ్ అవుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచ ఈక్విటీల ఆందోళన నేపథ్యంలో అనిశ్చితి కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐషర్ మెటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మారుతి, రిలయన్స్ లాభపడుతుండగా, ఐటీసీ, హెచ్యూఎల్, లార్సెన్, ఓఎన్జీసీ బ్రిటానియా నష్ట పోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా నష్టాల్లోనే ఉన్నంది. 12పైసల నష్టంతో 82.85 వద్ద ఉంది. -
TodayStockMarketUpdates: లాభాల్లో స్టాక్మార్కెట్, ఐటీ జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడ్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, యుఎస్ సిపిఐ డేటకోసం ఆసక్తి ఎదురు చూస్తున్న గ్లోబల్, ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ సూచీలు మంగళవారం గ్రీన్లో ప్రారంభమయ్యాయి. ఐటీ మెటల్, ఎఫ్ఎంసిజి సహా అన్ని రంగాల షేర్లు జోరుగా ఉన్నాయి. మెటల్ రంగ షేర్లు మాత్రం స్వల్పంగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 60847 వద్ద, నిఫ్టీ 106 పాయిట్లు ఎగిసి 17876 వద్ద కొన సాగుతున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్లలో ఇన్ఫోసిస్, టిసిఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. ఇంకా రిలయన్స్, ఐటీసీ,యూపీఎల్ లాభపడుతుండగా, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్, ఇండస్ఇంద్ బ్యాంక్, ఎస్బిఐఎన్ నష్టాల్లో ఉన్నాయి.అటు డాలరు మారకంలో రూపాయ 82.58 వద్ద కొనసాగుతోంది. చమురు ధరల క్షీణతతో డాలరు పడిపోవడంతో రూపాయి బలం వచ్చింది. -
Today StockMarketOpening: అదానీ, ఐటీ షేర్లు ఢమాల్; సెన్సెక్స్ పతనం
సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఏకంగా 372 పాయింట్లు కుప్ప కూలి 60307 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల పతనంతో 17749 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్ తప్ప అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా అదానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఫసిస్ తదితర ఐటీ స్టాక్స్ పతనం మార్కెట్ను ప్రభావితం చేస్తోంది. అదానీ సంక్షోభం మార్కెట్లో అదానీ సంక్షోభం కొనసాగుతోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (శుక్రవారం) నాలుగు అదానీ స్టాక్ల రేటింగ్ 'స్టేబుల్' నుండి 'నెగటివ్'కి డౌన్గ్రేడ్ చేయడంతో అమ్మకాలు కొనసాగుతున్నాయి. అటు సంస్థ కూడా తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని సగానికి తగ్గించింది. తాజాగా మూలధన వ్యయాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అదానీ. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది. ఇప్పటికే అదానీ లిస్టెడ్ ఎంటిటీలు మార్కెట్ విలువ 120 బిలియన్ డాలర్లకు పైగా కుప్పకూలింది. అటు జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల కోసం పెట్టుబడిదారులు వెయిట్ చేస్తున్నారు. టైటన్, హిందాల్కో, టాటా స్టీల్, సన్ఫార్మ, బజాజ్ ఆటో లాభపడుతుండగా, అదానీ ఎంటర్పప్రైజెస్, ఎస్బీఐ, ఎం అండ్ఎం, ఇన్ఫోసిష్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి 28 పైసలు నష్టంతో 82.73 వద్ద కొనసాగుతోంది. -
TodayStockMarketClosing: తీవ్ర ఒడిదుడుకులు, చివరికి నష్టాలే!
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లోముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి మిడ్సెషన్ తరువాత కోలుకున్నప్పటికీ ఆ లాభాలనునిలబెట్టుకోవడం విఫలమైంది. సెన్సెక్స్ 124 పాయింట్లు కుప్పకూలి 60683 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 17857 వద్ద ముగిసింది. మెటల్ షేర్లు భారీగా నష్టపోగా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగిసాయి. టాటా మోటార్స్, యూపీఎల్, సిప్లా, హీరోమోటో, లార్సెన్ టాప్ గెయినర్స్గా, అదానీ ఎంటర్పప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, కోల్ఇండియా టాప్ లూజర్స్గా నిలిచాయి. అలాగే పేటీఎంలో మొత్తం వాటాను అలీబాబా విక్రయించడంతో పేటీఎం షేరు దాదాపు 8శాతం కుప్పకూలింది. అటు ఎంఎస్సీఐలో అదానీ కంపెనీల షేర్ల వెయిటేజీ తగ్గించడంతో అదానీకి చెందినకొన్నిషేర్లు నష్టపోయాయి. -
Today StockMarketclosing: లాభాల్లోకి సూచీలు, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం లాభాల్లో ముగిసాయి. మిడ్సెషన్ తరువాత కోలుకున్న సెన్సెక్స్ 142 పాయింట్లు ఎగిసి 60,806 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 17894 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడగా అదానీ గ్రూపు షేర్లు మాత్రం నష్టాల్లోనే ముగిసాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్గా మిగిలాయి. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్లో ముగిశాయి. సెన్సెక్స్లో దివీస్ ల్యాబ్స్, హీరో మోటో, సిప్లా, జేఎస్డబ్ల్యూ, స్టీల్, యూపీఎల్ టాప్ లూజర్స్గా బజాజ్ ఫైనాన్స్, గ్రాసిం , బజాజ్ ఫిన్ సర్వ్ , హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్లు గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిడాలర్తో రూపాయి స్థిరంగా 82.51 వద్ద ముగిసింది -
Today StockMarket: ఫ్లాట్గా సూచీలు, అదానీ షేర్ల అమ్మకాల సెగ
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 39.34 పాయింట్లు లేదా 0.06 క్షీణించి 60,624.45 వద్ద , నిఫ్టీ 50 34.30 పాయింట్లు లేదా 0.19శాతం పడిపోయి 17,837.40 వద్దకు చేరుకుంది. రెండు రోజుల రికవరీ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు( ఫిబ్రవరి 9) నష్టాల్లోకి జారుకున్నాయి. పబ్లిక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి తక్షణమే అందుబాటులో ఉన్న అదానీ గ్రూప్-లింక్డ్ షేర్ల సంఖ్యకు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ సమీక్ష ప్రకటించనున్న ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫిబ్రవరిలో సాధారణ సమీక్షలో భాగంగా. గ్లోబల్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ (GIMI)తో అనుసంధానమైన అదానీ స్టాక్ల మార్పులు ఈరోజు తర్వాత ప్రకటించనుంది. దీంతో అదానీ గ్రూప్లోని మొత్తం 10 స్టాక్లు ముఖ్యంగా ప్రముఖ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 15 శాతం కుప్పకూలింది. అంతకుముందు రెండు రోజుల్లో 35 శాతం ఎగిసింది. క్షీణించిన ఇతర గ్రూప్ స్టాక్లలో అదానీ పోర్ట్స్ 7 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం, ఏసీసీ 3.7 శాతం, అంబుజా సిమెంట్ 6.3 శాతం, ఎన్డిటివి. 3.7 శాతం ఉన్నాయి. వీటితోపాటు, హీరోమోటో, యూపీఎల్ టాప్ లూజర్స్గా కొనాసగుతున్నాయి సెన్సెక్స్లో దివీస్ ల్యాబ్స్; బజాజ్ ఫైనాన్స్, గ్రాసిం , బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిలాభాల్లో ఉంది. 82.60 వద్ద కొనసాగుతోంది. -
Today StockMarketUpdate: నష్టాల ముగింపు, అదానీ ఇన్వెస్టర్లకు భారీ ఊరట
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్న సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొ న్నాయి. చివరికి సెన్సెక్స్ 220.86 పాయింట్లు లేదా 0.37 శాతం 60,286 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 17,721.50 వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తర్వాత రేట్ల పెంపును నిలిపివేస్తుందన్న పెట్టుబడిదారులలో స్వల్ప ఆశావాదంతో సూచీలు చూస్తూనే ఉన్నాయి. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతోనూ, ఎఫ్ఎంసిజి షేర్లు నష్టాల్లోముగిసాయి. అలాగే ఫ్లాగ్షిప్ అదానీ ఎంటర్ప్రైజెస్ సహా కొన్ని లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగిసాయి. హిండెన్ వర్గ్ వివాదంతో ఎఫ్పీవోను కూడా అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఈరోజు 20 శాతం ఎగిసింది. ఇదే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ 3.93 శాతం, అదానీ పోర్ట్స్ స్టాక్ ఏకంగా 8.65 శాతం పుంజుకుంది. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. చివరికి అదానీ ఎంటర్ ప్రైజెస్ 15 శాతం, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ టాప్ గెయినర్స్గా, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.70 వద్ద ఫ్లాట్గా ముగిసింది. సోమవారం 82.73 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
TodayStockMarketUpdate నష్టాల్లో స్టాక్మార్కెట్: అదానీషేర్ల లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా మొదలయ్యాయి. ఆ తరువాత అమ్మకాల ఒత్తిడితో ప్రస్తుతం సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి 60,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 17,758 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, ఎఫ్ఎంసిజి షేర్లు నష్ట పోతున్నాయి. అటు అదానీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. మరోవైపు అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్ ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంకు,హెచ్డీఎఫ్స టాప్ గెయినర్స్గా, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్ టాప్ లూజర్స్గా కొనసాగు తున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.75 వద్ద ఫ్లాట్గా ఉంది. -
ఐటీ షాక్తో నష్టాల ముగింపు, రూపాయి ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివర్లో నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి. తద్వారా 5 రోజుల లాభాలకు చెక్ పడింది. అమెరికా జాబ్ రిపోర్ట్ తరువాత ఫెడ్ రేట్ల పెంపు భయాలతో ఐటీ షేర్లు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్, బీపీసీఎల్, టాప్ విన్నర్స్గా నిలిచాయి. దివీస్, హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదాంత టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరుమారకంలో రూపాయి సెప్టెంబర్ 22 తర్వాత అతిపెద్ద నష్టాన్ని నమోదు చేసింది. 1.10 నష్టంతో 82. 72 వద్ద ముగిసింది. -
Today StockMarket Update భారీ నష్టాలు, 17750 దిగువకు నిఫ్టీ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారం ఆరంభంలోనే నస్టాల్లోకి జారుకున్నాయి. ఓపెనింగ్లో పాజిటివ్గా ఉన్నప్పటికీ తరువాత నెగిటివ్గా మారాయి. లాభనష్టాల ఊగిసలాటల మధ్య సెన్సెక్స్ ఏకంగా 424 పాయింట్ల నష్టంతో 60417వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 17720 వద్ద కొనసాగు తున్నాయి. తద్వారా నిఫ్టీ కీలకమైన 17750 మార్క్ను కోల్పోయింది. ముఖ్యంగా ఐటీ, మెటల్ నష్టాలు ప్రభావవితం చేస్తున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్ప్ ఎక్కువగా లాభపడుతుండగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, హిందాల్కో భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు ఎల్ఐసి, అదానీ ట్రాన్స్మిషన్, టాటా స్టీల్ ఈ రోజు ఫలితాలను ప్రకటించనున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీ నష్టాల్లోఉంది. 73 పైసలు కుప్పకూలి 82.43 స్థాయికి రూపాయి పడిపోయింది. -
మార్కెట్లో కొనసాగుతున్న అదానీ సెగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బడ్జెట్ రోజు నిన్న (బుధవారం) ఒడిదుడుకులకు లోనైన సూచీలు గురువారం ఆరంభంలో సెన్సెక్స్ ఏకంగా 475 పాయింట్లు కుప్పకూలింది. మిడ్ సెషన్లో పుంజుకున్నాయి. అయితే అదానీ గ్రూపు వరుస నష్టాల మార్కెట్ను వెనక్కి లాగాయి. ఫలితంగా సెన్సెక్స్ 224 పాయింట్లు ఎగిసి 59932 వద్ద, 6 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 16600 స్థాయిని నిలబెట్టుకుంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్పీవో ఉపసంహరణ ప్రకటన తర్వాత గ్రూపు షేర్లు మరింత పతనమైనాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏకంగా 27 శాతం, అదానీ పోర్ట్స్ 7 శాతం కుప్పకూలింది. ఐటీసీ, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గానూ అదానీ గ్రూపు షేర్లతో పాటు,యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో ఆరంభ లాభాలను కోల్పోయి తిరిగి 82 స్థాయికి పడి పోయింది. -
మార్కెట్కు బడ్జెట్ బూస్ట్, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్!
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి. టాక్స్ షాక్ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్లు తేరుకొన్నాయి. ఇంకా ఎన్టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్టి ఇండస్ట్రీస్ 0.35 శాతం నష్టాలతో కొనాసగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని, గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్ స్టాక్లకు జోష్నిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
ప్రీ బడ్జెట్ ర్యాలీ, ఈ జోష్ నిలబడేనా?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 512 పాయింట్లు ఎగియగా నిఫ్టీ 140 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. తద్వారా సెన్సెక్స్ 60 వేలకు, నిఫ్టీ 17800 పాయింట్ల మార్క్ను అధిగమించాయి. బడ్జెట్పై ఆశలు, అంచనాలతో ఇన్వెస్టర్లు ఆశాజనంగా ఉన్నారు. దీంతో సూచీలు ఉ త్సాహంగా ఉన్నాయి. బడ్జెట్ ప్రకటన తరువాత ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు , బబ్రిటానియా, హిందాల్కో, టాటా స్టీల్ బాగా లాభపడుతుండగా అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మ, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో 14 పైసలు ఎగిసి 81.80 వద్ద ఉంది. -
బడ్జెట్పైనే ఆశలు: ఫ్లాట్గా ముగిసిన సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిసాయి. రేపటి బడ్జెట్కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. ఫలితంగా రోజంతా ఒడి దుకుడుల మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 59550 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 17662 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, ఆటో షేర్లు లాభపడగా, ఐటీ ఫార్మ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు నష్ట పోయాయి. ఎంఅండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ లాభపడగా, బజాజ్ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్ర, సన్ఫార్మ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 42 పైసలు నష్టంతో 81.50 వద్ద ముగిసింది. -
TodayStockMarketUpdate: డే కనిష్టం నుంచి 800 పాయింట్లు జంప్, ఇన్వెస్టర్లకు పండగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ రికవరీ సాధించాయి. అదానీ, హిండెన్ బర్గ్ వివాదం, రానున్న బడ్జెట్ సెషన్ మధ్య ఒడిదుడుకుల నెదుర్కొన్నాయి. అయితే మిడ్సెషన్లో కోలుకుని, ఆఖరి ఆర్ధగంటలో ఒక్కసారిగా పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి. చివరికి సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగిసి 59500 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 17649 వద్ద ముగిసాయి. ముఖ్యంగా అదానీ కంపెనీ కొన్ని భారీ రికవరి సాధించాయి. మరికొన్ని అదానీ షేర్లతోపాటు, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. కానీ ఐటీ షేర్ల లాభాలు మార్కెట్కు మద్దతునిచ్చాయి. రిలయన్స్ 3 శాతం రికవరీ సాధించింది. ఐటీ, పిఎస్యు బ్యాంక్ , కన్స్యూమర్ డ్యూరబుల్ కూడా గ్రీన్లోనూ ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ దాదాపు 3.5 శాతం పతనమైంది ఫలితంగా డే కనిష్టం నుంచి మార్కెట్ ఏకంగా 800 పాయింట్లు ఎగియడం విశేషం. బజాజ్ఫైనాన్స్, అదాని ఎంటర్ ప్రైజెస్ హెచ్సీఎల్ టెక్, బజాజ్ఫిన్సర్వ్ లాభపడగా, ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గగ్రిడ్; జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, హెచ్ యూఎల్ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి 81.50 వద్ద ముగిసింది. శుక్రవారం 81.52 వద్ద క్లోజైన సంగతి తెలిసిందే. -
దలాల్ స్ట్రీట్లో హిండెన్బర్గ్ ప్రకంపనలు:11 లక్షల కోట్ల ఢమాల్
సాక్షి,ముంబై: బడ్జెట్కు ముందు, దేశీయ స్టాక్ మార్కెట్లకు అదానీ షేర్ల పతనం సెగ కొనసాగుతోంది. శుక్రవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం భారీగా కొనసాగడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. అలాగే బ్యాంకింగ్, మెటల్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 17500 స్థాయిని కోల్పోయింది. చివర్లో కోలుకుని సెన్సెక్స్ 874.16 పాయింట్లు లేదా 1.45 శాతం క్షీణించి 59,330.90 వద్ద, నిఫ్టీ 287.60 పాయింట్లు లేదా 1.61 శాతం దిగువన 17,604 వద్ద ముగిసింది. ఫలితంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. గత నాలుగు నెలల్లో ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా హిండెన్బర్గ్ ఆరోపణలతో గ్రూపునకు చెందిన 7 కంపెనీల షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. రెండురోజులుగా కొనసాగుతున్న అమ్మకాల వెల్లువలో అదానీ మార్కెట్ క్యాప్ లక్షల కోట్లు తుడుచు పెట్టుకుపోయింది. అదానీ పోర్ట్స్, అదానీఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఆటో, ఫార్మా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డా.రెడ్డీస్, ఐటీసీ లాభపడగా, దివీస్,అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభాల్లో 8 పైసలు ఎగిసింది. -
అదానీ షేర్ల పతనం, లక్షల కోట్లు ఢమాల్, ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన
సాక్షి, ముంబై: అదానీ గ్రూపుపై తీవ్ర ఆరోపణలు స్టాక్మార్కెట్ను కుదిపేశాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికను విడుదల నివేదికను విడుదల చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో కంపెనీలు 8 శాతం వరకు నష్టపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం కూడా అదానీ షేర్లలో మరింత అమ్మకాలు వెల్లు వెత్తాయి. మొత్తం తొమ్మిది లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ అవర్స్లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకుపైగా కోల్పోయింది. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ 333 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. కలకలం రేపుతున్న ఈ వివాదం నేపథ్యంలోని ఈ పతనం ఏ మేరకు కొనసాగుతుందనే ఆందోళన నెలకొంది. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేసింది. మరో ముఖ్యమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 13.5 శాతం క్షీణించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ 12 శాతానికి పైగా పడిపోయాయి. ఇంకా అంబుజా సిమెంట్, ఏసీసీ 6 శాతానికి పైగా పతనమవగా, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి. Our response to Adani: pic.twitter.com/6NcFKR8gEL — Hindenburg Research (@HindenburgRes) January 26, 2023 హిండెన్బర్గ్ ప్రతి సవాల్ మరోవైపు హిండెన్బర్గ్ రీసెర్చ్పై దావా వేయనున్నట్టు అదానీ ప్రకటించింది. అవన్నీ తప్పుడు వార్తలు తప్పుడు సమాచారరమని కొట్టి పారేసింది. భారతీయ చట్టాల క్రింద సంబంధిత నిబంధనలను పరిశీలిస్తున్నామని అదానీ లీగల్ గ్రూప్ హెడ్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని హిండెన్బర్గ్ రీసెర్చ్ స్పష్టం చేసింది. తమ వద్ద సుదీర్ఘ పత్రాల జాబితా ఉందని హిండెన్బర్గ్ రీసెర్చ్ ట్విటర్లో తెలిపింది. అటు అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై ఆర్బీఐ, సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, మనీలాండరింగ్ చేసిందంటూ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపుపై జనవరి 24, మంగళవారం అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన నివేదిక ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఒకే పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
పోర్ట్ఫోలియోలో ఒక్కటే మ్యూచువల్ ఫండ్, అది కూడా ఫ్లెక్సీక్యాప్ను కలిగి ఉండొచ్చా? ఎందుకంటే ఒక పథకం సైతం కనీసం 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది కనుక వైవిధ్యం ఉన్నట్టు అవుతుందిగా? పెట్టుబడుల విషయానికొస్తే వైవిధ్యం ఎంతో ముఖ్యమైనది. అన్ని గుడ్లను ఒక్కటే పెట్టెలో పెట్టడం సరికాదన్నట్టు.. పెట్టుబడులు అన్నింటినీ ఒక్కటే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరైనది అనిపించుకోదు. అనుకున్న విధంగా సంబంధిత సాధనం పనితీరు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అది ప్రతికూలంగా మారిపోతే? అందుకే వైవిధ్యం అన్నది ఈ రిస్క్ను తగ్గించేస్తుంది. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలి. కొన్ని రకాల కంపెనీలు కొన్ని సమయాల్లో మంచిగాను, ప్రతికూలంగాను పనితీరు చూపిస్తుంటాయి. వివిధ కంపెనీలనేవి, వివిధ రంగాల నుంచి ఉండాలి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందినవి అయి ఉండాలి. మెరుగ్గా నిర్వహించే ఏ మ్యూచువల్ ఫండ్ పథకంలో అయినా ఈ విధమైన వైవిధ్యం ఉంటుంది. వివిధ కంపెనీలు, వివిధ రంగాలు, వివిధ పరిమాణాలతో కూడిన కంపెనీల (మార్కెట్ క్యాప్ ఆధారింగా సైజు) మధ్య పెట్టుబడులు విస్తరించి ఉంటాయి. అందుకే తగినంత భద్రత ఉంటుంది. కాకపోతే పెట్టుబడులు పెట్టే వారు ఫండ్ మేనేజర్ల పరంగా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే? ఒక మ్యూచువల్ ఫండ్ పథకం 20–30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల తగినంత వైవిధ్యం ఉంటుంది. కానీ, ఒక్కటే ఫండ్ మేనేజర్ పరిధిలో పెట్టుబడులను పరిమితం చేయడం వల్ల అది రిస్్కకు దారితీస్తుంది. ఒక్కటే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పరిధిలోని వివిధ పథకాల మధ్య పెట్టుబడులు కేటాయించినా కానీ, పెట్టుబడుల శ్రేణి ఒక్కటే ఉండడం వల్ల రిస్క్ ఉంటుంది. అందుకుని వివిధ ఫండ్స్ సంస్థల పరిధిలో వివిధ ఫండ్ మేనేజర్ల మధ్య మన పెట్టుబడులను విభజించుకోవాలి. మా నిర్ణయం ప్రకారం నాలుగు లేదా ఐదు ఫథకాలు ఈ విధమైన వైవిధ్యానికి సరిపోతాయి. ఇంతకుమించిన పథకాల మధ్య పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల అదనంగా వచ్చే వైవిధ్యం కానీ, రిస్క్ తగ్గడం కానీ ఉండదు. మరీ ఎక్కువ పథకాలు అయినా, పెట్టుబడుల సౌలభ్యం తగ్గుతుంది. నాణ్యమైన ఎంపికే రాబడులను నిర్ణయిస్తుంది. నా దగ్గర 1995లో కొనుగోలు చేసిన యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూనిట్లు ఉన్నాయి. వాటిని ఎలా విక్రయించాలి. ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలంటూ మేము మొదటి నుంచి సూచిస్తున్నాం. మీరు 25 ఏళ్లకు పైగా ఈ పెట్టుబడులను కొసాగించినందుకు అభినందనలు. ఫండ్ హౌస్ కస్టమర్ కేర్ను సంప్రదించడం ద్వారా మీ పెట్టుబడుల తాజా విలువ ఎంతన్నది తెలుసుకోవచ్చు. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్ నుంచి అయినా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. అకౌంట్ తెరిచి, మై ఇన్వెస్ట్మెంట్స్ ట్యాబ్ కింద యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంపిక చేసుకోవాలి. మీ పెట్టుబడుల వివరాలను నమోదు చేయడం ద్వారా ఏ రోజుకారోజు వాటి విలువ ఎంతో చూసుకోవచ్చు. మీ దగ్గరున్న పెట్టుబడులను విక్రయించుకోవాలంటే, అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి చేసుకోవాలి. లేదంటే మీ మ్యూచువల్ ఫండ్ సంస్థ (ఏఎంసీ) పంపిణీదారు అయిన క్యామ్స్ లేదా ఫిన్టెక్ ద్వారా కూడా రిడెంప్షన్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిడెంప్షన్ ఫామ్ను పూరించి సమరి్పంచాలి. యూనిట్లను డీమెటీరియలైజ్ చేసుకుంటే, బ్రోకర్ ద్వారా విక్రయించుకోవచ్చు. -
డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవో అదిరింది
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు బుధవారానికల్లా దాదాపు 70 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 101.27 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వెరసి షేరుకి రూ.197-207 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 61.8 రెట్ల అధిక స్పందన లభించింది. -
రాకేష్ ఝున్ఝున్వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!
సాక్షి,ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిగ్బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా ఆకస్మిక మరణం తరువాత ఆయన పెట్టుబడుల నిర్వహణ, ట్రస్ట్కు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం ఝన్ఝన్వాలా విశ్వసనీయ మిత్రుడు, గురువు, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఝున్ఝున్వాలా ఎస్టేట్కు ప్రధాన ట్రస్టీగా వహిరిస్తారు. ఝున్ఝున్వాలా ప్రస్తుత పెట్టుబడులపై దమానీనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇతర విశ్వసనీయలు కల్ప్రజ్ ధరంషి అమల్ పారిఖ్ ఇతర ట్రస్టీలుగా ఉంటారు. ఝున్ఝున్వాలా తన గురువుగా ఆర్కె దమానీని ఎపుడూ ప్రశంసిస్తూ ఉండేవారు. తన తండ్రి, టాటాస్, విన్స్టన్ చర్చిల్, జార్జ్ సోరోస్, రాధాకిషన్ దమానీ ఈ ఐదుగురు తనకు రోల్ మోడల్స్ అనీ, వారినుంచి స్ఫూర్తి పొందానని పలు ఇంటర్వ్యూలలో ఝున్ఝున్వాలా గుర్తుచేసుకునేవారు. అందుకే విభిన్నమైన వ్యక్తిత్వాలతో, దలాల్ స్ట్రీట్లో ఈ రెండు బిగ్బుల్స్ మధ్య ఫ్రెండ్షిప్ని బాలీవుడ్ మూవీ'షోలే'లోని జై-వీరూలతో ఎక్కువగా పోలుస్తారు అభిమానులు. ఝున్ఝున్వాలా సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,గత ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నందున ప్రతీ విషయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ఆయన భార్య, వ్యాపారవేత్త రేఖా కూడా వ్యాపార కుటుంబానికి చెందినవారు, ఫైనాన్స్పై అపారమైన అవగాహన కూడా ఆమె సొంతం. దీంతోపాటు, రేఖా సోదరుడు సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే రేర్ ఎంటర్ప్రైజెస్ని ఉత్పల్ సేథ్ , అమిత్ గోలా ఆధ్యర్యంలోనే నడుస్తుంది. ఝున్ఝున్వాలాకా పెట్టుబడులపై సలహాలందించే ఉత్పల్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై దృష్టి సారించారు.ఇక అమిత్ గోలా ట్రేడింగ్ అంశాలపై ఆయనకు కుడిభుజంలాపనిచేసేవారు. అమిత్ ట్రేడింగ్ బుక్నికూడా నిర్వహిస్తున్నారు. కాగా ఆగస్ట్ 14న మరణించిన రాకేష్ ఝున్ఝున్వాలా లిస్టెడ్ , అన్లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులతో సహా కోట్లాది రూపాయల ఆస్తులను అతని భార్య ముగ్గురు పిల్లలకు వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ బిజినెస్మేన్గా రాణిస్తున్న రాధాకిషన్ దమానీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు కూడా. రిటైల్ కంపెనీ అవెన్యూ సూపర్మార్ట్ పేరుతో ఎంట్రీ ఇచ్చి డి-మార్ట్ చెయిన్తో పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు దమానీ. 2022 జూన్ నాటికి అవెన్యూలో దమానీ నికర విలువ రూ. 1,80,000 కోట్లకు పైమాటే. -
భారీ లాభాలు, సెన్సెక్స్ మళ్లీ 59 వేల పాయింట్ల ఎగువకు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే 600 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ చివరికి 59వేల ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 515పాయింట్లు ఎగిసి 59332 వద్ద, నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 17659 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్ర, టీసీఎస్ టాప్ విన్నర్స్గా నిలిచాయి. మరోవైపు టాటా కన్జ్యూమర్స్,అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, హిందాల్కో, ఎన్టీపీసీ నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి బలహీనపడి 14 పైసల నష్టంతో 79.63వద్ద ఉంది. చదవండి: 75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్గా అదానీ -
మార్కెట్ క్యాప్ ఢమాల్: బిలియన్ డాలర్ కంపెనీలు ఔట్
కొద్ది రోజులుగా గ్లోబల్ ట్రెండ్కు అనుగుణంగా దేశీ స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి తదుపరి ధరలు ఊపందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బలపడుతున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన లిక్విడిటీ విధానాలకు తెరతీయడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయంగానూ పలు స్టాక్స్ బేర్మంటున్నాయి. 2021 అక్టోబర్లో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన స్టాక్ మార్కెట్లు డీలా పడటంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు నేలచూపులకు పరిమితమవుతున్నాయి. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు చిల్లు పడుతోంది. రికార్డ్ స్థాయి నుంచి.. గతేడాది అక్టోబర్లో స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 62,245 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. దీంతో బిలియన్ డాలర్ల(అప్పట్లో సుమారు రూ. 7,500 కోట్లు) మార్కెట్ విలువను అందుకున్న కంపెనీలు 400కుపైగా నమోదయ్యాయి. అయితే తదుపరి ద్రవ్యోల్బణం ధాటికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్సహా, ఆర్బీఐవరకూ వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టడంతో ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. దీనికితోడు రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ముడిచమురు ధరలకు రెక్కలిచ్చింది. ఫలితంగా డాలరు భారీగా బలపడితే.. రూపాయి పతన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు క్షీణ పథంలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53,235 పాయింట్ల స్థాయికి తిరోగమించింది. దీంతో లిస్టెడ్ కంపెనీల విలువలూ నీరసించాయి. గత 9 నెలల్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో 660 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52 లక్షల కోట్లు) ఆవిరైందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు! ప్రస్తుతం బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,23,834 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మధ్య, చిన్నతరహా కంపెనీలకు అమ్మకాల సెగ తగులుతోంది!! విలువల నేలచూపు మార్కెట్లతోపాటు ఇటీవల షేర్ల ధరలు సైతం కుదేలవుతున్నాయి. ఇది చాలదన్నట్లు మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 79కు చేరింది. ఫలితంగా బిలియన్ డాలర్ల(రూ. 7,900 కోట్లు) జాబితాకు రెండు వైపులా దెబ్బతగులుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. షేర్ల ధరలు తగ్గడానికితోడు రూపాయి విలువ నీరసించడంతో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ జాబితాలో కంపెనీల సంఖ్య క్షీణించింది. దీంతో వీటి సంఖ్య తాజాగా సుమారు 340కు చేరింది. జాబితాలో వీక్ గత 9 నెలల్లో కొన్ని కంపెనీల షేర్లు పతన బాటలో సాగాయి. దీంతో వీటి విలువకు భారీగా చిల్లు పడింది. ఈ జాబితాలో మణప్పురం ఫైనాన్స్, వెల్స్పన్ ఇండియా, హెచ్ఈజీ, నజారా టెక్నాలజీస్, జెన్సార్, లక్స్ ఇండస్ట్రీస్, ఆర్బీఎల్ బ్యాంక్, దిలీప్ బిల్డ్కాన్ 70–50 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, మెట్రోపోలిస్ హెల్త్కేర్, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, ఇండిగో పెయింట్స్, వైభవ్ గ్లోబల్, ఇండియాబుల్స్ హౌసింగ్ తదితరాలు సైతం అత్యధికంగా క్షీణించాయి. ఇవన్నీ బిలియన్ డాలర్ విలువను కోల్పోవడం గమనార్హం! ఈ కాలంలో బీఎస్ఈలోని 1,100 షేర్లను పరిగణిస్తే 75 శాతంవరకూ నష్టాల బాటలోనే సాగాయి! లాభపడ్డవీ ఉన్నాయ్ కొద్ది రోజులుగా మార్కెట్లు డీలా పడినప్పటికీ జోరందుకున్న కంపెనీలూ ఉన్నాయి. దీంతో ఇదే కాలంలో బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న జాబితాలో ఆటో, ఇండస్ట్రియల్ విడిభాగాల కంపెనీ ఎల్జీ ఎక్విప్మెంట్స్తోపాటు, శ్రీ రేణుకా షుగర్స్, జీఎన్ఎఫ్సీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, సుందరం క్లేటాన్, ఆర్హెచ్ఐ మెగ్నీసిటా, బోరోసిల్ రెనెవబుల్స్ చోటు సాధించాయి. ఈ షేర్లు 20–70 శాతం మధ్య జంప్చేయడం ఇందుకు సహకరించింది. -
ఎల్ఐసీ లిస్టింగ్.. ప్చ్!
ముంబై: స్టాక్ మార్కెట్లు దూకుడు చూపినప్పటికీ బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్లో ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చింది. ఇష్యూ ధర రూ. 949కాగా.. బీఎస్ఈలో 9 శాతం(రూ. 82) నష్టంతో రూ. 867 వద్ద లిస్టయ్యింది. ఎన్ఎస్ఈలోనూ రూ. 77 తక్కువగా రూ. 872 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. పాలసీదారులతోపాటు, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఐపీవో ధరలో డిస్కౌంట్ ఇవ్వడంతో రూ. 889, రూ. 904 చొప్పున షేర్లు లభించాయి. ఈ ధరలతో పోల్చినా ఎల్ఐసీ నీరసంగానే లిస్టయ్యింది. కాగా.. బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు తొలుత రూ. 920 వద్ద గరిష్టాన్ని తాకగా, తదుపరి రూ. 860 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ ఇంట్రాడేలో రూ. 919–860 మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. చివరికి బీఎస్ఈలో రూ. 875.5 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 873 వద్ద ముగిసింది. వెరసి రోజంతా ఇష్యూ ధర కంటే దిగువనే కదిలింది. ఎన్ఎస్ఈలో 4.87 కోట్లు, బీఎస్ఈలో 27.52 లక్షలు చొప్పున షేర్లు చేతులు మారాయి. ఎల్ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది. టాప్–5లో చోటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా ఎల్ఐసీ రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పొందింది. దీంతో మార్కెట్ విలువలో టాప్–5 ర్యాంకులో చోటు సాధించింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం రూ. 17.12 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), రూ. 12.67 లక్షల కోట్లతో టీసీఎస్, రూ. 7.29 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. తదుపరి ఇన్ఫోసిస్ రూ. 6.38 లక్షల కోట్లతో నాలుగో స్థానాన్ని పొందగా.. రూ. 50,000 కోట్లు కోల్పోయిన ఎల్ఐసీ ఐదో ర్యాంకులో నిలిచింది. వెరసి మార్కెట్ విలువలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్యూఎల్(రూ. 5.27 లక్షల కోట్లు), ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ(రూ. 4.94 లక్షల కోట్లు), పీఎస్యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(రూ. 4.17 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ(రూ. 3.97 లక్షల కోట్లు)లను ఎల్ఐసీ వెనక్కి నెట్టింది. కొత్త ప్రొడక్టులు జనవరి–మార్చిలో నాన్పార్టిసిపేటింగ్, గ్యారంటీ ప్రొడక్టులను ప్రవేశపెట్టిన ఎల్ఐసీ ఇకపై వీటిని మరింత అధికంగా విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు కుమార్ చెప్పారు. కొన్ని కొత్త ప్రొడక్టులను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రత్యేకంగా డిజిటల్ మార్కెటింగ్ చానల్ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. పాలసీల పంపిణీ కోసం బ్యాంకెస్యూరెన్స్ చానల్పై సైతం దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ఎల్ఐసీ 63 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. కొనుగోలు చేయండి... అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగానే ఎల్ఐసీ బలహీనంగా లిస్టయినట్లు దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. మార్కెట్లను ఎవరూ అంచనా వేయలేరని, తగిన విలువ కోసం దీర్ఘకాలం వేచిచూడవలసిందిగా ఇన్వెస్టర్లకు సూచించారు. డిస్కౌంట్ ద్వారా పాలసీదారులకు, ఇన్వెస్టర్లకు కొంత రక్షణ కల్పించినట్లు తెలియజేశారు. కాగా.. మార్కెట్లు కోలుకుంటే షేరు ధర పుంజుకుంటుందని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఐపీవోలో షేర్లు దక్కని ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చని సలహా ఇచ్చారు. దీర్ఘకాలంపాటు షేరు తక్కువ స్థాయిలో నిలిచేందుకు ఎలాంటి కారణమూ కనిపించడంలేదన్నారు. మార్కెట్ విశ్లేషకులు సైతం దీర్ఘకాలానికి ఎల్ఐసీ షేర్లను హోల్డ్ చేయవచ్చని సూచిస్తున్నారు. -
బడ్జెట్ షాక్ : ఆరంభ లాభాలు ఢమాల్!
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట లభించపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. దీంతో ఆరంభంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లో అమ్మకాలు కొనసాగాయి. అయితే కార్పొరేట్ సంస్థలకు లబించిన ఊరటతో ఊగిసలాట కొనసాగుతోంది. సెన్సెక్స్ 891 పాయింట్ల లాభంతో 59 వేలకు దిగువన, నిఫ్టీ 223 పాయింట్ల లాభాలకు పరిమితమై 18 వేల దిగున ట్రేడయింది. క్రమంగా నష్టాల్లోకి జారుకుని తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగ షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో డిజిటల్ రుపీని జారీ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. 2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీని జారీ చేయబోతున్నట్లు వెల్లడించారు. డిజిటల్ అసెట్ల బదిలీపై 30శాతం పన్ను రాయితీ ఇవ్వనున్నారు. జనవరిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్లకు చేరుకున్నాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడం వల్లే సాధ్యమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రంనిర్మలాది మరో 2022-23 గ్రోత్ ఓరియెంటెడ్ బడ్జెట్ అంటూ ప్రశంసించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు లభించిన ఊరటను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. 2022-23 బడ్జెట్లో ఎమ్ఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు లభించాయి. ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ ఏర్పాటుతోపాటు, ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో ఎంఎస్ఎంఈల కోసం రానున్న అయిదేళ్లలో 6,000 కోట్ల రూపాయల RAMP కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్టార్టప్ల కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనున్నామని ప్రకటించడం విశేషం. -
అదృష్టం అంటే వీళ్లదే..! లక్షపెట్టుబడితో రూ.18లక్షలు లాభం..!
దేశీయ స్కాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ తారా జువ్వలా దూసుకెళ్తున్నాయి. నవంబర్ 2, 2020న రూ.4.18 పైసలున్న సాఫ్ట్వేర్ కంపెనీ బ్రైట్.కామ్ గ్రూప్ స్టాక్స్ ఏడాది తిరిగే సరికల్లా ఆ స్కాక్స్ వ్యాల్యూ రూ.75.40కి చేరింది. దీంతో ఈ పెన్నీ స్టాక్స్ కొన్న ఇన్వెస్టర్లకు పంట పడినట్లైంది. లక్ష పెడితే రూ.18.03లక్షలు ఉదాహరణకు బ్రైట్.కామ్ గ్రూప్ షేర్లలో ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెడితే ఈరోజు ఆ లక్షకాస్త రూ.18.03 లక్షలైంది. ఈ మధ్యకాలంలో సెన్సెక్స్ 47.89 శాతం పెరగడంతో ఆ స్కాక్స్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 13న షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరి రూ.90.55ను తాకింది. నిన్న(నవంబర్ 4న) దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్లో షేరు 0.87% లాభంతో రూ.75.40 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఈ కంపెనీ మొత్తం 2.78 లక్షల షేర్లు ఉండగా రూ. 2.10 కోట్ల టర్నోవర్ను సాధించడంతో బ్రైట్ కామ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.7,853.91 కోట్లకు చేరింది. సంవత్సరంలోనే ఇంత లాభమా బ్రైట్కామ్ గ్రూప్ షేర్లు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 1,002 శాతం లాభపడ్డాయి. కేవలం ఒక్కనెలలో 17 శాతం పెరిగాయి. బ్రైట్కామ్ గ్రూప్ షేర్లు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల వ్యాల్యూ స్థిరంగా సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.కాగా బ్రైట్.కామ్ గ్రూప్ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, ఏజెన్సీలు, ఆన్లైన్ ప్రచురణకర్తలకు డిజిటల్ మార్కెటింగ్ పరిష్కారాల్ని అందిస్తుంది. కరోనా కారణంగా ఆన్లైన్ సర్వీసులు పెరగడంతో ఆ షేర్ వ్యాల్యూ భారీగా పెరిగినట్లు ఇన్వెస్టర్లు తెలిపారు. పెన్నీ స్టాక్స్ అంటే దేశీయ స్కాక్ మార్కెట్లో రిజిస్టరైన కంపెనీ షేర్ వ్యాల్యూ రూ.10 కన్నా తక్కువగా ఉంటే ఆ స్కాక్స్ను పెన్నీ స్కాక్స్ అంటారు. -
అదృష్టం అంటే వీళ్లదే..! రూ.లక్ష పెట్టుబడితో రూ.కోటి సంపాదించారు..!
మల్టీ బ్యాగర్ స్టాక్స్. స్టాక్ మార్కెట్లో మనం తరుచూ వినే పదం. ఈ స్టాక్స్లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాల్ని గడించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షాది కారులు కాస్తా కోటీశ్వరులు కావొచ్చు. మంచి కంపెనీ. పెద్దగా పబ్లిసిటీ ఉండదు. కానీ ఇలాంటి కంపెనీలు రోజులు గడిచే కొద్ది ఇన్వెస్టర్లకు లాభాల పంట పడిస్తాయి. అయితే ఇందుకోసం స్టాక్మార్కెట్పై ఖచ్చితమైన అవగాహన, ఓపిక చాలా అవసరం. అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే భారీగా నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. హెచ్డీఎఫ్సీ స్టాక్స్ ఇక మల్టీ బ్యాగర్ స్టాక్స్లో ఒకటిగా ఉన్న హెచ్ డీఎఫ్సీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ముదుపర్లు భారీ లాభాల్ని మూటగట్టుకున్నారు. ఈ షేరు భారీ లాభాన్ని అర్జించిందిగత ఆరు నెలల కాలంలో 20 శాతం పెరుగుదలతో షేరు ధర రూ.1412 నుంచి రూ.1680 స్థాయికి చేరింది. ముఖ్యంగా మార్కెట్ లో హెచ్డీఎఫ్సీ షేర్ ధర సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టిన ముదుపర్లు ఇప్పుడు కోట్లు గడిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ వ్యాల్యూ ►నెలల వ్యవధిలో హెచ్డీఎఫ్సీ షేర్ వ్యాల్యూ పెరగడం పెట్టుబడిదారులకు వరంగా మారింది. నెల ముందు ఈ షేర్ రూ.1559 ఉండగా అనుహ్యంగా 8శాతం రిటర్న్తో రూ.1680 పెరిగింది. ►ఇక ఆరు నెలల క్రితం ఇదే షేర్ వ్యాల్యూ రూ.1412 నుంచి 20శాతం పెరిగి రూ.1680కి చేరింది. ►సంవత్సరం క్రితం రూ.1200 ఉండగా 40శాతం పెరిగి రూ.1680కి చేరింది. ► అదే గత 5 ఏళ్ల క్రితం బ్యాంక్ షేర్ రూ.635 ఉండగా 165శాతం పెరిగి రూ.1680కి చేరింది. ► 22ఏళ్ల క్రితం అంటే అక్టోబర్ 15,1999లో షేర్ ప్రైస్ రూ.9.82 ఉండగా ఈ వారానికి ఆ ధర రూ.1680కి చేరింది. ఏ సంవత్సరం లో ఎంత పెట్టుబడి పెడితే ఉదాహరణకు మల్టీ బ్యాగర్స్ స్టాక్స్గా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే .. ఇప్పుడు ఆ లక్ష కాస్త రూ.2.65 లక్షల లాభాల్ని అర్జించింది.ఇక పెట్టుబడులు పెట్టి చేతులు దులిపేసుకోకుండా కొన్ని సంవత్సరాల పాటు అలాగే నిరీక్షించిన ఇన్వెస్టర్లు ఎంత లాభమో ఈ షేర్ వ్యాల్యూని చూస్తే అర్ధం అవుతుంది. సరిగ్గా ఇదే అక్టోబర్ నెలలో 22ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడితో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక్క షేర్ వ్యాల్యూ రూ.9.82ఉన్నప్పుడు కొనుగోలు చేసి అలాగే ఉంచినట్లైతే.. ఈ వారంలో ఆ షేర్ వ్యాల్యూ ధర ఎంతంటే అక్షరాల రూ.కోటీ 70 లక్షలు. 22ఏళ్ల క్రితం లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ.1 కోటీ 70లక్షలకు చేరింది. చదవండి: ఇవి షేర్లా.. బుల్లెట్ రైళ్లా... లాభాలతో ఇన్వెస్టర్ల ఉక్కిరి బిక్కిరి -
డీమ్యాట్ అకౌంట్ల స్పీడ్, స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు
గతేడాది(2020–21) సగటున ప్రతి నెలా 12 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా ఓపెన్ అయ్యాయి. 2019–20లో ఈ సంఖ్య 4 లక్షలు మాత్రమేకాగా.. ఈ ఏడాది(2021–22)లో ఇప్పటివరకూ 26 లక్షలు చొప్పున జత కలుస్తున్నాయి. అంతేకాకుండా 2020–21కల్లా నగదు విభాగం రోజువారీ టర్నోవర్లో రిటైలర్ల వాటా 39 శాతం నుంచి 45 శాతానికి ఎగసింది. లిస్టెడ్ కంపెనీలలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా సైతం 9.3 శాతానికి బలపడింది. ఇది అత్యంత ప్రోత్సాహకర విషయమే అయినప్పటికీ క్యాపిటల్ మార్కెట్లలో వ్యక్తిగత పెట్టుబడులు మరింత పెరగవలసి ఉన్నట్లు త్యాగి సూచించారు. గ్లోబల్ గణాంకాల సంస్థ స్టాటిస్టా వివరాల ప్రకారం యూఎస్లో సుమారు 55 శాతం పెద్దలు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లకు మళ్లిస్తుంటారు. -
ఇన్వెస్టర్ల ప్రయోజనం కోసమే టీప్లస్1
న్యూఢిల్లీ: టీప్లస్1 సెటిల్మెంట్ (ట్రేడ్ ప్లస్ వన్) అన్నది మార్కెట్లోని భాగస్వాములు అందరి ప్రయోజనం కోసమేనని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి అన్నారు. ట్రేడ్స్ను ముందుగా సెటిల్ చేయడం (విక్రయించిన వారికి నగదు చెల్లింపులు.. కొనుగోలు చేసిన వారికి షేర్ల జమ) అన్నది అందరికీ మంచి చేస్తుందన్నారు. టీప్లస్1 సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా అమలు చేసుకోవచ్చంటూ స్టాక్ ఎక్సేంజ్లకు సెబీ ఈ నెల ఆరంభంలో అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం టీప్లస్2 సెటిల్మెంట్ అమల్లో ఉంది. అంటే ట్రేడ్ (లావాదేవీ) జరిగిన తర్వాతి రెండు పనిదినాల్లో దాన్ని పరిష్కరిస్తారు. విక్రయించిన వారు నిధుల కోసం, కొనుగోలు చేసిన వారు షేర్ల జమ కోసం లావాదేవీ జరిగిన తర్వాతి రెండు రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. టీప్లస్1లో లావాదేవీ తర్వాతి పనిదినం రోజునే అవి ముగిసిపోతాయి. దీనివల్ల విక్రయించిన వారికి తొందరగా నిధులు జమ అవుతాయి. 2002 లో టీప్లస్5 సెటిల్మెంట్ నుంచి సెబీ టీప్లస్3కు తగ్గించగా.. 2003లో టీప్లస్2కు కుదించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో, చెల్లింపుల వ్యవస్థల్లో ఎన్నో సంస్కరణలు వచ్చిన దృష్ట్యా దీన్ని టీప్లస్1కు తీసుకురావాల్సిన అవసరం ఉందని అజయ్త్యాగి అభిప్రాయపడ్డారు. కొనుగోలు చేసిన వాటిని వేగంగా పొందే హక్కు ఇన్వెస్టర్లకు ఉందన్నారు. ఇన్వెస్టర్ల ఇష్టం.. రెండు ఎక్సేంజ్లు భిన్నమైన సెటిల్మెంట్ సైకిల్స్ను ఎంపిక చేసుకుంటే లిక్విడిటీ సమస్య ఏర్పడదా? అన్న ప్రశ్నకు.. లిక్విడిటీ నిలిచిపోయేందుకు ఇది దారితీయదని బదులిచ్చారు. లిక్విడిటీ, ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట ట్రేడ్ చేసుకోవచ్చని సూచించారు. సెబీ టీప్లస్1ను ఇప్పుడు ఐచ్ఛికంగానే ప్రవేశపెట్టినా.. సమీప కాలంలో తప్పనిసరి చేయాలన్న ప్రణాళికతో ఉంది. టీప్లస్1పై విదేశీ ఇన్వెస్టర్ల ఆందోళనలను త్యాగి తోసిపుచ్చారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 1999 నుంచి డెరివేటివ్స్లో ట్రేడ్ చస్తున్నారని.. వీటికి ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే, ఐపీవోల్లో వారి పెట్టుబడులు సైతం ఏడు–ఎనిమిది రోజుల పాటు నిలిచిఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తక్కువ కాల వ్యవధితో కూడిన సెటిల్మెంట్ ప్రతీ ఒక్కరికీ అవసరమేనని చెప్పారు. నూతన పీక్ మార్జిన్ నిబంధనలు అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టినవేనని వివరణ ఇచ్చారు. ‘‘రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం పెరిగినందున.. అధిక మార్జిన్ నిబంధనలు ప్రశాంతను, అనుకోని సమస్యలకు దారితీయకుండా చూస్తాయి’’ అని పేర్కొన్నారు. పీక్మార్జిన్ నిబంధనల కింద బ్రోకర్లు ఇంట్రాడే ట్రేడ్స్కు సంబంధించి ఎక్కువ లెవరేజ్ (రుణ సర్దుబాటు) ఇవ్వడం ఇకమీదట కుదరదు. బాండ్ మార్కెట్లో సంస్కరణలు బాండ్ మార్కెట్ బలోపేతానికి సంస్కరణలు పరిశీలనలో ఉన్నాయని అజయ్త్యాగి తెలిపారు. మార్కెట్ మేకర్స్ను ఏర్పాటు చేయ డం ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. మార్కెట్ మేకర్స్ అనేవి సంస్థలు. సెకండరీ మార్కెట్లో కార్పొరేట్ బాండ్ల కొనుగోలు, విక్రయ ధరల ను కోట్ చేస్తూ లిక్విడిటీ ఉండేలా చూస్తాయి. కార్పొరేట్ బాండ్లకు రెపో కోసం లిమిటెడ్ పర్పస్ క్లియరింగ్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా సంస్కరణల్లో ఒకటిగా త్యాగి తెలిపారు. ప్రస్తుతం కార్పొరేట్బాండ్ మార్కె ట్లో 97–98 శాతం ప్రవేటు ప్లెస్మెంట్ మార్గం లో జారీ చేస్తున్నవే ఉంటున్నాయి. ఈ బాండ్ల సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ అంతగా ఉండ డం లేదు. మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఎక్కు వగా పాల్గొంటున్నాయి. దీంతో ‘‘మరిన్ని బాం డ్ల పబ్లిక్ ఇష్యూలు రావాలి. సెకండరీ మార్కె ట్లో మరిన్ని సంస్థలు పాల్గొనడం ద్వారా లిక్విడిటీ పెరగాల్సి ఉంది’’ అని త్యాగి వివరించారు. చదవండి: డిగ్రీలో ఫెయిల్, నెమ్మదస్తుడు.. కానీ లక్ష కోట్లకు అధిపతి -
Stock Market: ప్రారంభ లాభాలు ఆవిరి!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం ఒంటి గంటలకు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ సూచీల అస్థిరత మధ్య దేశీయ మార్కెట్ సూచీల ప్రారంభ లాభాలు ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకొని స్వల్ప లాభాలతో ఇంట్రాడే ముగిసింది. చివరకు సెన్సెక్స్ 4.89 పాయింట్లు (0.01%) పెరిగి 55,949.10 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 2.20 పాయింట్లు (0.01%) లాభపడి 16,636.90 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద నిలిచింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగియగా.. భారతి ఎయిర్ టెల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, మారుతి సుజుకి, హిందాల్కో ఇండస్ట్రీస్ పవర్ గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను చూశాయి.(చదవండి: బంగారం ధరలు: మరింత ప్రియం!) -
Stock Market: వరుస నష్టాలకు బ్రేక్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయ ఐటీ, మెటల్, ఫైనాన్షియల్ స్టాక్స్ మద్దతుతో మార్కెట్ లాభాల్లోకి దూసుకెళ్లింది. చివరకు, బీఎస్ఈ సెన్సెక్స్ 209.36 పాయింట్లు (0.40%) పెరిగి 52653.07 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 69.10 పాయింట్లు (0.44%) పెరిగి 15778.50 వద్ద ముగిసింది. నేడు సుమారు 1781 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1170 షేర్లు క్షీణించాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.28 వద్ద ఉంది. మెటల్ ఇండెక్స్ 5 శాతం లాభపడగా, ఐటీ, పీఎస్ యు బ్యాంక్, రియాల్టీ సూచీలు 1-3 శాతం పెరిగాయి. అయితే ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1 శాతం తగ్గింది. బిఎస్ ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4-0.9 శాతం పెరిగాయి. మార్కెట్లో హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, జెఎస్ డబ్ల్యు స్టీల్ షేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. మారుతి సుజుకీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఐటీసీ, కోల్ఇండియా షేర్లు నష్టపోయాయి. -
అదానీ షేర్లు మళ్లీ పరుగులు పెడుతున్నాయ్
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన మూడు ఫండ్లకు సంబంధించిన గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) ఖాతాలను మాతమ్రే స్తంభింపచేసినట్లు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) వివరణ ఇచ్చింది. దానికి అనుగుణంగానే తమ వెబ్సైట్లో తగు మార్పులు చేసింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లయిన ఎబ్యులా ఇన్వెస్ట్మెంట్స్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్, క్రెస్టా ఫండ్ వీటిలో ఉన్నాయి. తాజా వివరణతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు బుధవారం గణనీయంగా లాభపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. అదానీ గ్రూప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన ఆరు మారిషస్ ఆధారిత ఫండ్స్లో మూడింటి ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపచేసిందన్న వార్తలతో జూన్ 14న అదానీ సంస్థల షేర్లు ఏకంగా 25 శాతం దాకా పతనమయ్యాయి. అదానీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి కాకుండా 2016 జూన్ నాటి జీడీఆర్ల విషయంలోనే ఆ ఫండ్స్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు ఎన్ఎస్డీఎల్ అప్పట్లోనే తెలిపింది. కానీ తమ వెబ్సైట్లో స్తంభింపచేసిన 9,444 ఖాతాల జాబితాలో వీటిని కూడా కొనసాగించడం సందేహాలకు తావిచ్చింది. తాజాగా ఆయా ఫండ్స్ ’జీడీఆర్’లను మాత్రమే ఫ్రీజ్ చేసినట్లు పోర్టల్లోనూ మార్చడంతో స్పష్టత ఇచ్చినట్లయింది. దీంతో బుధవారం అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ చెరి 4 శాతం, అదానీ పవర్ 2 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 0.76 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 0.29 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 0.24 శాతం పెరిగాయి. -
దేవుడా.! ఓ మంచి దేవుడా అడగకుండానే వేల కోట్లు ఇచ్చావ్
దేవుడా..! ఓ మంచి దేవుడా అడగకుండానే అన్ని ఇచ్చావ్. వేలకోట్ల ఆస్తి ఇచ్చావ్. వారెన్ బఫ్ఫెట్ ఆఫ్ ఇండియాను చేశావ్. ఇప్పుడు నేను అడగకుండా ఇచ్చే ధనం వద్దు.. నేను దానం చేసే గుణం ఇవ్వు' అని కోరుకుంటున్నారు. రాకేశ్ జున్జున్వాలా పరిచయం అక్కర్లేని పేరు. దలాల్ స్ట్రీట్ లో ఆయన పట్టిందల్లా బంగారమే. తండ్రి దగ్గర అరువుగా తీసుకున్న రూ. 5000లతో బాంబే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి 36 ఏళ్లలోనే 34 వేల కోట్లు సంపాదించాడు. అయితే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిలో కొద్ది మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..నేను ఇప్పుడు దేవుడిని సంపదను ఇవ్వమని కోరుకోవడం లేదు. కానీ సంపాదించిన ఆస్తిని దానం చేసే గుణాన్ని ఇవ్వమని వేడుకుంటున్నా. అన్ని సహకరిస్తే త్వరలో రూ.400 నుంచి రూ.500కోట్ల క్యాపిటల్ ఫండ్ తో ఎన్జీఓని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు కరోనా కారణంగా దేశంలో తలెత్తిన ఆర్ధిక మాద్యంపై స్పందించారు. గతంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కంటే .. కరోనా సృష్టించిన ఆర్ధిక సంక్షోభం పెద్దది కాదని, రాబోయే రోజుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ 10శాతం పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఓకి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రాకేశ్ జున్జున్వాలా స్టార్ హెల్త్లో వాటాదారులుగా ఉన్నారు. చెన్నైకి చెందిన వి.జగన్నాథన్ యూనైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే 2006లో వి.జగన్నాథన్ చెన్నైలో స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ను ప్రారంభించి మెడిక్లయిమ్,యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్తో అనతికాలంలో ప్రజాదారణ పొందారు. దీంతో బిగ్ బుల్ రాకేశ్ 2018 ఆగస్ట్ నెలలో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, మాడిసన్ క్యాపిటల్ తో కలిసి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ 90 శాతం వాటాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం దరఖాస్తు దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.2,000 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: హింట్ ఇచ్చేసిందిగా, ఇండియన్ రోడ్లపై టెస్లా చక్కర్లు -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి కనబరిచాయి. మధ్యాహ్నం తర్వాత టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ షేర్లు రాణించడంతో సూచీలు పుంజుకున్నాయి. నిఫ్టీ సైతం ఇదే దొరణి కొనసాగించింది. చివరకు బీఎస్ఇ సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 53,000 53,054 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు పైకిచేరి 15,879 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద నిలిచింది. టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిస్తే.. టైటన్, మారుతీ, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి. -
Stock Market: ఈ వారంలో జోష్ రావాలంటే ఇవే కీలకం
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు రుతు పవనాల గమనం దారి చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థికపరమైన ప్రధాన గణాంకాల విడుదల లేకపోవడంతో కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి జరుగుతున్న అన్లాకింగ్, వ్యాక్సినేషన్ తదితర అంశాలు సైతం ట్రెండ్కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషించారు. వీటికితోడు విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరును సైతం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని తెలియజేశారు. ఒడిదొడుకులు.. ఈ వారం జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో హెచ్చుతగ్గులకు అవకాశమున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ట్రేడర్లు జులై ఎఫ్అండ్వో సిరీస్కు పొజిషన్లను రోలోవర్ చేసుకునే వీలున్నట్లు తెలియజేశారు. కాగా.. సాంకేతికంగా చూస్తే ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీకి 15,450–15,900 పాయింట్ల మధ్య పటిష్ట అప్ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో చార్టుల ప్రకారం నిఫ్టీ 15,400 స్థాయికి ఎగువన కొనసాగితే.. 15,800–15,900 పాయింట్ల వరకూ బలపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 16,050–16,130 పాయింట్లకు చేరవచ్చని అభిప్రాయపడ్డారు. 15,400 దిగువకు చేరితే అప్ట్రెండ్కు విఘాతం ఏర్పడవచ్చని చెప్పారు. చమురు ధరల ఎఫెక్ట్ గత వారం ముడిచమురు ధరలు 73 డాలర్ల స్థాయికి చేరడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయనుంది. వీటికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 90 నుంచి 92కు బలపడింది. 2023లో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు దీనికి కారణంకాగా.. రూపాయి 74 స్థాయికి బలహీనపడింది. గత వారం 1.17 శాతం క్షీణించింది. ఈ అంశాలు సెంటిమెంటును బలహీనపరిచే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా చూస్తే రుతు పవన విస్తరణ, వ్యాక్తినేషన్ వేగం వంటి అంశాలు మార్కెట్ల కదలికలను నిర్దేశించగలవని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, రిలయన్స్ సెక్యూరిటీస్ నిపుణులు బినోద్ మోడీ పేర్కొన్నారు. ఈ వారం మార్కెట్లు కొంతమేర కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని అంచనా వేశారు. మిడ్ క్యాప్స్ ఫలితాలు ఇప్పటికే ఫలితాల సీజన్ ముగింపునకు చేరుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఇకపై మరిన్ని క్యూ4, పూర్తి ఏడాది(2020–21) ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా సుమారు 500 మిడ్, స్మాల్ కంపెనీలు ఫలితాలు వెలువడనున్నట్లు తెలియజేశారు. ఎఫ్పీఐల జోరు గత కొద్ది నెలలుగా దేశీ క్యాపిటల్ మార్కెట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను భారీగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బాటలో జూన్ నెలలో ఇప్పటివరకూ దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ. 13,667 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. కాగా, ఫెడ్ రేట్ల నిర్ణయ ప్రభావం ఇకపై ఎలా ఉంటుందో చూడాలి. చదవండి : డెట్ ఫండ్స్..తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి! -
లాక్డౌన్ గుబులు: సుమారు 6 లక్షల కోట్లు సంపద ఆవిరి
సాక్షి,ముంబై: స్టాక్మార్కెట్ల మహాపతనంతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందను క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్డౌన్ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 వద్దకు చేరుకుంది. అంతకుముందు 48,832 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 426 పాయింట్ల పతనమై 14200కు దిగువకు చేరింది. దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఆరంభంలో మార్కెట్ల భారీ పతనంతో రూ .5.82 లక్షల కోట్ల మేర క్షీణించడంతో బీఎస్ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ గత సెషన్లోని రూ. 205.71 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 199.89 లక్షలకు కోట్లకు పడిపోయింది. బ్యాంకింగ్, ఆటో తో పాటు అన్న రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఈ పరిణామానికి దారి తీసింది. అయితే ఫార్మ, ఆక్సిజన్ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. (కరోనా సెగ : రుపీ ఢమాల్) తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ ఎగ్జిక్యూటివ్-విపి రస్మిక్ ఓజా తెలిపారు. కోవిడ్ కేసుల పెరుగుదల, రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు రాబోయే 2-3 నెలలలో మరింత ఎగియనుందనే ఆందోళన, దీంతో పలు రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు, లాక్డౌన్ల అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నాయన్నారు. ఇది మన ఎకానమీ వీ షేప్ రికవరీని దెబ్బతీస్తుందనీ, ఆదాయ అంచనాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాటు మరణాల రేట్లు పెరగడం పెట్టుబడిదారులను భయపెట్టిందని టిప్ప్ 2 ట్రేడ్స్లో సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ తెలిపారు. సాంకేతికంగా, నిఫ్టీ 14192 కన్నా దిగువన ముగిస్తే మరింత బలహీనం తప్పదన్నారు. (దలాల్ స్ట్రీట్లో కరోనా ప్రకంపనలు) కాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకటారం గత 24 గంటల్లో 2.73 లక్షల తాజా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 1,619 కొత్త మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులకుసంబంధించి ఇండియా ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్) -
కరోనా సెకండ్ వేవ్: కుప్పకూలిన మార్కెట్
సాక్షి,ముంబై: రెండో దశలో దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్మార్కెట్ ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 916, నిఫ్టీ 276 పాయింట్ల మేర నష్టపోయాయి. అనంతరం మరింత క్షీణించిన సెన్సెక్స్ 1160 పాయింట్ల నష్టంతో 48430 వద్ద, నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 14482 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల దెబ్బతో కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంకు కూడా దాదాపు 1200 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్ 1353పాయింట్ల నష్టంతో 484237వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు పతనమై 14423 వద్ద కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 48300, నిఫ్టీ 14500 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలనందించాయి. దేశంలో కరోనా ఉధృతి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితంగా చేస్తోంది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. (ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!) కేసుల నమోదులో సరికొత్త రికార్డు: కాగా తాజా గణాంకాల ప్రకారం దేశంలో 168012 కొత్త పాజిటివ్ కేసులో నమోదయ్యాయి. కరోనా కేసుల నమోదుకు సంబంధించి సరికొత్త రికార్డుతో మరింత బెంబేలెత్తిస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్లో కరోనా సెగ: మూడురోజుల లాభాలకు చెక్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లను కరోనా సెకండ్ వేవ్ వణికించింది. రోజుకురోజుకు కేసుల నమోదు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఆరంభంలో లాభాల్లో ఉన్న మార్కెట్లు మిడ్ సెషన్ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికి తోడు వారాంతం కావడంతో లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో సెన్సెక్స్ 155 పాయింట్లు క్షీణించి 48591 వద్ద, నిప్టీ 39 పాయింట్ల నష్టంతో 14834 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాలషేర్లు నష్టాలతోనే ముగిసాయి. ఐటీ, ఫార్మా స్వల్పంగా లాభపడగా, ఇన్ఫ్రా, బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, భారత్ పెట్రోలియం క్షీణించాయి. అటు టాటా మోటార్స్, హిందుస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఐటిసి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, ఒఎన్జిసి, జెఎస్డబ్ల్యు స్టీల్ లాభాలు ఆర్జించాయి. (కరోనా కలకలం : 37 మంది వైద్యులకు పాజిటివ్) మరోవైపు దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం గడచిన 24 గంటల్లో 1,31,968మంది కొత్తగా కోవిడ్-19 వైరస్ బారిన పడ్డారు. దీంతో వరసగా మూడో రోజూ లక్షా పదిహేనువేలకిపైగా కేసులు నమోదైనాయి. నిన్న ఒక్కరోజే 780 మరణాలు సంభవించడం గమనార్హం. -
ఫ్లాట్గా కొనసాగుతున్న స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా ప్రస్తుతం సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 51727 వద్ద నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 15233 కొనసాగుతోన్నాయి. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరోవైపు ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఐటీ, పీఎస్ఈ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, ఓఎన్జీసీ , పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఐఓసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లాభంతోనూ ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ నష్టంతో ఉన్నాయి. -
బ్యాంకింగ్ షాక్ : 49 వేల దిగుకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: చారిత్రక గరిష్టాలనుంచి కీలక సూచీలు వెనక్కి తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గానే ఉన్నప్పటికీ ఆరంభంలో లాభాల్లో ఉన్నా ఆతరువాత నుంచి అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్ ఇండెక్స్లో భారీ అమ్మకాల వెల్లువ కురిసింది. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1000పాయింట్లు కుప్పకూలింది. లాభనష్టాల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 746 పాయింట్ల నష్టంతో 48878 వద్ద 49 వేల స్థాయినికూడా కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా ఏకంగా 218 పాయింట్ల నష్టంతో 14372 వద్ద 14400 వేల దిగుకు చేరింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిసాయి. టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్గా ఉన్నాయి. యాక్సిస్,ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, హిందాల్కో, టెక్ మహీంద్రా, బజాజ్ఫైనాన్స్ డాక్టర్ రెడ్డీ టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు టాటా మోటార్స్ బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్ , హీరోమోటోకార్ప్, బ్రిటానియా నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి.