Petroleum Minister Puri Urges Oil Companies To Reduce Petrol, Diesel Prices - Sakshi
Sakshi News home page

ఎన్నాళ్ల కెన్నాళ్లకు..వాహనదారులకు శుభవార్త!

Jan 23 2023 6:43 AM | Updated on Jan 23 2023 9:06 AM

Union Minister Puri Urges Oil Companies To Slash Prices In India - Sakshi

వారణాసి: త్వరలో పెట్రోల్‌ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వ్యక్తం చేశారు. గతంలో పెట్రోల్‌ విక్రయంపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ నష్టపోతున్నాయి.

గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్‌ విక్రయ ధరలు తగ్గుతాయని పురి అన్నారు.

అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్‌ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్‌ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement