
వీడియో దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్ : ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన అవెంజర్ బైక్ దొంగతనానికి గురైన ఘటన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. కొద్దిరోజుల క్రితం జుమ్మేరాత్ బజార్ వద్ద పెట్రోల్ పంప్ ఎదురుగా గల్లీలో నిలిపి ఉంచిన అవెంజర్ను ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీకి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మంగళహాట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి : ఆన్లైన్ మోసం.. పోలీసులకే టోకరా..