యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే | Boy Dies After Surgery While Watching Youtube Videos In Bihar | Sakshi

యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే

Published Sun, Sep 8 2024 3:51 PM | Last Updated on Sun, Sep 8 2024 4:45 PM

Boy Dies After Surgery While Watching Youtube Videos In Bihar

దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని  ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్‌ డాక్టర్‌ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్‌ చూస్తూ గాల్‌ బ్లాడర్‌ ఆపరేషన్‌ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్‌.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్‌ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్‌.    

పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌ రాష్ట్రం సరణ్‌ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్‌ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్‌ అజిత్‌ కుమార్‌ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్‌ చేశారు. యూట్యూబ్‌ వీడియోస్‌ చూసి ఆ ఆపరేషన్‌ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్‌ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. 
గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్‌ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్‌ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. 

నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు 
అయినా, ఆపరేషన్‌ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్‌ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్‌ చేసిన నకిలీ డాక్టర్‌ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.

విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్‌ అజిత్‌ కుమార్‌ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement