
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ ఇంటిలో ఏం జరిగిందో గానీ ఓ తల్లి తన పిల్లలతో సహా నదిలో దూకేసింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఖమ్మం నగరంలో ఓ తల్లి తన ఇద్దరి పిల్లలు మున్నేరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు నదిలో దుకే సమయంలో చూసిన జాలరులు రక్షించటానికి ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా వాళ్ల ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు. మృతులను వనితి , చైతన్య, రోహితలుగా గుర్తించారు.
చదవండి: అధికారి భార్య ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment