నరరూప రాక్షసుల్లా టీడీపీ గూండాలు.. ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ | YSRCP Leaders Fires On TDP Attacks In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నరరూప రాక్షసుల్లా టీడీపీ గూండాలు.. ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ

Published Thu, Jul 18 2024 4:16 AM | Last Updated on Thu, Jul 18 2024 1:12 PM

YSRCP Leaders Fires On TDP Attacks In Andhra Pradesh

ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ గూండాలు నరరూపరాక్షసుల్లా తయార­య్యా­రని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. వైఎ­స్సార్‌­సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ­క్షణా రహితంగా దాడులకు తెగబడుతు­న్నారంటూ మండిపడింది. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి నడిరో­డ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఘ­టనే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. వినుకొండ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు రషీద్‌పై టీడీపీకి చెందిన గూండా జిలానీ పాశవికంగా కత్తితో దాడిచేసి హతమార్చారని ఆరోపించింది. 

అందరూ చూస్తుండగా, దారుణంగా రెండు చేతులు నరికి మెడపై కూడా పదేపదే కత్తితో వేటువేయడంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడని తెలిపింది. కొన ఊపిరితో ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడని పేర్కొంది. టీడీపీతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను  ట్యాగ్‌ చేస్తూ టీడీపీ వాళ్ల రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలి?  అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement