
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
గండేపల్లి: ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యువీ శివనాగబాబు తెలిపారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామానికి చెందిన బాడవుల కేదార్ మణికంఠ (21) రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం స్నేహితుడు విష్ణువర్ధన్తో కలిసి ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో బిర్యాని తినేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గండేపల్లి శివారుకు వచ్చేసరికి బైక్పై రాంగ్రూట్లో వచ్చిన వ్యక్తి వీరి బైక్ను ఢీకొట్టడంతో కేదార్ మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. రాజానగరం జీఎస్ఎల్కు తరలించగా అప్పటికే మణికంఠ మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.