పెళ్లయిన ఏడాదికే.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లయిన ఏడాదికే..

Published Fri, Nov 24 2023 1:32 AM | Last Updated on Fri, Nov 24 2023 10:05 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్: ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం పచ్చునూర్‌ గ్రామానికి చెందిన మానస (25)కు గట్టుదుద్దెనపల్లికి చెందిన పప్పు సంపత్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆరు నెలలకే అదనంగా డబ్బులు తీసుకురావాలంటూ భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

దీపావళికి మానస తల్లి గారింటికి వచ్చింది. భర్త డబ్బులు కావాలని వేధిస్తున్నాడని తల్లిదండ్రులతో చెప్పింది. పండుగ మరుసటి రోజు సంపత్‌ పచ్చునూర్‌ వచ్చి, డబ్బులివ్వాలని గొడవపడి వెళ్లిపోయాడు. అప్పటినుంచి మానస పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి, బయటకు వెళ్లిపోయింది. గురువారం తల్లిదండ్రులు వెతకగా గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో మానస మృతదేహం కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి కూడా చదవండి: బంధువుల ఇంట్లో.. జరిగే శుభకార్యానికి వెళ్లొస్తూ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement