manasa
-
ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్కి, అర్జున్కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు. -
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్లు, దువ్వెనలు, పెన్స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
సంక్రాంతి మాకెంతో ప్రత్యేకం
‘సంక్రాంతి పండగ అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటున్నారు పాయల్ రాజ్పుత్. ‘సంక్రాంతికి ఫుల్ ఎనర్జీతో భోగి మంటలు వేస్తుంటాను’ అన్నారు మానసా చౌదరి. ‘సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడమంటే చాలా ఇష్టం’ అంటున్నారు మాళవికా శర్మ. ఇలా సంక్రాంతిని తాము ఎలా జరుపుకొంటామో అంటూ ఈ కథానాయికలు సాక్షితో పంచుకున్న విశేషాలు.. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి – పాయల్ రాజ్పుత్ నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పంజాబీ ఆడియన్స్ కు హ్యాపీ లోహ్రీ. సంక్రాంతి పండగ అంటే నాకు ఎన్నో జ్ఞపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. పూజలు చేస్తాం.. ఇష్టమైన వంటకాలు చేసుకుంటాం. చిన్న తనంలో సంక్రాంతి పండక్కి గాలిపటాలను ఎగరవేసేదాన్ని. కానీ, నా జీవితం ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి గాలిపటాలను ఎగరవేసే సమయంలో మనలో కలిగే ఆ ఆనందపు అనుభూతిని కొంతకాలంగా మిస్ అయ్యాను. ఈ సారి ఢిల్లీలో నా స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగర వేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా సిబ్బందిలో కొంతమంది హైదరాబాదీలు ఉన్నారు. వారితో పాటు సంక్రాంతిని నేను సెలబ్రేట్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. నేను భోజన ప్రియురాలిని. ప్యూర్ వెజిటేరియన్ ని. మసాలా కిచిడీ, లడ్డు అంటే చాలా ఇష్టం. ఇలా మా అమ్మగారు పండక్కి చేసిన వంటకాలను ఇష్టంగా తింటాను. ఇక నేను నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’ మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.. నా అభిమానులకు కూడా థ్యాంక్స్. ఓ నటిగా మంచి కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. గాలిపటాలు ఎగరవేయడం చాలా ఇష్టం – మాళవికా శర్మ సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండగ. వారు ఎంతోకష్టపడి పండించిన పంటలు ఈ సంక్రాంతికి వారి చేతికి వస్తాయి. సూర్యభగవానుడికి పూజలు చేయడంతో మా సంక్రాంతి మొదలవుతుంది. మా అమ్మమ్మ మాకు ప్రతి సంక్రాంతికి కొత్త దుస్తులు ఇస్తుంటారు. నువ్వుల లడ్డూలు ఇస్తారు. లక్కీగా మా అమ్మమ్మగారి బర్త్ డే కూడా సంక్రాంతి రోజునే. మేము కూడా స్వీట్స్ను పంచిపెడతాం. మేం చేయగలిగినంతలో పేదలకు సాయం చేస్తుంటాం. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరిలానే నాకు గాలిపటాలను ఎగరవేయడం చాలా ఇష్టం. ఆకాశంలో కనిపిస్తున్న రంగు రంగుల గాలిపటాలు.. భూమిపై రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు ప్రతీకగా నేను భావిస్తుంటాను. నాపై తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలకు చాలా రుణపడి ఉంటాను. ముంబై నా జన్మభూమి అయితే హైదరాబాద్ నా కర్మభూమి. ఎందుకంటే.. నేను ఇక్కడే మూవీస్ చేస్తున్నాను. నేను నటించిన గోపీచంద్గారి ‘భీమా’, సుధీర్బాబుగారి ‘హరోంహర’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో నా పాత్ర చాలా ఎగై్జటింగ్గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం – మానసా చౌదరి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు స్వగ్రామం. నాన్న మధుసూదన్ నాయుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు. మేము చెన్నైలో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఊరు వెళతాం. అక్కడ నాన్న, అమ్మ సుజాత, నేను, తమ్ముడు చేతన్ కలిసి మా బంధువులతో ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటాం. కానీ, ఈ ఏడాది ఊరు వెళ్లలేకపోయాను. మా బంధువులు, కజిన్స్ ఫోన్ చేసి.. ‘ఏంటి? హీరోయిన్ అయిపోయావని ఊరికి రావా?’ అంటున్నారు. అయితే ఆదివారం భోగి పండగని చెన్నైలోనే జరుపుకొన్నాను. మేము ఉన్న వీధిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉంటారు.. సెలబ్రేట్ చేసుకుంటాం. ► సంక్రాంతి పండగలో తొలిరోజు వచ్చే భోగి అంటే మరీ ఇష్టం. తొలిరోజు కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉంటా. ఉదయాన్నే లేచి పెద్ద భోగిమంటలు వేసేవాళ్లం. ఆ తర్వాత ఆయిల్ బాత్ చేసి, కుటుంబమంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవాళ్లం.. థియేటర్కి వెళ్లి సినిమాలు చూస్తాం. ఆ తర్వాత మకర సంక్రాంతిన పొంగల్ చేయడం ఇష్టం. నేను నాన్ వెజ్ బాగా తింటాను. ప్రత్యేకించి నాటుకోడి కూరతో రాగిసంకటి తినడం చాలా ఇష్టం. అలాగే మటన్ నా ఫేవరేట్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఎవరైనా గాలిపటాలు ఎగర వేస్తుంటే చూస్తుంటాను. కానీ నేను గాలిపటాలు ఎగరవేయలేదు. తెలుగులో ‘బబుల్గమ్’ సినిమాకి ముందే నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ, చేయలేదు. ‘బబుల్గమ్’ తర్వాత కథలు వింటున్నాను. అయితే నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది కెరీర్లో ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్లాలనుకుంటున్నాను. -
సినిమా చూసి నాన్న ఎమోషన్ అయ్యారు
‘‘నటన పరంగా అమ్మానాన్న (సుమ, రాజీవ్ కనకాల) సలహాలు తీసుకుంటాను. ‘బబుల్గమ్’ మూవీని వారు చూశారు.. బాగా నచ్చింది. ఆ టైమ్లో నేను అక్కడ లేను. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నాన్న ఎమోషన్ అయి, ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. ఆయన్నుంచి ప్రశంస రావడం ఆనందంగా అనిపించింది’’ అని రోషన్ కనకాల అన్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘నా బాల్యం అంతా దాదాపుగా తాతగారి (దేవదాస్ కనకాల) నటనా శిక్షణ కేంద్రంలో గడిచింది. నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. అది తెలియని ఒక థ్రిల్ ఇస్తుంది. నటుడు కావాలనే నా కల ‘బబుల్గమ్’తో నెరవేరడం ఆనందంగా ఉంది. న్యూ ఏజ్ కంటెంట్తో వస్తున్న ఈ సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా షూటింగ్కి వెళ్లే నెల రోజుల ముందే వర్క్ షాప్ నిర్వహించడం మాకు ప్లస్ అయింది. ఈ మూవీలో ఓ సీన్ కోసం దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా తిరిగాను. మొదట్లో సిగ్గుపడ్డా... ఆ తర్వాత పోయింది (నవ్వుతూ). మా అమ్మానాన్నలకు పరిశ్రమలో చాలా మంచి పేరుంది. నేను హీరోగా వస్తుండటం బాధ్యతగా అనిపిస్తోంది. ఫలానా జోనర్ మూవీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ప్రేక్షకులను అలరించే మంచి సినిమాలు చేయడం ఇష్టం’’ అన్నారు. -
అలా జడ్జ్ చేయడం బాధగా ఉంది
‘‘మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్’లో కొన్ని సీన్లకు మేం ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వ్యూస్, ఇన్స్టా రీల్ వ్యూస్తో మ్యూజిక్ డైరెక్టర్స్ను జడ్జ్ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఆల్బమ్స్పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రోషన్ కనకాల, మానస జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్గమ్’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్. నా ఫ్రెండ్స్లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్ మ్యూజిక్పై అవగాహన ఉంది. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్గమ్’ చూశాను. రోషన్ మంచి నటుడు, డ్యాన్సర్. డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల మ్యూజిక్ కం΄ోజర్స్కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్ టచ్ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాలోని మ్యూజిక్ నచ్చి నాకు చాన్స్లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్ప్రైజ్’’ అని చెప్పుకొచ్చారు. -
ఇక స్పీడ్గా సినిమాలు చేస్తాను
రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో రవికాంత్ పేరేపు చెప్పిన విశేషాలు. ∙ప్రేమకథ ప్రధానంగా సాగే రిలేషన్షిప్ డ్రామా ‘బబుల్గమ్’. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించారు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది. రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథ చె΄్పాను. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకు ఇష్టమైనది చేయాలా? సంపాదన కోసం ఏ ఉద్యోగమైనా చేయాలా? అనే అయోమయంలో ఉంటారు. అలాంటి ఓ కన్ఫ్యూజన్లో ఉన్న ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశం. రోషన్కు ఇది తొలి సినిమా అయినా అతని తల్లిదండ్రులు సుమ, రాజీవ్ కనకాల ఈ సినిమాలో జోక్యం చేసుకోలేదు. ‘ప్రేమ బబుల్గమ్ లాంటిది. మొదట్లో తీయగా ఉంటుంది. ఆ తర్వాత చప్పగా ఉంటుంది. ఆ నెక్ట్స్ అతుక్కుంటే వదలదు’ అనే డైలాగ్ ఉంటుంది. కథానుసారం ఈ సినిమాకు ‘బబుల్గమ్’ టైటిల్ పెట్టాం. ఇక నా ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఇప్పుడు ‘బబుల్గమ్’ సినిమాలకు శ్రీ చరణ్ సంగీతం ఇచ్చాడు. మేమిద్దరం ఒకే ఊరివాళ్లం కాబట్టి కంఫర్ట్ కుదిరింది. ‘బబుల్గమ్’ ట్రైలర్ను చిరంజీవిగారికి చూపించాం. ఈ సినిమాలోని ‘ఇజ్జత్..’ సాంగ్ ఆయనకు బాగా నచ్చింది. ‘క్షణం’ మంచి విజయం సాధించింది. ఎందుకో కానీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ నాకు అంతగా రాలేదు. దర్శకత్వంలో అడివి శేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రచారం జరిగింది. నిజానికి ‘అడివి’ శేష్, శ్రీచరణ్ పాకాల ‘క్షణం’ క్రెడిట్ నాకే ఇస్తారు. ఓ అవుట్సైడర్గా ఇండస్ట్రీ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత టైమ్ పట్టింది. ఇకపై దర్శకుడిగా స్పీడ్గా సినిమాలు చేస్తాను. -
పెళ్లయిన ఏడాదికే..
సాక్షి, కరీంనగర్: ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ రాజ్కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం పచ్చునూర్ గ్రామానికి చెందిన మానస (25)కు గట్టుదుద్దెనపల్లికి చెందిన పప్పు సంపత్తో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆరు నెలలకే అదనంగా డబ్బులు తీసుకురావాలంటూ భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీపావళికి మానస తల్లి గారింటికి వచ్చింది. భర్త డబ్బులు కావాలని వేధిస్తున్నాడని తల్లిదండ్రులతో చెప్పింది. పండుగ మరుసటి రోజు సంపత్ పచ్చునూర్ వచ్చి, డబ్బులివ్వాలని గొడవపడి వెళ్లిపోయాడు. అప్పటినుంచి మానస పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి, బయటకు వెళ్లిపోయింది. గురువారం తల్లిదండ్రులు వెతకగా గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో మానస మృతదేహం కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: బంధువుల ఇంట్లో.. జరిగే శుభకార్యానికి వెళ్లొస్తూ.. -
నాకు డ్యాన్స్ చేయాలనిపించింది
‘‘బబుల్గమ్’ సినిమాలోని ‘ఇజ్జత్..’పాట చాలా హుషారుగా అనిపించింది. శ్రీచరణ్ పాకాల చక్కని సంగీతం అందించారు. ‘ఇజ్జత్..’ అనే ర్యాప్ సాంగ్లో రోషన్తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది. ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో ఈ పాట మార్మోగుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బబుల్గమ్’. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇజ్జత్..’ పాటను చిరంజీవి రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి ఎం.ఎస్. హరి సాహిత్యం అందించగా, రోషన్ కనకాల, ఎం.ఎస్. హరి పాడారు. -
ఆంధ్రాయూనివర్సిటీ టాపర్గా గవిడి మానస
చీపురుపల్లి: సాధారణ కుటుంబంలో జన్మించి చదువుల తల్లిగా ఎదిగింది. టాపర్గా నిలవడానికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదని, కేవలం కష్టపడి చదవడమేనని రుజువు చేసింది. టాపర్గా నిలవడానికి అహర్నిశలు కృషి చేసి ఆంధ్రాయూనివర్సిటీ స్థాయిలో టాపర్గా నిలిచి నేటి యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచింది చీపురుపల్లి పట్టణానికి చెందిన గవిడి మానస. 2020–21 విద్యాసంవత్సరంలో మానస ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి టాపర్గా నిలిచింది. అయితే ఆ విద్యా సంవత్సరానికి మానస యూనివర్సిటీ స్థాయిలో టాపర్గా నిలవడంతో ఆమెను 18 అవార్డులు వరించాయి. వాటిలో 4 బంగారు పతకాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వివిధ సంస్థలు పతకాలు, ప్రశంసలు ఇస్తుంటాయి. అందులో భాగంగానే మానసకు 18 అవార్డులు లభించాయి. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రాయూనివర్సిటీలో స్నాతకోత్సవాలు జరగకపోవడంతో వరుసగా మూడు స్నాతకోత్సవాలును శనివారం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మానస మెరిట్ ధ్రువీకరణతో బాటు పతకాలు అందుకుంది. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీలోనే భౌతికశాస్త్రంపై మానస పీహెచ్డీ చేస్తోంది. ఇదిలా ఉండగా మానస తండ్రి శాంతారావు ఇందిరక్రాంతి పథం(వెలుగు)లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి పైడిరాజు వీఓ ఏగా పని చేస్తోంది. మానస ఒకేసారి 18 అవార్డులు తెచ్చుకోవడం, యూనివర్సిటీ టాపర్గా నిలవడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. -
ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు!
సాక్షి, ఖమ్మం: మెడీకో విద్యార్థిని మానస మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని మమత మెడికల్ కాలేజ్లో బీడీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్న మానస ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. హాస్టల్ గదిలో లోపల గడి పెట్టుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. 80శాతం గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మహబూబాబాద్ కేసముద్రానికి చెందిన మానస.. మానసిక ఒత్తిడి కుటుంబ పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యవక్తమవుతున్నాయి. ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్లాగ్లున్నట్లు సమాచారం. మరోవైపు మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ చేపట్టకుండా పోలీసులు ఆగమేఘాలపై మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులిపేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వార్త: ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. హాస్టల్ నిర్వాహకులు, సహచర విద్యార్థుల నుంచి వివరాలేమీ సేకరించకుండా హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమయ్యింది. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మానస మృతికి దారితీసిన కారణాలపై కనీస స్పష్టత కొరవడింది. అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి మీడియాను అనుమతించొద్దని పోలీసులు చెప్పారంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విలేకరులను హాస్టల్ నిర్వాహకులు గేటు బయటే అడ్డుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఖమ్మం అర్బన్ సీఐ శ్రీహరిని వివరణ కోరగా.. తమ ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు. కాగా సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకున్న మానస.. మానసిక ఒత్తిళ్లతోనే బలవన్మరణం చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చదవండి: అసమ్మతి నేతల ‘అల్టిమేటం’.. ‘బండి’ని ఢిల్లీ పిలిపించిన అధిష్టానం? -
ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు
ఊలు ఉన్నది వెచ్చని స్వెట్టర్లు అల్లడానికే కాదు. చక్కగా చిత్రంగా బొమ్మలు వేయడానికి కూడా. ఊలు బొమ్మలంటే ఊలుతో అద్దిన బొమ్మలు కాదు. ఊలుతో అల్లిన చిత్రాలు... ఉలెన్ ఆర్ట్ కళారూపాలు. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు. అది నవంబర్ 17. బెంగళూరు, కర్నాటక చిత్రకళా పరిషత్తోని దేవరాజ్ అర్స్లో ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్. అది సోలో ఎగ్జిబిషన్. అందులో వినూత్నమైన చిత్రాల ప్రదర్శన. రంగు అద్దుకున్న కుంచె నుంచి కాన్వాస్ మీద రూపుదిద్దుకున్న రూపమేనా? సందేహం కలుగుతుంది. కళ్లు భ్రమకు గురి చేస్తున్నాయా అనే అనుమానం కూడా. భ్రుకుటి ముడిచి నిశితంగా చూస్తే తెలుస్తుంది అది దారాలు చేసిన మాయ అని. పోరింగ్ ఆర్ట్ను తలపిస్తూ రంగుల దారాలు పెయింటింగ్ ఫ్రేమ్ నుంచి కిందకు జాలువారి ఉన్నాయి. మొత్తం 14 చిత్రాలవి. అన్నింటిలోకి పెద్ద చిత్రం పదకొండు అడుగుల ఎత్తు, ఏడున్నర అడుగుల వెడల్పు ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో ఉన్నాయి. కానీ ప్రధానంగా ‘అమ్మ’ మనసును ప్రతిబింబిస్తున్నాయి. అమ్మ బొమ్మ కనిపించదు, నిద్రపోతున్న బిడ్డను సంతృప్తిగా చూసుకునే భావం బొమ్మల్లో ద్యోతకమవుతుంది. ఆ చిత్రాల రూపకర్త ఓ తెలుగు మహిళ. పేరు మానసప్రియ. ఆమె ఈ కళారూపాల కోసం ఐదేళ్లు నిరంతరంగా శ్రమించారు. పిన్నికి ఇచ్చిన మాట కోసం ఆమె జీవించి ఉండగానే ప్రదర్శించడం కోసం రెండేళ్ల పాటు నిద్రను త్యాగం చేస్తూ పని చేశారు. ఆమె పని చేస్తున్న వేగం కంటే పిన్నిని ఆవరించిన క్యాన్సర్ ఇంకా వేగంగా విస్తరించింది. పిన్నిని తీసుకువెళ్లి పోయింది. పిన్ని సీత ప్రథమ వర్థంతికి మానస ప్రియ ఇచ్చిన కన్నీటి కళాసుమాంజలి ఈ ప్రదర్శన. తాను ఆర్టిస్ట్ అయిన నేపథ్యాన్ని, చిత్రకళలో చేస్తున్న ప్రయోగాలను సాక్షితో పంచుకున్నారామె. ప్రకాశం నుంచి బళ్లారి ‘‘మా తాతలు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా నుంచి కర్నాటకలోని బళ్లారికి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను బళ్లారిలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. పెన్సిల్తో చక్కటి రూపాన్ని తీసుకురాగలిగేదాన్ని. స్కూల్లో ప్రైజ్లు కూడా వచ్చాయి. అయితే నాకు పెద్ద అడ్డంకి చదువే. ఎంత ప్రయత్నించినా మార్కులు పెద్దగా వచ్చేవి కాదు. అందులో నా అదృష్టం ఏమిటంటే... మార్కులు రావడం లేదని చదువు మానిపించకుండా ఫైన్ ఆర్ట్స్లో (బి.ఎఫ్.ఏ) చేర్పించడం. హైదరాబాద్లో లాలాపేట నుంచి ఉదయం ఐదింటికి ఉప్పల్కి వెళ్లి అక్కడి ప్రకృతి దృశ్యాలను బొమ్మలు వేశాను. పదిరోజులు వైజాగ్లో కాలేజ్ బల్లల మీద పడుకుంటూ ప్రాజెక్ట్ చేశాను. బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత బెంగళూరులో విజువల్ ఆర్ట్స్లో మాస్టర్స్ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిస్ట్గా గుర్తింపు పొందే లోపే పెళ్లి. పిల్లల కోసం కొంత గ్యాప్ తీసుకున్నాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత రేఖ అనే ఫ్రెండ్ ఆహ్వానంతో కేరళ, ఫోర్ట్ కొచ్చిలో నా చిత్రాలను ప్రదర్శించాను. అప్పటికి ఉలెన్ పెయింటింగ్స్ మొదలు పెట్టలేదు. అయితే ఆర్టిస్ట్గా ఊరికే ఉండకుండా ఏదో ఒక ప్రయోగం చేసేదాన్ని. అలా టెర్రారియమ్ అని గాజు సీసాల్లో మొక్కలను పెంచడం వంటి హాబీలు ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత పెయింటింగ్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఉలెన్ ప్రయోగం మొదలు పెట్టాను. మా వారి ఉద్యోగరీత్యా ఇప్పుడు పూనాలో ఉంటున్నప్పటికీ నా ఆర్ట్ ప్రయోగాలు మానలేదు. నా పేరు మీద మొక్క బెంగళూరులో ఎగ్జిబిషన్ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు అరవై దాటిన మహిళలు ఐదుగురు వచ్చారు. ‘మేము అక్కాచెల్లెళ్లం. ఓ సిస్టర్ ఈ రోజే కెనడా నుంచి వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ చూసి తీరాలని తనను నేరుగా తీసుకువచ్చాం’ అని చెప్పారు. అలాగే ఎగ్జిబిషన్ చివరి రోజు ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్గారు వచ్చి ‘వాళ్ల కాలేజ్లో రెండు రోజులు ఎగ్జిబిషన్ కావాల’ని అడిగారు. ఆరు వందల మంది విద్యార్థుల మధ్య నాతోనే ప్రారంభోత్సవం చేయించి, కాలేజ్ ప్రాంగణంలో నా పేరు మీద మొక్క నాటారు. ఐదేళ్లు నేను ఇంటి నాలుగ్గోడల మధ్య పడిన శ్రమ నాకో ప్రత్యేకతను తెచ్చింది. నేను అభ్యసించిన కోర్సుకి మరో కొత్త ఆర్ట్ ఫార్మ్ను జత చేయగలుగుతున్నాననే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు మానస ప్రియ. నా బొమ్మల్లో అమ్మ ఉంది నేను ఆర్టిస్ట్ని, తల్లిని. ఉలెన్ ఆర్ట్ మాధ్యమంగా అమ్మ మనసును ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. పిల్లలు మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఉలెన్ ఆర్ట్లో పిల్లల ముఖంలో ప్రసన్నత కోసం నేను శ్రద్ధగా పని చేయడాన్ని మా సీత పిన్ని చాలా ఇష్టంగా చూసేది. ‘ఈ కళాఖండాలతో ఎగ్జిబిషన్ పెడితే చూడాలని ఉంది’ అని చెప్పిందోసారి. ‘అలాగే చూస్తావు పిన్నీ’ అన్నాను. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే తెలిసింది పిన్నికి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని. అప్పటి వరకు మామూలుగా ప్రాక్టీస్ చేసిన నేను త్వరగా పూర్తి చేయాలని చాలా దీక్షగా పనిచేశాను. రెండేళ్లపాటు రోజుకు నాలుగు గంటలే నిద్రపోయాను. నేనెంత ఆత్రుత పడినప్పటికీ పిన్ని ఉండగా ఆ పని చేయలేకపోయాను. గత ఏడాది పిన్ని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. పిన్ని తొలి వర్ధంతి నాటికి ఎగ్జిబిషన్ పెట్టి తీరాలని ఈ ఏడాది నవంబర్లో ఆ పని చేయగలిగాను. ఈ ప్రక్రియలో నాకు చాలా మంది సహాయం చేశారు. అంజలి పట్వర్ధన్ నా ప్రతి బొమ్మకు ఒక పోయెమ్ రాశారు. ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటులో ఫ్రెండ్ తేజస్విని సహాయం చేసింది. – ధూళిపాళ్ళ మానస ప్రియ, ఉలెన్ ఆర్టిస్ట్ – వాకా మంజులారెడ్డి -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఇన్చార్జి తహసీల్దార్
సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): లంచం తీసుకుంటూ ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాలు.. రామారెడ్డి ఇన్చార్జి తహసీల్దార్ మానస, ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా అన్నారం గ్రామానికి చెందిన రైతు బన్నం బలరాం నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్, ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని రెండేళ్ల క్రితం ఆమె మరణించడంతో ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని తన పేరు మీదకు మార్చాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్లైన్ ఫీజు రూ. 3వేలు, దాని తర్వాత లంచం రూపంలో రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేనని రైతు ఇన్చార్జి తహసీల్దార్ మానసను కలవగా.. రూ. 4వేలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక బలరాం నిజామాబాద్లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం రూ. 4వేలు లంచం డబ్బులను ధరణి ఆపరేటర్ లక్ష్మణ్కు ఇస్తుండగా అధికారులు రెడ్ హాండెడ్గా పట్టుకున్నారు. తదుపరి విచారణ చేస్తున్నామని ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్పై చర్యలు ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు. -
టైటిల్ పాజిటివ్గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు. -
భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..
సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్): భర్త వేధింపులతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త దేవిరెడ్డి, మామ జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో తలదాచుకోవడం ఏంటని బంధువులు పెద్దఎత్తున తరలివచ్చి స్టేషన్ ముందు బైఠాయించారు. వివరాలు ఇలా.. మాడ్గుల మండలం అర్కపల్లికి చెందిన మానసను వనస్థలిపురం క్రిష్టియన్కాలనీకి చెందిన దేవిరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దేవిరెడ్డి మెడికల్ కంపెనీలో పని చేస్తుండగా మానస ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే... దేవిరెడ్డి సంసార జీవితానికి పనికిరాడని మానస తల్లిదండ్రులకు చెప్పగా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కోసం పెంచుకున్న దేవిరెడ్డి మానసను పలుమార్లు కొట్టడంతో పెద్దల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పారు. ఈ విషయమై 2021లో దేవిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చదవండి: (నవమి వేడుకల్లో ఘర్షణలు) నాటి నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న మానస ఈ నెల 9న మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ మానస అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా మానస అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. గత మూడ్రోజులుగా మానసిక క్షోభతో మృతి చెందిన మానస మృతదేహానికి భర్త దేవిరెడ్డి అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేయడంతో ఇంటికి తాళం వేసి వనస్థలిపురం పోలీస్స్టేషన్లో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. -
జూనియర్ ఆర్టిస్ట్ మానస మృతి.. అంత్యక్రియలకు డబ్బులు లేవు..
సాక్షి, జడ్చర్ల: బుల్లితెరపై చూద్దామనుకున్న తరుణంలో తన కూతురును రోడ్డు ప్రమాదం మింగేసిందని ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో శనివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్లు మృత్యువాత పడిన సంఘటనలో మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లిలోని పాతబజార్కు చెందిన మానస (21) ఉంది. చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..) స్థానికుల కథనం ప్రకారం.. ఈ యువతిది నిరుపేద కుటుంబం. ఆరేళ్ల క్రితం తల్లి బాలమణి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రి రవీందర్ ఓ పెట్రోల్బంకులో పనిచేసేవాడు. అక్క వైష్ణవి కొరియర్ కార్యాలయంలో చిరుద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పదోతరగతి వరకు చదివిన మానస బుల్లితెరపై కనిపించాలన్న ఆశతో హైదాబాద్ మెట్లెక్కిందని ఈ సందర్భంగా తండ్రి వివరించాడు. షార్ట్ ఫిలింస్లో నటించేదని, షూటింగ్స్ లేనప్పడు ఇంటికి వచ్చేదన్నారు. చదవండి: (అసలే మత్తు.. ఆపై స్పీడు) ఇటీవల తన ఇంటిలోని ఓ గదికి మరమ్మతు చేయించి రేకులకప్పుతో పాటు కలర్స్ వేయించిందన్నాడు. ఈనెల 16వ రాత్రి తన చేతికి గాయమైన సమయంలో కట్టుకట్టి ప్రాథమిక వైద్యం చేసిందని గుర్తు చేసుకుని లబోదిబోమన్నాడు. తన కూతురు వారం రోజుల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బస్సులో వెళ్లిందన్నాడు. శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న వార్త వినాల్సి వచ్చిందని బోరుమన్నాడు. తన కూతురు అంత్యక్రియలకు డబ్బులు లేవని వాపోయాడు. దాతలు స్పందించి సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) -
మిస్ వరల్డ్ పోటీ వాయిదా
ముంబై/సాన్జువాన్: మిస్ వరల్డ్–2021 పోటీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మిస్ ఇండి యా మానస వారణాసి (23) సహా పలువురు పోటీదారులు, సిబ్బంది కోవిడ్ బారినపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్యూర్టోరికోలోని సాన్ జువాన్లో డిసెంబర్ 16న ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమాన్ని రానున్న 90 రోజుల్లో రీషెడ్యూల్ చేస్తామని తెలిపారు. కరోనా బారిన పడిన పోటీదారులు, సిబ్బందిని ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు వెంటనే క్వారంటైన్కు తరలించి, వైద్యపరీక్షలు, అవసరమైన చికిత్సలు చేపట్టినట్లు తెలిపారు. వీరందరూ కోలుకున్న తర్వాత, మరోసారి పరీక్షలు నిర్వహించి నెగెటివ్గా తేలితే వారి వారి దేశాలకు పంపిస్తామని ‘మిస్ వరల్డ్’ సీఈవో జులియా మోర్లే పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన మానస భారత్ తరఫున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్యూర్టోరికో వెళ్లారు. -
పక్కా ప్లాన్తో మానస హత్య.. క్యాబ్ డ్రైవర్ సాయంతో గన్ కొని..
కొచ్చి: గత నెలలో జరిగిన డెంటల్ విద్యార్ధిని మానస హత్య కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. కేసుకు సంబంధించి బీహార్లోని మంగేర్ జిల్లాలో 21 ఏళ్ల సోను కుమార్ మోదీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ మానస(24) ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటోంది. రాఖిల్ (32) కూడా అదే జిల్లాకు చెందిన వాడు. రెండేళ్ల క్రితం ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత రాఖిల్ నువ్వు ఏ అబ్బాయితోనూ మాట్లాడొద్దు, చాటింగ్ చెయ్యొద్దంటూ కంట్రోల్ చెయ్యడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతడు పెడుతున్న షరతులు భరించలేక బ్రేకప్ చెప్పింది. అతడిని అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. దీనిని భరించలేని రాఖిల్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. నన్నే కాదంటుందా అని ఆమెపై పగ పెంచుకున్నాడు. మానస లేని జీవితం తనకి వద్దనుకున్నాడు. ప్రతి రోజూ మానసనే తలచుకుంటూ ఓ సైకోలా తయారయ్యాడు. తనకు దక్కని మానస ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. చివరికి ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ సాయంతో బీహార్లో సోను కుమార్ మోదీ అనే వ్యక్తి దగ్గర నాటు తుపాకీ కొన్నాడు. కేరళలోని కొత్తమంగళంలో మానస రూమ్కు దగ్గర్లోనే ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ఒక ప్లైవుడ్ కంపెనీలో పనిచేయడానికి వచ్చానని గది ఓనర్కి చెప్పాడు. అక్కడే మానసను ఎలా హతమార్చాలో పక్కా ప్లాన్ రచించాడు. గత వారం మానసను గన్తో కాల్చిన తర్వాత తనూ సూసైడ్ చేసుకున్నాడు. మరి రాఖిల్కి ఈ హత్యలో ఇంకెవరైనా సహకరించారా? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గ్రేట్ జర్నీ... మానస చిత్రం
గిగిల్స్... లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన రెండు బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో పదకొండు నెలల బాబు విహాస్ పియానో ముందు కూర్చుని కీ బోర్డుని పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లిష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ అరనిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి. కెమెరామన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారించేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడుగే కారణం. ఫొటోగ్రాఫర్గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫొటోగ్రాఫర్గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాళ్లు కూడా ఫొటో జర్నలిస్టులు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ల విషయానికి వస్తే... ఇంకా మహిళల ప్రస్థానం ఊపందుకోలేదు. అలాంటి సమయంలో ఓ సాహసం చేసింది మానస అల్లాడి. విహాస్ను ఫొటో తీస్తున్న ఉమన్ ఫొటోగ్రాఫర్ మానస ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సు చేయడంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫొటో స్టూడియో పెట్టింది. మరో ఐదుగురు ఫొటోగ్రాఫర్లకు, ఐదుగురు ఎడిటర్లకు ఉద్యోగం ఇచ్చింది. సొంత స్టూడియో ఆలోచనకు దారి తీసిన కారణం తనలోని తల్లి మనసేనంటోంది. తన పిల్లలను రకరకాల పోజుల్లో చూడాలని ముచ్చటపడింది. డెలివరీ అయిన ఐదో రోజున నిద్రలో నవ్వుతున్న తన బాబుని ఫొటో తీయాలనుకుంది. ఆ క్షణంలో తాను కదల్లేదు. ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు అందుబాటులో లేరు. అలా ఆ కోరిక తీరకపోవడం వల్ల ఆ పని తానే మొదలు పెట్టింది. సొంతంగా డిజైన్ కరీంనగర్లో పుట్టి పెరిగిన మానస, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివింది. బీటెక్ పట్టాతో హైదరాబాద్కి వచ్చి ఇన్ఫోసిస్లో ఉద్యోగంలో చేరింది. ఏడేళ్లు ఉద్యోగం ఇవ్వని సంతృప్తి మూడేళ్ల ఫొటోగ్రఫీ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఒక ప్రైవేట్ ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లమో కోర్సు చేసింది. సీనియర్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అప్పటికి స్టూడియో పెట్టే ఆలోచన లేదు. కేవలం ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నది. ‘‘మా అబ్బాయి ఐదు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఫొటో తీయడానికి బేబీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. నేను లేవగలిగినప్పటి నుంచి బాబుకి నేనే ఫొటోలు తీసుకున్నాను. ప్రతినెలా పుట్టినరోజు చేస్తూ ఒక్కో నెల డ్రెస్కి ఒక్కో థీమ్తో కుట్టించి మరీ ఫొటోలు తీశాను. రెండవసారి మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు సీరియెస్గా ఆలోచించాను. నేనే స్టూడియో పెడతాను. బేబీ ప్రతి మూమెంట్ని, రకరకాల నేపథ్యాలలో కెమెరాలో దాస్తానని ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. ‘ఏ ప్రయోగం చేయాలన్నా ఇదే సరైన వయసు’ అని ప్రోత్సహించారు. ఇక నేను ఏయే థీమ్స్తో పిల్లల్ని ఫొటో తీయాలని ముచ్చటపడ్డానో అన్ని సెట్టింగులూ చేయించుకున్నాను. మా స్టూడియోలో ఉన్నవేవీ మార్కెట్లో రెడీమేడ్గా దొరికేవి కాదు. ప్రతిదీ నేనే డ్రాయింగ్ వేసి కార్పెంటర్కి వివరించి చేయించుకున్నాను. మొత్తం ముప్పై నేపథ్యాలతో గదులు సిద్ధమయ్యాయి. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్లే. ఇండియాలో పెద్ద బేబీ ఫొటో స్టూడియో ఇదే. ఈ ఏడాది మా కరీంనగర్లో కూడా ఓ స్టూడియో పెట్టాను. పిల్లలు మాలిమి అవుతారు ఉద్యోగం చేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు పదిలక్షలతో 2017లో హైదరాబాద్, బోయిన్పల్లిలో స్టూడియో పెట్టాను. అప్పటికి హైదరాబాద్లో న్యూ బార్న్ బేబీ స్టూడియో ఉంది. కానీ మహిళలు ఈ ప్రయత్నం చేయలేదు. నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... చిన్న పిల్లలు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే త్వరగా మాలిమి అవుతారు. పిల్లలతో ఓ అరగంట గడిపితే ఆ బేబీకి ఏమిష్టమో అర్థమవుతుంది. అదే సమయంలో పిల్లలకు నేను అలవాటవుతాను. ఒక్కో పిల్లలు రైమ్స్ ఇష్టపడతారు, కొందరు బొమ్మలను ఇష్టపడతారు. ఇక షూట్ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైనవి చేస్తూ ఉండాలన్నమాట. మగవాళ్లకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఏం చేస్తే వాళ్ల ఏడుపును ఆపవచ్చనేది కూడా వెంటనే స్ఫురించదు. కాబట్టి ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా బేబీ ఫోటోగ్రఫీలో మహిళలకు మంచి అవకాశాలుంటాయి. హాబీగా నేర్చుకున్న వాళ్లు అక్కడితో ఆగిపోకుండా దీనిని ప్రొఫెషన్గా తీసుకోవచ్చు’’ అన్నది మానస. ఒక తొలి అడుగు మరికొన్ని అడుగులకు స్ఫూర్తి అవుతుంది. మానస ఇష్టంగా క్లిక్ మనిపించుకున్న జీవిత చిత్రమిది. ఈ దారిలో మరికొంతమంది యువతులు ఫొటోగ్రాఫర్లుగా ఎదగాలని ఆశిద్దాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్ ఇళ్లు
సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’లో సివిల్ ఇంజనీరింగ్లో బి.టెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్’ ఇంటిని నిర్మించింది. ఓపాడ్.. సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్ లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, వాష్రూమ్లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్ ఇళ్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్ హోమ్స్, మొబైల్ క్లినిక్లు, గెస్ట్ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది. మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి రమాదేవితో మానస -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త
‘హైదరాబాద్ నగరం నన్ను తీర్చిదిద్దింది. ఫుడ్ నుంచి ఫ్రెండ్స్ దాకా ఎన్నో ఇచ్చింది. నేను ఈ నగరంతో మమేకమైపోయా’’ అంటోంది నగరవాసి, తాజాగా ముంబయిలో జరిగిన పోటీల్లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న మానస వారణాసి (23). గ్లామర్ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా బ్యూటీ కాంటెస్ట్లోకి అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఎంబ్రాయిడరీ నుంచి ట్రెక్కింగ్ దాకా భిన్న రకాల అభిరుచులు, చిన్న వయసులోనే పరిపక్వ ఆలోచనలతో అబ్బురపరిచే మానస ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న నేను గ్లామర్ రంగానికి చాలా కొత్త. కాలేజ్ డేస్లో మిస్ ఫ్రెషర్గా గెలవడం తప్ప.. గతంలో గ్లామర్ రంగంలో ఎప్పుడూ ఫుల్టైమ్ పనిచేసింది లేదు. అనుకోకుండా ఈ పోటీకి ఎంపికై, టైటిల్ గెలుచుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. పోటీ ఇప్పటికే.. సిస్టర్స్గా ఎప్పటికీ... మిస్ ఇండియా పోటీలో 31 మంది ఫైనలిస్ట్లు పలు రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. కోవిడ్ కారణంగా ఈ పోటీ చాలా వరకూ వర్చువల్గానే సాగింది. వీరిలో 15 మంది ముంబయిలో జరిగిన ఫైనల్స్కు ఎంపికై హాజరయ్యారు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అంతేకాదు స్టైలింగ్ నుంచి ఎక్సర్సైజ్ దాకా ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నా. ఈ అనుభవం మర్చిపోలేనిది. పోటీ కేవలం ఇక్కడి వరకే. తర్వాత స్వంత సిస్టర్స్లా లైఫ్ లాంగ్ టచ్లో ఉంటాం. కుటుంబమే కీర్తి... మనుషులే స్ఫూర్తి... అమ్మమ్మ, తల్లిదండ్రులు, సోదరి ఇదే నా కుటుంబం. వాసవిలో ఇంజినీరింగ్ చదివా. సాధారణ జీవితం, అత్యున్నత ఆలోచనలు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం మాది. అది నేర్పిన విలువలే నన్ను నిర్వచిస్తాయి. తమను తాము ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుని, పునరావిష్కరించుకునే మనుషులే నాకు స్ఫూర్తి. జీవితాంతం వ్యక్తిగా పరిణతి సాధించుతూనే సాగుతాను. ఏ విషయంలోనైనా అంతిమంగా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేని సంపూర్ణ జీవితమే నాకు ప్రధానం. సినిమా... రమ్మంటే? భవిష్యత్తు మనకేమి ఇస్తుందో ఎవరికి తెలుసు? ఒక కొత్త ఆశలు..అవకాశాల ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి నేను మిస్ ఇండియా పోటీలకు వచ్చాను. ఈ టైటిల్ నన్నెక్కడికి తీసుకెళుతుందో చూడాలని నేను ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నా. సినిమా రంగ ప్రవేశం అనే ప్రశ్నకు కాలం మాత్రమే సమాధానం చెబుతుంది. నా వరకూ నాకు ఎదురయ్యే ప్రతి అవకాశానికి తలుపులు తెరచి ఉంచాలనేది ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణం నాకు నేర్పింది. అద్భుత యోగం.. అందం మానసికం.. శరీరంతో పాటు మనసు ఆత్మల మేలు కలయికే ఫిట్నెస్. అది అందించేదిగా నేను ఎంచుకున్న యోగా నా జీవితంలో అద్భుతాలు చేసింది. ఇతరుల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నం కాక నిన్ను నువ్వు మెప్పించుకోవడమే ముఖ్యమనేది ఫ్యాషన్లో పాటించే సూచించే సూత్రం. నువ్వేమిటి అనే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు. నీ గురించి నువ్వు సంతృప్తిగా భావించకపోతే అందంగా ఉండడం అనేదానిలో అర్ధం లేదు. అందాల భామ.. అభిరుచుల చిరునామా.. నగరానికి చెందిన మానస వారణాసి ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ఎనలిస్ట్గా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. మానస తండ్రి అనుమణి వారణాసి, తల్లి శైలజ వారణాసి. ఇన్స్ట్రా గ్రామ్ ద్వారా పెట్స్పై ప్రేమ నుంచి తన ఎంబ్రాయిడరీ స్కిల్స్ దాకా ఎన్నో ఆమె పంచుకుంటుంటారు. ట్రెక్కింగ్, స్కై గేజింగ్ తదితర సాహసాలు చేయడాన్ని ఇష్టపడే మానస సైన్ లాంగ్వేజ్ లో కూడా శిక్షణ పొందారు. ఒక సాధారణ యువతిగా నగరానికి చెందిన ఎన్జీవో ‘మేక్ ఎ డిఫరెన్స్’తో కలిసి పనిచేయడం నన్ను చాలా మార్చింది. నా అంతర్ముఖ వ్యక్తిత్వాన్ని అధిగమించడానికి, విద్యాపరమైన సమానత్వాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా ఉపకరించింది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఇక మిస్ ఇండియాగా సమాజానికి నా వంతు బాధ్యత స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాను. -
మంచి చిత్రాలను ఆదరించాలి
‘‘చిత్రం ఎక్స్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇటువంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. హీరో రాజ్బాల, యూనిట్కి ఆల్ ద బెస్ట్’’ అన్నారు శ్రీకాంత్. రాజ్బాల, మానస జంటగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చిత్రం ఎక్స్’. శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవీ మూవీ క్రియేషన్స్ పతాకంపై పొలం గోవిందయ్య నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ను శ్రీకాంత్ విడుదల చేశారు. రమేష్ వీభూది మాట్లాడుతూ– ‘‘14 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో చేశాను. తేజాగారివద్ద సహాయ దర్శకుడిగా చేశా. మా సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘కరోనా కష్టకాలంలో పెద్ద మనసుతో శ్రీకాంత్గారు మా ట్రైలర్ని విడుదల చేసి, మమ్మల్ని ఆశీర్వదించడం హ్యాపీ. మా సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ’’ అన్నారు పొలం గోవిందయ్య. ‘‘40 రోజులు భయంకరమైన అడవిలో మేం పడ్డ కష్టాన్ని శ్రీకాంత్గారి అభినందనలతో మరిచిపోయాం’’ అన్నారు రాజ్బాల. ఈ చిత్రానికి సంగీతం: శివప్రణయ్, కెమెరా: ప్రవీణ్. కె. కావలి. -
మానస కేసులో చార్జిషీట్ దాఖలు
వరంగల్ క్రైం: అత్యాచారం, హత్యకు గురైన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ దీన్దయాల్నగర్కు చెందిన గాదం మానస కేసులో సుబేదారి పోలీసులు గురువారం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మం డలం నెమలిగొండకు చెందిన పులి సాయిగౌడ్.. నవంబర్ 27న మానసను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం, ఆపై హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు 24 గంటల్లో నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం వారం పాటు పోలీసు కస్టడీకి తీసుకుని శాస్త్రీయంగా వివరాలను సేకరించారు. మృతు రాలి దుస్తులపై ఉన్న రక్తం, వీర్యం మరకలతో పాటు, పోస్టుమార్టం నివేదిక, డీఎన్ఏ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అన్నీ నిందితుడు సాయిగౌడ్ ఆధారాలతో సరిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మానసపై అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని సేకరించామని సుబేదారి ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు. నేరం జరిగిన 30 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, నిందితుడికి శిక్ష పడేందుకు అవసరమైన ప్రతి విషయాన్ని సేకరించామని పేర్కొన్నారు. -
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మానస తల్లి..
-
మానస కేసు : ఒకరికి ఉద్యోగం, ఇల్లు, తక్షణ న్యాయం..
హన్మకొండ: మానస తల్లి గాదం స్వరూప శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్వరూప 9వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నవంబర్ 27న పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస.. అత్యాచారం, హత్యకు గురైన విషయం విదితమే. అనంతరం హైదరాబాద్లో దిశ ఘటన చోటుచేసుకుంది. (చదవండి : పరిచయం.. ప్రేమ.. అత్యాచారం.. హత్య ) అయితే.. దిశకు జరిగిన న్యాయం తన కూతురు విషయంలో జరగడం లేదని స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 18 రోజులు అవుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. స్వరూపతో పాటు గొల్ల కురుమల నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రుషికేష్వర్ రాజు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం హామీతో దీక్ష విరమణ.. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీతో మానస తల్లి గాదం స్వరూప దీక్ష విరమించారు. తన కూతురు చావుకు కారణమైన దోషులకు శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్వరూప గత 9 రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీక్షాస్థలికి చేరుకున్న దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వం తరపున పూర్తి భరోసా ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. -
మానసను చిత్రహింసలు పెట్టి ఆపై..
సాక్షి, వరంగల్ : పుట్టిన రోజు నాడే పరిచయం ఉన్న వ్యక్తి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన గాదం మానస కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె మరణంపై తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా కొత్త విషయాలకు బయటకు వస్తున్నాయి. గత నెల 27న తన పుట్టిన రోజున బయటకు వెళ్లిన మానస అత్యాచారం, హత్యకు గురి కావడం... ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే ఘటనకు బాధ్యుడైన పులి సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపిన విషయం విదితమే. పోలీసులు ఈ కేసును హత్యగా పేర్కొన్నప్పటికీ.. రక్తస్రావం వల్ల మానస చనిపోవచ్చన్న ప్రచారం సాగింది. అయితే ముమ్మాటికీ గాదం మానసది అత్యాచారం, హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లాన్ ప్రకారమే... అత్యాచారానికి ముందు మానసను నిందితుడు సాయికుమార్ తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తొంది. నిందితుడు పక్కా ప్రణాళికతోనే బలవంతంగా మానసపై అత్యాచారానికి పాల్పడిన క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించిందని సమాచారం. ఈ మేరకు చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. నిందితుడిపై మానస తిరుగుబాటు చేసే క్రమంలో ఆమె రెండు చేతులకు తీవ్ర గాయాలయయ్యాయని సమాచారం. అలాగే, తలపై సైతం తీవ్రంగా దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పాటు తలలో రక్తం సైతం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారని తెలిసింది. నివేదిక కోసం ఎదురుచూపులు మానస అత్యాచారం ఘటనలో వెంటనే స్పందించిన పోలీసులు పులి సాయికుమార్ను అరెస్టు చేయగా.. ఈ ఘటనపై మానస ఆమె తల్లిదండ్రులు గాదం స్వరూప, మల్లయ్యలు మాత్రం సాయికుమార్తో పాటు ఇంకెవరైనా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మానసపై అత్యాచారం అత్యంత అమానవీయంగా జరిగిందని గుర్తించిన వైద్యులు.. ఈక్రమంలో మానసకు తీవ్ర రక్తస్రావం జరిగిందని తేల్చారని తెలిసింది. అలాగే, పూర్తిగా నిర్ధారించుకునేందుకు సెమెన్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి అందే నివేదిక ఆధారంగా అత్యాచారం ఘటనలో ఒకరు లేదా అంతకు మించి ఉన్నారా అని నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కేసులో స్పష్టత వస్తుందని అపోహలు తొలగిపోతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, ఈ కేసులో పులి సాయికుమార్ అరెస్టుకు ముందు మానస ‘కాల్ డేటా’ ఆధారంగా ముగ్గురు ఉన్నతాధికారుల డ్రైవర్లు, అటెండర్లను కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. అయితే, ఫోన్ చేస్తే ఆ ఆ అధికారుల ఇళ్లకు కూరగాయలు పంపే క్రమంలో... మానస ఫోన్లో కాల్స్ ఉండడంతో అనుమానించిన పోలీసులు ఈ కోణంలోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలకాంశాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చదవండి: పరిచయం.. ప్రేమ.. అత్యాచారం.. హత్య -
బాధ్యత ఎవరు తీసుకోవాలి
స్త్రీలను గౌరవించాలి. వారు భద్రమైన వాతావరణంలో ఉండాలి.వారికి అనుక్షణం రక్షణ ఇచ్చే వ్యవస్థ ఉండాలి. వారిని లైంగిక వస్తువులుగా చూడని సంస్కారం పురుషులలో ఏర్పడాలి. ఇందుకు ఎవరు పూనుకోవాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? తల్లిదండ్రులా? టీచర్లా? పోలీసులా? ‘ధైర్యం, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో ఉండడం కూడా అంతే ముఖ్యం’ ‘దిశ’ హత్య సంఘటన నేపథ్యంలో ఫేస్బుక్లో కనిపించిన ఒక కామెంట్ అది. ఈ కామెంట్లో వాస్తవం ఉంది. ‘దిశ’ ఘటనలోగాని, వరంగల్లో కారులో అత్యాచారం జరగడం వల్ల షాక్కు గురై మరణించిన మానస విషయంలోగాని జరిగింది అదే. పరిస్థితులను ఎరిగి జాగ్రత్తలో లేకపోవడం. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగాక మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలను మరింత కట్టుదిట్టం చేశారు. కొత్త చట్టాన్నీ తెచ్చారు. అయినా లైంగిక దాడులతో కూడిన హత్యలు ఆగడం లేదు. ఇందులో సమాజంలో స్త్రీల పట్ల పేరుకునిపోయిన క్రూర దాడి స్వభావంతో పాటు మహిళలు తామున్న పరిస్థితిని గుర్తెరిగి ప్రవర్తించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఒక తప్పుకు కేవలం ఒకరు మాత్రమే బాధ్యత వహించవలసిన పని లేదు. సమష్టిగా బాధ్యత వహించాల్సిందే. అందులో తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులు.. ఈ అన్ని వ్యవస్థల సంరక్షణా కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకు? మంచి జీవితం కోసం ఇప్పుడు అమ్మానాన్నా ఇద్దరూ జీతం తేవాల్సిందే. పిల్లలకు ‘మంచి’ చదువు ఇప్పించడం కోసం ప్రైవేట్ స్కూల్లో వేయాల్సిందే. బాగా చదువుచెప్పే పనిలో ఆ స్కూళ్లూ పిల్లలను దాదాపు ఉదయం ఏడు నుంచి సాయంకాలం ఆరుగంటల దాకా ఎంగేజ్ చేస్తున్నాయి. దీంతో పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో కంటే స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంటికొచ్చాక కూడా స్కూల్ ఇచ్చిన పనిలో కొంతసేపు ఉండి, మిగిలిన కాసేపు సోషల్ మీడియా బడిలో సేద తీరుతున్నారు. కాలేజ్ పిల్లల షెడ్యూల్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది కొంత మార్పుతో. ఏతావాతా పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయ పరిమాణం, సమయ నాణ్యత గణనీయంగా తగ్గింది. తల్లిదండ్రుల పాత్రను టీచర్లే పోషించాల్సిన అవసరం ఏర్పడింది. అలాగని పిల్లల సమయం ఎక్కడోఒకచోట పూరింపబడుతోంది కదా అని సంతోషపడాల్సిన ముచ్చట లేదు. ప్రైవేట్ లేదా కార్పొరేట్ స్కూళ్లు పిల్లలను తెలివైన విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులకు మాటిస్తాయి తప్ప మంచి విద్యార్థిగా అని కాదు. తల్లిదండ్రుల షరతు కూడా తెలివైన బిడ్డలు కావాలనే. మంచి పిల్లలు అని కాదు. ఇక ప్రభుత్వ పాఠశాల విషయానికి వస్తే.. వికాసవంతమైన విద్య, క్రీడా విద్య, ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ మొదలైనవన్నీ కరిక్యులమ్లో భాగాలే. ప్రతి యూనిట్, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల్లో పై వాటికీ మార్కులుంటాయి. ప్రతి విద్యార్థి ప్రవర్తనను, ఆరోగ్య, మానసిక దృఢత్వాన్ని పరీక్షించే మార్కులు వేయాలి. కాని ప్రాక్టికల్గా అలా ఉండదు. ఎందుకంటే చాలా ప్రభుత్వ పాఠశాలలు దాదాపుగా ఇద్దరు టీచర్ల నిర్వహణలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో మొక్కుబడిగా మార్కులివ్వడం తప్పిస్తే పరీక్షించి రిపోర్ట్ రాయడం కుదరని పని. ఈ కరిక్యులమ్కు రూపకల్పన చేసిన ప్రభుత్వ సిబ్బందికీ ఆ విషయం తెలుసు. ఇక పోలీసులు.. సమాజంలోని కుల, మత, వర్గ, లింగ వివక్ష చూపకుండా, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ రక్షణ చూసుకోవాల్సిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి నుంచి విధానాలు రూపొందే అసెంబ్లీ (రాష్ట్రం వరకు మాట్లాడుకుంటే) వరకు శాంతి, భద్రతల బరువును మోయాల్సిన వారు. అంటే పిల్లలకు సంబంధించి పేరెంటింగ్ పాత్రనూ చేపట్టాల్సిన వారు. వీటన్నిటినీ సమన్వయం చేయాల్సిన ప్రభుత్వమూ ఉమ్మడి కుటుంబంలో పెద్ద వాళ్ల భూమికను పోషించాలి. ఆడవాళ్ల మీద హింస తగ్గించడానికి, అలాంటి నేరాలు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా పోలీసులను సంప్రదించడానికి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అది – ఆ జిల్లాలోని స్కూళ్ల నుంచి అమ్మాయిలను ఎంపిక చేసి వారానికి ఒకరోజు ఆ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ ఇన్చార్జిగా పెట్టడం. దీనివల్ల నేరాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా రిపోర్ట్ చేయాలి వంటి వాటి మీద అమ్మాయిలకు అవగాహన పెరగడమే కాక భయం పోతుంది. పోలీసులు సున్నితంగా వ్యవహరించే వీలుంటుంది అని. ఇలాంటివి ఇక్కడా ప్రయోగించవచ్చేమో. ‘దిశ’ ఘటన నేపథ్యంలో ఆయా వర్గాలు ఏమంటున్నాయో చూద్దాం. ఒక్కోనెల ఒక్కోరంగంలోని నిపుణుడితో సెషన్ పెట్టించాలి పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ముందు పిల్లలను మార్కుల కోసం వత్తిడి చేయడం ఆపాలి. వారి లైఫ్ స్కిల్స్ పట్ల దృష్టి పెట్టాలి. ఇంతకుముందు ఇంట్లోంచి ఇవి అందేవి. ఇప్పుడు స్కూల్లో అందేలా చూడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు శ్రద్ధ పెట్టే టైమ్లేక నైతికవిద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్, జీవన నైపుణ్యాలు వంటి అంశాలను కూడా మామూలు పరీక్షల్లాగే భావించి అందరికీ ఒకే రకంగా మార్కులు వేసి పాస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేయడం నిజంగా ఏ టీచర్కూ ఇష్టం ఉండదు. బాధగానే ఉంటుంది. కాని ఏం చేస్తాం? నేను కోరేది ఒక్కటే.. ప్రతి స్కూల్లో ప్రతి నెల ఆయా రంగాల్లోని నిపుణులను పిలిపించి ఆ రోజు పిల్లలతోపాటు, టీచర్లు, పేరెంట్స్కి కూడా క్లాస్ ఇప్పించాలి. అంటే కౌన్సిలింగ్ సెషన్లా ఉండాలన్నమాట. – గాజోజు నాగభూషణం, మన్నెపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కరీంనగర్ జిల్లా. విపరీతంగా ప్రచారం చేయాలి ఈరోజు ప్రతి వాళ్లకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ దినచర్యలో ప్రయాణం తప్పనిసరి అయింది. నేరాలు జరిగే అవకాశం కూడా ఈ మూమెంట్లోనే ఎక్కువ. ఒక ప్రొడక్ట్కి మార్కెట్లో ఎలా అయితే ప్రచారం జరుగుతుందో అలాగే ఈ సేఫ్టీ అండ్ సెక్యురిటీని కూడా మార్కెటైజ్ చేయాలి అంటాను. వాట్సప్లో అప్పుడప్పుడూ కొన్ని మెసేజెస్ వస్తూంటాయి.. ఫలానా దేవుడి నామాన్ని 108 మందికి ఫార్వర్డ్ చేయండి.. లేదంటే ఏదో అవుతుంది అనుకుంటూ! అదిగో ఆ స్థాయిలో ఈ సేఫ్టీ అండ్ సెక్యురిటీ ప్రచారం సాగాలి. ఇంటి నుంచి డెస్టినేషన్కు వెళ్లే దారిలో ప్రజల దృష్టి పడే చోట్లంతా దీనికి సంబంధించిన పత్రాలను, హోర్డింగ్స్ను పెట్టాలి. పేరెంట్స్, టీచర్స్, పోలీసులు అని కాకుండా అందరం దీన్నో క్యాంపెయిన్లా ముందుకు తీసుకుపోవాలి. – సుమతి, ఐపీఎస్ పేరెంట్స్ మీటింగ్కి కూడా హాజరు కావడం లేదు నిజమే .. స్కూల్లో టీచర్ పేరెంట్ పాత్ర పోషించాలి. పోషిస్తున్నాం కూడా. కాని ఇంట్లో తల్లిదండ్రులూ శ్రద్ధ పెట్టాల్సిందే. పాఠాలు ఎంత ముఖ్యమో.. బతుకు పాఠాలు అంతకన్నా ముఖ్యం. నేను ప్రతి క్లాస్లో లెసన్ చెప్పేకంటే ముందు పదినిమిషాలు జనరల్ విషయాల గురించే పిల్లలతో మాట్లాడ్తా. వాళ్ల అబ్జర్వేషన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. దాంతో వాళ్ల ఆలోచనా ధోరణి తెలుస్తుందని. ఏ కొంచెం తేడా అనిపించినా తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు అని. ఇవి కరిక్యులమ్లో భాగమైనా కాకపోయినా ఓ టీచర్ పాఠంలో భాగం కావాలని అనుకుంటా, నమ్ముతా, అమలుచేస్తా. ఇలాంటి ఎక్సర్సైజ్ ఇంట్లోనూ జరగాలి. పేరెంట్స్ మీటింగ్లో పిల్లల మార్కులనే కాదు ప్రవర్తననూ డిస్కస్ చేస్తా. అందుకే పేరెంట్ మీటింగ్కి తప్పకుండా తల్లి, తండ్రి ఇద్దరూ హాజరుకావాలి. కాని వాస్తవం ఏమిటంటే తల్లిదండ్రులకు అందుకోసం కూడా టైమ్ ఉండటం లేదు. – కె. కవిత, ప్రభుత్వ టీచర్, మనోహరాబాద్, మెదక్ జిల్లా. ఇంగితాన్ని నేర్పాలి కొన్ని పరిస్థితుల్లో గుడ్డిగా నమ్మడం కంటే అనుమానించడమే మంచిది అని ఇంగ్లిష్ సామెత. అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో నమ్మకం పాలు ఎక్కువని సైంటిఫిక్గా రుజువైంది. అమ్మాయిల్లో విడుదలయ్యే కొన్ని హార్మోన్సే ఇందుకు కారణం. జాలి, దయ, సహాయం చేస్తుంటే వారించలేనితనాన్ని ఈ హార్మోన్లు ప్రేరేపిస్తూంటాయి. కాని ఎల్లవేళలా ఇది మంచిదికాదు కదా. ఏ పరిస్థితికి ఆ పరిస్థితి వేరు అనే స్పృహను, ఎవరినీ అంతలా నమ్మకూడదు అనే అవగాహనను పెంచాలి. ప్రతి సంఘటనను దేనికదే విడిగా చూడాలనే ఇంగితాన్నీ నేర్పాలి. ఇది స్కూల్లో పాఠంగా మారాలి. ఎనిమిదేళ్లు నిండిన ప్రతివాళ్లకు చెప్పాలి. అమ్మాయిలకు కూడా శారీరక దృఢత్వంతోపాటు మానసిక దృఢత్వమూ అవసరం అనే ఎరుకను పెంచాలి. శిక్షణనూ ఇవ్వాలి. ప్రతిరోజు అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ ఒకటి చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్లైన్లను ఎలా సంప్రదించాలో చెపుతూ అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రవర్తించాల్సిన తీరునూ వివరించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి అమ్మాయి తనకు నిర్భయలాంటి ప్రమాదకర స్థితి పొంచి ఉందనే జాగరూకతతో వ్యవహరించాలి. – కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్. -
ప్రేమ.. అత్యాచారం.. హత్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్లో సంచలనం రేపిన గాదం మానస(19)పై అత్యాచారం, హత్య కేసు మిస్టరీ వీడింది. పుట్టిన రోజు సందర్భంగా బుధవారం గుడికి వెళ్లొస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లి హన్మకొండ హంటర్రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో విగత జీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలికొండ ప్రాంతానికి చెందిన పులి సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. 6 నెలల పరిచయంలోనే ప్రేమ పేరిట సెల్ఫోన్ సంభాషణ కొనసాగించిన సాయికుమార్.. పథకం ప్రకారం నమ్మించి బయటకు రప్పించి మానసపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు తేలింది. కేసులో సాయికుమార్ను అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించిన వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమ పేరిట గాలం జనగామ జిల్లా నమిలికొండకు చెందిన పులి సాయిగౌడ్ హన్మకొండ హంటర్రోడ్డులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. హన్మకొండలోని దీన్దయాళ్ కాలనీకి చెందిన గాదం మానస హంటర్రోడ్డులోని నీలిమ జంక్షన్ వద్ద తండ్రితో కలసి కూరగాయల వ్యాపారం నడుపుకొంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిందితుడు కాలేజీకి వెళ్లే క్రమంలో 6 నెలల కింద మానసతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులుగా ఇద్దరూ సెల్ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బుధవారం మానస పుట్టిన రోజు కావడంతో తనను కలిసేందుకు రావాలని సాయి కోరాడు. దీంతో భద్రకాళి గుడికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి మధ్యాహ్నం ఇంటి నుంచి మానస వెళ్లింది. ముందుగా అదాలత్ జంక్షన్ వరకు రావాలని చెప్పిన సాయి.. ఆ తర్వాత కాజీపేట వైపు రావాల్సిందిగా ఫోన్లో సూచించాడు. కాజీపేట వెళ్లి ఎదురు చూస్తుండగా.. మానసను కారులో తీసుకెళ్లిన సాయి.. చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కారును నిలిపి మానసను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు సీపీ తెలిపారు. కొత్త బట్టలు తొడిగి.. మానసది సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితుడు సాయి ప్రయత్నించాడు. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తరలించేందుకు సాయం కోసం తన మిత్రులు మాచర్ల శ్రీకాంత్, నీలి శ్రీకాంత్లను తప్పుడు సమాచారంతో అక్కడికి రప్పించాడు. అయితే ఇద్దరూ ఘటనాస్థలానికి చేరుకుని మానస మృతదేహాన్ని చూసి షాక్తో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక నిందితుడు ఒక్కడే మానస మృతదేహాన్ని కారులో ఎక్కించి చీకటి పడే వరకు చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ సెంటర్ మీదుగా తిరుగుతూ హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాడు. మానస హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు కాలేజీ సమీపంలోని బట్టల షాపులో డ్రెస్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి కారులో బయల్దేరి హంటర్ రోడ్డులోని న్యూ శాయంపేట వద్ద రైల్వేట్రాక్ వద్దకు చేరుకుని మానస ఒంటిపై రక్తసిక్తమైన దుస్తులను తీసి కొత్త డ్రెస్ వేశాడు. అక్కడి నుంచి విష్ణుప్రియ గార్డెన్స్ పరిసర ప్రాంతానికి చేరుకుని ఎవరికీ కనిపించకుండా నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని వేసి తన స్వగ్రామమైన నమిలికొండకు వెళ్లిపోయాడు. సోదరుడి ఫిర్యాదుతో.. చీకటి పడినా మానస తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె అన్నయ్య శ్రీనివాస్ బుధవారం రాత్రి హన్మకొండలోని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. సాయికుమారే మానసను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా సాక్ష్యాధారాలను సేకరించి గురువారం మధ్యాహ్నం నమిలిగొండలో అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే నిందితుడు సాయికుమార్ను అరెస్టు చేసేందుకు కృషి చేసిన పోలీసులను సీపీ అభినందించారు. ఎప్పుడేం జరిగింది.. బుధవారం ► మధ్యాహ్నం ఒంటి గంట: ఇంటి నుంచి బయటికి వెళ్లిన మానస ► 1.30 గం.కు: అదాలత్ జంక్షన్ నుంచి కాజీపేట బయల్దేరిన బాధితురాలు ► 2.00 గం.కు: కాజీపేట జంక్షన్ చేరుకుని నిందితుడి కారు ఎక్కిన మానస ► 2.30 గం.కు: అత్యాచారం.. హత్యకు గురైంది. ► మధ్యాహ్నాం 3.00 గంటల నుంచి నిందితుడు మానస మృతదేహంతో చిన్నపెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి, కేయూసీ జంక్షన్, అశోకా జంక్షన్ వరకు కారులో ప్రయాణం ► రాత్రి 8.30 గం.కు: మృతురాలి బట్టలు మార్చాడు. ► 9.00 గం.కు: మృతదేహాన్ని విష్ణుప్రియ గార్డెన్స్ వద్ద పడేసి పరారైన నిందితుడు. ► 9.43 గం.కు: డయల్ 100కి సమాచారం ఇచ్చిన స్థానికులు. ► 9.50 గం.కు: సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ► 10.00 గం.కు: సంఘటన స్థలంకు చేరుకున్న డాగ్ స్క్వాడ్, క్లూసీ బృందాలు ► 12.00 గం.కు: మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు గురువారం ► ఉదయం 10.30 గం.కు: మృతదేహానికి పోస్టుమార్టం ► మధ్యాహ్నం ఒంటి గంటకు: నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు -
మరో ఇంటర్ విద్యార్థి..
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల మానస(17) అనే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థిని పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకోగా..చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఊపిరొదిలింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల రమేష్, సునీత దంపతుల పెద్ద కుమార్తె సాయిల మానస ఈ ఏడాది ఇంటర్లో ఎంపీసీ మొదటి సంవత్సరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంది. వార్షిక పరీక్షలు రాసి స్వగ్రామం వెంగన్నపాలెం వచ్చిం ది. గత నెల 18న ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మానస ఫిజిక్స్, ఇంగ్లిష్ తప్పితే మిగతా నాలుగు సబ్జెక్టులు ఫెయిలైంది. పదో తరగతిలో 8 జీపీఏ గ్రేడ్ సాధించి, బాగా చదువుతుందనే పేరున్న తాను ఫెయిల్ కావడమేంటని తదేకంగా ఆలోచిస్తూ..అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందును తాగింది. విషయా న్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులపాటు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో..వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ లోని ఓ సూపర్స్పెషల్ హాస్పిటల్లో తల్లిదంద్రులు చేర్పించారు. 20 రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. మృతదేహాన్ని హైదారాబాద్ నుంచి వెంగన్నపాలెంకు మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్లే తమ కుమార్తె ఫస్ట్ ఇయర్లో ఫెయిలైందని..ఆమె మృతదేహంపై పడి తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా రోదించారు. బాగా చదువుతుందనుకున్న అమ్మాయి..ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, 9వ తరగతి చదువుతున్న ఆమె చెల్లెలు లిఖిత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
భారత కిక్ బాక్సింగ్ జట్టులో మానస
సాక్షి, హైదరాబాద్: టర్కిష్ ఓపెన్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ రాష్ట్ర అమ్మాయి బి. మానస రెడ్డి చోటు దక్కించుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోన్న మానస... భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. మొత్తం భారత జట్టుకు 14 మంది ఎంపికవగా... తెలంగాణ నుంచి మానస జట్టులో చోటు దక్కించుకుంది. టర్కీలోని అంటాల్యా వేదికగా ఈనెల 4 నుంచి 7 వరకు టర్కిష్ ఓపెన్ కిక్బాక్సింగ్ టోర్నీ జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ జట్టుకు ఎంపికైన ఆమెను కోచ్ రామాంజనేయులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అభినందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మానస అంతర్జాతీయ టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం తమకు గర్వంగా ఉందని వారు అన్నారు. ఢిల్లీ, కోల్కతా వేదికల్లో జరిగిన జాతీయ స్థాయి టోర్నీల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆమెను భారత జట్టుకు ఎంపిక చేశారు. ఈ జాతీయ స్థాయి టోర్నీల్లో మానస ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించింది. -
వివాహమైన నెల రోజులకే..
సాక్షి, ఆలేరు : ఆలేరులో దారుణం చోటుచేసుకుంది. నవ వధువు మానస(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి జిల్లా ఆలేరులోని కొల్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నెల రోజుల కిందట హైదరాబాద్లోని శేరిలింగంపల్లికి చెందిన అబ్బాయితో మానసకు వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మ చేసుకున్నట్టు తెలుస్తోంది. కట్నం విషయంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. -
అండగా ఉంటానన్న ఆ అన్నయ్య ఎక్కడున్నాడు?
రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములకైనా, స్నేహితుల్లో, బంధువుల్లో ఉన్న అన్నదమ్ములకైనా తమ అక్క చెల్లెళ్లకు అన్యాయం జరిగినప్పుడు కలిగే బాధ... ఇంకో ఆడపిల్ల విషయంలో ఎందుకు అనిపించడం లేదు? అన్నా! ఇది అన్యాయం కాదా? రాఖీ పండుగరోజు చెల్లెమ్మ రాఖీ కడితే, ‘అండగా ఉంటానమ్మా!’ అనే ఒక ధైర్యాన్నిచ్చేస్తారు అన్నలు. ఇష్టంగా ఒక చిన్న బహుమతిని కూడా ఇచ్చేస్తారు. కానీ ఎల్లప్పుడూ అండగా ఉంటున్న అన్నయ్యలు ఎందరు? ఎంత మంది చెల్లెళ్లు ఈరోజు ఈ సమాజంలో ఇబ్బంది పడుతున్నారు! అండగా ఉంటానన్న ఆ అన్నయ్య ఎక్కడున్నాడు? రక్షాబంధన్... రాఖీ... అదొక అన్నాచెల్లెళ్ల పండుగ. ఒక పండుగ అనే కంటే పవిత్రమైన ప్రమాణాల వేడుక. అంటే ఒక ముఖ్యమైన బాధ్యతను ప్రతినిత్యం గుర్తు చేసుకోవచ్చునేమో. రాఖీ ఎలా పుట్టింది? పురాణాలు ఏం చెబుతున్నాయి? మొదటి రాఖీ కట్టిన ఆమె ఏ సంబంధం ఉన్న అతనికి కట్టింది, దాని ఫలితమేంటి? అనే చారిత్రక అంశాలు తెలిసినా, తెలియకపోయినా రాఖీ అంటే రక్షణ కల్పించే ఒక నమ్మకం. మతాలకు అతీతంగా అక్కా చెల్లళ్లు అన్నదమ్ములకు రాఖీలు కడతారు. ఒక పండుగ వాతావరణంతో ఆ రోజంతా గడుస్తుంది. బుడిబుడి అడుగులు వేసుకుంటూ చిట్టిచిట్టి చేతులతో వచ్చీరాని ముడులు వేసే వయసులో అన్న అల్లరిగా గెంతుతూ కళ్ల ముందే ఉంటాడు. నూనూగు మీసాల అన్నయ్య తను దాచుకున్న డిబ్బీ పైసలలోంచి చెల్లెలికి ఒక రంగుల పుస్తకమో, బొమ్మలో కొనిచ్చినప్పుడు కంటి నిండా కనిపిస్తాడు. అక్క పెళ్లికి ముందు జరిగే ఆఖరి రాఖీ పండుగ రోజున తనకిష్టమైన నెమలికంఠం రంగు జరీ చీర కొనిచ్చి ఆజన్మాంతం నీకు రక్షణ కల్పిస్తానని ప్రమాణం చేసినప్పుడు చెట్టంత మనిషిలా, నిలువెత్తు భరోసాలా కనువిందు చేస్తాడు. అదేంటో బావమరిదిగా మారినా, ఇంటి కొడుకుగా నిలబడాల్సి వచ్చినా ఆ అన్న మాయమౌతాడు. ఏది ఏమైనా తన అక్క లేక చెల్లి మెట్టినింటే ఉండాలనుకుంటాడు. తన ఇంటి ఆడబిడ్డ భర్త దగ్గర దెబ్బలు తింటున్నా బావకు ఆర్థికంగా సహకరిస్తే అక్కను బాగా చూసుకుంటాడని నమ్ముతాడు. కానీ అన్నగా తమ్ముడిగా కనుమరుగవుతుంటాడు. మళ్లీ ఏడాది రాఖీనాడు కనిపిస్తాడు. అన్నగా తమ్ముడిగా రాఖీలు కట్టించుకునే వాడిగా. ఈ అన్నదమ్ముల్ని నిర్వీర్యం చేసేదేమిటి? తమ అక్కలకు చెల్లెళ్లకు తమ నుంచి ఏ కష్టం రాకుండా చూసుకుంటే సరిపోతుందా? అదీ ఎన్నోసార్లు కష్టతరమే. రోజూ సొంత ఇంట్లోనే వివక్షకు గురవుతున్న చెల్లెళ్లకు, ఆఫీసుల్లో చిల్లర చూపులకు బలవుతున్న అక్కలకు, రోడ్ల మీద, మెట్టినిళ్లలో అవమానాలకు, అఘాయిత్యాలకు బలవుతున్న ఆడబిడ్డలకు ఈ అన్నదమ్ములు ఏమీ చేయలేరా? వీళ్లు చేయాల్సింది నిరంతరం ఇంటి ఆడవారి వెన్నంటే ఉండి రక్షించడం కాదు, వారికి ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించడమే కాదు, ఈ తోడబుట్టిన అన్నదమ్ములందరూ ప్రతి మగాడికీ తెలిసేలా తమను తాము సంస్కరించుకోవడం. ఈ బంధాల కన్నా స్త్రీలు భయపడకుండా తిరగగలిగే స్వేచ్ఛనివ్వడమే గొప్పది. రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములైనా, స్నేహితుల్లో, బంధువుల్లో ఉన్న అన్నదమ్ములైనా తమ అక్క చెల్లెళ్లకు అన్యాయం జరిగినప్పుడు కలిగే బాధ ప్రతి ఆడపిల్లకూ ఎందుకు వర్తించడం లేదు? ఇటీవల సంచలనం సృష్టించిన చలనచిత్రం క్లైమాక్స్లో మోసం చేసిన ప్రేయసిని ప్రియుడు హింసిస్తున్న సన్నివేశాలను దాదాపు ప్రతి యువకుడూ ఈలలతో అరుపులతో రాక్షసానందం పొందుతూ చూశాడు. వీళ్లందరికీ ఇళ్లల్లో ఆడపడుచులు ఉన్నా లేకపోయినా సాటి మనిషిగా స్త్రీని గుర్తించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేదెవరు? తప్పుకి లింగభేదం ఉండదు. దానికి చట్టం ఉంది. ఎప్పుడైతే స్త్రీ ఆత్మరక్షణ పద్ధతులను భయం వల్ల నేర్చుకుంటుందో అప్పుడు ఆ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టే! ఆ ధైర్యాన్ని నిర్భయాన్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ అన్నలు తమ్ముళ్లు అనేవాళ్లు తమ తోటి స్నేహితులతో కలసి స్త్రీ సమాజానికి అభయహస్తం అందించాలని ఎందుకు చర్చించుకోలేకపోతున్నారు? ఒక అఘాయిత్యమో, అత్యాచారమో జరిగిన తర్వాత ఆ నేరం చేసిన వాడిని ఆమె అన్న లేక తమ్ముడు వెళ్లి శిక్షించడం లేదు. అసలు అటువంటి పరిస్థితులు రాకుండా పురుషులందరూ కలసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ఒక ఎరుక ఉండాలి. తమ వర్గంలో ఎందుకిన్ని నేరాలు జరుగుతున్నాయని చర్చలు జరపాలి. అడపాదడపా కళాశాలల్లో జరిగే చర్చోపచర్చల్లో మగపిల్లలు మాట్లాడే మాటలు, వారి వాదన చూస్తుంటే భయం కలగక మానదు. ‘ఆడపిల్లలు తక్కువ తీసిపోరు. మోసం చేస్తారు. కురచ దుస్తులు ధరిస్తారు. అటువంటప్పుడు అఘాయిత్యాలు జరగక మానవు’ అన్న ఆలోచనలు, ఆ ధోరణి యువకుల్లో చూస్తుంటాం. అవును! ఆడపిల్లలూ తప్పులు చేస్తారు. ఎందుకంటే దేవతలు కారు. మనుషులు. ఆడపిల్లల్లో కూడా చదువు అబ్బని మొద్దులుంటారు. ఘరానా మోసాలు చేసేవారు ఉంటారు. నేరాలు చేసేవారు ఉంటారు. అచ్చు మగవాళ్లలాగానే! ప్రతి పురుషుడూ నీచుడు కానట్టే ప్రతి ఆడపిల్లా మంచిది కాకపోవచ్చు. అయితే, ఆమె తప్పు చేసిందని ఆమెకు ‘తగిన‘ శాస్తి చేయడానికి ఏ పురుషుడికీ హక్కు లేదు. ఎవరూ ఎవరికీ నేరం చేసి గుణపాఠం నేర్పాల్సిన పని లేదు. నిజానికి నిర్భయ ఘట్టం ఈ ‘గుణపాఠం’ అనే ఆలోచనలోంచే అంతటి విషాదం జరిగిందని చెప్పవచ్చు. ఆమె అర్ధరాత్రి స్నేహితుడితో ఎందుకు బయట తిరగాలి? అనే దానికి ఆ నేరస్తులే సొంత పరిష్కారం సృష్టించుకుని ఆమెను అతి కిరాతకంగా, భయానకంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆ సందర్భంలో వేలాదిగా యువతీ యువకులు ఢిల్లీలో నిర్భయకు మద్దతుగా నిలిచారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అయితే కొన్ని రోజులకే ఆ ఆవేశమంతా చల్లారిపోయింది. పదేపదే పల్లెల్లో, మురికివాడల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో అత్యాచారం, లైంగికదాడి, ఆకతాయితనం అరికట్టడంపై సదస్సులు నిర్వహిస్తుండాలి. ప్రతినిత్యం పురుషులు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సాటి మనుషులను ఏ రకమైన హింసకు గురిచేయకుండా గౌరవించాలన్న స్పృహ ఉండాలి. ఇతరుల్లో పెంచాలి. సాధారణంగా ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు పూర్వం ‘నీకు అక్కా చెల్లెళ్లు లేర్రా!’ అని అంటుండేవారు. ఇప్పడైతే ‘ఇదే నీ అక్కనో చెల్లినో అయితే చేస్తావా?’ అంటున్నారు. లేదా ‘ప్రతి స్త్రీలో అమ్మతనం ఉంటుంది కాబట్టి అమ్మాయిలను ఎలా అవమానిస్తావు’ అనో, ‘స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో ఆడదాన్ని ఎలా హింసిస్తార’నో అంటుంటారు. వాస్తవానికి ప్రతి పురుషుడిలో తండ్రిని, అన్నని చూడనట్టే ప్రతి స్త్రీలో అమ్మను చూసి గౌరవించడం అనేది జరగదు. స్త్రీ ముందుగా ఒక మనిషి. ఆ తర్వాతే ఆమె ఒకరికి కూతురు, అక్కా చెల్లెలు వగైరా. స్త్రీని గౌరవించడానికి, ఆమెపై అన్యాయం జరపకుండా ఉండటానికి ఆమెలో తోబుట్టినదాన్ని వెతుక్కోవాల్సిన పనిలేదు. ఆమెను మనిషిగా చూస్తే చాలు. ఒక పురుషుడు తనను ఎలా గౌరవించాలని, సమానంగా చూడాలని కోరుకుంటాడో స్త్రీతో అదే విధంగా నడుచుకుంటే చాలు. ఇవన్నీ ఇలా ఉంటే అన్నదమ్ములు, తండ్రుల తర్వాతి స్థానం తీసుకుని ఇంట్లోని ఆడవారిపై జులుం చేస్తుంటారు. ఎటువంటి బట్టలు వేసుకోకూడదు దగ్గర నుంచి ఇంటికి ఎప్పుడు తిరిగి రావాలి వరకు వీరు ఆంక్షలు విధిస్తుంటారు. అది వారి ధర్మంగా ఒంటబట్టించుకుంటారు. వీళ్లే కూతుళ్లకూ కొడుకులకూ వారి వారి కర్తవ్యాలుగా ఈ వివక్షను పెట్టి పెంచి పోషిస్తుంటారు. దీనిని ఏదో ఒక తరంలో అన్నదమ్ములే అరికట్టాలి. చదువుకున్న కుటుంబాలలో కట్నం ఆచారాల విషయంలో కాకపోయినా, కనీసం ఆడపిల్లల పెంపకంలో చాలా మార్పును కనబరుస్తున్నారు. ఏది ఏమైనా ఒక పండుగ వస్తుందంటే మనం ఇల్లు శుభ్రం చేసుకుని ఆ రోజుకు మాత్రం అతి భక్తి నటిస్తూ ఉంటామో, లేదా ఏ స్వాతంత్య్ర దినోత్సవం నాడో, గణతంత్ర దినోత్సవం నాడో దేశభక్తిని సామాజిక మాధ్యమాల్లో మన పేర్ల తరఫున నింపేస్తుంటామో అదేవిధంగా ఈ రాఖీ పండుగ కూడా మిగిలిపోవడం విషాదం. ఆ రోజు అన్నలు తమ్ముళ్లు తమ అక్కలను చెల్లెళ్లను సంరక్షించుకుంటామని వారికి భరోసా ఇచ్చే కంటే ముందే వారివల్ల ఏ ఆడపిల్లకూ హాని జరగదని ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. రక్షాబంధన్ వేడుకను వర్ణించడానికి వాడే అన్నాచెల్లెళ్ల బంధం, ఆ పవిత్రతను నిజమైన అర్థంలో సంపూర్ణంగా జరుపుకోవాలని ఆశిద్దాం. రక్షణ కోసం అన్నదమ్ముల అవసరం రాని రోజు కోసం ఎదురు చూద్దాం. మొదటి రాఖీ కట్టిన ఆమె ఏ సంబంధం ఉన్న అతనికి కట్టింది, దాని ఫలితమేంటి? అనేది తెలిసినా, తెలియకపోయినా రాఖీ అంటే రక్షణ కల్పించే ఒక నమ్మకం. ఇదీ అక్కాచెల్లెళ్ల పరిస్థితి మహిళలకు భద్రత కరువైన దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానానికి చేరుకోవడం తాజా పరిణామం. ‘నిర్భయ’ సంఘటన తర్వాత దేశంలోని పరిస్థితులు మరింతగా దిగజారాయి. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గత ఏడాది విడుదల చేసిన లెక్కల ప్రకారం... 1ని. 39 నేరాలు దేశంలో మహిళలపై ప్రతి నిమిషానికి 39 నేరాలు జరుగుతున్నాయి. 83% నేరాలు - గత దశాబ్ద కాలంలో... అంటే, 2007–17 కాలంలో మహిళలపై నేరాలు 83% పెరిగాయి. 25 లక్షలకు పైగా ఇదే దశాబ్ద కాలంలో మన దేశంలోని మహిళలపై 25 లక్షలకు పైగా నేరాలు జరిగాయి. 11% గడచిన ఏడాది వ్యవధిలోనే మహిళలపై అత్యాచారాలు 11.5 శాతం పెరిగాయి. 25% గడచిన ఏడాది కాలంలో మహిళలపై లైంగిక దాడులు 25 శాతం పెరిగాయి. 19% గడచిన ఏడాది కాలంలో మహిళలు, బాలికల కిడ్నాప్లు 19 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాల కేసులు ప్రతి గంటకు నాలుగు చొప్పున నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన లెక్కలన్నీ దేశంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వెల్లడించినవి మాత్రమే. దేశంలో వాస్తవంగా మహిళలపై జరుగుతున్న నేరాలతో పోలిస్తే, పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులు నామమాత్రమేనని, నమోదు కాని సంఘటనలు 99 శాతానికి మించే ఉంటాయని గత ఏడాది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక వెల్లడించింది. దేశంలోని అక్క చెల్లెళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలవూ! రాఖీరోజు అన్నలు తమ్ముళ్లు తమ అక్కలను చెల్లెళ్లను సంరక్షించుకుంటామని వారికి భరోసా ఇచ్చే కంటే ముందే వారివల్ల ఏ ఆడపిల్లకూ హాని జరగదని ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. – మానస ఎండ్లూరి రాఖీ విశేషాలు రక్షాబంధన్ ఆచారం మన దేశంలో ప్రాచీనకాలం నుంచే ఉంది. పురుషులు యుద్ధాలకు బయలుదేరేటప్పుడు వారి విజయం కోసం మహిళలు పూజలు చేసేవారు. పూజల తర్వాత పురుషుల నుదుట వీరతిలకం దిద్ది, ముంజేతికి నూలుదారాలతో అల్లిన సన్నని తాడును రక్షాబంధనంగా కట్టేవారు. బలి చక్రవర్తి స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు. స్వర్గం రాక్షసరాజ్యంగా మారింది. పదవీచ్యుతుడైన తన భర్తకు విజయం దక్కేట్లు చూడాల్సిందిగా శచీదేవి విష్ణువును కోరింది. విష్ణువు ఆమెకు నూలుదారాలతో అల్లిన తాడును ఇచ్చాడు. ‘ఈసారి యుద్ధానికి వెళ్లే ముందు నీ భర్త ముంజేతికి ఈ రక్షాబంధనాన్ని కట్టు. తప్పక విజయం సాధించగలడు’ అని చెబుతాడు. బలి చక్రవర్తిపై తిరిగి యుద్ధానికి సిద్ధపడిన ఇంద్రుడికి శచీదేవి విష్ణువు ఇచ్చిన రక్షాబంధనాన్ని కడుతుంది. ఇంద్రుడు బలిచక్రవర్తిని ఓడించి, తిరిగి స్వర్గాధిపత్యం సాధిస్తాడు. ఇది భవిష్యపురాణంలోని గాథ. వామనావతారంలో వచ్చిన విష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన కథ తెలిసిందే కదా! మహాభక్తుడైన బలిచక్రవర్తి ఆ సమయంలో విష్ణువును నిత్యం తన వద్దనే ఉండాలంటూ కోరుకుంటాడు. బలి కోరిక మేరకు విష్ణువు పాతాళంలోనే ఉండిపోతాడు. లక్ష్మీదేవి వైకుంఠంలో ఒంటరిగా మిగిలిపోతుంది. తన భర్తను తిరిగి తనతో తీసుకుపోవడానికి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి బలి చక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది. కానుకగా ఏం కావాలని బలి అడిగినప్పుడు తన భర్తను తనతో పాటే వైకుంఠానికి పంపమని కోరుతుంది. బలి సరేననడంతో పతీసమేతంగా లక్ష్మీదేవి వైకుంఠానికి చేరుకుంటుంది. ఈ గాథ భాగవతంలోను, విష్ణుపురాణంలోను ఉంది. ఆయువు తీరినవారి ప్రాణాలను హరించడంలోను, నరకానికి వచ్చిన పాపుల పాప విచారణ చేసి, వారికి శిక్షలు విధించడంలోను నిరంతరం తలమునకలుగా ఉండే యమధర్మరాజు ఒకసారి పన్నెండేళ్ల పాటు తన చెల్లెలు యమునను చూడటానికి వెళ్లలేకపోయాడు. అన్నను చూసి ఏళ్లు గడుస్తున్న కొద్దీ యమున దిగులుతో కుంగిపోసాగింది. గంగ వద్ద ఒకసారి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. అప్పుడు గంగ యముడి వద్దకు వెళ్లి యమున బాధను వివరిస్తుంది. అప్పుడు యముడు నరకాన్ని వీడి బయలుదేరి యమున వద్దకు వస్తాడు. ఇంటికి వచ్చిన అన్నకు యమున షడ్రసోపేతమైన భోజనం వడ్డించి, రక్షాబంధనాన్ని కడుతుంది. కనీసం ఏడాదికి ఒకసారైనా తనను చూడటానికి రావాలని కోరుకుంటుంది. అలెగ్జాండర్ భార్య రుక్సానా కేకయ రాజు పురుషోత్తముడికి, చిత్తోడ్ రాణి కర్ణీదేవి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రక్షాబంధనాలను పంపి, వారి సాయం కోరినట్లుగా చారిత్రక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, వీటికి స్పష్టమైన ఆధారాలు ఎక్కడా లేవు. -
తెలుగు తేజం మానస
ఆమె అడుగులు నటరాజకు నాట్యాభిషేకం చేస్తాయి.ఆమె పాద మంజీరాలు భరతముని నాట్యాశాస్త్రానికి చిరునామాగామారుతాయి. ఆమె ప్రదర్శించే అంశాలు భారతీయ నృత్య సంప్రదాయ విలువలను చాటుతాయి. ఆమె ప్రముఖ నాట్య కళాకారిణి అచ్యుత మానస, నగరానికి చెందిన అచ్యుత మానస ఈ నెల 4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు గ్రీసులోని ప్రపంచ ప్రఖ్యాత ఎథెన్స్ ప్రాంతంలో 51 అంతర్జాతీయ వేదికమీద కూచిపూడి నాట్యంలోని తరంగం అంశంగా ప్రదర్శన(అంతర్జాతీయ డాన్స్ కౌన్సిల్) ఇవ్వటానికి వెళుతున్నసందర్భంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. విజయవాడ కల్చరల్: 25 సంవత్సరాల నాట్యప్రస్ధానం, ఆరేళ్ల వయస్సులోనే నృత్యంలో శిక్షణ ప్రారంభం, తల్లి రాజ్యలక్ష్మి తండ్రి రవిచంద్ర(పోలీస్ ఉన్నతాధికారి)ప్రేరణతో నాట్యరంలోకి ప్రవేశించిన అచ్యుత మానస నాట్యాచార్యులు కాజ వెంకటసుబ్రహ్మమణ్యం పర్యవేక్షణలో కూచిపూడి, భరతనాట్యం, కథక్ అంశాలను అలవొకగా ప్రదర్శంచగల తెలుగు తల్లి ముద్దుబిడ్డ అచ్యుత మానస. నాట్యమేకాదు, అటు చిత్రలేఖనం, సంగీతం, యోగాలో విశేష ప్రతిభ కనపరుస్తున్న అచ్యుత మానస దేశవిదేశాలలో 1200పైగా ప్రదర్శనలు ఇచ్చింది. పురస్కారాలు యునెస్కో బెస్ట్ కల్చరల్ అంబాసిడర్గా ఎంపిక, 2016లో నాట్యరంలో ఉగాది పురస్కారం, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు, కళాసరస్వతి, నాట్యమయూరి, నాట్యకళామయి బిరుతులతో సత్కరించాయి. ఉచిత శిక్షణ కూచిపూడి మై లైఫ్ పేరుతో దిగువ తరగతికి వారికి నాట్యంలో శిక్షణ ఇచ్చివారిని అంతర్జాతీయ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కొత్తగా కూచిపూడి నాట్య కళాక్షేత్ర అనే నృత్య అకాడమీని స్థాపించారు. ఔత్సాహికుల కోసం సీడీల నిర్మాణం భావితరాలకు భారతీయ నృత్య సంప్రదాయమైన కూచిపూడిని అందించటానికి కూచిపూడి నాట్యాభినయ వేదం మోక్షం అనే సీడీని తయారుచేసి జీయర్ స్వామి, దర్శకుడు విశ్వనా«థ్, విశ్వంజీ చేతులమీదుగా ఆవిష్కరించి దాని ద్వారా వచ్చిన సొమ్మును మై లైఫ్ పేరుతో శిక్షణ తీసుకొనే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు ప్రతినిధిగా.. జూలై 4 నుంచి 8వ తేదీ వరకు ఎథెన్స్(అంతర్జాతీయ స్టేడియం)లో 51వ అంతర్జాతీయ డాన్స్ రెసెర్చి సంస్థ 50 దేశాల ప్రతినిధులతో సమ్మేళనం నిర్వహిస్తోంది. అదే వేదిక మీద అచ్యుత మానస భారతదేశ ప్రతినిధిగా కూచిపూడి అంశంగా ప్రసంగించనున్నది. జీవితాశయం ఉన్నత విలువలుగల భారతీయ మహిళాగా ఎదగాలని, భారతీయ నృత్యసంప్రదాయ రీతులు ప్రపంచమంతా పాకాలని, అతి పేద వారికి కూడా సంప్రదాయ నృత్యరీతులను నేర్పించి భావితరాలకు ఉన్నత విలువలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశయమని ఆమె వివరించారు. -
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
పెన్పహాడ్: మరి కొన్ని గంటల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు రానున్న నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మానస(15) పెన్పహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఇటీవల జరిగిన పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో.. ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ మానసను చదివిస్తుండటంతో.. ఫెయిల్ అయితే తల్లిదండ్రులు బాధపడుతారనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అంటున్నారు. -
మతిస్థిమితం లేని యువతి అదృశ్యం
-
మతిస్థిమితం లేని యువతి అదృశ్యం
హైదరాబాద్: మతిస్థిమితం లేని యువతి అదృశ్యమైన ఘటన నగరంలోని హబ్సీగూడలో చోటు చేసుకుంది. జె. మానస(19) అనే యువతి శనివారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానస తండ్రి ఇటీవల మృతి చెందిన సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ జే. శ్రీనివాసులు. మానస ఆచూకీ తెలిసిన వారు 9441368944కు సమాచారం ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులు కోరుతున్నారు. కేసు నమోదు చేసిన ఉస్మానియా యూనివర్సటీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ప్రియుడి కోసం అమెరికా నుంచి బెజవాడకు
విజయవాడ: ఓ ఎన్నారై యువతి విజయవాడలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే భర్తను కాదని మానస అనే యువతి ప్రియుడి కోసం విజయవాడకు వచ్చింది. తీరా ఆమె విజయవాడ వచ్చాక ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు. అతడి కోసం ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మానస బంధువుల ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా హేమంత్ కోసం ఫోన్ చేస్తే వాళ్ల కుటుంబసభ్యుడు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని మానస ఆరోపించింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి వచ్చేందుకు అనుమతించడం లేదు. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఓ ఎన్నారైని గత డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. మానస అమెరికాకు వెళ్లినప్పటి నుంచి హేమంత్ పెళ్లి చేసుకుంటానని ఫోన్లో చెప్పాడు. ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న మానస విషయాన్ని భర్తకు చెప్పి...హేమంత్ కోసం అమెరికా నుంచి విజయవాడకు వచ్చింది. ఈలోగా...హేమంత్ రెడ్డి కనిపించకుండా పోవడంతో... తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ఇంట్లోకి రావద్దని చెప్పడంతో బంధువుల ఇంట్లో చేరింది. అక్కడ ఉంటూనే ప్రియుడిని కలిసేందుకు ప్రయత్నించింది. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో..హేమంత్ ఇంటికి ఫోన్ చేసింది. వాళ్లు కట్నం డిమాండ్ చేయడంతో ..వేరే దారి లేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తను వదిలి వచ్చిన మానసను కట్నం పేరుతో మోసం చేయడం సరైన పద్దతి కాదంటున్నారు బంధువులు. ఎలాగైనా పోలీసులే మానసకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
మానస...మనోజ్ అయ్యాడు..
కామారెడ్డి : తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మిదేవత ఇంటికి వచ్చిందని మురిసిపోయారు. చూడచక్కగా ఉన్న పాపకు మానస పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏడాది.. రెండేళ్లు.. మూడేళ్లు..పదేళ్లు గడిచాయి. అంతలోనే మానసకు కడుపులో నొప్పి రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తల్లిదండ్రులు డాక్టర్ల వద్ద చూపించారు. రకరకాల పరీక్షలు, స్కానింగ్ తరువాత ఆమెలో మగ లక్షణాలున్నాయని తేల్చారు. గర్భాశయం, అండాశయం లేవని నిర్ధారించారు. పురుషాంగాలు లోపల ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్కు డబ్బు చాలానే ఖర్చవుతుందన్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి ఈ నెల 9న కరీంనగర్ జిల్లా ముస్తాబాద్లోని పీపుల్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపు లోపలి భాగంలో ఉన్న వృషణాలను బయటకు తీసి సరిచేశారు. ఇది అరుదైన ఘటనగా చెప్పారు. మానస పేరును మనోజ్గా మార్చేశారు. ఇప్పుడు మనోజ్గా కొత్త జీవితం మొదలైంది. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య దంపతులు కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్లో 20 ఏళ్లుగా నివసిస్తారు. రాజు బీడీ కంపెనీలో పనిచేస్తుండగా, లావణ్య బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. వారికి 2005 జూన్ 26న మానస జన్మించింది. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్లోని వాగ్దేవి పాఠశాలలో మానస చదువుతోంది. గత యేడాది 4వ తరగతి చదివింది. ఏడాదిగా సంఘర్షణ... మానస ఆడపిల్ల కాదని తెలిసిన నాటి నుంచి తల్లిదండ్రులు ఎంతో సంఘర్షణకు లోనయ్యా రు. తమ కూతురి సమస్య ఎలా పరిష్కారమవుతుందోనని ఆ తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. కూతురిని వెంటబెట్టుకుని ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. బీడీలపైనే ఆధారపడ్డ ఆ దంపతులు కూతురిని కాపాడుకునేందుకు అప్పు లు చేసి మరీ ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా ఆపరేషన్ చేయించారు. ఏడాది కాలం గా పడ్డ సంఘర్షణకు తెరపడడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కాని మరో మూడు నెలలకు మరో ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పిన మీదట మరిన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనేది ఆ తల్లిదండ్రులకు తీవ్ర సమస్యగా మారింది. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం బీడీ కంపెనీలో పనిచేసే రాజు, బీడీలు చుట్టే లావణ్యల సంపాదన సంసారానికే సరిపోతుంది. అయితే తమ కూతురి సమస్యతో ఇబ్బందులు పడ్డ రాజు, లావణ్యలు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏడాదిపాటు తిరగడానికి, వైద్యానికి రూ. లక్షన్నర అప్పు చేశారు. చేసిన అప్పు తీర్చడం ఒక ఎత్తయితే, మరో ఆపరేషన్కు కావలసిన డబ్బులు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి భారంగా మారాయి. తమకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆమె... దశాబ్దం తర్వాత అతడయ్యాడు
ముస్తాబాద్: అందమైన చిరునవ్వు.. అంతే అందమైన పేరు.. మానస. అందరు పిల్లల్లాగే పెరిగి పెద్దవుతున్న కొద్దీ మానసలో కొన్ని అసహజ మార్పులు..! ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా... ఆమెలో పురుష లక్షణాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ వైద్యుడు చింతోజు శంకర్ను సంప్రదించగా ఆయన శస్త్రచికిత్స నిర్వహించి మానసను మనోజ్గా మార్చారు. వివరాలివీ.. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య కూతురు మానస(11). వీరు ఉపాధి కోసం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థిరపడ్డారు. మానస అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ఆమె పుట్టినప్పుడు కొంత పురుష అవయవాలతో జన్మించగా.. దానిని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. మానస జన్మించినప్పుడు వృషణాలు పొత్తికడుపులో ఉండడంతో గమనించలేదు. స్త్రీ మర్మావయాలు కొంతమేరకు ఉండడంతో ఆమ్మాయిగానే భావించారు. అందరు ఆడపిల్లల్లాగే పెంచారు. ఇటీవల ఆమెలో పురుష లక్షణాలు కనిపిస్తుండటంతో గమనించిన తల్లిదండ్రులు కరీంనగర్, హైదరాబాద్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. మానసలో పురుష లక్షణాలు ఉన్నాయని, గర్భాశయం, అండాశయం లేవని వైద్యులు తేల్చారు. కానీ, శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. రెండు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లికి చెందిన కొర్రె వేణుకు స్త్రీ, పురుష జననాంగాలు ఉండగా, జిల్లాలోని ముస్తాబాద్లోని పీపుల్స్ హాస్పిటల్లో డాక్టర్ చింతోజు శంకర్ శస్త్రచికిత్స చేసి సరిచేశారని ‘సాక్షి’ లో వచ్చిన కథనం చూసిన మానస తండ్రి గవ్వల రాజు... డాక్టర్ శంకర్ను సంప్రదించాడు. బైలాటరల్ ఆర్కిటోపెక్సీగా పిలిచే అరుదైన కేసు అని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. గర్భంలో ఉన్నప్పుడు వైక్రోమోజోం సరిగా ఎదగకపోవడంతో జెనెటిక్ సమస్య వచ్చిందన్నారు. మానసలో టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, శస్త్రచికిత్స ద్వారా మూత్రనాళం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే కోలుకుంటుందని తెలిపారు. శస్త్రచికిత్సతో మానస జీవితం మారిపోయిందని, ఆమెను మనోజ్గా పిలుచుకుంటామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
మిస్టరీగా మారిన మానస కేసు
* నూడుల్సే కారణమంటున్న తల్లిదండ్రులు * ఫోరెన్సిక్ లేబరేటరీకి వివరాలు యనమలకుదురు (పెనమలూరు): యనమలకుదురు గ్రామం లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని వెలిశిల మానస(15)కేసు మిస్టరీగా మారింది. బాలిక నూడిల్స్ తిని మృతి చెందిందని తల్లిదండ్రు లు చెబుతుండగా, వడదెబ్బ వలనే ఆమె మృతి చెందిందని వైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. కేసు వివాదంగా మారటంతో పూర్తి వివరాల కోసం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ లేబరేటరీకి వివరాలు పంపారు. యనమలకుదురు అంబేడ్కర్నగర్కు చెందిన వెలిశిల విజయ్కుమార్కు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు కొండపల్లికి వెళ్లటంతో ఇంట్లో ఉన్న మానస, మమత, నమ్రత సమీపంలో ఓ షాపులో ప్రముఖ కంపెనీకి చెందిన నూడుల్స్ కొని ఇంట్లో వండుకుని శీతల పానీయంతో తిన్నారు. కొద్ది సమయానికి మానస వాంతులు చేసుకుని కుప్పకూలి పోయింది. మిగతా ఇద్దరూ స్వల్ప అస్వస్థతకు గురైనా వారికి ఏమీ కాలేదు. మానసను వైద్యం కోసం విజయవాడ తరలించగా ఆమె చనిపోయింది. అయితే ఆమె ఎందుకు చనిపోయిందనేది మిస్టరీగా ఉంది. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే.. ఆమె తల్లితండ్రులు మాత్రం తమ బిడ్డ నూడుల్స్ తినటం వలనే చనిపోయిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు నూడుల్స్ ప్యాకెట్, వండగా మిగిలిన నూడుల్స్, శీతలపానీయం సీజ్ చేశారు. అలాగే నూడుల్స్ అమ్మిన కొట్టు యజమాని తమ్ము సుశీల స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. నూడుల్స్ చాలా మందికి అమ్మానని వాటి డేట్ ఎక్సపేర్ కాలేదని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు మానస మృతదేహానికి పోస్టుమార్టం చేయించి ఆయా వివరాలు, సీజ్ చేసిన ఆహార పదార్ధాన్ని హైదరాబాద్లోని ఫోరెన్సిక్ లేబరేటరీకి పంపారు. ఈ నివేదిక నెల రోజుల్లో వస్తుందని పోలీసులు తెలిపారు.అప్పటి వరకు కేసు విషయం ఏమీ తేల్చి చెప్పలేమన్నారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో సోమవారం రాత్రి ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన వలశిల విజయ్కుమార్, అతని భార్య కలసి కొండపల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి సోమవారం సాయంత్రం వెళ్లారు. వారి ముగ్గురు కమార్తెలు మానస(15), మమత, థెరీసాలను ఇంట్లోనే ఉంచి వెళ్లారు. అక్కాచెల్లెళ్లు మ్యాగి చేసుకుని తిని, కూల్ డ్రింక్ తాగారు. అనంతరం మానస నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మానస మృతి చెందింది. మిగతా ఇద్దరికీ ఏమీ కాకపోవడం, మానస ఒక్కతే మృతి చెందడంతో అనుమానాస్పద మృతి కింద పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన మెదక్ పట్టణంలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మానస(30) ఇంట్లో ఎవరు లేని సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు మానస బంధువులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తే.. ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. -
తిరిగి వస్తుందనుకుంటే...
విగతజీవిగా కనిపించిన కుమార్తె గత నవంబర్లో ప్రేమజంట ఆత్మహత్య అప్పుడే ప్రియుడే మృతి మూడు నెలల తర్వాత {పియురాలి మృతదేహం గుర్తింపు హయత్నగర్: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే భయం ఓ ప్రేమజంటను ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ప్రేమ విషయం తెలిస్తే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని భావించిన ప్రేమికులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన ఊపిరితో సంఘటనా స్థలం నుంచి వచ్చిన ప్రియుడు మార్గమధ్యలో మృతి చెందగా.. 3 నెలల తర్వాత ప్రియురాలి మృతదేహం బయటపడింది. ఇన్నాళ్లూ తమ కూతురు బతికే ఉందని భావించిన తల్లిదండ్రులకు విషాదం మిగిల్చిన ఈ ఘటన బుధవారం హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్పేట నగరపంచాయతీ పరిధిలోని తట్టిఅన్నారంలో నివశించే బురుగు నారాయణ గౌడ్ స్థానికంగా మిర్చి బండి నిర్వహిస్తుంటాడు. ఆయన కూతురు మానస (18) టైలరింగ్ నేర్చుకునేది. అదే గ్రామంలో నివసించే నల్ల నర్సింహ కుమారుడు హరిబాబు (25) ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మానస తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను వరంగల్ జిల్లా గీసుకొండలోని తన పెద్దమ్మ వద్దకు పంపించారు. ప్రియురాలిని మరిచిపోలేక హరిబాబు గత ఏడాది నవంబర్ 20న మానసను బైక్పై తీసుకొచ్చాడు. మరునాడు తెల్లవారుజామున తాము ‘ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం.. చనిపోతున్నాం’ అని హరిబాబు ఫోన్ నుంచి ఇరువురి కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్ పంపారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వారిని వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నవంబర్ 21నపెద్ద అంబర్పేట సమీపంలోని పాపాయిగూడ చౌరస్తా వద్ద హరిబాబు అపస్మారక స్థితిలో కనిపించాడు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తేల్చారు. మానస ఆచూకీ దొరకకపోవడంతో.. ఆమె బతికే ఉండవచ్చని తల్లిదండ్రులు భావించారు. ఎంత వెతికినా జాడ లేకపోవడంతో అదే నెల 25న గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అక్కడ మిస్సింగ్ కేసు న మోదు చేసుకున్నారు. మానస కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కొంతకాలంగా తట్టి అన్నారంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు బుధవారం చుట్టు పక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. గ్రామంలోని గద్దగుండి చెలుక వద్ద నిర్జన ప్రదేశంలో బండరాయిపై ఓ మృతదేహం బయటపడింది. మృతదేహానికి ఉన్న చెవి కమ్మలు, పట్టా గొలుసులు, దుస్తుల ఆధారంగా మానసగా గుర్తించారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ‘మేం ప్రేమించుకుంటున్నాం. ఇది వరకే పెళ్లయింది. పెద్దలకు తెలిస్తే గొడవలు అవుతాయన్న ఉద్దేశంతో చనిపోతున్నాం. ఎవరి బలవంతమూ లేదు’ అని ఆ నోట్లో రాసి ఉంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
నిప్పంటించుకుని బాలిక బలవన్మరణం
మల్యాల: పదో తరగతి చదువుతున్నఓ బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రుద్రవేని దేవయ్య, నర్సవ్వ కుమార్తె మానస(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా మానస ఇంట్లోనే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు అప్రమత్తమై వచ్చేలోపల తీవ్ర గాయాలతో చనిపోయింది. స్థానిక యువకుల వేధింపులే బాలిక ఉసురు తీశాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.