
ఎయిమ్స్కు కేంద్రంపై ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతు లభించినా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్ కలిసి రాయచూరులో మహాత్మగాంధీ మైదానంలో చేపట్టిన ఆందోళన 1057వ రోజుకు చేరిందన్నారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ధి కొరతతో మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. అశోక్ కుమార్ జైన్, సంతోష్ కుమార్, వినయ్ కుమార్, శాంతనగౌడలున్నారు.