ఉరితాళ్లతో జీపీ కార్మికుల నిరసన ! | - | Sakshi
Sakshi News home page

ఉరితాళ్లతో జీపీ కార్మికుల నిరసన !

Published Tue, Jul 18 2023 4:14 AM | Last Updated on Wed, Jul 19 2023 2:05 PM

- - Sakshi

కుమరం భీం: రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ప్రారంభించిన సమ్మె సోమవారం 12వ రోజుకు చేరింది. దీక్షా శిబిరంలో కార్మికులు తలకు ఉరితాళ్లతో వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 11వ పీఆర్సీ, జీవో నం.60ని వెంటనే అమలు చేయాలని సంఘం నాయకులు శ్రీకాంత్‌, లోకేష్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌, శంకర్‌, రాజు, సమ్మయ్య, శ్రీనివాస్‌ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement