హౌస్‌లో గొడవపడ్డ కంటెస్టెంట్స్‌.. కొట్టుకునేలా ఉన్నారుగా! | Bigg Boss Telugu Season 8 Latest Promo Out Now | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu: మణికంఠపైకి దూసుకెళ్లిన పృథ్వీ.. కొట్టుకున్నంత పనైంది!

Published Thu, Oct 17 2024 5:51 PM | Last Updated on Thu, Oct 17 2024 5:51 PM

Bigg Boss Telugu Season 8 Latest Promo Out Now

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్‌ సీజన్‌-8 అలరిస్తోంది. తెలుగులో బిగ్‍బాస్- 8 ఏడో వారం కొనసాగుతోంది. వెల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఈ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారింది. పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి హౌస్‌ను హాట్‌హాట్‌గా మార్చేశారు. ఇప్పటికే రెండు టీమ్‌లుగా రాయల్‌, ఓజీగా విడిపోయిన కంటెస్టెంట్స్ టాస్కుల్లో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. అయితే హౌస్‌లో మెగా చీఫ్‌ కంటెండర్‌గా గంగవ్వ ఛాన్స్ కొట్టేసింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న రాయల్‌ టీమ్‌ను ఓవర్‌ స్మార్ట్‌ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్‌ స్మార్ట్‌ చార్జర్లుగా విభజించారు. హౌస్‌ అంతా రాయల్‌ టీమ్‌ ఆధీనంలో, గార్డెన్‌ ఏరియా ఓజీ టీమ్‌ ఆధీనంలో ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. కిచెన్‌, బెడ్‌రూమ్‌, వాష్‌రూమ్‌ వంటి వసతులు అందిస్తూ ఛార్జింగ్‌ పొందవచ్చని తెలిపాడు. ఆ సంగతి అలా ఉంచితే ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్‌మేట్స్‌ అంతా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. 

అయితే ఓవర్‌ స్మార్ట్‌ చార్జర్స్‌ టీమ్‌లో ఉన్న మణికంఠ, పృథ్వీ ఓ విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లారు. నీ యాటిట్యూడ్ తగ్గించుకో అని మణికంఠ అనడంతో పృథ్వీకి మరింత కోపమొచ్చింది. ఆ గొడవ మరింత ముదరడంతో చివరికీ హౌస్‌మేట్స్‌ అంతా కలిసి వారిద్దరిని నిలువరించారు. ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్‌ ఇవాళ రాత్రి ప్రసారం కానుంది. 
    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement