Promo
-
ఏయ్ పవన్ కళ్యాణ్.. నీకు దమ్ముందా?
-
Womens Day: కన్న పేగు బంధం అమ్మది..
-
'అన్స్టాపబుల్' షోలో వెంకటేశ్.. ప్రోమో రిలీజ్
అన్స్టాపబుల్ (Unstoppable with NBK) ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ఇదివరకే ఆరు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ కోసం విక్టరీ వెంకటేశ్ (Venkatesh) వచ్చారు. ఈయన లేటెస్ట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). ఈ మూవీ సంగతులతో పాటు బోలెడన్ని విషయాల్ని పంచుకున్నారు. హోస్ట్ బాలకృష్ణతో కలిసి వెంకీ ఫుల్ సందడి చేశారు. వెంకీతో పాటు ఈయన అన్నయ్య సురేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కూడా ఇదే ఎపిసోడ్లో పాల్గొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా?)లేటెస్ట్గా రిలీజైన ప్రోమోలో వెంకీ, బాలకృష్ణ ఒకరి సినిమాకు మరొకరు హైప్ ఇచ్చుకున్నారు. వెంకటేష్ 'డాకు మహారాజ్' (Daaku Maharaj) అని హైప్ ఇవ్వగా, బాలకృష్ణ అందుకొని 'నా మనసులో నువ్వే మహారాజ్' అని డైలాగ్ వేశారు. ఆ తర్వాత గతాన్ని గుర్తు తెచ్చుకుని మాట్లాడుకున్నారు. 'రాముడు మంచి బాలుడు' అనే డైలాగ్ చెప్పి బాలయ్య సిగ్గుపడుతుంటే.. వెంకటేష్ అందుకుని 'హలో కొంపతీసి నువ్వా రాముడు?' అని సెటైర్ వేశారు. ఆ వెంటనే బాలయ్య.. 'అలా భయపెట్టిస్తే ఎలా' అని పంచ్ వేశారు.ఇదే షోలో వెంకటేశ్.. నాగచైతన్య, రానాతో తనకున్న బాండింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. సోదరుడు సురేశ్ బాబు కూడా షోకి వచ్చారు. వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యారు. డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు పూర్తి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్) -
జగన్ ఈజ్ ఏ ఫైటర్..
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. హ్యాపీ లైఫ్కి మైక్రో మంత్ర!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని హ్యాపీ లైఫ్కు మైక్రో మంత్ర అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈనెల 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్ సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. -
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ప్రోమో
-
ప్రేరణకు బిగ్బాస్ సర్ప్రైజ్.. హౌస్లోకి ఎవరొచ్చారంటే?
ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో ఎమోషనల్ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పంపిస్తూ ఫుల్ ఎమోషనల్ వీక్గా మార్చేశారు. తాజాగా మరో కంటెస్టెంట్ కుటుంబ సభ్యుడు బిగ్బాస్ హౌస్లో సందడి చేశాడు. హౌస్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ప్రేరణ భర్త ఇవాళ హౌస్లో అడుగుపెట్టాడు. తన భర్తను చూసి ఆనందంలో గంతులేసింది ప్రేరణ.(ఇది చదవండి: 40 రోజులుగా బ్లీడింగ్.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి)ఆ తర్వాత చాలా బాగా అడుతున్నావంటూ ప్రేరణను మరింత ఎంకరేజ్ చేశాడు ఆమె భర్త. నువ్వు విన్నర్గా తిరిగి రావాలంటూ భార్యకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ జంట హౌస్లో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరితో సరదాగా మాట్లాడారు. చివర్లో భార్య, భర్తలిద్దరితో గేమ్ ఆడించాడు బిగ్బాస్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇవాళ హౌస్లో ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. -
రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. మరో నెల రోజుల్లోపే బిగ్ గేమ్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. గత రెండు నెలలుగా బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్ 11వ వారానికి చేరుకుంది. గతవారంలో వెల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హరితేజ ఎలిమినేట్ అయింది. ఇక మరోవారం మొదలైందంటే చాలు నామినేషన్ల గొడవే. ఆ రోజంతా ఒకరిపై ఒకరు చిన్నపాటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలా ఈ వారంలో గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేషన్స్లో నిలిచారు.ఇవాల్టి ఎపిసోడ్లో హౌస్ను కాస్తా ఎమోషనల్గా మార్చేశాడు బిగ్బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రారంభంలోనే టేస్టీ తేజ ఫుల్ ఎమోషనల్గా కనిపించాడు. నేను ఏడిస్తే మా అమ్మకు నచ్చదు అంటూ ఆమెను తలచుకుని ఏడుస్తూ.. కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత కంటస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ను హౌస్లోకి పంపించారు. రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్బాస్. ఆమె కుమారుడితో పాటు రోహిణి వాళ్ల అమ్మను హౌస్లోకి పంపించారు. అక్కడికెళ్లిన రోహిణి కుమారుడితో బిగ్బాస్ కంటెస్టెంట్స్ అందరూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమోను రిలీజ్ చేశారు. 💖 An Adorable Surprise for Rohini! 💖Bigg Boss house fills with warmth as Rohini receives an unforgettable, adorable surprise! Watch her heart-melting reaction to this sweet moment! ❤️#BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/ay1nLZdkdA— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 12, 2024 -
'ఇక ఆపేద్దామన్న హరితేజ.. నా మీదే ఎందుకంత కోపం'
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. గతవారంలో నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం వచ్చిందంటే హౌస్లో మాటల యుద్ధమే. ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యేది ఆ రోజు నుంచే. అయితే ఈసారి బిగ్బాస్ ఓ చిన్న కండీషన్ పెట్టాడు. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు.అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. పలు కారణాలతో ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. అయితే ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగాయి. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో హరితేజ, ప్రేరణ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటివరకు జరిగిందంతా చాలు.. ఇక నుంచి ఆపేద్దాం.. నోరు బాగుంటే ఊరు బాగుంటది' అంటూ ప్రేరణను అడిగింది హరితేజ. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే నామినేట్ చేసుకుందాం. అంతేకానీ మనిద్దరికీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలకు హరితేజను అభినందిస్తూ మాట్లాడింది ప్రేరణ. ఆ తర్వాత మళ్లీ హరితేజను ఫేక్ అని ప్రేరణ అనడంతో మరింత మాటల యుద్ధం నడిచింది. ప్రతిసారి ఫేక్ అనొద్దు.. మాటలు ముందు సక్కగా మాట్లాడు అంటూ హరితేజ వాదించింది. దీంతో వీరిద్దర మధ్య జరిగిన వార్ పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
'ఓవర్ యాక్టింగ్ ఆపమన్న నిఖిల్'.. వార్ను తలపించిన బిగ్బాస్ హౌస్!
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్బాస్ షో కాస్తా రసవత్తరంగానే సాగుతోంది. కొత్త, పాత నీరు కలవడంతో పోటాపోటీగా హౌస్లో హల్చల్ చేస్తున్నారు. ఇక నామినేషన్స్ టైమ్లో అయితే కంటెస్టెంట్స్ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ గొడవ మొదలైనట్లే. అలా ఈ వారంలో గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేషన్స్లో ఉన్నారు.ఇక నామినేషన్స్ గోల ముగియడంతో ఈ రోజు టాస్క్ల గోల మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పానిపట్టు యుద్ధం అంటూ హౌస్మేట్స్కు సరికొత్త పోటీ పెట్టాడు బిగ్బాస్. నీళ్ల ట్యాంకుల టాస్క్ ఇవ్వడంతో హౌస్మేట్స్ పోటాపోటీగా పాల్గొన్నారు. ఇక టాస్క్లో భాగంగా నిఖిల్ రెచ్చిపోయాడు. యష్మితోపాటు ఇద్దరి చేతులను పట్టుకుని లాగాడు. దీంతో గౌతమ్ నీకసలు బుద్ది ఉందా? అంటూ నిఖిల్ను హెచ్చరించాడు. సంచాలక్కు రెస్పెక్ట్ ఇవ్వరా? అంటూ యష్మి మండిపడింది.టాస్క్ కాస్తా దారి మళ్లీ గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. నీకసలు సెన్స్ ఉందా? అంటూ గౌతమ్ అనడంతో నిఖిల్ మరింత ఫైరయ్యాడు. ఆపు నీ ఓవర్ యాక్టింగ్ అని నిఖిల్ చెప్పడంతో.. నీది ఓవర్ యాక్టింగ్ గౌతమ్ మీదికి దూసుకెళ్లాడు. ఈ గొడవ ఇద్దరు చివరికీ కొట్టుకునే దాకా వెళ్లడంతో అవినాశ్, పృథ్వీ వారిని నిలువరించారు. ఈ టాస్క్ గోల పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ!
తెలుగు బుల్లితెర రియారిటీ షో బిగ్బాస్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ సారి దీపావళి ఫెస్టివల్ కావడంతో సన్డే ఎపిసోడ్ను కాస్తా ఫన్డే మార్చేశారు. ఇంటి సభ్యులతో సరదా పంచులు, డైలాగ్స్తో సందడి చేశారు. ఇవాల్టి ఎపిసోడ్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గెస్ట్గా వచ్చాడు. హౌస్మేట్స్పై తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరించాడు. విష్ణు ప్రియ, టేస్టీతేజ, ముక్కు అవినాశ్, రోహిణితో సహా పలువురిపై పంచ్ డైలాగ్స్ వేశాడు.తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్మేట్స్కు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. హౌస్ను ఫుల్ ఎమోషనల్గా మార్చేశాడు. ఇద్దరు హౌస్మేట్స్ను పిలిచి వారి కుటుంబ సభ్యుల ఫోటోలను చూపించాడు. వారిలో ఒక్కరికి మాత్రమే తన ఫ్యామిలీ సభ్యులు పంపిన మేసేజ్ చూసే అవకాశముందని నాగార్జున చెప్పాడు. దీంతో గంగవ్వ, టేస్టీ తేజకు మీలో ఎవరో ఒకరే తేల్చుకోవాలంటూ ఆదేశించాడు.దీంతో గంగవ్వ, టేస్టీ తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. గంగవ్వను పట్టుకుని ఏడ్చేశాడు. టేస్టీ తేజను సైతం గంగవ్వ ఓదారుస్తూ కనిపించింది. ఫుల్ ఫన్ ఎపిసోడ్ అంటూ చివరికీ వచ్చేసరికి హౌస్మేట్స్ను ఏడ్పించేశాడు బిగ్బాస్. చివరికీ ఏ హౌస్మేట్ తన కుటుంబ సభ్యులు పంపిన సందేశం చదివారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇప్పుడైతే ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి. -
బిగ్బాస్ హౌస్లో దెయ్యం.. భయంతో వణికిపోయిన హౌస్మేట్స్!
తెలుగులో బిగ్బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారంలోనే మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే సోమ, మంగళ వారాల్లో నామినేషన్స్ గొడవలతో ఓ రేంజ్లో సాగింది. ఈ వారంలో ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇక టాస్కుల గోల మొదలు కానుంది. అయితే ఈ సారి హౌస్లో ఊహించని సంఘటన జరిగింది. హౌస్మేట్స్ను నిద్రపోకుండా చేసేలా పెద్ద స్కెచ్ వేశారు. ముగ్గురు కలిసి హౌస్మేట్స్ను వణికించేశారు. అదేంటో తెలుసుకుందాం.హౌస్లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి కేకలు వేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా లేచి బయటకు పరిగెత్తారు. ఇంతకీ ఏం జరుగుతోంది అంటూ అంతా భయపడిపోయారు. గంగవ్వను చూసిన హౌస్మేట్స్ ఓ రేంజ్లో వణికిపోయారు. ఆ తర్వాత అవ్వను ధైర్యంతో మెల్లగా గదిలోకి తీసుకెళ్లిన టేస్టీ తేజ తన బెడ్పై నిద్రపుచ్చారు. ఆ తర్వాత అంతా కలిసి దెయ్యం పట్టిందేమో అంటూ చర్చ మొదలెట్టేశారు. నాకైతే నిద్ర కూడా రావడం లేదంటూ రోహిణి, హరితేజ తెగ చర్చించుకున్నారు.అయితే ఆ తర్వాత ఫ్రాంక్ అని తెలిసిపోయింది. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ ముగ్గురు కలిసి మాట్లాడుకుని ఫ్రాంక్ చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వీళ్లు ముగ్గురు కలిసి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. ఇంకా హౌస్లో ఏం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్బాస్
బిగ్బాస్ హౌసులో ఎనిమిదో వారం నామినేషన్ పూర్తయ్యాయి. మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. మెహబూబ్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నయని పావని లిస్టులో ఉన్నారు. హరితేజ కూడా నామినేట్ అయింది. కాకపోతే మెగాచీఫ్ గౌతమ్.. సూపర్ పవర్ ఉపయోగించిన ఆమెని తప్పించాడు. ఈ వారానికి సంబంధించి కీలక ఘట్టం ముగియడంతో కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)పృథ్వీ మెడలోని బంగారు గొలుసు గురించి తేజ అడగ్గా.. 'గోల్డ్, గోల్డ్ వేసుకుని తిరగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా' అని విష్ణుప్రియ మధ్యలో దూరి కామెంట్ చేసింది. అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని సరదాగా కామెంట్ చేశారు. అయితే అవినాష్ అన్నప్పుడు బిగ్బాస్ నిజంగానే డోర్ తెరిచాడు. దీంతో అందరూ అతడిని పట్టుకుని మరీ బయటకు తోసేయడానికి ప్రయత్నించారు. ఇదంతా కూడా ఫన్నీగా సాగింది.దీని తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్గా మారి, ఇంటి సభ్యులు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఆ తర్వాత టేస్టీ తేజతో వర్కౌట్స్ చేయించాడు. ఇదంతా కూడా ఫన్నీగా సాగేసరికి మిగిలిన హౌస్మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. పదేపదే అవినాష్, రోహిణి, టేస్టీ తేజతో తప్పితే మిగిలిన వాళ్ల నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది రావట్లేదు. బుధవారం కూడా అవినాష్ తన కామెడీతో నవ్విస్తాడని అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి) -
'నువ్వు ఎవరూ చెప్పడానికి?'.. విష్ణు ప్రియకు ప్రేరణ వార్నింగ్!
తెలుగులో బిగ్బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారం మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక సోమవారం మొదలవగానే నామినేషన్స్ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ హౌస్లో ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్లో జరిగినట్లు తాజా ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఆ వివారాలేంటో చూసేద్దాం.ఇకపోతే మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్హాట్గా సాగింది. విష్ణు ప్రియ, యష్మి గౌడ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏడు వారాలైనా నీ సొంత గేమ్ ఎక్కడ కనిపించట్లేదు.. కొన్ని మాటలు కూడా చాలా హార్ష్గా ఉంటాయని విష్ణుప్రియను యష్మి నామినేట్ చేసింది. వీరి మధ్యలో అనుకోకుండా ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. దీంతో విష్ణుప్రియతో గొడవ తారాస్థాయికి చేరింది. నా పేరు తీయకుండా మాట్లాడాలని ప్రేరణ అనడంతో..అలా అయితే హౌస్ నుంచి వెళ్లిపో అంటూ విష్ణుప్రియ వాదించింది. దీంతో నువ్వు ఎవరూ చెప్పడానికి.. నా గురించి మాట్లాడకు అంటూ ప్రేరణ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత మెహబూబ్ను నిఖిల్, యష్మి పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఆ తర్వాత పృథ్వీని ముక్కు అవినాశ్ నామినేట్ చేశాడు. బిగ్బాస్ రావడానికి మనీ తీసుకుంటావ్.. కానీ బిగ్బాస్ ఇస్తే తీసుకోవు అంటూ అవినాశ్ ప్రశ్నించాడు. ఆ తర్వాత మ్యాటర్ కాస్తా పృథ్వీ గడ్డం మీదకు వెళ్లింది. యాభై వేలు ఇచ్చినా నా గడ్డం తీయను బ్రో అంటూ పృథ్వీ గట్టిగానే అరిచేశాడు. మీరేందుకు యాభై వేలకు ఓకే చెప్పారంటూ అవినాశ్ను పృథ్వీ అడిగాడు. అది నా ఇష్టమని అవినాశ్ అనడంతో.. ఇది నా ఇష్టం అంటూ పృథ్వీ వాదించడంతో ప్రోమో ముగిసింది. హౌస్లో మరెంత హాట్హాట్గా సాగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. కాగా.. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
హౌస్లో గొడవపడ్డ కంటెస్టెంట్స్.. కొట్టుకునేలా ఉన్నారుగా!
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బిగ్బాస్ సీజన్-8 అలరిస్తోంది. తెలుగులో బిగ్బాస్- 8 ఏడో వారం కొనసాగుతోంది. వెల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఈ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారింది. పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి హౌస్ను హాట్హాట్గా మార్చేశారు. ఇప్పటికే రెండు టీమ్లుగా రాయల్, ఓజీగా విడిపోయిన కంటెస్టెంట్స్ టాస్కుల్లో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. అయితే హౌస్లో మెగా చీఫ్ కంటెండర్గా గంగవ్వ ఛాన్స్ కొట్టేసింది.బిగ్బాస్ హౌస్లో ఉన్న రాయల్ టీమ్ను ఓవర్ స్మార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్ వంటి వసతులు అందిస్తూ ఛార్జింగ్ పొందవచ్చని తెలిపాడు. ఆ సంగతి అలా ఉంచితే ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. అయితే ఓవర్ స్మార్ట్ చార్జర్స్ టీమ్లో ఉన్న మణికంఠ, పృథ్వీ ఓ విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లారు. నీ యాటిట్యూడ్ తగ్గించుకో అని మణికంఠ అనడంతో పృథ్వీకి మరింత కోపమొచ్చింది. ఆ గొడవ మరింత ముదరడంతో చివరికీ హౌస్మేట్స్ అంతా కలిసి వారిద్దరిని నిలువరించారు. ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ ఇవాళ రాత్రి ప్రసారం కానుంది. -
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్కు సంబంధించిన టీజర్ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్తోనే సాంగ్పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
అవినాష్ భార్యపై పృథ్వీ చీప్ కామెంట్స్.. మరీ ఇలానా?
బిగ్బాస్ 8 షో మరీ హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది. మాట్లాడుకోవడం, తన్నుకోవడం అనేది గేమ్స్ వరకు అయితే పర్లేదు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. మంగళవారం ఎపిసోడ్లో అలాంటి గొడవే జరిగింది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఫ్రెండ్షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని యష్మి ఏడ్చింది. దీంతో ప్రేరణ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్గా ఫామ్ అయిన నిఖిల్.. నబీల్, పృథ్వీ, మణికంఠతో మాట్లాడుతూ తేజని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని అన్నాడు. గుర్రం సౌండ్ వినిపించగానే యష్మి టోపీ లాగేసుకుని ప్రేరణకి ఇచ్చింది. పోడియంపై నిలబడ్డ విష్ణుప్రియ.. రివేంజ్ పేరుతో నయని పావనిని నామినేట్ చేయాలనుకుంది. కానీ రివేంజ్ అనేది ఇక్కడ కుదరదని బిగ్బాస్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇదంతా చూసిన తేజ.. ఓజీ క్లాన్ బండారాన్ని బయటపెట్టాడు. తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఓజీ vs తేజ చేసేస్తున్నారని, ఇక మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని తేజ.. వాళ్లకు సవాలు విసిరాడు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)తర్వాత వచ్చిన పృథ్వీ.. ప్రోమో చూసి తను టాస్క్లు ఆడుతున్నానని చెప్పడం అస్సలు నచ్చలేదని అవినాష్ని నామినేట్ చేశాడు. దీంత ఇద్దరి మధ్య తగువు మొదలైంది. 'నేను చూసిన ఎపిసోడ్స్లో రెండు మూడు టాస్క్లు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మా వైఫ్ చూసింది' అని అవినాష్ అనగానే.. మరి అలాంటిప్పుడు మీ భార్యనే బిగ్బాస్కి రావాల్సింది, మీరెందుకు వచ్చారు అని పృథ్వీ నోరు జారాడు. వైఫ్ టాపిక్ తీయకు అని అవినాష్ సీరియస్ అయ్యాడు.సోఫాలు కూర్చోవడం తప్పితే ఇంకేం చేయవ్ అని అవినాష్ అనేసరికి.. కామెడీ తప్ప ఇంకేం చేశావ్ నువ్వు అని పృథ్వీ అన్నాడు. పోయిన వారం నేను ఏ పాయింట్ చెప్పానో, ఈ వారం కూడా గంగవ్వ అదే పాయింట్ చెప్పిందని అవినాష్ అనేసరికి.. 'గంగవ్వ పేరు ఎందుకు చెబుతావ్ రా' అని పృథ్వీ మరోసారి నోరు జారాడు. 'రేయ్ రా అనకు' అని అవినాష్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇది నీ సంస్కారం. బిగ్బాస్కి వచ్చావ్ కదా నేర్చుకో' అవినాష్-పృథ్వీ ఒకరిపై ఒకరు వెళ్లారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
కమెడియన్లని అవమానించిన గౌతమ్? రెచ్చిపోయిన అవినాష్
బిగ్బాస్ షోలో మిగతా వాటి సంగతి పక్కనబెడితే కాస్తంత కామెడీ ఉంటేనే జనాలు చూస్తారు. ఈసారి అది లేకపోవడం వల్లే గత సీజన్లలో పాల్గొన్న పలువురిని వైల్డ్ కార్డ్స్ పేరిట మళ్లీ తీసుకొచ్చారు. ఉన్నంతలో రోహిణి, అవినాష్ కాస్త ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ వాళ్లిద్దరినీ అవమానించేలా కామెంట్స్ చేశాడు. ఇదేం కామెడీ షో కాదు అని చెబుతూనే గొడవ చేశాడు. దీంతో అవినాష్ రెచ్చిపోయాడు.గతవారం ఫన్ టాస్క్ సందర్భంగా గౌతమ్ని ఇమిటేట్ చేసిన అవినాష్. అశ్వద్ధామ 2.0 అని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ అది ఇబ్బందిగా అనిపించింది. దీంతో మైక్ తీసి నేలకేసి కొట్టాడు. అయితే అప్పుడు మైక్ తీసి పడేయడం తనకు నచ్చలేదని కారణం చెప్పిన రోహిణి.. గౌతమ్ని ఈ వారం నామినేట్ చేసింది. కామెడీ, మరేదైనా గానీ బుల్లీయింగ్ (పరోక్షంగా బాధపెట్టడం) లాంటిదని గౌతమ్ నోరు జారాడు. ఇది చాలా పెద్ద మాట అని హౌస్మేట్స్ అందరూ సీరియస్ అయ్యారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)బుల్లీయింగ్ అంటే ఓ మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెబుతారా అని గౌతమ్ ఆవేశపడిపోయాడు. పక్కనే ఉన్న అవినాష్ ఇక తట్టుకోలేకపోయాడు. మాకు తెలీదు తెలీదు తెలీదు అని ఫైర్ అయ్యాడు. మేం కావాలని చెయ్యలేదు, వేలు పెట్టి కెలకలేదు అన్నాడు. దీంతో ఇదేం కామెడీ షో కాదు, మనం వచ్చింది బిగ్బాస్ షోకి అని గౌతమ్ మరోసారి మాట తూలాడు. ఫలితంగా అవినాష్ రెచ్చిపోయాడు.'కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు తీసుకోకండి. షోకు రాకండి. కామెడీ అంటే ఏమనుకుంటున్నారో' అని అవినాష్ తన జాకెట్ విసేరేశాడు. గౌతమ్ని అశ్వద్ధామ 2.0 అనకండ్రా, మీకు దండం పెడతాను అని కెమెరా చూస్తూ అతడి ఫ్యాన్స్కి చెప్పాడు. పక్కనే ఉన్న గౌతమ్కి క్షమాపణలు కూడా చెబుతూనే సారీ భయ్యా, నాకు తెలీదు అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే కామెడీ చేయడం ఏమో గౌతమ్కి తీరా చేస్తేనేమో తీసుకోలేకపోతున్నాడు. చూస్తుంటే ఈ గొడవే సోమవారం ఎపిసోడ్ అంతా ఉండేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!
బిగ్బాస్ సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో మొదలై ఇన్ని రోజులవుతున్నా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒక్క విష్ణు ప్రియ మినహాయిస్తే అంతా కొత్త వాళ్లే కావడంతో షో చప్పచప్పగా సాగిపోతోంది. అందుకే బిగ్బాస్ సరికొత్త ఐడియాతో ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు.అందులో భాగంగానే గతంలో బిగ్బాస్లో కంటెస్టెంట్స్గా అలరించిన వారిని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీల్లో మాత్రం కొత్తవాళ్లకు చోటివ్వలేదు. బుల్లితెర ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్నవాళ్లనే పట్టుకొచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, ముక్కు అవినాష్, గౌతమ్, నయని పావని, మెహబూబ్, రోహిణి లాంటి హౌస్లోకి తోసేశారు. ఇక నుంచైనా అభిమానులను ఆకట్టుకునేందుకు బిగ్బాస్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.(ఇది చదవండి: Bigg Boss 8: ఏడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ముక్కు అవినాష్)వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది హౌస్లో అడుగుపెట్టాక మొదటి ప్రోమో విడుదలైంది. ఇందులో గంగవ్వ హౌస్లో నవ్వులు పూయించారు. రోహిణి- గంగవ్వ మధ్య ఫన్నీ సంభాషణ నడించింది. ఇక తొలిరోజే ముక్కు అవినాశ్ అడ్డంగా బుక్కయ్యాడు. మొదటి రోజే పాత్రలు క్లీన్ చేసే పనికి పూనుకున్నాడు. నేనేదో యుద్ధానికి పోతున్నట్లు అందరూ క్లాప్స్ కొడుతున్నారంటూ కామెడీ పండించాడు. ఈ ప్రోమో చూస్తే కొత్త, పాత వాళ్లతో కలిసి బిగ్బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలైతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. -
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈరోజే.. వారిద్దరి ఎంట్రీ ఖాయం!
నెల రోజులకు పైగా బిగ్బాస్ సీజన్-8 టాలీవుడ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ ఆదివారం ఈ షోపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హోస్లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజన్ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీరిలో గతంలో హౌస్లోకి వచ్చినా వాళ్లు కూడా ఉన్నారు.తాజాగా ఈరోజు జరిగే ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్త కంటెస్టెంట్స్పై హౌస్ సభ్యులందరినీ నాగార్జున అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారిని త్వరగా ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్లలో భాగంగా స్వాగ్ టీమ్, జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో టీమ్స్ సందడి చేశాయి.(ఇది చదవండి: Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?)వారిపైనే ఆసక్తి?అయితే అందరి దృష్టి వారిపైనే ఉంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రోమో చూస్తే కొందరి పేర్లు కనిపెట్టేలా హింట్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు హౌస్లోకి గతంలో మధ్యలోనే బయటికెళ్లిన గంగవ్వ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాంకర్ హరితేజ కూడా హౌస్లో అడుగుపెట్టనుంది. వీరితో పాటు మరికొంత ప్రముఖులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. -
మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి
బిగ్బాస్ 8లో ఐదో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్యని ఇంటికి పంపించేశారు. ఆదివారం ఎవరిని పంపిస్తారో చూడాలి. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట దాదాపు ఎనిమిది హౌసులోకి రాబోతున్నారు. ఇలా సందడిగా ఉంది. శనివారం కావడంతో నాగార్జున వచ్చేశాడు. హౌస్మేట్స్కి ఓ వైపు ప్రశంసలు, మరోవైపు వార్నింగ్లు ఇచ్చాడు. మణికంఠని అయితే పూర్తిగా గాలి తీసేశాడని చెప్పాలి.తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో భాగంగా సీత, నైనిక తప్పుల గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడాడు. వీళ్ల తర్వాత మణికంఠతో ముచ్చటించాడు. సీత బాడీ లాంగ్వేజ్లో నీకు సమస్య ఏంటి? అని అడగ్గా.. తను వెక్కిరించినట్లు అనిపించిందని మణికంఠ అన్నాడు. మధ్యలో మాట్లాడిన సీత.. మణినే తమందరినీ కార్నర్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. దీని తర్వాత నాగార్జు, మణికంఠని యాక్షన్ రూమ్లోకి రమ్మన్నాడు.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లి పేరుతో అందరినీ ఫూల్ చేసిన నటి వనిత)మణికంఠ.. నీకు 8 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేసేయ్ అని నాగ్ చెప్పాడు. ఆల్మోస్ట్ అయిపోయింది సర్ అని మణి ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో మాట్లాడిన నాగ్.. ఒకవేళ కన్నా నా దగ్గరికి రావొద్దు, అక్కడే ఉండిపో అని ప్రియ చెప్పిందనుకో అని నాగ్ అనగానే.. నాకు భయమేస్తుంది సర్ అని భార్య గుర్తొచ్చి మణికంఠ ఏడుపు మొదలుపెట్టాడు.నీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి కూడా ఉందని నాగ్ బాంబు పేల్చాడు. ఏడవటం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు. హౌస్ అందరికీ తెలుసు అని మణికంఠ గాలి మొత్తం తీసేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఎమోషన్ చూపిస్తూ, ఏడుస్తూ హౌస్లో ఉండిపోవాలనేది మణికంఠ ప్లాన్. దీన్నే ఇప్పుడు నాగార్జున బయటపెట్టాడా అనిపించింది. అలానే ఇకపై ఏడిస్తే కుదరదు అని స్మూత్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది.(ఇదీ చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్) -
Bigg Boss 8: అంతా ఫేక్.. నామినేషన్స్లో మణికంఠ vs యష్మి
సోమవారం వచ్చేసింది. అంటే బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ మాటలతో కొట్టేసుకునే రోజు. అందుకు తగ్గట్లే ఈ వారం కూడా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో పేరు, కారణం చెప్పి వాళ్ల తలపై చెత్త పోసే కార్యక్రమం పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ అరిచేసుకున్నారు.తొలుత సీత.. యష్మి, పృథ్వీని నామినేట్ చేసింది. ఏ టాస్క్ జరిగినా సరే యష్మిది డామినేటింగ్ వాయిస్లా అనిపించిందని కారణం చెప్పింది. అలానే గేమ్లో ప్రవర్తించిన తీరుపై సీత-పృథ్వీ మధ్య మాటల యుద్ధమే సాగింది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు)మణికంఠ.. యష్మి, పృథ్వీని నామినేట్ చేశాడు. అయితే యష్మితో పెద్ద గొడవే పెట్టేసుకున్నాడు. మణికంఠ మాట్లాడుతున్నప్పుడు యష్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నేను మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకో లేడీ అని వేలు చూపించి మరీ మణికంఠ సీరియస్ అయ్యాడు. దీంతో యష్మి రెచ్చిపోయింది. 'ఫ్రెండ్గా నా దగ్గరికొచ్చి నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు. అన్నీ ఫేక్' అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అలానే తన పాయింట్ ఆఫ్ వ్యూని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావ్ అని మణికంఠ చెప్పగా.. నీకు దమ్ము లేదా అని యష్మి రెచ్చిపోయింది. ఇక చివర్లో విష్ణుప్రియ.. ప్రేరణని నామినేట్ చేసింది. ప్రోమో చూస్తుంటేనే హోరాహోరీగా ఉంది. ఇక ఫుల్ ఎపిసోడ్ ఇంకేలా ఉంటుందో ఏంటో?(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?) -
అందమైన అమ్మాయిలతో నాగార్జున డ్యాన్స్.. బిగ్బాస్ ప్రోమో చూశారా?
టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ఎనిమిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్లోనూ అక్కినేని నాగార్జున హోస్ట్గా అలరించనున్నారు. తాజాగా బిగ్బాస్-8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.ఈ ప్రోమోలో బిగ్బాస్ సీజన్-8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్లు, ట్విస్ట్లకు లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ హైలెట్గా ఉంది. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంకండి అంటూ ఈ సీజన్ సరికొత్తగా అలరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సీజన్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. కాగా.. గత సీజన్లో బిగ్బాస్ విన్నర్గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. Eesari entertainment ki, fun ki, twists & turns ki limit ee ledu! In continuation to the Bigg Boss season 8 teaser, here is the promo!!Meeru ready ah?https://t.co/A6q4zx9AfJBigg Boss Season 8 is COMING SOON!#BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 11, 2024 -
రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. ఆటో ఎక్కిన హీరో, హీరోయిన్!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్ సరసన ముంబయి భామ కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. దీనిలో భాగంగా గెటప్ శ్రీనుతో రామ్ పోతినేని, కావ్య థాపర్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆటోలో వచ్చిన గెటప్ శ్రీను.. హీరోయిన్, హీరోతో కలిసి సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ ట్విటర్లో పంచుకున్నారు. డబుల్ ఇస్మార్ట్- డబుల్ డోస్ రైడ్ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను బుధవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. మరో అప్డేట్ వచ్చేసింది!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.కల్కి విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఇందులో బుజ్జిని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తిప్పుతున్నారు. ప్రస్తుతం బుజ్జి రాజస్థాన్లోని జైపూర్లో సందడి చేయనుంది. ఈనెల 15,16 తేదీల్లో బుజ్జి టూర్కి సిద్ధమైంది. అంతే కాకుండా ఈ నెల 15న కల్కి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఈ సాంగ్ను పాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోస్టర్ను ట్విటర్లో పంచుకున్నారు.𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐌𝐨𝐬𝐭 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐒𝐢𝐧𝐠𝐞𝐫 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐌𝐨𝐬𝐭 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐀𝐜𝐭𝐨𝐫 🎶❤️🔥#Prabhas X @diljitdosanjh#Kalki2898AD First Single Promo Out Tomorrow.@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/XPqk5mozFr— Kalki 2898 AD (@Kalki2898AD) June 14, 2024Hello Jaipur! 🩷Meet our #Bujji at Pathrika Gate on June 15th & Jal Mahal on June 16th.#Kalki2898AD pic.twitter.com/jaFZtXM02k— Kalki 2898 AD (@Kalki2898AD) June 14, 2024 -
సంగీత ప్రియులను అలరించే షో.. ప్రోమో అదుర్స్!
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హిట్షో ఇండియన్ ఐడల్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి సంగీత ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇండియన్ ఐడల్ మరో సీజన్ ఈనెల 14 నుంచి ప్రారంభ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు.తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్- 3 లాంఛ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి జడ్జీలుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతామాధురి, శ్రీరామచంద్ర, కార్తీక్ వ్యవహరించనున్నారు. కొత్త సీజన్లో కంటెస్టెంట్ల ఎమోషన్స్ ఫుల్గా ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది. ఈ షో మూడోసారి ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ కానుంది. దీంతో వారం ముందుగానే ప్రోమోను ఆడియన్స్కు పరిచయం చేశారు మేకర్స్. Ultimate musical journey ki muhurtham set ayindi 🎙️🗓️.Kotha swarala madya competition, Judges iche entertainment tho Indian Idol resound India antha vinapadutundi.✨.Telugu Indian Idol Season 3 Launch Promo Out▶️https://t.co/6b5B1VURT9🎤🎶 Catch #TeluguIndianIdolS3 starting… pic.twitter.com/Pl33SKG5No— ahavideoin (@ahavideoIN) June 6, 2024 -
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. గతంలో శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు.An Indian rides forth with courage & valor! 🔥 Here's a promo of the 1st single #PAARAA from INDIAN-2. 🇮🇳 Full song is dropping Tomorrow at 5️⃣ PM. 🤩🥁Rockstar @anirudhofficial musical 🎹Lyrics @poetpaavijay ✍🏻Vocals @anirudhofficial #ShruthikaSamudhrala 🎙️#Indian2 🇮🇳… pic.twitter.com/dz2JeTiqP8— Lyca Productions (@LycaProductions) May 21, 2024 -
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్సాంగ్ అనే పేరుతో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సాంగ్కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఫియర్ సాంగ్ అంటూ వస్తున్న ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ బీజీఎం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జైలర్లోని హుకుమ్ సాంగ్ కంపోజ్ చేసి అనిరుధ్ తనదైన మార్క్ చూపించారు. దీంతో దేవర సాంగ్ తర్వాత హుకుమ్ సాంగ్ మర్చిపోతారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్ చేయడంతో గూస్ బంప్స్ ఖాయంగా కనిపిస్తోంది. It's a warning notice from the Lord of Fear…. #FearSong Promo out now! #Devara pic.twitter.com/RJYOs59mNL— Devara (@DevaraMovie) May 17, 2024 -
టీమిండియా వరల్డ్కప్ ప్రోమో రిలీజ్.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం
2024 టీ20 వరల్డ్కప్లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పాండ్యా, జడేజాలను చూపించిన వైనం అత్యద్భుతంగా ఉంది. INDIAN TEAM PROMO FOR THE T20I WORLD CUP. 🇮🇳 - Rohit Army is ready to create history.pic.twitter.com/2jjM9wYQQW — Johns. (@CricCrazyJohns) April 23, 2024 ఇది చూస్తే భారత క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. బ్యాక్ గ్రౌండ్లో వందేమాతర గీతం వీడియోని రక్తి కట్టించింది. ఆఖర్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సెల్యూట్ చేస్తున్న క్లిప్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. "వరల్డ్కప్ కోసం టీమిండియా సిద్ధం" అని అర్దం వచ్చేలా ఈ వీడియాకి క్యాప్షన్ ఉంది. కాగా, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20 వరల్డ్కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ దాదాపు నెల రోజులపాటు సాగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్-పాక్ మ్యాచ్) జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
హీరో చెంప పగలగొట్టిన స్టార్ యాంకర్.. వీడియో వైరల్!
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. బీ2పీ స్టూడియోస్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే మహాలక్ష్మి అన్న పేరు ఉంటే వారికి 200 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ శ్రీముఖితో చిత్రబందం ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హీరో పార్వతీశం వెళ్లి శ్రీముఖిని చూసి' మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ' అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీముఖి హీరో చెంపపై ఒక్కటి ఇస్తుంది. 'మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంది. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow! మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo — Mukesh G (@MukeshG39549544) March 21, 2024 -
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ 'నందనందనా..' రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. గీత గోవిందంలోని 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' పాటకు పనిచేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో ఈ సాంగ్ వస్తోంది. కాగా..ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అతనితో డేటింగ్.. నోరు జారిన దేవర భామ!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రం ధడక్తో అలరించింది. గతేడాది బవాల్ చిత్రంలో మెరిసింది. తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫస్ట్లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారుయ అయితే ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. తన సోదరి ఖుషి కపూర్తో కలిసి కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. కాఫీ విత్ కరణ్ సీజన్ -8 పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కరణ్ అడిగిన ప్రశ్నలకు జాన్వీ, ఖుషి ఆసక్తికర సమాధానాలిచ్చారు. (ఇది చదవండి: ఫ్యాన్స్కు పోస్టర్తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దేవర గ్లింప్స్ రెడీ) జాన్వీ కపూర్ను ప్రశ్నిస్తూ నీ స్పీడ్ డయల్ నంబర్స్లో ముగ్గురి పేర్లు చెప్పమని కరణ్ జోహార్ అడిగాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ పాపా(నాన్న), ఖుషు, శిక్కు అని ఠక్కున చెప్పేసింది. దీనికి ఖుషీ, కరణ్ ఆశ్చర్యంగా జాన్వీ వైపు చూశారు. ఆమె సమాధానంతో నటుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందన్న విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో చాలాసార్లు జాన్వీ కపూర్, శిఖర్ పహారియా జంటగా చాలాసార్లు కనిపించారు. కానీ తమ రిలేషన్పై ఎక్కడా స్పందించలేదు. కాగా.. శిఖర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' ఫుల్ ఎపిసోడ్ జనవరి 4న ఓటీటీ ప్లాట్ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానుంది. -
'ఆ కుర్చీని ఇస్తానని దేవా మాటిచ్చాడు'.. సలార్ పవర్ఫుల్ డైలాగ్ ప్రోమో!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండో వీక్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సలార్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) తాజాగా ఈ చిత్రంలోన ఓ డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సలార్- సీజ్ఫైర్ చిత్రంలో క్లైమాక్స్లో శ్రుతిహాసన్ చెప్పే ఈ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా చూడని వారు డైలాగ్ ప్రోమోను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. -
ఆ కుర్చీని మడతపెట్టి...
మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ అనే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ పాట పూర్తి లిరికల్ వీడియో నేటి సాయంత్రం విడుదలవుతోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. -
'దయచేసి ఆ పదాన్ని తీసేయండి'.. మహేశ్బాబుకు విజ్ఞప్తి!
ఇప్పుడంతా ఎక్కడ చూసిన సోషల్ మీడియానే శాసిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే వైరలవుతోంది. అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన మాటలతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. డైలాగ్లో ఓ బూతు పదం కూడా ఉన్నప్పటికీ.. చాలామందికి ఇదో ఊతపదంలా మారిపోయింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని ఏకంగా మాస్ పాట చేసేశారు. తాజాగా మహేశ్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రంలోని పాటకు ఈ పదాన్ని వాడేశారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గామారింది. అయితే ఈ చిత్రంలో కుర్చీని మడతబెట్టి పదం వినియోగించడంపై ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అయ్యే మీలాంటి స్టార్ సినిమాలో ఈ బూతు పదాన్ని తొలగించాలని చిత్రబృందానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి బూతు పదాలు చూసి పిల్లలు చెడిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. -
'నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు'.. రైతుబిడ్డపై బిగ్బాస్ ప్రశంసలు!
బుల్లితెర ఓ రేంజ్లో అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7. ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రారంభమైన ఈ షో అదే పంథాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్.. అందుకు తగ్గట్టుగానే అలరించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రతిక రీ ఎంట్రీతో ఈ సీజన్ సరికొత్తగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో నాలుగు రోజుల్లో మీ అభిమాన రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు ఆరుగురు కంటెస్టెంట్స్ అర్హత సాధించారు. మరి వీరిలో ట్రోఫీ ఎవరిని వరిస్తుందో త్వరలోనే తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం హౌస్లో ఉన్న ఆరుగురి జర్నీపై వీడియోలను బిగ్బాస్ ఆడియన్స్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చివరివారం మొదటి రెండు రోజుల్లో అమర్, అర్జున్, ప్రియాంక, శివాజీ బిగ్ బాస్ ప్రయాణాన్ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చూపించారు. ఆ వీడియోను చూసిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ తమలోని భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నారు. తమ బిగ్ బాస్ ప్రయాణాన్ని స్క్రీన్పై చూసి ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటున్నారు. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు సంబంధించిన ప్రోమో మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియోలో బిగ్బాస్ పల్లవి ప్రశాంత్పై ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. 'మట్టితో మనకున్న బంధం విడదీయలేనిది. ఒక కామనర్ల సెలబ్రిటీగా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. టాస్కుల్లో గెలవడానికి నీ రక్తాన్ని చిందించడానికి సైతం వెనుకాడలేదు. మీకు ఇక్కడ రకరకాల వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది. మీరు కృంగిపోయిన ప్రతిసారి లోకం తీరును వివరిస్తూ.. నీ లక్ష్యాన్ని గుర్తు చేసి.. ఏడుపు సమాధానం కాదని.. నీకు ఆ స్నేహమే తెలియజేసింది. నామినేషన్స్లో నీలో మరో ప్రశాంత్ను అందరికీ చూపించి.. ఓ బలమైన పోటీదారునిగా మిమ్మల్ని నిలిపి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆకాశం నుంచి జారే ప్రతి నీటిబొట్టు భూమిమీద జీవానికి ఓ అవకాశమే. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యం నీది' అంటూ బిగ్ బాస్ కొనియాడారు. ప్రశాంత్ ఫుల్ జర్నీ వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
'హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత.. నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి'
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు హౌస్లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలే మరో వారంలో షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఈవారంలో హౌస్ నామినేషన్స్ రోజే యుద్ధరంగాన్ని తలపించింది. అయితే ఇప్పటి దాకా హౌస్మేట్స్తో కేకులు తినే గేమ్స్ పెట్టిన బిగ్బాస్ ఈసారి త్రో బాల్ టాస్క్ను ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ టాస్క్లో ప్రతి రౌండ్లో ఎవరీ జాకెట్కు అయితే ఎక్కువ బాల్స్ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్బాస్ ప్రకటించాడు. అయితే గేమ్ నుంచి శోభా శెట్టి, యావర్ మొదట్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు పోటీలో నిలిచారు. అయితే దూరం నుంచి బాల్స్ విసరాల్సిన అమర్.. పల్లవి ప్రశాంత్ను పట్టుకుని బాల్స్ అంటించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులైన అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. దీంతో అమర్ తనను కొరికాడంటూ పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. దీనికి అమర్ కూడా ధీటుగానే స్పందించి అవునురా.. నేను తప్పని ఒప్పుకుంటా.. నేను చేసేవి కనిపిస్తాయి.. కానీ నువ్వు చేసేవి కనపడవు తెలుసా అన్నాడు. నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావ్ అన్నాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. రేయ్ హౌస్లో ఉంటే ఎంత.. పోతే ఎంత? వీడి గురించి అందరికీ తెలియాలి.. నీకున్న డబుల్ గేములు ఎవరికీ లేవు తెలుసా? అని అమర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నా గురించి ఇంట్లో అందరికీ తెలుసు అని ప్రశాంత్ బదులిచ్చాడు. 'నేను అబద్ధం.. వాడే నిజం..కట్టుకథ అల్లొద్దు.. వాడు ఏం చెప్పాడో ఎవరికీ చెప్పనని మాట ఇచ్చా. అందుకే మాట్లాడటం లేదు' అంటూ బాంబ్ పేల్చాడు. వాడు ఏం చెప్పాడో తెలుసా.. నన్ను పిచ్చోన్ని చేసి ఆడుకుంటావా? మాట్లాడకు.. అంటూ తల బాదుకున్నాడు అమర్. దీనికి ఆగమాగం చేయకు.. నీళ్లు తాగు అంటూ రైతు బిడ్డ ప్రశాంత్ కౌంటరిచ్చాడు. అమర్ను శోభా వారిస్తుండగా.. అర్జున్ కలగజేసుకుని రేయ్ ఆపండ్రా అంటూ నోర్లు మూయించాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే చూసేయాల్సిందే. -
నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో చివరిదశకు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలేకు తెరలేవనుంది. గతవారం గౌతమ్ ఎలిమినేట్ కావడంతో హౌస్లో ఇంకా ఏడుగురు ఉన్నారు. వారిలో ఇప్పటికే అర్జున్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. ఇక మరోవారం మొదలైందంటే నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. హౌస్లో ఒకరిపై ఒకరు కారణాలు చెబుతూ నామినేట్ చేసే సమయంలో జరిగే తంతు మామూలుగా ఉండదు. అసలే ఈ వారం నుంచి టగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. బిగ్బాస్ సీజన్-7 ఇవాల్టి ఎపిసోడ్ల నామినేషన్స్ ప్రక్రియలో విమర్శలు వేరే లెవల్కు చేరుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రశాంత్ను అమర్దీప్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది. నువ్వు నన్ను రా అనొద్దంటూ వాదించగా.. నా తమ్ముడిని రా అనే అంటానురా.. పలికితే పలుకు.. లేదంటే పో అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత అర్జున్.. అమర్, యావర్ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత హౌస్లో సేఫ్ ప్లేయర్ ఎవరంటే.. ఒక్క పల్లవి ప్రశాంతే అంటూ శోభా శెట్టి నామినేట్ చేసింది. ఆ తర్వాత శివాజీ, ప్రియాంకల చిన్నపాటి వార్ నడిచింది. ఫ్రెండ్షిప్ విషయాకొనిస్తే త్యాగం చేసే వాళ్లు కావాలని శివాజీ అనగా.. ప్రియాంక ఏదో అనడంతో.. నువ్వు ఓవర్ స్మార్ట్ ఇక్కడ చేయొద్దమ్మ అంటూ చురకలంటించాడు. దీనికి ఐయామ్ నాట్ ఓవర్ స్మార్ట్ అంటూ ప్రియాంక సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ మధ్యే పెద్ద వార్ నడిచింది. అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగెటివ్గానే ఉన్నాడు అనడంతో మధ్యలో శోభా ఎంటరైంది. మాట అంటే మాటే.. తగ్గేదేలే.. ప్రాణమైనా ఇస్తాడు అని లోపలికి వెళ్లి దాచి కూర్చోలే అని శోభా అనడంతో.. ఇది నిజ స్వరూపం.. అందరినీ మోసం చేసే గుణం నీది అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దీంతో టాపిక్ డైవర్ట్ చేసి తవ్వుకోద్దంటూ అని అమర్ అన్నాడు. దీనికి ప్రశాంత్ బరాబర్ తవ్వుతా.. తగ్గదేలే అన్నాడు. దీంతో ఆగరా.. నువ్వు..నీ అబద్ధాలు అంటూ అమర్ ఫైరయ్యాడు. ఎదుటివాళ్లను మోసం చేసుడు నీగుణం.. మోసపోయింది నువ్వు కాదు.. నేను అంటూ ప్రశాంత్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత నన్ను బయటకు పంపించేయండి.. వాడికి కప్పు ఇచ్చేయండి.. మీరందరూ హ్యాపీగా ఉండండి.. వాడు హ్యాపీగా ఉంటాడు అని అమర్ అనడంతో ప్రోమో ముగిసింది. మొత్తానికి ప్రోమో చూస్తే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హీటెక్కినట్లు తెలుస్తోంది. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
శివాజీని చేతులెత్తి వేడుకున్న అమర్దీప్.. ఎందుకంటే?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్-7 12వ వారానికి చేరుకుంది. గతవారం ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్బాస్.. ఈ వారంలో ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. మరీ ఈ వారంలో ఎవరు బయటకు రానున్నారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే ఈలోగా సేఫ్ అయ్యేందుకు ఉన్న అవకాశాల కోసం కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. తాజా ఎపిసోడ్లో కెప్టెన్ కంటెండర్ పోటీని బిగ్ బాస్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్గా ఎవరంటే?) ప్రోమో చూస్తే అయితే ఈ పోటీలో చివరికీ అమర్, అర్జున్ మాత్రమే ఫైనల్గా కెప్టెన్ పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. గతవారంలో తృటిలో కెప్టెన్సీ కోల్పోయిన అమర్దీప్ బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో హౌస్లో హంగామా చేశాడు. అమర్, అర్జున్ విషయంలో శివాజీ, శోభాశెట్టి తన అభిప్రాయాలు బిగ్బాస్కు వెల్లడించారు. కెప్టెన్సీ పోటీలో అర్జున్కు వ్యతిరేకంగా శోభాశెట్టి తన నిర్ణయాన్ని వెల్లడించింది. కెప్టెన్ అయ్యేందుకు నీకెంత అర్హత ఉందో.. అమర్కు అంతే ఉందని చెప్పింది. ఆ తర్వాత శివాజీ కెప్టెన్సీ పోటీలో అర్జున్కు మద్దతుగా నిలిచారు. దీంతో అమర్దీప్, శివాజీని బతిమాలాడారు. ప్లీజ్ అన్న.. అర్థం చేసుకో.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. పోగోట్టకన్నా.. నీకు దండం పెడతా అంటూ రెండు చేతులతో మొక్కాడు. నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం ఏడుస్తున్నావేంట్రా? అని శివాజీ అన్నాడు. నేను కెప్టెన్ అవ్వాలన్నా అంటూ శివాజీని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అమర్. కానీ చివరికీ నేను దేనికి పనికిరాను అంటూ అమర్ ఎమోషనలయ్యాడు. ఆ తర్వాత అమర్ ఫోటో మంటల్లో కాలిపోతూ ఉండగా ప్రోమో ముగిసింది. మరీ ఈ వారం కెప్టెన్సీ ఎవరినీ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!) -
బిగ్ బాస్ హౌస్లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!
బిగ్ బాస్ హౌస్లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే కంటెస్టెంట్స్ ఈ వారంలో కంటతడి పెట్టిస్తున్నారు. ఎప్పుడు హాట్ హాట్గా సాగే బిగ్ బాస్ హౌస్.. ఇప్పుడు ఫుల్ ఎమోషనల్గా మారింది. మంగళవారం ఒక్క రోజే ముగ్గురు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్కు రప్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. శివాజీ, అంబటి అర్జున్, అశ్వినికి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు రిలీజ్ కాగా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. (ఇది చదవండి: మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!) రెండో రోజు కూడా హౌస్ను ఫుల్ ఎమోషనల్గా మార్చేశారు. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియాంక జైన్ ప్రియుడిని హౌస్లో తీసుకొచ్చారు బిగ్ బాస్. హౌస్లో అడుగుపెట్టిన మౌనరాగం సీరియల్ ఫేమ్ శివకుమార్ తన ప్రియురాలికి గులాబీ పువ్వుతో మరోసారి ప్రపోజ్ చేశారు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రియుడిని చూసిన ప్రియాంక తన ప్రేమతో అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఎలా ఉన్నావ్ అంటూ.. తన ప్రియుడిని అడిగింది. నేను ఇలా ఉన్నా అనడంతో.. ఒకరినొకరు చాలా మిస్సవుతున్నామంటూ ఎమోషనలయ్యారు. శివతో మాట్లాడుతూ..'మరీ పెళ్లెప్పుడు అని ప్రియాంక ప్రేమగా అడగడంతో.. నువ్వు బయటకొచ్చిన వెంటనే చేసుకుందాం అన్నాడు. కాదు.. ఇప్పుడే చేసుకుందాం ప్రియాంక అంటూ శివను గట్టిగా మరోసారి కౌగిలించుకుంది. ఆ తర్వాత ఈ జంట దగ్గరకు వచ్చిన శోభా శెట్టి బిగ్ బాస్ ఇచ్చిన సమయం అయిపోయిందని చెబుతుంది. ఇక్కడే ఉండిపోవచ్చా అని బిగ్ బాస్ను శోభ అడుగుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి శివకుమార్కు గుడ్ బై చెప్పడంతో ప్రోమో ముగిసింది. కాగా.. జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్.. బుల్లితెర నటుడు శివ కుమార్లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. జానకి కలగనలేదు సీరియల్లో నటించిన ప్రియాంక జైన్.. నటుడు శివ కుమార్లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్గా శివ కుమార్లు పాత్రలు పోషించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. (ఇది చదవండి: 'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!) -
నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు.. కెప్టెన్కు శివాజీ కౌంటర్!
బిగ్ బాస్ సీజన్- 7 తొమ్మిదో వారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్స్లో ఉన్నవాళ్లకి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్లో రెండు టీమ్స్ మధ్య ఛాలెంజ్ల పర్వం కొనసాగుతోంది. కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ నడుస్తుండగా ఇరు జట్ల మధ్య వాదనలు హాట్ హాట్గా సాగుతున్నాయి. (ఇది చదవండి: రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని) కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం బిగ్బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. టాస్క్లో భాగంగా గౌతమ్ టీం బిగ్బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. గౌతమ్ టీం దగ్గర బాల్స్తో.. అవతలి టీం వద్ద ఉన్న బాల్స్ను మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ టీం సభ్యులు ఎగిరి గంతేశారు. అయితే బిగ్బాస్ నిర్ణయంపై శివాజీ కాస్తా అసహనం ప్రదర్శించారు. గోల్డెన్ బాల్ వాళ్లకే, అన్ని వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే బాల్స్ మార్చుకునే సమయంలో శివాజీ, కెప్టెన్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండన్న అంటూ గౌతమ్ అనడంతో.. మధ్యలో నేను మాట్లాడతా అన్న కదా అంటూ ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే ప్రతిసారి చేయం మేము.. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా.. అంతవరకు ఆగలేవా నువ్వు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో చాలా సైలెంట్గా ఉంటావ్.. అని శివాజీ ఫైరయ్యాడు. దీంతో నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటూ గౌతమ్ ప్రశ్నిస్తాడు. నీతో నేను మాట్లాడలేనమ్మా.. కావాలనే వాదన పెట్టుకుంటావా? అని శివాజీ అనడంతో.. ఇక్కడ ఎవరికీ అలాంటి అవసరం లేదన్న అని గౌతమ్ అనడంతో అక్కడితో ప్రోమో ముగుస్తుంది. బాల్స్ టాస్క్లో మాత్ర బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మరింత రసవత్తరంగా మారింది. హౌస్లో ఏం జరగనుందో ఇవాల్టి ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!) -
భయపెడితే భయపడతారనుకున్నావా?.. పక్కకెళ్లి ఆడుకో.. హౌస్లో మాటల యుద్ధం!
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో వారం హాట్హాట్గా కొనసాగుతోంది. ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్లో టాస్కుల పర్వం మొదలైంది. కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలెట్టేశాడు బిగ్బాస్. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. దీని కోసం ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా.. మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్లో ఉన్నారు. (ఇది చదవండి: వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అమర్పై మళ్లీ విషం కక్కిన శివాజీ) మొదట బాల్స్ టాస్కు పెట్టిన బిగ్ బాస్.. దాని ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. ఇది గెలిచిన టీమ్కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదట జంపింగ్ జపాంగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో.. అవతలి టీమ్లోని ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో అందరూ చర్చించుకుని పల్లవి ప్రశాంత్ను గేమ్ నుంచి తొలగించారు. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ మరో ఛాలెంజ్తో ఎపిసోడ్ మొదలైంది. అమర్దీప్, కెప్టెన్ గౌతమ్ పరుగుత్తుకెంటూ వెళ్లి ఛాలెంజ్లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్క్ విషయంలో రతికా, అమర్ దీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎందుకు కింద పడేశావ్ అంటూ అమర్ను రతికా ప్రశ్నించగా.. నా ఇష్టం ఇది నా స్ట్రాటజీ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత ప్రతిసారి వెధవ పని చేయడం నీకు అలవాటు అనడంతో.. నువ్వు చేసే పనులతో నన్ను పోల్చొద్దు అని అమర్ కౌంటరిచ్చాడు. దీంతో రతికా కోపంతో మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి అమర్ సైతం నువ్వు కూడా అంటూ రెచ్చిపోయాడు. భయపెడితే భయపడతారనుకున్నావా? పక్కకెళ్లి ఆడుకో.. వచ్చి నా బ్యాగ్ లాగడం కాదు.. నీ బ్యాగ్ లాగినవాళ్ల దగ్గరికి వెళ్లి లాగు అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత బిగ్బాస్ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్లో అమర్, శోభా తలపడగా.. ఇందులో అమర్ విన్ అయ్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. మరీ ఫైనల్గా ఏ టీమ్ కెప్టెన్సీ కంటెండర్ నిలిచిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!) -
'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు!
బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే నాగ్ వచ్చేస్తాడు. వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులు బయటపెడతాడు. ఒక్కొక్కరికి నిలబెట్టి మరీ కడిగేస్తాడు. ప్రతివారం ఇదే జరుగుతూ ఉంటుంది. అలా ఈ వీకెండ్ అందరికీ గట్టిగానే పడ్డాయి. కానీ యవర్కి మాత్రం కోలుకోలేని రేంజులో కౌంటర్స్ పడినట్లు కనిపిస్తున్నాయి. 'పిచ్చోడు' గురించి మొత్తానికే సీరియస్ అయ్యాడు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో, ఎపిసోడ్పై ఆసక్తి పెంచుతోంది. అసలేంటి గొడవ? ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా శోభాశెట్టితో పాటు మరికొందరు నిలిచారు. వీళ్లలో ఎవరికి అనర్హులు చెప్పాలని.. మిగతా వాళ్లకు బిగ్బాస్ చెప్పాడు. దీంతో యవర్.. శోభాశెట్టికి ఎండుమిర్చి దండ వేశాడు. కానీ శోభాకి ఇది నచ్చలేదు. కాస్త సౌండ్ పెంచేసరికి యవర్ రెచ్చిపోయాడు. అమ్మాయి అని కూడా చూడకుండా శోభాశెట్టి మీదమీదకి వెళ్లి మరీ అరిచాడు. దీంతో ఆమె ఓ సందర్భంలో యవర్ని పిచ్చోడు అని సంభోదించింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) నాగ్ ఏం చెప్పాడు? శనివారం ఎపిసోడ్లో భాగంగా నాగ్ ఈ విషయమై సీరియస్ అయ్యాడు. శోభా, యవర్ని నిలబెట్టి మరీ కడిగేశాడు. ఫస్ట్ శోభాతో మాట్లాడిన నాగ్.. 'గతవారం భోలె.. నిన్ను ఎర్రగడ్డ అన్నందుకు గింజుకున్నావ్, మరి నువ్వు పిచ్చోడు అనడం కరెక్టా?' అని అడిగాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదమ్మా' అని చల్లబరిచాడు. ఇక యవర్తో మాట్లాడుతూ.. 'బిగ్బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదని కంప్లీట్ రూల్స్ ఉన్నాయ్. మళ్లీ యువర్ బ్యాక్ టూ ద ఒరిజినల్ బిహేవియర్, నువ్వు ప్రవర్తించిన పద్ధతి చూస్తే.. నేనైనా ఆడియెన్స్ అయినా, ఎవరైనా సరే పిచ్చోడు అంటారు' అని నాగ్ సీరియస్ అయినట్లు ప్రోమోలో చూపించారు. యవర్ అసలు రంగు హౌసులో శివాజీకి శిష్యరికం చేస్తున్న యవర్.. వచ్చిన తొలి రెండు వారాల్లో గట్టిగా గొడవలు పడ్డాడు. ఆ తర్వాత గురువు శివాజీ చెప్పడంతో పాటు హౌస్మేట్స్ అదే చెప్పేసరికి కోపాన్ని తగ్గించుకున్నట్లు కవరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు శోభా చిన్నగా ఓ మాట అనేసరికి నిజంగానే రెచ్చిపోయి, మిర్చిదండ విసిరేయడం, అమ్మాయి అని చూడకుండా మీదమీదకి వెళ్లిపోవడం లాంటివి చేసి.. నిజంగానే పిచ్చోడు అని నాగ్తోనే అనిపించుకున్నాడు. తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి మళ్లీ బ్యాడ్ అయిపోయాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) -
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్బాస్ మారథాన్లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్బాస్ మారథాన్లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్బాస్ హౌస్మేట్స్కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
'రాననుకున్నారా.. రాలేననుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్ కృష్ణ!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0. ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్బాస్ రోజుకు ఒక షాక్ ఇస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. శుభశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. గౌతమ్ను సీక్రెట్ రూమ్లోకి పంపి బిగ్ షాకిచ్చారు బిగ్ బాస్. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను రిలీజైంది. ఈ ప్రోమోలో గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి బయటికొచ్చేశాడు. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి యత్నించారు: శుభ శ్రీ) బయటకు వస్తూనే గౌతమ్ మాట్లాడుతూ..'రాననుకున్నారా.. రాలేననుకున్నారా? అంటూ సీక్రెట్ రూమ్లో ఉన్న గౌతమ్ ఎంతో ఆవేశంతో బయటకొచ్చాడు. అశ్వత్థామ ఇజ్ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. 'తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.. అయినా ఈ అశ్వత్థామ చావడు. ఎలా వెళ్లానో అలానే వచ్చా. దిస్ ఇజ్ 2.0 బేబీ' అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ మాటలు చూసి కంటెస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత శివాజీనీ ఉద్దేశించి మాట్లాడారు. అన్న మీరు నన్ను ఎంటర్టైన్ చేయలేడేమో అన్నారు కదా? అని గౌతమ్ చెప్పడంతో.. తమ్ముడు ముందు నీ రీజన్ చెప్పు అంటూ శివాజీ అన్నారు. 'ఎంటర్టైన్ చేయడమంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదన్నా.. కవర్ను చూసి బుక్ను జడ్జ్ చేయొద్దన్నారు అన్నా' గౌతమ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. 'బట్టలిప్పడం ఎంటర్టైన్మెంటా? అని ఇంతమంది ముందు అన్నావ్. 100 సినిమాల్లో చేశా బట్టలు లేకుండా.. నేను ఒక నటుడిని.. ఏమైనా చేస్తా' అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వెంటనే గౌతమ్.. నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను.. దీన్ని ఊపయోగించి నువ్వు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు' అని ఆప్షన్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయాలనుకున్నాడో చెప్పేలోగా ప్రోమో ముగిసింది. గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయనున్నాడో ఇవాళ ప్రసారమయ్యే ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. సీక్రెట్లో రూమ్లో ఉన్న గౌతమ్కు బయటకు రావడం, స్పెషల్ పవర్ ఇవ్వడం ఈ ఎపిసోడ్లో హాట్టాపిక్గా మారింది. కాగా.. ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: నామినేషన్స్లో ట్విస్ట్.. కొత్తవాళ్లకే ఛాన్స్! ఒక్కొక్కరికీ ఉంటదీ..) -
'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!
ఈ ఏడాది బిగ్బాస్ చూస్తున్న వారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీలవుతుంటారు. ఎందుకంటే మొదటి వారం నుంచే నామినేషన్స్, ఎలిమినేషన్స్తో హీటెక్కించారు. నాలుగు వారాలుగా హాట్హాట్గా సాగిన బిగ్బాస్.. ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్లోని కంటెస్టెంట్స్కి.. తమ కుటుంబ సభ్యుల పట్ల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) తాజాగా ప్రోమో విడుదల కాగా.. అందులోని సీన్స్ ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే.. మరొకరికి మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఫుల్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. అయితే ఈ ప్రోమోలో అమర్దీప్ తన భార్యను తలుచుకుని కంటతడిపెట్టాడు. అమర్దీప్ మాట్లాడుతూ.. ఇంతవరకు తేజును బాగా చూసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విలువలు తెలిసొచ్చాయి. కన్నాను చూడగానే అదే పిలిచినట్లు అనిపించింది. తేజు ఐ యామ్ సో సారీ. నీ విలువ తెలిసింది నాకు అంటూ బోరున ఏడ్చేశారు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్ను అమర్ త్యాగం చేశాడని తెలుస్తోంది. (ఇది చదవండి: చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..) ఇక శివాజీ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషన్స్తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ..'ఎక్కడో ఊరి నుంచి వచ్చావు.. అన్న అంటూ హగ్ చేసుకున్నావ్.. నేను నా లెటర్ను గివ్ అప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటది. తనను నేను ఎంత బాగా చూసుకున్నానో నాకు తెలవదు కానీ.. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నా మాట విను అంటూ' పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్ను శివాజీ త్యాగం చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమో చూస్తేనే కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలు ఆడియన్స్ను సైతం ఫుల్ ఎమోషనల్గా టచ్ చేశాయి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఎవరెవరు లెటర్స్ను త్యాగం చేశారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
ఆ కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ బిగ్ షాక్.. అదేంటో తెలుసా?
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: 'బిగ్బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్లో ఇకపై కష్టమే!) ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్ మధ్య రొమాంటిక్ సీన్స్తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు. దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. -
టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!
'బిగ్బాస్ 7' మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. తొలి రెండు వారాల్లో కిరణ్, షకీలా ఎలిమినేట్ అయిపోయారు. ఇక తాజా నామినేషన్స్లో ఏకంగా ఏడుగురు నిలిచారు. అయితే ఈసారి సోమవారం ఎపిసోడ్ కాస్త ప్లెయిన్ గానే జరిగినప్పటికీ ఆ తర్వాత గొడవలు, స్కెచ్లు, టాస్కులతో హౌస్ అంతా హీటెక్కిపోయింది. ఇంతకీ బిగ్బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది? మళ్లీ పులిహోర మొదలు తొలివారం రతికతో ప్రశాంత్ గట్టిగా పులిహోర కలిపేశాడు. రెండో వారం వచ్చేసరికి అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. దీంతో ఇద్దరూ మాట్లాడుకోవడమే మానేశారు. మూడోవారం వచ్చేసరికి మళ్లీ మొదటికొచ్చారు. తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని రతిక ఏడుస్తుంటే.. ఆమెని కూల్ చేసేందుకు ప్రశాంత్ ఫర్టింగ్ చేశాడు. కంట్లో నుంచి నీళ్లు రాకుండా పాలలెక్క వస్తున్నాయి ఏందని అన్నాడు. దీంతో ఆమె సిగ్గు పడిపోతూ నవ్వేసింది. (ఇదీ చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!) చేతులేయడంతో గొడవ రెండో ప్రోమోలో భాగంగా మూడు వారాల ఇమ్యూనిటీ టాస్క్ కోసం అమరదీప్, శోభాశెట్టి, యవర్ని బిగ్బాస్ సెలెక్ట్ చేశాడు. అయితే వీళ్లలో ఎవరు పోటీకి అనర్హులో చెప్పమని మిగిలిన వాళ్లని అడిగాడు. దీని తర్వాత ఏ విషయం గురించో తెలీదు గానీ ప్రశాంత్-రతిక గొడవపడ్డారు. 'హే పో' అని ప్రశాంత్.. రతికని టచ్ చేస్తూ అరిచాడు. దీంతో సీరియస్ అయిన రతిక.. మర్యాదగా ఉండదు చెబుతున్నా అని వార్నింగ్ ఇచ్చింది. అయితే అసలు ఎందుకు గొడవపడ్డారు? ఏం జరిగిందనేది తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. నామినేషన్స్ సంగతేంటి? ఈ వారం నామినేషన్స్లో శుభశ్రీ, గౌతమ్, అమరదీప్, ప్రియాంక, దామిని, రతిక, యవర్ ఉన్నారు. వీళ్లలో ప్రస్తుతానికి అయితే ఓటింగ్ విషయంలో అమర్ టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. దామిని చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. మూడో ఎలిమినేషన్కి ఇంకా నాలుగైదు రోజుల టైముంది కాబట్టి అంతలో ఏదైనా జరగొచ్చు. ఓటింగ్ తారుమారు కావొచ్చనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీనే!) -
నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!
కొన్ని నెలల ముందు టాలీవుడ్లో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి తమ జీవితంపైనే ఓ సినిమా చేయడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అవును పైన చెప్పిందంతా కూడా నరేశ్-పవిత్రా లోకేశ్ గురించే. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన షోలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నరేశ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్గా మారిపోయాడు. కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న ఇతడు.. వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) నరేశ్, అతడి భార్య రమ్య రఘుపతి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఇతడు, నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఇది నిజమనేలా బయటకూడా జంటగా కనిపించడం, 'మళ్లీ పెళ్లి' అని తమ జీవితాన్నే సినిమాగా తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే వినాయక చవితి సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్ని ఓ ఈవెంట్కి గెస్టులుగా పిలిచారు. నరేశ్.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్టేజీపై సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నరేశ్ ఎమోషనల్ అయ్యాడు. '50 ఏళ్లు అయిపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో రకరకాల ఒడిదొడుకులు. గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను' అని అన్నాడు. అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) -
నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!
'బిగ్బాస్ 7' సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ వారమంతా గొడవలే టార్గెట్ అన్నట్లు కంటెస్టెంట్స్ తిట్టుకున్నారు. తెగ హడావుడి చేశారు. అయితే వీకెండ్ వస్తే నాగార్జున వచ్చేస్తాడు. అప్పటివరకు జరిగిన వాటికి కౌంటర్స్ ఇచ్చేస్తాడు. అలా ఈ సారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీకి గట్టిగానే పడ్డాయి. ఇంతకీ తాజా ప్రోమోలో ఏముంది? 'బిగ్బాస్' షోలో మిగతా రోజుల్లో ఎలా ఉన్నా గానీ సోమవారం, శని-ఆదివారం మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సోమవారం నామినేషన్ల హడావుడి ఉంటుంది. వీకెండ్ మాత్రం నాగార్జున వచ్చేస్తాడు. అందరికీ పేరుపేరున కౌంటర్స్ ఏసేస్తాడు. మంచి చేస్తే మెచ్చుకుంటాడు. ఎక్కువచేస్తే మాటలతో గాలి తీసేస్తాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ) అలా ఈ వారం పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయలేదని శివాజీకి కౌంటర్స్ పడ్డాయి. ప్రతిసారి వయసు అంశాన్ని మాట్లాడుతున్నందుకు షకీలాకు కూడా స్మూత్గా పడ్డాయి. ఇక నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్పై అమరదీప్ అరిచాడు. ఈ విషయమై స్పందించిన నాగార్జున.. 'అతడు డబ్బులు అతడి ఇష్టం. అతడు ఎవరికైనా ఇచ్చుకుంటాడు నీకెందుకు?' అని అన్నాడు. హౌసులోకి వెళ్లేటప్పుడు పల్లవి ప్రశాంత్కి హోస్ట్ నాగార్జున ఓ మొక్క ఇచ్చాడు. అయితే దాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో అది ఆకులు రాలిపోయి, పూర్తిగా వాడిపోయింది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పిన నాగార్జున.. 'మొక్కనే సరిగా చూసుకోలేకపోయావ్ నువ్వు రైతుబిడ్డవా?' అని అన్నాడు. దీంతో ప్రశాంత్ ముఖం మాడిపోయింది. ఇంకా ఎవరెవర్ని ఏమేం కౌంటర్స్ పడ్డాయో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్!) -
'ఏంటి సార్ కొత్త ఫోనా'.. ఆసక్తి పెంచుతోన్న బిగ్ బాస్ ప్రోమో!
తెలుగువారిని అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ సీజన్కు నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మొదటివారం కాస్తా నెమ్మదిగా సాగిన బిగ్బాస్ షో.. రెండోవారం నుంచే హాట్హాట్గా మారిపోయింది. అయితే తెలుగులో ఏడో సీజన్ కాగా.. కన్నడలో బిగ్ బాస్ సీజన్ 10కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. త్వరలో ప్రారంభం కానున్నట్లు ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2వ తేదీన సుదీప్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి ప్రోమోలో కిచ్చా కనిపించలేదు. దీంతో మరోసారి స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే బిగ్బాస్ శాండల్వుడ్ అభిమానులకు సందడి చేయనుంది. (ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం! ) సరికొత్తగా ప్రోమో బిగ్ బాస్ ప్రతి సీజన్కు విడుదల చేసే ప్రోమోలు కాస్తా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోను రిలీజ్ చేశారు. సరికొత్త "ఏంటి సార్ కొత్త ఫోన్" అని ఓ ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ను అడిగాడు యువకుడు. అవును సార్ నా కొడుకు పండగకి కొనిచ్చాడు. అని చెప్పగానే ప్రోమోలో సుదీప్ కనిపించాడు. ఆ తర్వాత అదే యువకుడు ఆటో ఎక్కి ఇంటికి వెళ్తే.. పండగ మొదలవుతోంది సార్ అంటూ ఆటోడ్రైవర్ నుంచి సమాధానం వస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి వీధి అంతా పండుగలా కనిపిస్తుంది. ఏంటిరా ఇందతా సందడి అని అక్కడి యువకులను అడుగుతాడు. వారంతా ఇది వందరోజుల పండగ అని సమాధానమిస్తారు.' ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 లుక్ చూపించారు. సుదీప్ కనుసైగ చేస్తూ "హ్యాపీ బిగ్ బాస్" త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది అంటూ సుదీప్ ఫోటోను ఆవిష్కరిస్తూ సందడి చేస్తూ కనిపించారు ఫ్యాన్స్. కంటెస్టెంట్స్ ఎవరు? అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ లిస్ట్ లో పది మందికి పైగా పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ.. కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియరాలేదు. త్వరలోనే ఈ షో ప్రారంభమైన తర్వాతే ఆ క్యూరియాసిటీకి బ్రేక్ పడనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరున షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రూమ్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి) ಊರ ಹಬ್ಬಕ್ಕೆ ಇಲ್ಲಿದೆ ರೀಸನ್; ಶುರುವಾಗ್ತಿದೆ HAPPY 'BIGG BOSS KANNADA' ಹತ್ತನೇ ಸೀಸನ್! #BiggBossKannada #BBK10 #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ @KicchaSudeep pic.twitter.com/qCQkXGkQgI — Colors Kannada (@ColorsKannada) September 14, 2023 -
అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!
'బిగ్బాస్' హౌస్ రోజురోజుకీ క్రేజీగా మారుతుంది. లేకపోతే ఏంటబ్బా.. ఈరోజు ఫ్రెండ్ గా ఉన్నోళ్లు రేపటికి శత్రువులు అయిపోతున్నారు. ఇప్పుడు ఒకే టీమ్ లో ఉన్నోళ్లు.. రోజు మారేసరికి ఒకరిని ఒకరు ఎలా పడగొట్టాలా అని స్కెచ్ లు వేసుకుంటున్నారు. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? 12వ రోజు ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. తొలివారం ఎంతో సరదాగా సాగిన బిగ్ బాస్.. రెండో వారంలోకి ఎంటరయ్యేసరికి చాలావరకు మారిపోయింది. ఎప్పుడు చూడు గొడవలే అవుతున్నాయి. మాట్లాడితే చాలు కంటెస్టెంట్స్.. ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. తాజాగా 12వ రోజు కూడా గౌతమ్-ప్రిన్స్ గొడవపడ్డారు. దీంతో ప్రిన్స్ ఏడ్చేశాడు. ఇక కన్ఫెషన్ రూంలోకి వెళ్లొచ్చిన తర్వాత రతికతో మాట్లాడుతూ కనిపించాడు. ఆమె కూడా ఇతడితో పులిహోర కలుపుతూ కనిపించింది. (ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) అయితే రతిక-ప్రిన్స్ మధ్య ప్రేమలాంటిది పుట్టడం కాదు.. అదంతా ప్రశాంత్ ముందే జరగడం.. అయ్యో పాపం అనిపించేలా ఉంది. మరోవైపు పవర్ అస్త్ర కోసం గేమ్స్ గెలుచుకున్న మహాబలి గ్రూపులో షకీలా, శివాజీ అర్హులని అందరూ నిర్ణయించారు. అయితే సడన్ ఎంట్రీ ఇచ్చిన బిగ్బాస్.. సందీప్ ని మరో వ్యక్తిని కంటెండర్ గా సెలెక్ట్ చేసే అవకాశం కల్పించాడు. దీంతో సంచాలకుడు సందీప్.. అమర్దీప్ని పవర్ అస్త్ర పోటీ కోసం ఎంచుకున్నాడు. దీంతో ఇప్పటికే పోటీలో ఉన్న షకీలా, శివాజీ అసహనం వ్యక్తం చేశారు. తాము ఇంట్లో నుంచి వెళ్లిపోతామని అరిచి కేకలు పెట్టడం మీరు తాజా ప్రోమోలో చూడొచ్చు. మరి పూర్తిగా ఏం జరిగిందనేది తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇదీ చదవండి: బిగ్బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్) -
బెండు తీసిన 'బిగ్బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!
తొలివారం చప్పగా సాగిన 'బిగ్బాస్ 7'.. రెండోవారం వచ్చేసరికి ట్రాక్లోకి పడినట్లు కనిపిస్తుంది. గొడవలు, టాస్కులతో మంచి ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 9 రోజులు పూర్తి కాగా, బుధవారం 10వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన ప్రోమోలు.. ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఏంటి విషయం? దొంగతనం స్కెచ్ 'పవర్ అస్త్ర' దక్కించుకోవడంలో భాగంగా రణధీర, మహాబలి పేర్లతో కంటెస్టెంట్స్ ని గ్రూపులుగా విభజించి.. ఓ గేమ్ పెట్టాడు. ఇందులో రణధీర సమూహం (అమర్దీప్, ప్రియాంక, శివాజీ, ప్రిన్స్, షకీలా, శోభాశెట్టి) ఓ తాళం గెలుచుకున్నారు. అయితే దాన్ని దొంగిలించాలని మహాబలి టీమ్ స్కెచ్ వేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'కి డబ్బింగ్ చెప్పే ఈయన ఎవరో తెలుసా?) రాత్రి నిద్రపోయే టైంలో దాన్ని కొట్టేయాలని ప్లాన్ వేసింది. కానీ శివాజీ.. ఆ తాళాన్ని ఓ బెల్టులో పెట్టి, నడుముకి కట్టేసుకోవడం, రతిక దాన్ని కొట్టేయాలని ప్లాన్ చేయడం లాంటివి ప్రోమోలో చూపించారు. ఓవరాల్గా ఏం జరిగిందనేది బుధవారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్లో చూడొచ్చు. బెండు తీశాడు ఇకపోతే 'మాయ అస్త్ర' కోసం 'మలుపులో ఉంది గెలుపు' పేరుతో రెండు సముహాల మధ్య బిగ్బాస్ రెండో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా స్పిన్ వీల్ లో సూచించిన విధంగా.. ఆయా కలర్స్ ఉన్న చోట కాళ్లు, చేతులు పెట్టాల్సి ఉంటుంది. గెలిచిన టీమ్కి 'మాయ అస్త్ర'కి సంబంధించిన మరో తాళం లభిస్తుంది. అయితే ఈ ఆటలో భాగంగా బాడీని ఎలా పడితే అలా వంచేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు.. బిగ్బాస్ వాళ్ల బెండు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్లో ఆ తొమ్మిది మంది) -
పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ?.. ఓ రేంజ్లో రతిక ఫైర్!
తెలుగు ప్రేక్షుకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హోస్లోకి ఎంట్రీ ఇవ్వగా తొలిరోజు నుంచే ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా బిగ్బాస్-7 సీజన్ ఈసారి ఉల్టా పల్టాగా ఉంటుందని ప్రకటించిన నాగార్జున ఈ షోపై మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే తొలివారం అంతంత మాత్రంగానే అలరించిన కంటెస్టెంట్స్.. రెండోవారం వచ్చేసరికి విమర్శలతో షోను రసవత్తరంగా మార్చేశారు. దీంతో రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్గా మారింది. బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య రణరంగం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్లో పరిస్థితి అర్థమవుతోంది. వాడీవేడీగా నామినేషన్స్ రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ చాలా వాడీవేడీగా కొనసాగుతోంది. శక్తి అస్త్రాను సొంతం చేసుకున్న సందీప్ ఐదు వారాల పాటు సేవ్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఈ వారం ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశాన్ని సందీప్ సొంతం చేసుకున్నాడు. ప్రిన్స్ యావర్ను సందీప్ అతడిని నామినేట్ చేశాడు. సందీప్.. ప్రిన్స్ యావర్ను నామినేట్ చేయడంతో మిగిలినవాళ్లు అతన్ని నామినేట్ చేసేందుకు వీల్లేదని బిగ్బాస్ ఆదేశించాడు. పల్లవి ప్రశాంత్పై చర్చ టేస్టీ తేజను శుభశ్రీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ నామినేట్ చేయగా.. శివాజీని అమర్దీప్, ప్రియాంకజైన్, షకీలా, శోభాశెట్టి, దామినిలు నామినేట్ చేశారు. నామినేషన్ సమయంలో వారి మధ్య తీవ్ర చర్చ జరిగింది. రైతు బిడ్డ అంటూ సింపథీ కోసం ప్రయత్నస్తున్నాడని పల్లవి ప్రశాంత్ని గౌతమ్ కృష్ణ, దామిని, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, షకీలా, అమర్దీప్లు నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ సమయంలో రైతుబిడ్డ ఇష్యూపై పెద్ద చర్చే నడిచింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మంగళవారం కూడా కొనసాగనుంది. శివాజీతో గొడవ నామినేషన్స్ ప్రక్రియ చూస్తే గౌతమ్, రతికా రోజ్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ? అంటూ రతిక ఓ రేంజ్లో ఫైర్ అయింది. మరోవైపు తనను నామినేట్ చేసినందుకు.. శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. నువ్వు ఆర్టిస్ట్ కాబట్టే ఇంప్రెస్ చేశావు అంటూ శివాజీ ఫైర్ కావడంతో.. ‘అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను’ అని శోభ కౌంటరిచ్చింది. దీంతో మంగళవారం రిలీజైన ప్రోమో చూస్తే హౌస్లో ఎంత హీట్ ఉందో అర్థమవుతోంది. -
శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!
'బిగ్బాస్ 7' తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే మెల్లగా పికప్ అవుతుంది. తొలివారం కాబట్టి ఒకటి రెండు టాస్కులు చిన్న చిన్న గొడవలు జరిగాయి. అలా ఆడుతూ పాడుతూ ఉండేసరికి వీకెండ్ వచ్చేసింది. దీంతో హోస్ట్ నాగార్జున విచ్చేసి సందడి చేశాడు. అదే టైంలో హౌసులో ఏమేం జరుగుతుందనేది చెప్పుకొచ్చారు. అలానే నాగార్జున.. స్మూత్గా వాళ్లకు కౌంటర్లు కూడా వేసేశాడు. ఇంతకీ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది? బిగ్బాస్ షోలో వారంలో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వస్తే చాలు.. హౌస్మేట్స్ అందరూ కలర్ఫుల్గా కనిపిస్తారు. మరోవైపు హోస్ట్ నాగార్జున కూడా ఓవైపు నవ్విస్తూనే, మరోవైపు కౌంటర్స్ వేసేస్తాడు. ఈసారి కూడా అలానే ఫుల్ ఎనర్జీతో వచ్చేసిన నాగ్.. కిరణ్ రాథోడ్ తెలుగు మాట్లాడటం లేదని చెప్పి.. ఓ పది తెలుగు పదాలు చెప్పమన్నాడు. దీంతో ఆమె ఇబ్బంది పడుతూనే చెప్పింది. (ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్బాస్ 7'.. కారణం అదే?) రాత్రిపూట షకీలా చేసిన హంగామా, సందీప్.. రతిక చెప్పులు మోసాడని, ఒకరి వెంట ఉన్నావా అని గౌతమ్ అని నాగార్జున ఫన్ జనరేట్ చేశారు. అలానే ప్రియాంకతో మాటామాటా అన్న విషయమై దామినికి క్లారిటీ ఇచ్చేశారు. అలానే హౌసులో శోభాశెట్టి ఏడుస్తుండటంపైనా నాగ్.. సైలెంట్ కౌంటర్ వేసేశాడు. 'మొదటివారం నుంచి కన్నీళ్లు పెట్టుకునే కంటెస్టెంట్ని ఆడియెన్స్.. టాప్-5కి పంపిన దాఖలాలు లేవు' అని నాగ్ అన్నారు. మరి నాగ్ స్టేట్మెంట్ని శోభాశెట్టి ఏమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ఈ సీజన్లోని ఎపిసోడ్స్ని టీవీలో ప్రతిరోజు రాత్రి టెలికాస్ట్ చేస్తుండగా, హాట్స్టార్లో 24 గంటల స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. అయితే రోజంతా లైవ్ స్ట్రీమింగ్ వల్ల.. ఎపిసోడ్ లో కిక్ ఉండటం లేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా శనివారం, ఆదివారం స్ట్రీమింగ్ ఉండదని ప్రకటించారు. మళ్లీ ఆదివారం రాత్రి 10:30 తర్వాతే 24x7 స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. (ఇదీ చదవండి: ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్బాస్.. మరో కొత్త ట్విస్ట్!) -
నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర
తెలుగు ఇండస్ట్రీలో మిగతా కపుల్స్ సంగతేమో గానీ నరేశ్-పవిత్రా లోకేశ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నరేశ్ ఇప్పటికే పలుమార్లు పెళ్లి చేసుకుని విడిపోయాడు. పవిత్ర కూడా ఇలానే పెళ్లి చేసుకుని విడిగా ఉంటుంది. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఈ మధ్య తమ జీవితం ఆధారంగా 'మళ్లీ పెళ్లి' పేరుతో ఓ సినిమా కూడా తీసిపడేశారు. అలాంటి ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత జంటగా స్టేజీపై కనిపించారు. కొత్త జంటలా సందడి చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) వినాయక చవితి సందర్భంగా ఓ ఎంటర్టైన్మెంట్ షో టెలికాస్ట్ కాబోతుంది. ఇందులోనే నరేశ్-పవిత్రా లోకేశ్ జంటగా పాల్గొన్నారు. కొన్నాళ్ల ముందు నుంచి ఎక్కడైనా సరే ఇద్దరూ జంటగా కనిపిస్తున్నారు. కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఈసారి కూడా దానికి ఏ మాత్రం తక్కువ కాదు అనేలా.. స్టేజీపై 'మాస్టారూ మాస్టారూ' పాటకు డ్యాన్స్ చేయడంతోపాటు ముద్దులు కూడా పెట్టారు. అలానే నరేశ్ని ముద్దుగా ఏమని పిలుస్తుందో పవిత్ర బయటపెట్టింది. 'మళ్లీ పెళ్లి' ప్రమోషన్ లో భాగంగా పవిత్రని అమ్ములు అని ముద్దుగా పిలుస్తానని నరేశ్ చెప్పాడు. పవిత్ర మాత్రం నరేశ్ని 'రాయ' అని ముద్దుగా పిలుస్తుందట. తాజాగా రిలీజ్ చేసిన షో ప్రోమోలో ఈ విషయాన్ని పవిత్రా లోకేశ్ బయటపెట్టింది. ఇక వీళ్లపై హైపర్ ఆది చిన్నగా పంచులు కూడా వేయడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నరేశ్-పవిత్రా లోకేశ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా ఉన్నారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) -
'బిగ్బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!
బిగ్బాస్ 7వ సీజన్ లో అప్పుడే గొడవలు మొదలైపోయాయి. ఆదివారం అందరినీ హౌసులోకి పంపి హోస్ట్ నాగార్జున తాళం వేశారు. ఇక సోమవారం నామినేషన్స్ స్టార్ట్ అవగా, కంటెస్టెంట్స్ మధ్య రచ్చ షురూ అయిపోయింది. ఫస్ట్ డే శివాజీ, ప్రియాంక జైన్.. తమ తమ నామినేషన్స్ గురించి చెప్పారు. దీంతో నామినేట్ అయిన వాళ్లకు శివాజీ, ప్రియాంక జైన్ కి మధ్య హాట్ హాట్ డిస్కషన్ సాగింది. రెండో రోజు మరిన్ని గొడవలు జరిగినట్లు అనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఫస్ట్ డే హైలైట్స్.. గొడవలు,నామినేషన్లలో ఉన్నది వీళ్లే!) గొడవ షురూ చేసిన శోభా సోమవారం ఏడుస్తూ కాస్త డల్ అయిన శోభాశెట్టి.. నామినేషన్స్ లో మాత్రం రెచ్చిపోయింది. భాషకు సంబంధించిన కిరణ్ రాథోడ్ తో తనకు ఇబ్బందులు ఉన్నాయని ఆమెని, గౌతమ్ కృష్ణని కూడా నామినేట్ చేసింది. ఇక సింగర్ దామిని.. శోభాశెట్టిని నామినేట్ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. హౌసులో తనని చివరి స్థానంలో ఉంచడం అనే కారణం తనకు నచ్చలేదని ఆమెతో గొడవ పెట్టుకుంది. అలానే దామిని.. తాను చేసింది తప్పే అయ్యుండొచ్చని అంటుండగానే.. అవును తప్పే అని గట్టిగా అరుస్తూ శోభాశెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తేజతో ఆడుకున్న బిగ్బాస్ మరోవైపు ప్రిన్స్, షకీలా.. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక టేస్టీ తేజ.. రూంలోకి వెళ్లిన తర్వాత కిరణ్, రతిక పేర్లు చెప్పాడు. అయితే వాళ్లని నామినేట్ చేయడానికి చెప్పిన కారణాలు సరిగా లేవని, నామినేట్ చేయడానికి భాష అనేది కారణం కాదని చెబుతూ.. కాసేపు తేజతో బిగ్బాస్ ఆటాడుకున్నాడు. అలానే అక్కడే నామినేషన్స్ రూంలో పడుకోమని చెప్పగా... 'బాయ్ బిగ్బాస్' తాను వెళ్లొస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా ఫన్నీ మేనర్లో జరిగింది. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?) -
నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కౌంటర్!
కొన్నాళ్ల ముందు ఇండస్ట్రీలో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ల లైఫ్ ని సినిమాగా తీసి మరీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అవును మీరు ఊహించింది కరెక్టే. వాళ్లే నరేశ్-పవిత్రా లోకేశ్. 'మళ్లీ పెళ్లి' అని సినిమా వీళ్లు చేయడం మాటేమో గానీ కొన్నాళ్లపాటు తెగ ట్రెండ్ అయ్యారు. సరేలే వీళ్ల గురించి అందరూ మర్చిపోయారు అనుకునే టైంలో మరోసారి చర్చనీయాంశమయ్యారు. నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కామెంట్స్ దీనికి కారణం? విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ ఫామ్లో ఉన్నాడు. నటుడిగా ఇతడిని వంకపెట్టడానికి లేదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే పలు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్.. మాజీ భార్య రమ్య రఘుపతితో దూరంగా ఉంటున్నాడు. అదే టైంలో నటి పవిత్రా లోకేశ్తో రిలేషన్లో ఉన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) నరేశ్-పవిత్రా లోకేశ్ కలిసి తమ బంధంపై 'మళ్లీ పెళ్లి' అనే మూవీ తీయడం.. దానిపై రమ్య రఘుపతి కోర్టుకెళ్లడం లాంటి విషయాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. సరే దాని గురించి వదిలేస్తే.. వీళ్లిద్దరూ జంటగా ఓ తెలుగు ఛానెల్లో ప్రసారం కాబోతున్న వినాయక చవితి ఈవెంట్లో పాల్గొన్నారు. దీని ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే హైపర్ ఆది.. నరేశ్పై ఫన్నీగా కౌంటర్ వేశాడు. 'నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు. పెళ్లి, మళ్లీపెళ్లి ఎలా సార్?' అని హైపర్ ఆది.. స్టేజీపై అందరూ చూస్తుండగానే నరేశ్ని అడిగేశాడు. పక్కనే పవిత్రా లోకేశ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ క్వశ్చన్కి నరేశ్ నవ్వి ఊరుకున్నాడు. ప్రోమో కాబట్టి పెద్దగా రివీల్ చేయలేదు. బహుశా ఫుల్ ఈవెంట్లో నరేశ్ చెప్పిన ఆన్సర్ చూపిస్తారేమో? ఏదేమైనా అలా పెళ్లిళ్ల గురించి డైరెక్ట్గా అడిగేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) -
'వరల్డ్కప్కు ముందు ఆసియా కప్ కొట్టండి'.. ప్రోమో అదిరింది
ఆసియాకప్ 2023కి సంబంధించిన హక్కులను బ్రాడ్కాస్ట్ సంస్థ స్టార్స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్కు సంబంధించిన ప్రోమోను శుక్రవారం తన ట్విటర్లో రిలీజ్ చేసింది. ''ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే వరల్డ్కప్ కొట్టడానికి ముందు ఆసియా కప్ కొట్టండి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొండి'' అంటూ టీమిండియాను ఎంకరేజ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మాటలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఆసియా కప్లో పాల్గొననున్న ఆరు జట్లను చూపిస్తూ ప్రోమో కొనసాగుతుంది. చివరగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆసక్తికరపోరు ఖాయమని చెబుతూ 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉపఖండపు దేశాల మధ్య పోరు రంజుగా ఉంటుంది.. అంటూ ముగించింది. స్టార్స్పోర్ట్స్ రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. All eyes on Asia as we gear up for an ultimate showdown in the #AsiaCup2023! Join #TeamIndia's exhilarating journey as they intend to conquer first the Asia Cup & then the World Cup #AajAsiaKalDuniya Watch Asia Cup LIVE from Aug 31-Sep 17, only on Star Sports Network pic.twitter.com/b1tcPlZ6dn — Star Sports (@StarSportsIndia) June 17, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు.పాకిస్తాన్లో 4 మ్యాచ్లు... శ్రీలంకలో 9 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. పాకిస్తాన్లోని నాలుగు మ్యాచ్లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్ల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: 'వరల్డ్కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా? ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
సీఎం జగన్ వైపే కాపు సామజిక వర్గం..!
-
'నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా'.. హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం!
టాలీవుడ్లో యంగ్ హీరో అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజు గారి గది సిరీస్తో అభిమానులను మెప్పించారు. ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. జీనియస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమయ్యారు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో మెప్పించారు ఆయన నటించిన రాజుగారి గది సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. రాజు గారి గది సిరీస్ చిత్రాలకు అతడి అన్నయ్యే దర్శకుడు కావడం విశేషం. (ఇది చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్) హిడింబ చిత్రం మరోసారి అభిమానులను పలకరించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఓంకార్ యాంకర్గా హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అశ్విన్తో పాటు హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్ కూడా వచ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ షోలో పాల్గొన్న తమ్ముడిని చూసి ఓంకార్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి తమ్ముడితో సిక్త్ సెన్స్ షో ఆడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో పాల్గొన్న వారిని ప్రశ్నించిన ఓంకార్.. తన తమ్ముడికి కూడా ఓ ప్రశ్న వేశాడు. నీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందా అని అడిగాడు. (ఇది చదవండి: ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!) ఈ ప్రశ్నకు అశ్విన్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. 'ఇప్పటివరకు నాకు అన్నీ నువ్వే. నేను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నా అన్నయ్యా. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ' కన్నీటి పర్యంతమయ్యాడు. తమ్ముడిని చూసిన అన్నయ్య కూడా ఫుల్ ఎమోషనల్గా కనిపించారు. వీరు మొత్తం ముగ్గురు అన్నదమ్ముులు కాగా.. చిన్నతమ్ముడు నిర్మాణరంగంలో రాణిస్తున్నారు. తన తమ్ముళ్ల కోసం ఓంకార్ ఎంత ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. -
'విమానం అంటే నీకెందుకు అంత ఇష్టం నాన్న'.. ఆసక్తిగా ప్రోమో
సముద్ర ఖని, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం 'విమానం'. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్పై సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోను చూస్తే.. అందులో తండ్రీ, కుమారుల కొడుకుల మధ్య అనుబంధం కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. సముద్ర ఖని అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య అనే తండ్రి పాత్రలో నటించారు. జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ క్రేజీవాల్ మాట్లాడుతూ..'కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్తో అసోసియేట్ కావటం చాలా సంతోషంగా ఉంది. బలమైన కథాంశంతో రూపొందిన విమానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ను అందించటమే మా లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో మాస్టర్ ధ్రువన్, రాహుల్ రామకృష్ణ, ధన్రాజ్, రాజేంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 9 థియేటర్లలో రిలీజ్ కానుంది. -
ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ .. ఆకట్టుకుంటున్న ప్రోమో
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తోంది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఊర్రూతలూగిస్తోంది. తాజాగా సీజన్-2 లో మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో అమెరికాకు చెందిన డాక్టర్ శృతి నండూరి తన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
'అబ్బాయి టచ్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది'.. సాంగ్ ప్రోమో రిలీజ్
కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకెండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.ఈ పూర్తి పాటను జనవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. -
ప్రభాస్తో బాలయ్య ముచ్చట్లు.. ప్రోమో మామూలుగా లేదుగా..!
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్-2 క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫేమస్ సెలబ్రీటీలు హాజరవుతున్న ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్తో కలిసి ఈనెల 30న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. అయితే ఈ ఎపిసోడ్ను రెండు భాగాలుగా ప్రసారం చేయనుండగా తాజాగా మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ప్రోమోలో ప్రభాస్ను బాలకృష్ణ సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ ప్రోమో చూస్తే ఆద్యంతం నవ్వుల పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో సెటైర్లు, సీక్రెట్స్, సరదాలు, సలహాలు, డ్యాన్సులు, సంచలనాలు, అన్ని ఉండనున్నట్లు ఆహా ట్వీట్లో వెల్లడించింది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈనెల 30న మొదటి పార్ట్ ప్రసారం కానుండగా.. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. Satirelu, Secretlu, Saradalu, Salahalu, Songulu, Dancelu, Sanchalanalu, annni unnay...😍🤯😋❤️ Anduke Bali Bali Ra Bali Sahore Bahubali in 2 Parts. Part 1 premieres December 30.#PrabhasOnAHA #UnstoppableWithNBKS2#Prabhas𓃵 #NandamuriBalakrishna pic.twitter.com/Bqmguxmq4G — ahavideoin (@ahavideoIN) December 28, 2022 -
హీరోయిన్ అవ్వాలంటే అవి తప్పవు.. అన్స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా అన్స్టాపబుల్ రెండో సీజన్ టాలీవుడ్ సెలబ్రిటీలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తాజాగా ఈ సీజన్లో మరో ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా పాల్గొననుంది. తాజాగా ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. వీరితో కలిసి బాలయ్య సందడి చేయగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 23న ఫుల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి వేశారు. రాశి ఖన్నాని పొగుడుతూ అలరించాడు. రాశి ఖన్నా తాను నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని పాటతో అలరించింది. ఈ ప్రోమోలో జయప్రద, జయసుధపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ప్రస్తుతం నేను, శృతి ఆంధ్రప్రదేశ్లో హాట్ పెయిర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. -
Unstoppable With NBK: హీరోయిన్కి ఫోన్ చేసి ఫ్లర్ట్ చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటీవలె గ్రాండ్గా లాంచ్ అయిన ఈ షో సెకండ్ ఎపిసోడ్లో యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్లు గెస్టులుగా వచ్చారు. కలిసి అన్స్టాపబుల్ వేదికపై బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు. రావడం రావడంతోనే సిద్ధూ హెయిర్స్టైల్పై పంచ్ వేసిన బాలయ్య.. తలదువ్వకుండా పంపించారు హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడా అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. దీనికి సిద్ధూ ఆన్సర్ ఇస్తూ.. 'ఇది మెస్సీ లుక్' అని చెప్పగా..'అలా నేను మెస్సీ లుక్తో కనిపించిన సినిమాలన్నీ మెస్సీ అయ్యాయమ్మా' అంటూ బాలయ్య సెటైర్ వేశారు. ఇక మీ ప్రజెంట్ క్రష్ ఎవరు అని బాలయ్యను అడగ్గా రష్మిక మందన్నా అని ఓపెన్గానే చెప్పేశారు. ఆ తర్వాత ఫ్లర్టింగ్ ఎలా చేయాలంటూ టిప్స్ అడిగి మరీ తెలుసుకున్న బాలయ్య ఓ హీరోయిన్కి కాల్ చేసి.. మీ వాయిస్ విని మీ ఫేస్ చందమామలా ఉంటదని నేను చెప్పగలను. నేనేమో చీకట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రే అంటూ సరదాగా ఫ్టర్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడితో పుష్ప భామ స్టెప్పులు.. వీడియో వైరల్
పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో పుష్పతో ఒక్కసారిగా స్టార్డమ్ పొందిన ఈ అమ్మడు బాలీవుడ్లోని ఓ టీవీ షోలో తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి కాలు కదిపింది. పుష్ప సినిమాలో సూపర్ హిట్ సాంగ్' రా రా సామీ బంగారు సామీ' అంటూ తన డ్యాన్స్తో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. హిందీలో ప్రసారమవుతున్న సూపర్ మామ్స్-3 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమోలో ఈ అమ్మడు తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (చదవండి: ఆ రోజు 'గుడ్ బై' చెప్పనున్న రష్మిక మందన్నా!) సూపర్ మామ్స్- 3 గ్రాండ్ ఫినాలేలో రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జీ టీవీ. 15 సెకన్ల వీడియోలో బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి వేదికపై సామీ సామీ స్టెప్పులతో దుమ్ము రేపింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న సూపర్ మామ్స్ గ్రాండ్ ఫినాలే ఫుల్ ఎపిసోడ్లో ఈ బ్యూటీ కనిపించనుంది. ఆమె బాలీవుడ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్తో కలిసి నటించిన చిత్రం 'గుడ్బై' విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్తో స్టార్డమ్ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. -
వీకెండ్ ట్విస్ట్: ఆ 9మంది హౌజ్మేట్స్పై నాగ్ ఫైర్, బయటకు వెళ్లిపొమ్మంటూ..
బిగ్బాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఘట్టం వీకెండ్ ఎపిసోడ్. తొలివారం వీకెండ్లో ఎపిసోడ్లో హౌజ్మేట్స్తో సరదసరదాగా ఆటలు ఆడించిన నాగ్ ఈ వీకెండ్లో మాత్రం కంటెస్టెంట్స్పై గుర్రుమన్నాడు. కుండలు బద్దతు కొడుతూ కంటెస్టెంట్స్కి చీవాట్లు పెట్టాడు. అంతేకాదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ఆఖరిలో ట్విస్ట్ ఇచ్చాడు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, మరినా-రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్ ఈ తొమ్మిది మంది పేర్లపై కుండలు పెట్టి వాటిని పేరు పేరునా పగలగొడుతూ కంటెస్టెంట్స్పై చిర్రుబుర్రమన్నాడు. అంతేకాదు చివరిలో వారందరి లగేజ్ బ్యాగ్లను స్టేజ్పై పెట్టించాడు. చదవండి: కాస్టింగ్ కౌచ్పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. అయితే ఇందులో నామినేషన్లో ఉన్నది ముగ్గురు మాత్రమే. ఇక వీరందరిని ఉద్దేశిస్తూ.. మీరంతా బిగ్బాస్ హౌజ్లోకి ఆడటానికి రాలేదని, చిల్ అవ్వడానికి వచ్చారంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత షానీ కుండ పగలగొట్టి.. తింటానికే, పంటానికే ఈషోకు వచ్చాననని నువ్వు అనుకుంటే వెంటనే బ్యాగ్ సర్దుకుని బయటకు వెళ్లిపోవచ్చంటూ షాకిచ్చాడు. ఇక బాలాదిత్య ఉద్దేశిస్తూ.. నువ్వు ఆడకపోవవడమే కాదు ఇతరుల ఆటను కూడా చెడగొడుతున్నావంటూ ఫైర్ అయ్యాడు నాగ్. దీనికి ఈ మాజీ కెప్టెన్ స్పందిస్తూ.. ‘నేను తప్పు చేశాను.. బుర్రతో ఆలోచించలేదు. మనసుతో ఆలోచించాను’ అన్నాడు. దానికి నాగ్ ‘మనసూ బుర్రా కాదు బిగ్ బాస్ హౌస్మేట్గా ఆలోచించు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్ ఇక మెరీనా - రోహిత్ను ఉద్దేశించి ‘మీరు ఇద్దరూ ఈ ఇంట్లోకి పవర్ ఆఫ్ టూ(power Of Two) కింద వచ్చారు. కానీ ఆటలో మాత్రం మైనస్లో ఉన్నారు’ అంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం శ్రీసత్యను ‘నీ బొమ్మ పోయినప్పుడు నువ్వు ఫీలయ్యావా? అదే నీ ప్లేటు లాగేసుకుని ఉంటే కచ్చితంగా ఫీలయ్యేదానివి’ అంటూ ఆమెకు చురక అట్టించాడు. ఇక అభినయ మాట్లాడుతూ.. తాను జీరో పర్సెంట్ మాత్రమే ఆడానంటే ఒప్పుకోనంటూ నాగ్తో వాదించడంతో.. మరి 10 శాతం ఆడావా? అని బదులిచ్చాడు నాగార్జున. ఆ తర్వాత సుదీప ఖచ్చితంగా తానేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పడంతో నువ్వు ఈ హౌజ్లో ఉంటే.. అంటూ వ్యాఖ్యానించాడు. చూస్తుంటే ఈ వారంలో నామినేషన్లో ఉన్నవారు కాకుండా హౌజ్లో పర్ఫామెన్స్ ఇవ్వని వారిని బిగ్బాస్ బయటకు పంపించేలా కనిపిస్తున్నాడంటూ ప్రోమోపై నెటిజన్లు కామెంట్స చేస్తున్నారు. -
చలాకీ చంటీపై చేయిచేసుకున్న ఆర్జే సూర్య!.. షాక్ అయిన సుధీర్ బాబు
బిగ్బాస్ హౌస్లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం సందడి చేసింది. సుధీర్ బాబు, కృతిశెట్టిలు గ్రాండ్గా బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్మేట్స్తో సరదాగా గడిపారు. ఇక ఇంటిసభ్యులు కొన్ని డైలాగులను స్పూఫ్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఇందులో రేవంత్ ఎవడు కొడిడే మైండ్ బ్లాంక్ అయితుందో వాడే పండుగాడు అంటూ డైలాగ్ చెప్పగా, తమిళేంటి, తెలుగేంటి డార్లింగ్.. గొడవైంది కొట్టేసుకుందాం రా అంటూ గీతూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది. ఇక ఆర్జే సూర్య, చలాకీ చంటీల మధ్య జరిగిన డిస్కషన్లో సూర్య అతనిపై సరదాగా చేయిచేసుకుంటాడు. మరోవైపు సత్యను ఫ్లర్ట్ చేయడానికి రాజ్ తెగ ట్రై చేశాడు. శారీలో బాగున్నావ్.. లెట్స్ గో ఫర్ ద డేట్ అని అందరి ముందే అడిగేశాడు. దీంతో సత్య ఈ డైలాగ్ ఎంతమందికి చెప్పావ్ అంటూ అతడి పరువు తీసేసింది. మరి ఇవాల్టి ఎపిసోడ్లో ఫన్ డోస్ ఎంత ఉందన్నది చూడాల్సి ఉంది. -
‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్కు ఇంకా 6 రోజులే.. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్బీర్ కపూర్-ఆలియా భట్లు తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న అన్ని భాషల్లో(హందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్ రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ ఓ క్రేజీ వీడియోను వదిలాడు రాజమౌళి. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి బ్రహాస్త్రం ప్రీరిలీజ్ ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ట్రైలర్లో చూపించని, సినిమాకు హైలెట్గా నిలిచే పలు కీలక సన్నివేశాలతో చూపించారు. దీంతో ఈ వీడియో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక రాజమౌళి ఈ వీడియోను షేర్ చేస్తూ ‘బ్రహ్మాస్త్రం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది’ అని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ‘నాగిని’ బ్యూటీ మౌని రాయ్ నెగిటివ్ రోల్లో కనిపించనుంది. Here’s #Brahmastra PRE-RELEASE PROMO... Advance Bookings Open Now! Experience Brahmāstra in cinemas on September 9th. pic.twitter.com/9GFZWLwhrf — rajamouli ss (@ssrajamouli) September 3, 2022 -
భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్మ్యాన్ ప్రోమో
విండీస్ టూర్ ముగిసిందో లేదో అప్పుడే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ సందడి మొదలైంది. ఆసియా కప్ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులైన ఈ రెండు దేశాలు ఆగస్ట్ 28న తలపడనున్నాయి. దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరానికి 20 రోజుల ముందుగానే వాతావరణాన్ని వేడెక్కించేందుకు టోర్నీ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఓ ఆసక్తికర ప్రోమోను విడుదల చేసింది. 𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭'𝐬 𝐠𝐫𝐞𝐚𝐭𝐞𝐬𝐭 𝐫𝐢𝐯𝐚𝐥𝐫𝐲 returns to deliver a blockbuster with @ImRo45's #TeamIndia! 🤩#BelieveInBlue | #AsiaCup2022 | #INDvPAK | Aug 28, 6 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/Jf01OLLwYz — Star Sports (@StarSportsIndia) August 8, 2022 ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్తో సమరానికి సై అన్నట్లుగా క్రీజ్లో కాలుదువ్వుతూ కనిపిస్తాడు. క్రికెట్ పరంగా భారత్-పాక్ల మధ్య ప్రత్యేక అనుబంధముందని, పాక్ జట్టులోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని రోహిత్ ఈ ప్రోమోలో ప్రస్తావిస్తాడు. భారత్ ఎనిమిదో సారి ఆసియా కప్ గెలవాలి, విశ్వవేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడాలంటూ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 140 crore fans cheering 𝑰𝒏𝒅𝒊𝒂 𝑰𝒏𝒅𝒊𝒂... there is no greater pride than this for @ImRo45. #BelieveInBlue and join us in supporting #TeamIndia at #AsiaCup 2022! Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/gh2SPFmQEu — Star Sports (@StarSportsIndia) August 4, 2022 స్టార్ స్పోర్ట్స్ కొద్ది రోజుల ముందు కూడా రోహిత్ను హైలైట్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో హిట్మ్యాన్.. 140 కోట్ల మంది భారత అభిమానులు ‘‘ఇండియా.. ఇండియా’’ అని ముక్తకంఠంతో నినదిస్తుంటే వినడం కంటే గొప్ప అనుభూతి ఉండదని, ఆసియా కప్లో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడిద్దాం రమ్మని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా విండీస్తో ముగిసిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్కు రెస్ట్.. కెప్టెన్గా హార్ధిక్.. మరో కొత్త ఓపెనింగ్ జోడీతో ప్రయోగం -
ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం.. ఆసియా కప్ 2022 ప్రోమో అదుర్స్..!
Asia Cup 2022: నాలుగేళ్లుగా క్రికెట్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఆసియా కప్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. యూఏఈ వేదికగా ఆగస్ట్ 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే అర్హత సాధించగా.. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్లో తలపడనున్నాయి. The battle for Asian supremacy is 🔛. Get set to #BelieveInBlue as @ImRo45 leads #TeamIndia at the #AsiaCup2022!💙Starts Aug 27 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/K2hcfuGeBK— Star Sports (@StarSportsIndia) July 22, 2022 తాజాగా టోర్నీకి సంబంధించిన ప్రోమోను ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ వేదికగా విడుదల చేస్తూ.. ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం అంటూ క్యాప్షన్ను జోడించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 45 సెకెన్ల పాటు సాగిన ఈ ప్రోమోలో అత్యధిక భాగం భారత ఆటగాళ్లు దర్శనమివ్వగా.. పాక్ నుంచి బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిది, బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్ తరఫున రషీద్ ఖాన్ కనిపించారు. ఈ టోర్నీలో ఆగస్టు 28న భారత్-పాకిస్తాన్ జట్లు గ్రూప్ దశలో తలపడనున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో అనుకోని అతిధి.. ఏం చేశాడో చూడండి..! -
T20 World Cup 2022: జెయింట్ రిషబ్ పంత్.. గాడ్జిల్లాలా ఎంట్రీ.. !
టీ20 వరల్డ్ కప్ 2022 కౌంట్డౌన్ (97 రోజులు) మొదలైన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం (జులై 10) ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో టీమిండియా యువ వికెట్కీపర్ రిషబ్ పంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. ఈ వీడియోలో భారీ అవతారంలో దర్శనమిచ్చిన పంత్.. సిడ్నీ హార్భర్లో నుంచి ఉద్భవించి అక్కడి వీధుల గుండా గాడ్జిల్లాలా నడుచుకుంటూ వెళ్తాడు. వెల్కమ్ టు బిగ్ టైమ్, పంత్ అంటూ ఐసీసీ దీనికి క్యాప్షన్ జోడించింది. Welcome to The Big Time, Rishabh Pant 🚁 🚁#T20WorldCup pic.twitter.com/ZUSK63ssFZ— T20 World Cup (@T20WorldCup) July 10, 2022 ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. పంత్ను హైలైట్ చేయడంపై అతని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతకొంతకాలంగా మెగా ఈవెంట్ల ప్రోమోల్లో టీమిండియా తరఫున విరాట్ కోహ్లి మాత్రమే దర్శనమిచ్చేవాడు. అయితే కోహ్లిపై అంచనాలు తగ్గడంతో ఐసీసీ పంత్ను హైలైట్ చేస్తూ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. ఐసీసీ తాజా ప్రోమోలో పంత్తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, పాక్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్, విండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ స్టోయినిస్, పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది దర్శనమిచ్చారు. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించకపోవడం విశేషం. కాగా, అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: ఇంగ్లాండ్తో టీ20 మ్యాచ్.. ప్లేయర్స్, ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసిన ధోని -
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరిశ్రావుతో స్ట్రెయిట్ టాక్ ప్రోమో
-
బిగ్బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది.. 24/7 ఎంటర్టైన్మెంట్
బిగ్బాస్ అభిమానులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ బాప్గా నిలిచిన ఈ షో ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు రెడీ అయింది. 'బిగ్బాస్ నాన్స్టాప్' పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి సైతం నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. 'ఓ ఖైదీకి ఉరిశిక్ష పడగా, అతడి చివరి కోరికగా బిగ్బాస్కి సంబంధించి ఒక్క ఎపిసోడ్ని చూడాలనుకుంటాడు. అతని కోరిక మేరకు షోని ప్రసారం చేయగా నాన్ స్టాప్గా ప్రసారమయ్యే బిగ్బాస్ షోకు ఎండ్ ఉండదు. దీంతో ఆ ఖైదీకి ఉరిశిక్ష పడదనే ఫన్నీ కాన్సెప్ట్తో ప్రోమోని తెరకెక్కించారు. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్' అంటూ ప్రోమోను వదిలారు. 'డిస్నీ+ హాట్స్టార్'లో ఈనెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. -
అన్స్టాపబుల్ స్పెషల్ ప్రోమో: మహేశ్పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఫినాలేలో సూపర్స్టార్ మహేశ్బాబు సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ రేపు(ఫిబ్రవరి 4న) 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇప్పటికే ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా సోషల్ మీడియా ఇది వీపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ రేపు(శుక్రవారం) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్కు సంబంధించిన స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన తక్కువ వ్యవధిలో మంచి వ్యూస్ను రాబట్టింది ఈ ప్రోమో. ఇందులో బాలయ్య మహేశ్ బాబును ఆటపట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. చదవండి: వరుణ్ తేజ్తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. మహేశ్ సంబంధించిన ఆసక్తికర సీక్రెట్స్ను రాబట్టడానికి బాలయ్య చేసిన సందడి బాగా ఆకట్టుకుంటోంది. ఇక నువ్వు చిన్నప్పుడు చాలా నాటీ బాయ్ అంట కదా అనగానే మహేశ్ సిగ్గు పడటం.. దీనికి చేసేవి చేస్తూనే చెప్పాడానికి సిగ్గు పడతావంటూ బాలయ్య వేసిన పంచ్ డైలాగ్ ఫ్యాన్స్ను ఫిదా చేస్తోంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం నెటజన్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నటసింహం, సూపర్ స్టార్ల అల్లరి చూడాలంటే ఈ ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి. -
నాకో టైమింగ్ ఉంటుంది.. సితార తాట తీసేస్తది : మహేశ్ బాబు
Unstoppable With Mahesh Babu Grand Finale Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్స్టార్ మహేశ్బాబు చివరి ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య అన్స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్కు ఎండ్ కాండ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్ల మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. 'ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతనే మహేశ్'.. అంటూ బాలయ్య తనదైన స్టయిల్లో మహేశ్ను ఆహ్వానించారు.ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ ..తాట తీసేస్తది అంటూ మహేశ్ నవ్వులు పూయించాడు.ఓ సారి కేబీఆర్ పార్కుకి వాకింగ్కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదంటూ సీక్రెట్ రివీల్ చేశాడు.మొత్తంగా ఆహా అనిపించేలా ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఉండనుంది స్పష్టమవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
నటుడు శ్రీతేజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
ఆచార్య : 'సానా కష్టం' అంటూ చిరు డ్యాన్స్
Megastar Chiranjeevi Acharya Movie Saanakastam Song Promo Released: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’.చిరు సరసన కాజల్ అగర్వాల్ నటించింది. రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆచార్య టీం ప్రమోషన్స్ను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’అనే లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. 'సానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..' అంటూ ఈ పాట సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో లిరికల్ సాంగ్ను రేపు(సోమవారం)ఉదయం రిలీజ్ చేయనున్నారు. -
టీమిండియా 29 ఏళ్ల దాహం తీరేనా.. దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయంపై ప్రోమో అదుర్స్
India Tour of South Africa: Star Sports Launched Promo: మూడు టెస్ట్ల సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్న కోహ్లీ సేనను ఉత్సాహపర్చేందుకు భారత క్రికెట్ జట్టు అఫిషియల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ‘First ka Thirst’ అంటూ సాగే ఈ ప్రోమోలో ఇంగ్లండ్(1971), పాకిస్థాన్(2004), ఆసీస్(2018) గడ్డలపై టీమిండియా సాధించిన మొదటి సిరీస్ విజయాలకు సంబంధించిన దృశ్యాలను చూపించిన స్టార్ స్పోర్ట్స్.. భారత క్రికెట్ జట్టుకు ఆల్ ద బెస్ట్ చెప్పింది. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ విజయం సాధించి 29 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆకాంక్షిస్తూ.. #BelieveinBlue అనే హ్యాష్ట్యాగ్ను రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తుంది. #FirstKaThirst begins as #TeamIndia looks for their maiden Test series victory in 🇿🇦 Do you #BelieveinBlue to create history?#SAvIND Test Series | Starts Dec 26 I Star Sports Network & Disney+Hotstar pic.twitter.com/PC8UEgI2cS — Star Sports (@StarSportsIndia) December 8, 2021 ఇదిలా ఉంటే, 1992 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా ఇంతవరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా నెగ్గలేకపోయింది. ఇటీవలి కాలంలో విదేశీ గడ్డలపై అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. ఈ సారి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని భావిస్తుంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం ఏడు టెస్ట్ సిరీస్లు (దక్షిణాఫ్రికా గడ్డ మీద) జరగ్గా.. ఒక్క సిరీస్ను మాత్రమే టీమిండియా డ్రా చేసుకోగలిగింది. ఇక, ప్రస్తుత సిరీస్ విషయానికొస్తే.. తొలి టెస్ట్ డిసెంబర్ 26న, రెండో టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్లో ఆఖరుదైన మూడో టెస్ట్ జనవరి 11న జరగనున్నాయి. చదవండి: భారత హాకీ జట్టులో కరోనా కలకలం.. -
భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే
India Vs Pakistan Match Promo Released By ICC: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్కు సంబంధించిన ప్రోమోని ఐసీసీ ఇవాళ ఉదయం ట్విటర్ వేదికగా విడుదల చేసింది. ఈ మ్యాచ్ కోసమే ఐసీసీ ఈ వీడియోను ప్రత్యేకంగా రూపొందించింది. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. The world is watching. Tonight in Dubai, India and Pakistan go toe-to-toe.#INDvPAK | #T20WorldCup pic.twitter.com/ynIzBry0ha — ICC (@ICC) October 24, 2021 'టుడే ఈజ్ బిగ్ డే' అనే టైటిల్తో మొదలయ్యే ఈ వీడియో.. ఇండియా, పాకిస్థాన్, రైవల్రీ, ప్యాషన్, ప్రెషర్ అనే పదాలతో రూపొందించబడి, 'ద వరల్డ్ ఈజ్ వాచింగ్ యు' అనే టైటిల్తో ముగుస్తుంది. గతంలో జరిగిన మ్యాచ్లకు సంబంధించిన క్లిప్పింగ్స్తో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలు, అభిమానుల కోలాహలంతో రూపొందించిన ఈ ప్రోమో వీడియో చూస్తున్నంత సేపు సగటు క్రికెట్ అభిమాని రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే. చదవండి: భారత్-పాక్ మ్యాచ్పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు -
భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై
-
భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై
సాక్షి, ముంబై: హిందీ పాపులర్ రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లేటెస్ట్ సీజన్లో బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ తన యాంకరింగ్తో అభిమానులకు ఆకట్టుకుంటున్నారు. గణేష్ చతుర్ధి సందర్భంగా ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ సెస్సేషన్గా నిలవనుంది. హాట్లోసీట్లో ఉన్న అమితాబ్కు భర్త రణవీర్ సింగ్పై దీపికా ఫిర్యాదు చేయడం, ఈ సందర్భంగా దీపికా దంపతులతో బిగ్బీ చేసిన సందడి హైలెట్గా నిలిచింది. చదవండి : Chiranjeevi Sarja Son: బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం ఈ కార్యక్రమంపై ప్రోమోల మీద ప్రోమోలను విడుదల చేసింది సోనీ టీవీ. లేటెస్ట్ ప్రోమోలో తన భర్త రణ్వీర్ సింగ్ ఫిర్యాదు చేసింది దీపిక. బ్రేక్ఫాస్ట్ చేసి పెడతానని ప్రామిస్ చేసిన రణవీర్ ఇంతవరకు ఆ పనిచేయలేదంటూ గోముగా ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రణవీర్ను లైన్లోకి తీసుకొచ్చిన అమితాబ్ ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా వంట చేయలేదటగా అంటూ మరింత క్రేజ్ పెంచారు. దీంతో అమితాబ్ జీకి నా విషెస్ చెప్పమంటే.. నామీదే కంప్లైంట్ చేస్తావా అంటూ రణవీర్ అలిగాడు. చివరలో తన ఒడిలో కూర్చొ బెట్టుకుని ఆమ్లెట్ తినిపించమని అమితాబ్ చెప్పారంటూ ప్రేక్షకులను రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లబోతున్నాడు రణవీర్. చదవండి: కేబీసీలో దీపికా, ఫరా సందడి మామూలుగా లేదుగా! పండుగ సందర్భంగా స్పెషల్ ఎడిషన్తో సందడి చేసే షో నిర్వాహకులు తాజాగా దీపికా, ఫరా ఖాన్ను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫరా, దీపికా అల్లరితోపాటు, కొన్ని ఎమోషనల్ సంగతులను కూడా ప్రేక్షకులకు వడ్డించనున్నారు. దీంతోపాటు ఇండియన్ ఐడల్ సింగర్స్ తమ పాటలతో చేసిన సందడి షోకు మరింత ఎట్రాక్షన్గా నిలనుంది. చదవండి : కోటి రూపాయలను తలదన్నే కథ View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
పీపుల్స్ సీఎం
-
ప్రజల హృదయాల్లో చెరగని రూపం
-
బిగ్బాస్ దివితో రక్షాబంధన్ స్పెషల్ ప్రోమో
-
బిగ్బాస్ 5 తెలుగు: ప్రోమో వచ్చేసింది, రంగంలోకి నాగ్
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్బాస్ తెలుగు సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టార్మా బిగ్బాస్ సీజన్ 5 ప్రోమోను విడుదల చేసింది. త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ 5 లోగోను విడుదల చేసిన నిర్వహకులు హీరో నాగార్జున నటించిన బిగ్బాస్ 5 ప్రోమోను ప్రోమోను రిలీజ్ చేశారు. అంటే.. ఈ ప్రోమో చూస్తుంటే సారి కూడా నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించనున్నట్లు స్పష్టం అయ్యింది. ‘బోర్డమ్కు చెప్పేయ్ గుడ్బై.. వచ్చేసింది బిగ్బాస్ తెలుగు సీజన్ 5’ అంటూ నాగార్జున సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. దీనితో మొదటి నుంచి ఈ సీజన్ హోస్ట్ ఎవరన్న దానిపై ఉన్న సస్పెన్స్కు ఈ ప్రోమోతో తెరపడింది. కాగా ఈ ప్రోమోలో నాగ్ అందరితో చిందులేస్తూ చెప్పే మాటలు బుల్లితెర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. చెప్పాలంటే ఈ ప్రోమోతో బిగ్బాస్ను క్రేజ్ను మరింత పెంచేశాడు నాగ్. కాగా ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ నిర్వాహకులు బిగ్బాస్ సీజన్ 5 లోగోను విడుదల చేసిన సంగతి తెలిసందే. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే ఈ సారి కూడా బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. అందులో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. -
నేను అందుకే డైరక్టర్గా సినిమాలు తీయను: మోహన్ బాబు
-
జనహృదయ నాయకుడు ప్రోమో
-
వైరల్ : ముమైత్ఖాన్పై సీరియస్ అయిన ఓంకార్
బుల్లితెరపై యాంకర్గా ఓంకార్కు ప్రత్యేక స్థానం ఉంది. తనదైన స్టైల్తో షో టీఆర్పీ రేటింగ్స్ పెంచడంలో ఓంకార్ ముందుంటారు. ప్రస్తుతం ఓ బుల్లితెరపై ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకు ఓంకార్ హోస్ట్గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఓ గొడవలో షో జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్ ఖాన్కు ఓంకార్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఏమైందంటే..జడ్జిమెంట్ టైంలో ఓ కంటెస్టెంట్కు, ముమైత్ ఖాన్కు గొడవ జరుగుతుంది. దీంతో కంటెస్టెంట్ పైకి ముమైత్ గట్టిగా అరుస్తుండటంతో ఎందుకు సీరియస్ అవుతున్నారు అంటూ ఓంకార్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముమైత్ తగ్గకపోగా, ఓంకార్పై కూడా వేలు చూపిస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటనతో సీరియస్ అయిన ఓంకార్..మీరు మీరు గొడవపడుతున్నప్పుడు నన్నెందుకు పాయింటౌట్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్తో ఏం చెయ్యాలో తెలియక ముమైత్ సైలంట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ ప్రోమోపై సోషల్ మీడియాలో పలు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. చదవండి : అందరు చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్కు తీవ్ర గాయం! -
ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్కు తీవ్ర గాయం!
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ తెలుగునాట సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేకాక కంటెస్టెంట్లు సైతం సినిమాల్లో పలు పాటలకు చిందేస్తున్నారు. ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ.. ప్రస్తుతం 13వ సీజన్ను నిర్వహిస్తుంది. అయితే తాజాగా షోలో డ్యాన్స్ చేస్తూ ఓ లేడీ కంటెస్టెంట్ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలె విడుదలైంది. ఇందులో..డ్యాన్స్ చేస్తూ ఓ కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ స్టేజ్ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. డ్యాన్స్ చేస్తూ కిందకు దూకే ఓ షాట్లో కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తలకు తీవ్రంగా దెబ్బ తగిలి రక్తస్రావమైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నిజంగానే ప్రమాదమా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది తెలియాలంటే మాత్రం వచ్చే వారం ఏప్రిల్14న విడుదలయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సి ఉంది. చదవండి : ఈ బుల్లితెర జంట విడిపోనుందా? చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
మీ లైఫ్ను మార్చే మొదటి ప్రశ్న..డోంట్ మిస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేయబోతున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. త్వరలోనే జెమిని టీవీలో ఈ షో ప్రసారం కానుంది. శుక్రవారం ఈ షోకి సంబంధించి మరో ఇంపార్టెంట్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చార్మినార్ గురించి టూరిస్టులకు చెబుతూ ఓ గైడ్..ఇది చార్మినార్...దేశం నాలుగు దిక్కుల నుండీ టూరిస్టులు వస్తుంటారు.. అందుకే దీనిని చార్మినార్ అంటారు అని చెప్పగా, ఎందుకు కట్టారని టూరిస్ట్ ప్రశ్నించగా..రోడ్లు విశాలంగా ఉన్నాయి...అందుకే కట్టేశారని గైడ్ సమాధానం చెప్తాడు. దీంతో వెంటనే అక్కడున్న ఆటో డ్రైవర్ వచ్చి..‘400 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి వచ్చి తగ్గిపోయింది.. దానికి గుర్తుగా చార్మినార్ కట్టారు’అని సమాధానం చెప్తాడు. దీంతో షాక్ అయిన టూరిస్ట్..ఇన్ని తెలిసి ఆటో డ్రైవర్గా ఉన్నావేంటి అని అడగ్గా..బతకాలి కదా అందుకే ఇలా అని చెప్పగా..మరి గెలుపుని వెతకాలి కదా అంటూ ప్రోమో చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ షోఎప్పుడు మొదలు కానుంది, కంటెస్టెంట్స్ ఎవరనేది మాత్రం ప్రకటించకలేదు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ లో మొదటి ప్రశ్న ఎప్పుడనేదానిపై క్లారిటీ ఇచ్చారు. మార్చి 29న రాత్రి గం. 8.15 నిమిషాలకు.. మీ లైఫ్ ని మార్చే మొదటి ప్రశ్న అడిగేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారు. సో డోంట్ మిస్. ఈ ప్రోగ్రాం ఏప్రిల్ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. చదవండి : భార్యకు ఖరీదైన గిఫ్టిచ్చిన ఎన్టీఆర్! ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే -
‘మాస్టర్’ రొమాంటిక్ ప్రోమో : మాలవిక మాయ
సాక్షి, హైదరాబాద్: తమిళహీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ 4వ ప్రోమోను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. విజయ్తో పాటు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం మరింత ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా అందం వాడి చూపేరా అనే పాట యువతను ఉర్రూతలూగించేలా, అద్భుతంగా ఉంది. అలాగే ఈ లవ్లీ, రొమాంటిక్ ప్రోమోలో కాలేజీ లెక్చరర్గా మాలవికా మోహనన్ గ్రేస్ లుక్లో అలరిస్తోంది. మరి తన అందంతో ఏం మాయ చేస్తుందో చూడాలి. తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ప్రోమోలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ టీజర్ ను సుమారు 5 లక్షల మంది వీక్షించారంటేనే మాస్టర్ మ్యాజిక్ను ఊహించుకోవచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఉత్కంఠ భరిత సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం నుంచి తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మాత్రమే ఉండాలన్న కేంద్రం సూచన మేరకు సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దాంతో విజయ్ సినిమా ఓపెనింగ్స్పై సందేహాలు నెలకొన్నాయి. Small break for the mass promos. Here's a lovely romantic promo from #Master this time.. @actorvijay @MalavikaM_ A @Dir_Lokesh film .. @XBFilmCreators @Lalit_SevenScr @Jagadishbliss @SonyMusicSouth #మాస్టర్ pic.twitter.com/PXVOM3zGlj — Mahesh Koneru (@smkoneru) January 8, 2021 -
కొత్త వరుడు కొంటె పోరడు
-
బిగ్బాస్: శ్రుతి మించిన రొమాన్స్
బిగ్బాస్... అక్కడ అనుక్షణం ఎమైనా జరగొచ్చు. చివరి వరకు ఉంటారనుకున్న వారు మధ్యలోనే వెళ్లిపోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన వారు ఫైనల్కి రావొచ్చు. కంటెస్టెంట్ల ప్రవర్తన వారి ఆటను పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఇక వివిధ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్బాస్ షోలలో హిందీ బిగ్బాస్కు క్రేజ్ ఎక్కువ. అక్కడ కంటెస్టెంట్లు, టాస్కులు, ఆట విధానం ఒకింత భిన్నంగా ఉంటాయి. ఇంటి సభ్యుల ప్రవర్తన, గొడవలు కూడా వేరే లెవల్లో ఉంటాయి. హిందీలో ఇప్పటి వరకు 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రస్తుతం 14 వ సీజన్ కొనసాగుతుంది. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ షోలో గత సీజన్లలో పాల్గొన్న, గెలిచిన ప్రముఖ వ్యక్తులను తీసుకు రావడం విశేషం. చదవండి: బిగ్బాస్: మాస్టర్ను ఇంటికి పంపించాల్సిందే.. 34 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బిగ్బాస్లో అయిదవ వారం కొనసాగుతోంది. ఇంట్లో ప్రస్తుతం ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ప్రోమో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. అసలే హిందీ బిగ్బాస్లో కంటెస్టెంట్ల మధ్య సన్నిహిత్యం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల్లో కొంతమంది మరింత రెచ్చిపోయారు. అందులోనూ ఈరోజు రేపు (శని, ఆది) వీకెండ్ కావడంతో ఫన్తోపాటు ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. శనివారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్ ప్రోమోలో జాస్మిన్ బాసిన్-అలీ గోని, అభినవ్ శుక్లా- రుబినా దిలైక్, నిక్కి తంబోలి- జాన్ కుమార్ సాను, ఐజాజ్ ఖాన్- పవిత్ర పునియా జంటలుగా ఏర్పడి ఒకరికొకరు నువ్వానేనా అన్నట్లు ప్రవర్తించారు. చదవండి: ప్రేమలో ఉన్నట్లు చెప్పిన బిగ్బాస్ ఫేం శనివారం నాటి ఎపిసోడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ వచ్చి ఇప్పటి నుంచి బిగ్బాస్ ఇంట్లో సెలబ్రెషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జాస్మిన్, అలీ హిందీ పాటకు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అభినవ్ తన భార్య రుబినాతోకలిసి హిట్ సాంగ్ తుహైబివి నెం1 అనే పాటను ఆలపించారు. అంతేగాక రియాలిటీ షోలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. అనంతరం షారూఖ్ ఖాన్ పాటకి రాహుల్ వైద్య డ్యాన్స్ చేశాడు. ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ సినిమా నుంచి ఐ యామ్ ది బెస్ట్ పాటకు స్టెప్పులువేశాడు. అంతేగాక ఈరోజు ఎపిసోడ్లో ఓ గెస్ట్ రానున్నారు. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన రెమో డి సౌజాతో పాటు సల్మాన్ యూసుఫ్, పునిత్ పాథక్, షాకి మోహన్..వీరంతా ఇంటి సభ్యులతో కలిసి హౌజ్లో సందడి చేయనున్నారు. చదవండి: నేను ప్రెగ్నెంట్ కాదు: బిగ్బాస్ నటి Promo precap pic.twitter.com/vzZwzvtaaO — SuzyCrxn (@suzybb14) November 6, 2020 Promo precap 2 pic.twitter.com/qitkahgMyi — SuzyCrxn (@suzybb14) November 6, 2020 -
లక్ష్మి నుంచి మరో ప్రోమో
అక్షయ్కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లక్ష్మి సినిమా మరో మూడు రోజుల్లో (నవంబర్ 9) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హీరో అక్షయ్ కుమార్, యూనిట్ సినిమా ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్నారు. కాంచన చిత్రం లక్ష్మి పేరుతో హిందీలో తెరకెక్కింది. ఈ సినిమా డిస్నీ హాట్స్టార్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అక్షయ్ సరసన కియరా అద్వానీ నటిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను అక్షయ్ కుమార్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. అక్షయ్ ఒక మహిళను కొట్టడంతో ఈ వీడియో మొదలవుతుంది. View this post on Instagram Dekhiye iss ajeeb family ko #Laxmii mein, aapki family ke saath 9th November ko! #ThreeDaysToLaxmii #FoxStarStudios #DisneyPlusHotstarMultiplex #YehDiwaliLaxmiiWali @kiaraaliaadvani @offl_lawrence @shabskofficial @tusshark89 @foxstarhindi @disneyplushotstarvip #CapeOfGoodFilms #ShabinaaEntertainment #TussharEntertainmentHouse @zeemusiccompany A post shared by Akshay Kumar (@akshaykumar) on Nov 5, 2020 at 9:59pm PST అనంతరం గట్టిగా అరుస్తూ ఇక్కడి నుంచి పో అంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఆ మహిళ కొట్టావు అంటూ అక్కడి నుంచి పాకుతూ వెళుతుంది. ఈ వీడియోలో అక్షయ్ చూడటానికి చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. కాంచనా సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్ష్మి సినిమాపై కూడా ప్రస్తుతం భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేసిన అక్షయ్ చూశారుగా ఈ విచిత్రమైన కుటుంబాన్ని మీరంతా 9న చూడండి అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: అక్షయ్ను టార్గెట్ చేసిన నెటిజన్లు..తీరు మార్చుకోరా? -
‘బిగ్బాస్’లో మిర్చి మంట.. టార్గెట్ అతడే
బిగ్ బాస్ సీజన్ 4 చూస్తుండగానే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. గంగవ్వ హఠాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోవడం, సుజాత ఎలిమినేషన్తో ఐదోవారానికి ఎండ్ కార్డ్ పడింది. ఇక ఆరోవారం హౌస్లో వాతావరణం మరింత వేడెక్కేలా ఉంది. నామినేషన్ డే (సోమవారం) రావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ‘ఘూటు’గా సాగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. నామినేషన్ కోసం ఘూటుగా ఉండే ఎండు మిర్చిల దండలను పంపిన బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ మధ్య గొడవల ఘూటును కూడా మరింత పెంచాడు. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఎక్కువగా మెహబూబ్ బుక్కయినట్లు తెలుస్తోంది. గతవారం హోటల్ టాస్క్ లో అతను చేసిన రచ్చకు హోటల్ సిబ్బంది ‘ఘూటు’గా రివేంజ్ తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇంటి కెప్టెన్ కావడంతో సోహైల్ ఈ వారం బతికిపోయాడు. లేదంటే అతను కూడా మెహబూబ్లాగా బుక్కయ్యేవాడేమో. ఇక అభిజిత్, అఖిల్ మధ్య మరోసారి వార్ జరిగినట్లు తెలుస్తోంది. ఎండుమిర్చిల దండలను ఒకరిపై మరొకరు వేసుకున్నారు. కెప్టెన్సీ గేమ్లో సంచాలకుడిగా వ్యవహరించిన అభిజిత్ తీరును తప్పుబడుతూ అఖిల్ నామినేట్ చేయగా.. అభి కూడా అదే తరహా రీజన్ చెబుతూ.. అఖిల్ను నామినేట్ చేశాడు. ఇక మరోసారి మోనాల్ కంటతడి పెట్టింది. తన గురించీ ఎవరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా సమస్యలను నేను పరిష్కరించుకోగలనని ఏడుస్తూ చెప్పింది. ఇక అరియన కూడా మెహబూబ్ పై విమర్శలు చేసింది. దానికి మెహబూబ్ కూడా ఘాటుగానే స్పందించినట్టు చూపించారు. దివి గత గొడవలను గుర్తు చేసుకుంటూ.. దెబ్బలు తగిలించుకోవడానికి రాలేదంటూ హౌస్మేట్స్పై మండిపడింది. మోనాల్ దండవేస్తుంటే అసహనంతో తెంచి పడేసింది. ఇక సోహెల్ కి కూడా కుమార్ సాయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వేలు దించి మాట్లాడు అంటూ సోహెల్ కుమార్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ లో మిర్చి ఘాటు గట్టిగానే తగిలినట్లుంది. -
లైఫ్ విత్ లక్ష్మీ
నటిగా, నిర్మాతగా, టాక్ షోకి హోస్ట్గా.. ఏం చేసినా లక్ష్మీ మంచు ఫుల్ మార్కులు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఓ కొత్త షోను ప్రకటించారు. గురువారం లక్ష్మీ మంచు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె తాజా షో ‘కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు’ని ప్రకటించారు. ఈ షోలో ఆమె íసినిమా, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్ తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్య్వూ చేయనున్నారు. ఈ షోకి సంబంధించి లక్ష్మీ విడుదల చేసిన ప్రోమోలో రాజమౌళి, తాప్సీ, సెంథిల్ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాశ్ అమృతరాజ్ తదితర ప్రముఖులు కనిపిస్తున్నారు. ఈ షో త్వరలోనే ప్రారంభం కానుందని లక్ష్మీ తెలిపారు. సౌత్ బే సమర్పణలో ఈ షో రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. లాక్డౌన్లో ‘లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు’ పేరుతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు లక్ష్మీ. ఈ లైవ్కి మంచి ఆదరణ లభించింది. అలాగే ఇప్పుడు ‘కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు’ షోని అందర్నీ అలరించేలా నిర్వహించడానికి లక్ష్మీ రెడీ అవుతున్నారు. -
కొత్త షో అనౌన్స్ చేసిన మంచు వారమ్మాయి..
‘మేము సైతం’ షోతో బుల్లితెరలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మీ ప్రసన్న. టాక్ షోస్, రియాలిటీ షోలతో లక్ష్మీకి ఫాలోయర్స్ బాగానే పెరిగిపోయారు. గతేడాది కూడా ఓ బోల్డ్ షోను హోస్ట్ చేశారు మంచు లక్ష్మీ. దీని ద్వారా స్టార్స్ అందరి బెడ్రూమ్ ముచ్చట్లు బయటికి తీసుకొచ్చారు. ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అంటూ మంచు లక్ష్మీ చేసిన ఈ షో బాగానే పాపులర్ అయింది. ఇక లాక్డౌన్ సమయంలో కూడా 'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' పేరుతో పలువురు సినీ, పొలిటికల్ సెలబ్రిటీలతో ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 8న మరో కొత్త షోకు శ్రీకారం చుట్టారు మంచు లక్ష్మీ. ఇందుకు సంబంధించిన ప్రోమోతో తన కొత్త షోను అనౌన్స్ చేశారు మంచు లక్ష్మీ. (చదవండి: ‘మళ్లీ జన్మలోనూ నా కూతురిగానే పుట్టాలి’) #ComingBackToLifeWithLakshmi It’s a series of positive,forward-looking conversations with celebrated personalities across the globe, Hosted by @LakshmiManchu Presented by @RanaDaggubati , the digital series will air on @SouthBaySound #ComeBackToLife pic.twitter.com/WiL21R8IZI — Lakshmi Manchu (@LakshmiManchu) October 8, 2020 సౌత్ బే సమర్పిస్తోన్న ఆ షో పేరు 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు'. ఇది కూడా లాక్డౌన్ సమయంలో వచ్చిన 'లాక్డ్ అప్ విత్ లక్ష్మీ మంచు' తరహాలోనే ఉండబోతుంది. ఈ షోలో ఆమె ఫిలిమ్స్, స్పోర్ట్స్, ఫ్యాషన్, ఫుడ్.. తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు లక్ష్మీ ఫ్రెండ్ తాప్సీ పన్ను.. సెంథిల్ రామమూర్తి, సానియా మీర్జా, ప్రకాష్ అమృతరాజ్, శంతను, నిఖిల్, బిభు మొహాపాత్ర, పూజా ధింగ్రా, అన్నా పొలీవియౌ తదితరులు కనిపిస్తున్నారు. సౌత్ బే ప్రెజెంట్ చేస్తున్న 'కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మీ మంచు' షో త్వరలోనే ప్రారంభం కానుంది. -
బిగ్బాస్: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ
వీకెండ్లో(శని, ఆది) సరదాగా ఆట, పాటలతో ఎంజాయ్ చేసిన బిగ్బాస్ ఇంటి సభ్యులు సోమవారం రాగానే మళ్లీ గేమ్లోకి ఎంటర్ అయ్యారు. మొదటి వారం పూర్తిచేసుకున్న బిగ్ బాస్హౌజ్ హౌజ్ సోమవారంతో రెండో వారంలోకి ప్రవేశిస్తోంది. ఆరంభం నుంచే బిగ్బాస్ సీజన్ 4 చప్పగా సాగుతోందని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రోమోల రూపంలో మాత్రం నెటిజన్లలో హైప్ క్రియెట్ చేస్తున్నాడు బిగ్బాస్. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే బిగ్బాస్ హౌజ్లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పటికే కంటెస్టెంట్లలో ఒకరికొకరికి మధ్య సరైన అవగాహన లేదన్న విషయం కొట్టొచ్చినట్లు కన్పిస్తుండగా.. దీన్ని ఆసరాగా చేసుకున్న బిగ్బాస్ మరోసారి వారి మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధపపడ్డాడు. (హారిక విష సర్పం, అఖిల్ దున్నపోతు..) సోమవారం బిగ్బాస్ తమ కంటెస్టెంట్లకు ఓ టాస్క్ను ఇచ్చాడు. ఇంటిలోపల ఓ పడవను ఏర్పాటు చేసి అందులోకి అందరిని ఎక్కమని చెప్పాడు. సభ్యులందరూ పడవ ఎక్కిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దిగేందుకు వీల్లేదని తెలిపాడు. పడవ తీరం చేరుకున్నాక హారన్ కొట్టిన వెంటనే ఓ ప్యాసింజర్ ఖచ్చితంగా దిగాలని నిబంధన పెట్టాడు. అలా ఎవరైతే పడవ నుంచి దిగుతారో వారు ఈ వారం నామినేషన్ అవుతారని పేర్కొన్నాడు. దీంతో ఇంట్లోని వారిలో ఎవరిని పడవ నుంచి దింపేయలాన్న సందేహం మొదలైంది. అయితే ముందు నేనే దిగి వెళ్లి పోతానంటూ గంగవ్వ సిద్ధపడంది. దీంతో గంగవ్వను ఆపేందుకు మిగిలిన వారందరరూ ప్రయత్నినట్లు కన్పిస్తోంది. మధ్యలో నోయల్ కల్పించుకొని.. అందరితో మంచి రిలేషన్ ఉన్నందున ఆ బంధం తెగిపోవద్దని అలా దిగిపోతానంటుదని అంటున్నాడు. అయితే ఎవరిని ఉద్ధేశించి ఆ మాటలు అన్నాడో పక్కగా తెలియదు. (బిగ్బాస్: నేడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ) Boat journey simple ga undabothunda..enthamandi untaru? enthamandi digutharu? Lets wait and watch!!#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Er1OPgUAx6 — starmaa (@StarMaa) September 14, 2020 మరోవైపు మొదటి నామినేషన్లో భాగంగా డైరెక్టర్ సూర్యకుమార్ ఇంటి నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. అలా సూర్య వెళ్లాడో లేదో ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సాయి అనే కుర్రాడు అడుగు పెట్టాడు. దొంగలా హౌజ్లోకి అర్థరాత్రి ప్రవేశించిన కుమార్ సాయి ఇంటి సభ్యులందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనున్నాడు. అయితే ఈ ప్లాన్ బెడిసి కొట్టి దొంగ అనుకొని ఇంటి సభ్యులు తనను కొట్టే అవకాశం ఉందని భయతో కుమార్ సాయి బిగ్బాస్తో విన్నపించుకున్నాడు. మరి సాయి కుమార్ ఇంట్లో వాళ్లతో ఎలా కలవనున్నాడు. బోట్ టాస్క్లో ఎంత మంది చివరి వరకు ఉంటారు, ఎవరు దిగిపోయి నామినేషన్లో నిలిచారో తెలుసుకోవాలంటే ఈ రోజు జరిగే బిగ్బాస్ చూడాల్సిందే. (మైండ్ బ్లాక్ చేసిన దివి, దేవి) Wild card entry #KumarSai house enter ayyadu...Housemates reaction chudali ela untundo#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/eN0mx2xS7q — starmaa (@StarMaa) September 14, 2020 -
వినోదాల బిగ్బాస్ 4
‘‘వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతి పెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్బాస్.. లె లుగు టెలివిజన్లో అత్యుత్తమమైన రేటింగ్స్ సాధించిన బిగ్బాస్ నాలుగో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది’’ అని స్టార్ మా ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మూడు సీజన్లతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన బిగ్బాస్ గతంలో కంటే ఈసారి మరింత ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. బిగ్బాస్ 3వ సీజన్కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన హీరో నాగార్జున 4వ సీజన్కి కూడా హోస్ట్గా వ్యవహరిస్తారు. వరుసగా రెండోసారి బిగ్బాస్కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున మాట్లాడుతూ– ‘‘బిగ్బాస్ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్కి రావడం చాలా సరదాగా అనిపించింది. గత సీజన్ గొప్ప విజయం అందుకుంది. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత వినోదంతో పాటు సర్ప్రైజ్లు కూడా అందించే ప్రయత్నం చేయబోతున్నాం’’ అన్నారు. కాగా యంగ్, మిడిల్, ఓల్డ్ గెటప్స్లో నాగార్జున కనిపించిన 4వ సీజన్ ప్రోమోకి మంచి స్పందన లభించింది. -
వైరల్: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక
ఇప్పటికే దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగగా త్వరలోనే మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి పనులు మొదలవ్వనున్నాయి. కొణిదెల నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక తన మెడలో కోరుకున్న వరుడితో మూడు ముళ్లు వేయించుకోనున్నారు. తన చేయి పట్టి ఏడడుగులు నడవబోయే ఆ పెళ్లి కొడుకు గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డ అని సోషల్ మీడియాలో ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ప్రేమ జంట ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ ఓ షోలో పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక తెగ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె తండ్రి నాగబాబే జడ్జి కావడం విశేషం. వినాయక చవితి సందర్భంగా "బాపు బొమ్మకు పెళ్లంట" అని ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. (హ్యాపీ బర్త్డే.. లవ్ : నిహారిక) దీనికి సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో నిహారిక పల్లకి నుంచి దిగారు. ఎప్పుడూ పంచ్లతో ఎదుటివారిని మాట్లాడకుండా చేసే నిహారిక కాబోయే భర్త గురించి అడిగేసరికి సిగ్గుల మొగ్గయ్యారు. భర్తతో కలిసి ప్రోగ్రామ్కు విచ్చేసిన యాంకర్ అనసూయ.. నిహారికకు ముందస్తు కానుకను కూడా అందించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్తో పాటు బిగ్బాస్ కంటెస్టెంట్ బాబా భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఇదిలా వుంటే నిహారిక, చైతన్యల నిశ్చితార్థం నేడు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయి నిహారిక కొత్త పెళ్లి కూతురిగా తయారైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (కుమారి శ్రీమతి కానుంది) -
బిగ్బాస్ 4 ప్రోమో.. గోపి ఎవరు?
హైదరాబాద్: బిగ్బాస్, మా టీవీలో ప్రసారమైన ఈ షో ఎంతగా ప్రేక్షకుల ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మూడు సీజన్లను ఈ షో పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాల్గవ సీజన్ మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మరో ప్రోమో విడుదల అయ్యింది. మూడవ సీజన్కు హోస్ట్గా చేసిన కింగ్ నాగార్జునే నాలుగవ సీజన్కు కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు విడుదల చేసిన బిగ్బాస్ 4 ప్రోమోలో నాగార్జున స్టైలిష్గా కనిపించగా ప్రస్తుతం విడుదల చేసిన ప్రోమోలో ఆయన ఓల్డ్ లుక్లో ఒక బయోస్కోప్ పట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గోపి అని పిలుస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంతకీ అసలు గోపీ ఎవరు? ఈసారి బిగ్బాస్ తీసుకురాబోతున్న ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అని అంతా ఆలోచిస్తున్నారు. సీజన్ 3లో నాగార్జున పండు అంటూ ఒక కోతి బొమ్మను వేలుకు పెట్టుకొని చాలా విషయాలు దాని ద్వారా చెప్పేవారు. ఈ బొమ్మ తరువాత ఎంతో ఆదరణ పొందింది. ఎంతో మంది దీనిని కొన్నారు కూడా. అయితే ఈ సారి గోపి అంటూ ఎవరు రాబోతున్నారో చూడాలి. బిగ్బాస్ 4 ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. చదవండి: బిగ్బాస్ 4: కెమెరా, యాక్షన్ వాట్ ఏ వావ్.. -
‘గరం గరం వార్తల’ తో మీ ముందుకు సత్తి!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్. ఇప్పుడు సాక్షి టీవీ ద్వారా ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాంతో మన ముందుకు రానున్నాడు. ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్తి స్టైల్లో అదిరిపోయేలా ఉన్న వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. బిత్తిరి సత్తి, సాక్షి టీవీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ‘గరం గరం వార్తలు’ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని సెలబ్రేట్ చేస్తూ విడుదల చేసిన తొలి ప్రోమోకు కూడా మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. -
రంగంలోకి దిగుతున్నా!
ఓ పాతిక కిలోల వంకాయలు. గుడ్లు, బియ్యం.. ఇలా కిరాణా సామాన్లను బిజీబిజీగా కొనుగోలు చేస్తున్నారు నాగార్జున. ఇవన్నీ వాళ్ల ఇంటికోసం కాదు.. త్వరలో ప్రారంభం కానున్న బిగ్బాస్ హౌస్లోకి. ‘బిగ్బాస్’ సీజన్3కి నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ‘బిగ్బాస్’ బృందం. ‘ఈ సీజన్లోకి నేను రంగంలోకి దిగబోతున్నాను’ అంటూ నాగార్జున పలికే డైలాగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రారంభం కానున్న మూడో సీజన్ గురించి స్టార్ మా ప్రతినిధి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం. నాగార్జునగారు తోడవ్వడం ఈ సీజన్కు కొత్త ఫ్లేవర్ వస్తుందనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కొత్త కొత్త విషయాలతో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. అలాగే టెలివిజన్ కూడా నాకు కొత్తేం కాదు. ఆల్రెడీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేసి ఉన్నాను. ‘బిగ్బాస్’ అనేది కొత్త ఎక్స్పీరియన్స్. చాలా ఎగై్జటింగ్గా ఉంది’’ అన్నారు నాగార్జున. -
ప్రోమో వైరల్: కోహ్లి న్యూజిలాండ్ వస్తున్నాడు..
హైదరాబాద్: స్టార్ స్పోర్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార విస్తరణతో పాటు అభిమానులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో స్టార్ సంస్థలు ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు చానల్ ప్రారంభించింది. ఇప్పటికే ప్రో కబడ్డీ ఆరో సీజన్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్.. క్రీడా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు మరో ముందుడుగేసింది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టీమిండియా న్యూజిలాండ్కు పయనమవనుంది. ఈ పర్యటనలో కివీస్తో కోహ్లి సేన ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. దీనిలో భాగంగా సిరీస్కు సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ స్పోర్స్ట్ విడుదల చేసింది. ‘కె అంటే కోహ్లి.. కోహ్లి న్యూజిలాండ్ వస్తున్నాడు. అప్పుడు తెలుస్తుంది నిజమైన కింగ్ ఎవరనేది’ అంటూ తెలుగులో సంభాషణలు ఉండటంతో తెలుగు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ప్రాంతీయ భాషలో క్రికెట్ కామెంటరీ వినబోతుండటం ఆనందంగా ఉందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మరోసారి రెచ్చిపోయిన కత్తి కత్రినా
సాక్షి, ముంబై: ‘మై నేమ్ ఈజ్ షీలా... షీలా కీ జవానీ...' అంటూ ఒకపుడు ఉర్రూతలూగించిన కత్తి లాంటి కత్రినా కైఫ్ మరోసారి రెచ్చిపోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ ఆమీర్ఖాన్ తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లోని ఒక సాంగ్లో ఈ బాలీవుడ్ హీరోయిన్ స్టెప్పులతో ఇరగదీసింది. ఒకప్పుడు గ్లామర్తో ఆకట్టుకున్న కత్రినా.. ఇపుడిక ట్రెండ్కి తగ్గట్టుగా డ్యాన్స్పై దృష్ టిపెట్టినట్టుంది. దీంతో ఈ సినిమాలో మరోసారి కత్రినా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవడం ఖాయమని సినీ విమర్శకులు చెబుతున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లో వేగం పెంచింది యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ సురైయా ప్రొమోని రిలీజ్ చేసింది. లెహెంగాలో కత్రినా చేసిన డ్యాన్సు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కానుంది. అబితాబ్ భట్టాచార్య గీతానికి, అజయ్ అతుల్ సంగీతానికి పోటీగా కత్రినా స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది. మరోవైపు విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దంగల్ నటి ఫాతిమా సనా షేక్ , ఇంగ్లీషు నటి లలోయిడ్ ముఖ్యపాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్లుక్లను ఇప్పటికే విడుదల చేశారు. కాగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ?rel=0 -
ఒక్కడి కల.. ఇండియాను ఏకం చేసింది
రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన తెల్లోళ్ల జెండాకు సలాం కొట్టాల్సిన పరిస్థితులు. అలాంటి సమయంలో ఒక్కడు.. ఒక్కే ఒక్కడు కన్నకల... దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. బ్రిటీషర్లే మన జెండాకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది. బాలీవుడ్లో ఈ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే గోల్డ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రొమో కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ‘మన జాతీయ గీతం వస్తోంది.. లేచి నిల్చొండి అంటూ బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా, జాతీయ గీతం బ్యాక్ గ్రౌండ్లో కనిపించి.. వినిపిస్తాయి. వెంటనే ‘అది మీకు ఎలాంటి భావన కలిగించింది?’ అన్న ఓ ప్రశ్న ఉద్భవిస్తుంది. ఒక్కడు కన్న కల మన జాతీయ గీతానికి బ్రిటీష్ వాళ్లు నిల్చునేలా చేసింది.. అంటూ టీజర్ ను చూపించారు. అక్కీ జాతీయ జెండాను చాటుగా బయటికి తీయటం, హకీ గేమ్ నేపథ్యంలో ఎమోషనల్గా టీజర్ను కట్ చేశారు. సచిన్ జిగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబోడుచుకునేలా ఉంది. 1948 లండన్ ఒలంపిక్స్లో భారత్ హకీలో గోల్డ్ పతాకం సాధించటం అన్న నేపథ్యంతో(కల్పిత గాథ) రీమా ఖగ్టీ డైరెక్షన్లో ‘గోల్డ్’ చిత్రం తెరకెక్కింది. అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, అమిత్ సద్, వినీత్ సింగ్, సంగీత్ కౌశల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గోల్డ్’ ఆగష్టు 15 2018న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ఒక్కడు.. ఒక్కే ఒక్కడు కన్నకల.
-
కంటికి కనిపించిందే నిజం కాదు!
అవును. కంటికి కనిపించేవన్ని నిజాలు కాదు. లోతుగా పరిశీలించేస్తేనే నిజం తెలుస్తుందని అంటున్నారు లోక నాయకుడు కమల హాసన్. త్వరలో రాబోతున్న తమిళ బిగ్ బాస్ రెండో సీజన్కు కూడా ఈ యూనివర్సల్ హీరోనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 2 మోషన్ పిక్చర్కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ రియాల్టీ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇప్పుడు ఇది వైరల్గా మారుతోంది. ఈ వీడియోలో.. ఓ ఆకతాయిలా కనిపించే కుర్రాడు... అకస్మాత్తుగా ఓ అమ్మాయిని ఢీ కొట్టి పరిగెత్తుకుంటుపోతాడు... చుట్టుపక్కన ఉన్నవారంతా తిట్టబోతుంటే... కమల్హాసన్ ఓ చిటికేసి ఆ సీన్ను పాజ్ చేస్తారు . కంటికి కనిపించేది నిజం కాదంటూ... వెనకాల ఏదో ఉంటుందంటూ కమలహాసన్ చెబుతారు. తీరా స్క్రీన్ మొదలైన వెంటనే ఆ కుర్రాడు ఓ పాపను ప్రమాదం నుంచి కాపాడడానికే అలా వెళ్తాడు. కంటికి కనపడకుండా ఉండే విషయాన్ని తెలుసుకుంటేనే నిజమేంటో అర్థమవుతుందని ముగింపునిస్తారు కమల్. వినూత్నంగా ఉన్న ఈ ప్రోమో కు మంచి స్పందన వస్తోంది. మరి బిగ్బాస్ సీజన్ 2 ను కూడా ఈ హీరో రక్తికట్టించేలానే ఉన్నారు. -
సాక్షి టీవీ 8వ వార్షికోత్సవం
-
ఆస్ట్రోనాట్గా అగ్రహీరో!
'చంద్రుడిపై మనిషి తొలిసారి అడుగుపెట్టినప్పుడు.. గుడ్డు నుంచి కోడిపిల్ల తొలిసారిగా పుట్టినప్పుడు సరికొత్త చరిత్ర నమోదైంది. అదేవిధంగా తొలిసారి సామాన్యులు బిగ్బాస్ షోలోకి రాబోతున్నారు. ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లేక మిస్టరీనా?' అంటూ సల్మాన్ ఖాన్ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. దేశంలో అత్యంత వివాదాస్పదమైన పాపులర్ టీవీ షో 'బిగ్బాస్' తాజా ప్రోమోలో ఆస్ట్రోనాట్గా సల్మాన్ కనిపించాడు. వ్యోమగామిగా కనిపిస్తూ.. బిగ్బాస్-10 షోలో తొలిసారిగా సెలబ్రిటీలు ఉండబోరని, మొత్తం సామాన్యులతో ఈసారి షో నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. మిడ్ సెప్టెంబర్లో కలర్స్ చానెల్లో ఈ షో ప్రసారం కానుంది. -
అజయ్ దేవ్గణ్ ప్రోమో కష్టాలు..
తెరపై వీరోచిత నటనా సామర్థ్యాన్నిప్రదర్శించే అజయ్ దేవ్గణ్కూ పాపం‘ప్రోమో’కష్టాలు వచ్చిపడ్డాయి. ఎలాంటి యాక్షన్ సినిమాల్లోనైనా నటించడమే చాలా తేలికని, సినిమాల ప్రోమోల్లో పాల్గొనడం కష్టమని అంటున్నాడు ఈ కండల వీరుడు. ప్రభుదేవా దర్శకత్వంలోని ‘యాక్షన్ జాక్సన్’ ప్రోమో కోసం వెళ్లిన చోటల్లా రోజంతా మీడియా ఇంటర్వ్యూలతో గడుపుతున్న అజయ్ దేవ్గణ్, ఈ వ్యవహారంతో విసుగెత్తినట్లే కనిపిస్తున్నాడు. ప్రతిచోటా అవే ప్రశ్నలకు, అవే సమాధానాలిస్తూ ప్రోమోల్లో పాల్గొనడం కంటే, నటించడమే సులువని మీడియా ఎదుటే వాపోయాడు. -
ఒక విలయం మిగిల్చిన నిశ్చబ్దం
-
ఇదా ఓ 12 ఏళ్ల చిన్నారికి మనమిచ్చే జీవితం?
-
దేశం కోసం ప్రాణలర్చించిన వీర జవాన్లుకు సాక్షి సలాం!
-
జాతర, పండుగ, ఉత్సవం, ఊరేగింపు
-
కమిట్మెంట్ ఉండాలే గానీ దుమ్ము దులపొచ్చు
-
అనుభవం కాదు... ఆలోచన కావాలి !
-
సంక్షేమంతో కూడిన అభివృద్ధికే నా ఓటు!
-
నువ్వు కావాలి..
-
ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బావుంటుందో...
-
రాజన్నపాట ప్రోమో