35 ఏళ్ల తర్వాత మరోసారి జతకడుతోన్న కమల్‌-మణిరత్నం | Kamal Haasan, Mani Ratnam Reunite After 35 Years | Sakshi
Sakshi News home page

Kamal Haasan-Mani Ratnam: 35 ఏళ్ల తర్వాత మరోసారి జతకడుతోన్న కమల్‌-మణిరత్నం

Nov 7 2022 10:00 AM | Updated on Nov 7 2022 10:00 AM

Kamal Haasan, Mani Ratnam Reunite After 35 Years - Sakshi

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ తన బర్త్‌ డే (నవంబరు 7) సందర్భంగా ఫ్యాన్స్‌కు సూపర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు కమల్‌హాసన్‌. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఇదే కావడం విశేషం. 1987లో వారిద్దరి కాంబోలో ‘నాయకన్‌’(తెలుగులో ‘నాయకుడు’) అనే హిట్‌ సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారు కమల్‌-మణిరత్నం.

చదవండి: ఆదిపురుష్‌ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఓం రౌత్‌

ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో కమల్‌ హాసన్, మణిరత్నం, ఆర్‌. మహేంద్రన్, శివ అనంత్‌ ఈ కొత్త సినిమా నిర్మించనున్నారు. కమల్‌ కెరీర్‌లో 234వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2024లో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ‘‘ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మణిరత్నంగారితో పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఈ ఉత్సాహానికి ఏఆర్‌ రెహమాన్, ఉదయనిధి స్టాలిన్‌ తోడవ్వడం హ్యాపీ’’ అన్నారు కమల్‌హాసన్‌. ‘‘కమల్‌సర్‌తో మళ్లీ వర్క్‌ చేయడం సంతోషంగా, గర్వంగా, గౌరవంగా ఉంది’’అన్నారు మణిరత్నం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement