Kamal Hassan
-
నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ఔత్సాహికులను పర్యావరణ స్ప్రుహ వైపుకు అడుగులు వేసేలా సృజనాత్మకతకు పెద్దపీట వేస్తోంది. ఆ వేదికపై టాప్ డిజైనర్ క్రియేషన్ని మొత్తం పర్యావరణహిత ఫ్యాషన్తోనే నింపేసింది. ఆ అద్భుతమైన ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రదర్శనల్లో కమలహాసన్ లేబుల్ హౌస్ ఆప్ ఖద్ధర్ను సుతారా కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఇక్కడ కోలీవుడ్ నటుడు కమలహాసన్ ఖాదర్ ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఈ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇది వంద శాతం ఎకో బ్రాండ్. నేత కార్మికుడు నుంచి నేరుగా ఈ ఫాబ్రిక్ను తీసుకుని రూపొందిస్తారు. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం సేంద్రీయ రంగులతోనే తయారు చేయడం విశేషం. సుతారా కలెక్షన్స్ సినిమా, కళలను స్ఫూర్తిగా తీసుకుని స్థిరమైన ఫ్యాషన్ దృక్పథాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఫ్యాషన్ కలెక్షన్తో ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే టొమాటో లెదర్, ఖద్దర్ డెనిమ్ పిక్ నిట్, మస్లిన్ ఖాదీ, వృత్తాకార మెష్ ఫ్యాబ్రిక్తో సహా పర్యావరణ అనుకూల పదార్థాలతో ఫ్యాషన్ని ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఇది హస్తకళాకారుల నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది. అదీగాక సెలబ్రిటీలు, ప్రముఖులు, డిజైనర్లు పర్యావరణ అనూకూల ఫ్యాషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతరు సారా అలీఖాన్ 60ల నాటి రెట్రో చీరలతో రూపొందించిన లెహంగాతో మెరిసిన సంగతి తెలిసిందే. జీరో కార్బన్కి ప్రాధాన్యత ఇచ్చేలా పాత వస్త్రాలను రీసైక్లింగ్ చేసి పొదుపు షాపింగ్కి ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అందులోనూ ప్రముఖ లగ్జరీ బ్రాండ్లే జీరోవేస్ట్ డిజైన్కి ప్రాముఖ్యత ఇచ్చి..సరికొత్త డిజైనర్వేర్లను క్రియేట్ చేస్తుండటం మరింత విశేషం. ఈ ఫ్యాషన్ ట్రెండ్కి అత్యంత విశేష ప్రజాదరణ లభించడమే గాక పర్యావరణ అనుకూల ఫ్యాషన్కి పెరుగుతున్న క్రేజ్ని ప్రతిబింబిస్తోంది. (చదవండి: 60ల నాటి చీరలతో రూపొందించిన లెహంగాలో సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!) -
అబ్బ కమలహాసన్ !
-
ప్రభాస్ కల్కి ఖాతాలో కోట్లు జోష్ మాములుగా లేదుగా
-
నా దగ్గర ఇలాంటి తిరకాసు ప్రశ్నలు వద్దు: జయసుధ
అలనాడు హీరోయిన్గా కుర్రకారు మనసులు దోచుకున్న జయసుధ.. ఇప్పుడు అమ్మగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా.. నానమ్మగా మారి సహజనటిగా తెరపై అలరిస్తూనే ఉన్నారు. సుమారుగా 50 ఏళ్లుగా వెండితెరపై తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. జయసుధ అద్భుతంగా నటించగల గొప్ప స్టార్. అందుకే, ఆమె మాత్రమే 'సహజనటి' అవగలిగింది. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన జయసుధ హీరోయిన్ గా అన్ని విధాల పాత్రల్ని అవలీలగా చేసింది. నటన ఆమె ప్రధానమైన బలమైనప్పటికీ కమర్షియల్, గ్లామర్ రోల్స్ కి కూడా జయసుధ ఎన్నోసార్లు వన్నెతెచ్చింది. ఈ క్రమంలో ఆమె సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సొంతం చేసుకుంది. 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్, తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించారు. కమల్తో జయసుధ పెళ్లంటూ అప్పట్లో జరిగిన ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. ముందుగా ఆ ప్రశ్న ఎదురు అయిన వెంటనే ఆమె చాలా అసహనానికి లోనయ్యారు. ప్రశ్న అడిగిన వ్యక్తితో చాలా ఎళ్లుగా పరిచయం ఉంది కాబట్టి ఏం అనలేక వదిలేస్తున్నాను అంటూనే ఎంతో హూందాగా సమాధానం చెప్పారు. 'ఇప్పుడు కమల్తో పెళ్లి విషయం అవసరమా? చాలామంది పాత సంగతులను ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి..? ఆ రోజుల్లో బాలచందర్ గారు తీసిన చాలా సినిమాల్లో కమల్తో పాటుగా నేను నటించాను. ఆ సినిమాలకి సంబంధించిన పలు పాటలను స్టేజ్ పై ఇద్దరమూ పాడే వారం. వాస్తవంగా కమల్ మంచి సింగర్. ఆయనతో పాటు నేను కూడా పాటలు పాడేదానిని. ఆ సమయంలో మా పెయిర్ బాగుందని అందరూ అనేవారు. అందువలన మేము జంటగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుని ఉండొచ్చు. ఈ విషయంపై అప్పట్లో కొన్ని తమిళ పేపర్లు రాసి ఉండొచ్చు. పత్రికల వాళ్లు ఏదో ఒకటి రాయకపోతే ఎలా..? దీంతో అలాంటి తప్పుడు ప్రచారం జరిగి ఉంటుంది. వాస్తవంగా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారనే చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నేను గొప్పనటిని అంటున్నందుకు సంతోషమే కానీ ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం చెప్పను.' అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. -
కార్తీ, కమల్ ప్రాజెక్ట్లను కాదని కమెడియన్తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వీరాభిమాని వైరల్ వీడియో..లిప్ స్టిక్ పెదాలతో కమల్ హాసన్ ఫోటో
-
కమల్ హాసన్ పెద్ద నటుడు.. ఆయన అన్న మాటలకు నేను షాక్
-
ప్రభాస్ 'కల్కి' సీక్రెట్స్ బయటపెట్టిన కమల్ హాసన్
-
ప్రాజెక్ట్ K సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్... ఫస్ట్ పార్ట్ కథ ఇదే...
-
శంకర్ కి కమల్ హాసన్ స్పెషల్ గిఫ్ట్
-
ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో విశ్వనటుడు కమల్ హాసన్
-
ఇండియన్ స్క్రీన్ పై నయా ట్రెండ్
-
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!
-
కమల్ మాస్టర్ ప్లాన్ శింబు కోసం దీసికకు 30 కోట్లు
-
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్కుమార్, ప్రకాశ్రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
కమలహాసన్ అంటే చాలా ఇష్టం
దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్ చాలాకాలంగా బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల హవానే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే సమీప కాలంలో ఆ ట్రెండ్ మారుతోంది. తమిళనాడుకు చెందిన అమ్మాయిలు కథానాయికగా నటించటానికి ముందుకు వస్తున్నారు. అలా తాజాగా సువితా రాజేంద్రన్ అనే తమిళ అమ్మాయి తామీ అనే చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు అంటూ జాలీగా సాగే కథా చిత్రం ఇది. ప్రవీణ్ దశరథం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మరో కథానాయకి నటి చాందిని తమిళరసన్ నటించారు. కాగా తన సినీ రంగ ప్రవేశం గురించి నటి సువితా రాజేంద్రన్ తెలుపుతూ చిన్న తనం నుంచి నటుడు కమలహాసన్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అలా నటనపై ఆసక్తి పెరిగిందన్నారు. దీంతో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తానని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు సంకోచించడంతో పాటు భయపడ్డారన్నారు. కారణం తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడమేనన్నారు. అయితే ఉద్యోగం పేరుతో చైన్నెకి వచ్చిన తాను ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానన్నారు. అదేవిధంగా ఒక కూత్తుపట్టరై కళాకారుడి వద్ద తాను నటనలో శిక్షణ పొందానని చెప్పారు. ఆ తర్వాత సినిమా రంగంపై దృష్టి సాధించానన్నారు. అలా వచ్చిన అవకాశమే తామి చిత్రం అని చెప్పారు. ఇందులో దర్శకుడు సూచనల మేరకు బాగా నటించానని భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. ఇందులో తాను జర్నలిస్టు పాత్రను పోషించినట్లు చెప్పారు. -
ఇండియన్ 2కు కాజల్ మేకోవర్.. మేకప్కు మూడున్నర గంటలు!
మేకప్ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లోక నాయకుడు కమలహాసన్ పేరే. ఆయన పాత్రలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, గెటప్పులకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దశావతారం చిత్రంలో ఏకంగా 10 పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ పాత్రల కోసం ఆయన కేవలం మేకప్ కోసమే నాలుగైదు గంటలు వెచ్చించేవారు. ఇక ఇండియన్ చిత్రంలోని కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా మారిపోయి గుర్తు పట్టలేనంతగా అబ్బురపరిచారు. ఇక అదే చిత్రంలో నటి సుకన్య కూడా ఆయనకు సరి సమాన మేకప్తో మేకోవర్ అయ్యి నటించి నప్పించారు. 1996లో విడుదలైన ఆ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్గా ఇండియన్ –2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనేక ఒడుదుడుకుల మధ్య నాలుగేళ్లు గడిచిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, ప్రియాస్నీ శంకర్, నటుడు సిద్ధార్థ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. 90 ఏళ్ల వృద్ధుడు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమలహాసన్ నటిస్తుండగా, ఆయనకు జంటగా నటి కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కాజల్ కూడా బామ్మ పాత్ర కోసం మేకోవర్ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం తనూ మేకప్ కోసం రోజూ మూడున్నర గంటల సమయాన్ని ప్రత్యేకంగా వెచ్చిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది ఇండియన్ చిత్రంలో నటి సుకన్య నటించిన పాత్రకు సీక్వెల్ అని సినీ వర్గాలు భావిస్తున్నారు. చదవండి: హీరోయిన్ రితికా సింగ్కు చేదు అనుభవం తొలిసారి జిమ్లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? -
రజనీకాంత్తో విజయ్ని పోల్చడం సరికాదు!: నటుడు శ్యామ్
తమిళ సినిమా: నటుడు విజయ్తో కలిసి వారీసు చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు శ్యామ్ పేర్కొన్నారు. 12బి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అలాగే పలు చిత్రాలకు కూడా ఆయన నిర్మాత వ్యవహిరించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారసుడు(తమిళంలో వారీసు) చిత్రంలో ఆయనకు సోదరుడిగా ముఖ్య పాత్రలో శ్యామ్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా నేడు(బుధవారం) 11వ తేదీన భారీ అంచనాల మధ్య వారిసు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన మంచి ఎంటర్టైనర్ కథాచిత్రంగా వారీసు ఉంటుందన్నారు. తాను ఆరంభ దశలో విజయ్తో ఖుషి చిత్రంలో చిన్న పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 12బి చిత్రంలో కథానాయకుడిగా నటించినప్పుడు విజయ్ తనను అభినందించారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వారీసు చిత్రంలో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారని,ఎక్కువగా కసరత్తులు చేస్తారన్నారు. ప్రస్తుతం సూపర్స్టార్ ఎవరన్న ఆంశంపై పెద్ద చర్చే జరుగుతోందని, అయితే ఈ విషయంలో రజనీకాంత్తో విజయ్ని పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల స్థాయి వేరని, అయితే విజయ్కు అజిత్కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు. ఇద్దరికీ అత్యధిక సంఖ్యలోనే అభిమానులు ఉన్నారన్నారు. పొంగల్కు విడుదల అవుతున్న వారిసు, తుణివు చిత్రాలు రెండు విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని, గోలీ సోడా 3 చిత్రంలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, మరికొన్ని చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడంలోనూ నటిస్తున్నానని, అదే విధంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు. -
మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన త్రిష? ఆ హీరోతో ముచ్చటగా మూడోసారి!
నాలుగు పదుల వయసులోనూ త్రిష క్రేజ్ కొనసాగుతోంది. తన కెరీర్ ముగిసిపోయిందంటూ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారనే చెప్పవచ్చు. ఆ మధ్య త్రిష సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో ఇక ఆమెకు సినిమాలకు దూరమైందని అంతూ అనుకుంటున్న సమయంలో తమిళ చిత్రం 96 విజయంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో రీఎంట్రీ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీ విజయంతో త్రిష కెరీర్ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందుకలో పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఉండటం విశేషం. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి మంగాత్తా, ఎన్నై అరిందాల్ వంటి హిట్ చిత్రాల తరువాత అజిత్తో జతకట్టడానికి సిద్ధం అవుతుందామె. అలాగే విజయ్ 67వ చిత్రంలోనూ నటించనుంది. ఈ నేపథ్యంలో త్రిష కోసం మరో క్రేజీ ఆఫర్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విలక్షణ నటుడు కమలహాసన్ తన తదుపరి చిత్రం మణిరత్నంతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 234వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈయన ఇటీవల తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ తొలి భాగం విజయం సాధించింది. కాగా దీని రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీ విడుదలకు ముస్తాబవుతుంది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! ఆ తర్వాత విక్రమ్ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు మణరత్నం. వీరి కాంబోలో నాయకన్ వంటి సంచలన హిట్ చిత్రం రూపొందింది. కాగా సుమారు 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కానుంది. ఈ క్రేజీ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఇందులో కమలహాసన్కు జంటగా త్రిషను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా త్రిష ఇంతకుముందు కమలహాసన్కు జంటగా మన్మదన్ అన్బు, తూంగావనం చిత్రాల్లో నటించింది. అంత ఒకే అయితే ఇప్పుడు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయనతో నటించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. -
చెన్నై: కమల్హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల
-
తమిళ పాలిటిక్స్లో ట్విస్ట్.. డీఎంకేతో కమల్ దోస్తీ?
సాక్షి, చెన్నై: రానున్న లోక్సభ ఎన్నికల్లో కూటమితో కలిసి ముందుకు సాగాలని మక్కల్ నీది మయ్యం వర్గాలు భావిస్తున్నాయి. అధికార డీఎంకేతో జత కట్టాలంటూ.. పార్టీ అధినేత కమల్కు వివిధ జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు సూచించారు. వివరాలు. గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను మక్కల్ నీది మయ్యం ఒంటరిగానే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో 2024 లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవడంతో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఆపార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం చెన్నైలో జరిగింది. పార్టీ పరంగా ఉన్న 85 జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, పార్టీ ఉపాధ్యక్షులు మౌర్య, తంగవేలు, కార్యదర్శి సెంథిల్ అర్ముగం, శివ ఇలంగో, స్నేహన్, మూకాంబీకై, మురళీ అబ్బాస్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధినేత, నటుడు కమల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. కూటమి కోసం పట్టు.. లోక్సభ ఎన్నికలను ఈ సారి బలమైన కూటమితో కలిసి ఎదుర్కొంద్దామని, గతంలో చేసిన తప్పులు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడికి నేతలు విజ్ఞప్తి చేశారు. డీఎంకేతో జత కట్టే విధంగా, మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన వివరాలను కొందరు నేతలు అందజేసినట్లు సమాచారం. ఎక్కువమంది మంది డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొంద్దామని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ముందే తీసుకోవాలని కమల్ను కోరారు. చివర్లో కమల్ ప్రసంగిస్తూ, కూటమి గురించి పట్టించుకోవద్దని, ఈ వ్యవహారంపై తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. ఎవరితో కలిసి వెళ్లాలి..? అనే విషయాన్ని పక్కన పెట్టి, ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. అలాగే చెన్నైలో మక్కల్ నీది మయ్యం కోసం భారీ కల్యాణ వేదికను నిర్మించను న్నట్లు ఈసందర్భంగా కమల్ ప్రకటించారు. -
కుటుంబ సభ్యుల మధ్య కమల్ హాసన్ బర్త్డే వేడుక (వైరల్ ఫొటోలు)
-
35 ఏళ్ల తర్వాత మరోసారి జతకడుతోన్న కమల్-మణిరత్నం
ప్రముఖ నటుడు కమల్హాసన్ తన బర్త్ డే (నవంబరు 7) సందర్భంగా ఫ్యాన్స్కు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు కమల్హాసన్. దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఇదే కావడం విశేషం. 1987లో వారిద్దరి కాంబోలో ‘నాయకన్’(తెలుగులో ‘నాయకుడు’) అనే హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారు కమల్-మణిరత్నం. చదవండి: ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ ఈ కొత్త సినిమా నిర్మించనున్నారు. కమల్ కెరీర్లో 234వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2024లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మణిరత్నంగారితో పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఈ ఉత్సాహానికి ఏఆర్ రెహమాన్, ఉదయనిధి స్టాలిన్ తోడవ్వడం హ్యాపీ’’ అన్నారు కమల్హాసన్. ‘‘కమల్సర్తో మళ్లీ వర్క్ చేయడం సంతోషంగా, గర్వంగా, గౌరవంగా ఉంది’’అన్నారు మణిరత్నం. Here we go again! #KH234 பயணத்தின் அடுத்த கட்டம்! #ManiRatnam @Udhaystalin @arrahman #Mahendran @bagapath @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM pic.twitter.com/ATAzzxAWCL — Kamal Haasan (@ikamalhaasan) November 6, 2022 -
‘నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా’
ఇటీవల జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లో హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్రమంలో సినిమాలో తాను చేసిన రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ ఏడాది వచ్చిన ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులో విశేష ఆదరణ అందుకుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. చదవండి: ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే అయితే ఈ చిత్రంలో సూర్య రోలెక్స్ అనే మాఫీయా గ్యాంగ్ లీడర్గా కనిపించాడు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఆ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సూర్య ఎంట్రీకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్. విలనిజానికి కేరాఫ్గా అడ్రస్గా సూర్య ఇందులో కనిపించాడు. చివరి 5 నిముషాలో రోలెక్స్ పాత్రను పరిచం చేశాడు డైరెక్టర్. కనిపించిన 5 నిమిషాలు సూర్య తన కళ్లలో చూపించిన క్రూరత్వం, నవ్వుతూనే భయపెట్టిన ఆయన నటనకు ప్రతిఒక్కరు ఫిదా అయ్యారు. అలా విక్రమ్లో ప్రేక్షకులను రోలెక్స్గా భయపెట్టిన సూర్యకు ఈ పాత్ర చేయాలంటే మొదట భయం వేసిందట. చదవండి: ‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సైమా అవార్డు ఫంక్షన్లో తెలిపాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘విక్రమ్లో రోలెక్స్ పాత్ర చేయాలంటే మొదట భయంగా అనిపించింది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజుకు చేయనని చెబుదామని అనుకున్న. కానీ అదే సమయంలో కమల్ సార్ ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఓకే చెప్పాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని చెప్పుకొచ్చాడు. కాగా కమల్ హాసన్ హీరోగా నటించి ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. I did it for one man "ulaganayagan" #kamalhassan #Rolex#southfilmfare #filmfareawards2022 @ikamalhaasan @suru #bengaluru pic.twitter.com/yK07292uRm — Civic Ranter (@deerajpnrao) October 9, 2022 -
‘పొన్నియన్ సెల్వన్’ వివాదం, కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో పాన్ చిత్రం రూపొందిన ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే తమిళనాట తప్ప ఈ సినిమా మరే భాషల్లో పెద్దగా ఆదరణ అందుకోలేకపోయింది. రిలీజ్కు ముందు ఈ సినిమాను బాహుబలితో పోల్చడంతో విడుదల అనంతరం ఇదే అంశంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు బాహుబలికి, పొన్నియన్ సెల్వన్కు పోలికే లేదంటూ విమర్శిస్తున్నారు. చదవండి: ‘మై విలేజ్ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా? దీంతో తమిళనాట దీనిపై పెద్ద వివాదమే రాజుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా నిలిచాయి. ‘‘సినిమా బాగుంటే ఏ భాష వారైనా ఆదరిస్తారు. మనం ‘శంకరాభరణం’ ఆదరిస్తే వాళ్ళు మన ‘మరో చరిత్ర’ను ఆదరించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక తమిళ చారిత్రక కథ, దానిని ఇతర భాష వారు ఆదరించాలనే నియమం లేదు. దీనికి పోయి ఇతర భాషల ప్రజలను దూషించడం తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటే.. అనంతరం అసలు చోళరాజులు హిందువులు కాదంటూ కమల హాసన్ కామెంట్స్ చేశారు. రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వమే లేదని, అప్పట్లో హిందూమతం లేదన్నారు. శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయని చెప్పారు. మనదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఎలా పిలవాలో తెలియక హిందువులని సంబోధించారని కమల్ పేర్కొన్నారు. ఇక కళలకు భాష, కులం, మతం లేదని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికా వెళ్లిన కమల్! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా?
‘విక్రమ్’ సినిమా విజయంతో ఫుల్ జోష్లో ఉన్నారు కమల్హాసన్. ఆ చిత్రం హిట్ కావడంతో మరింత ఉత్సాహంగా తర్వాతి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నారాయన. అందులో భాగంగానే శంకర్ దర్శకత్వంలో చేయనున్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) సినిమా కోసం మేకోవర్ అయ్యేందుకు అమెరికా వెళ్లారు కమల్హాసన్. మూడు వారాల పాటు యూఎస్లోనే ఉండి, ఈ సినిమాకి తగ్గట్టు తన ఫిజిక్ని మార్చుకోనున్నారని టాక్. కమల్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’ (1996)కి ‘ఇండియన్ 2’ సీక్వెల్గా రూపొందుతోంది. 2020లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. అయితే కరోనా, సెట్స్లో నెలకొన్న ప్రమాదం వంటి కారణాలతో ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది. కమల్హాసన్ అమెరికా నుంచి రాగానే సెప్టెంబరులో ‘ఇండియన్ 2’ని సెట్స్పైకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
‘పొన్నియన్ సెల్వన్’.. మణిరత్నం కోసం రంగంలోకి కమల్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న తెలుగు, హిందీ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్కు నెటిజన్లు ఫిదా! ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా ఇందులోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్ను ఒక్కొక్కొటిగా విడుదల చేస్తూ మూవీపై అంచనాలను పెంచుతోంది చిత్ర బృందం. అయితే ఈ సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన పలు సన్నివేశాలను అక్కడక్కడా కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట. అయితే తమిళంలో ఈ స్పెషల్ సీన్స్కు కమల్తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నాడు మణిరత్నం. అంతేకాదు ఇతర భాషల్లో కూడా ఆయా స్టార్ను ఎంచుకుని వాయిస్ ఓవర్ చెప్పించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళంలో కమల్ చెబితే బాగుటుందని మూవీ టీం భావిస్తోందట. -
‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్కు నెటిజన్లు ఫిదా!
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చదవండి: కానిస్టెబుల్గా విశాల్.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్ ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా డిస్నీప్లస్ హాట్స్టార్ విడుదల చేసింది. 6 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో దాదాపు యాక్షన్ సీన్స్కు సంబంధించిన మేకింగ్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఫహద్ ఫాజిల్ సీన్తో మొదలైన ఈ మేకింగ్ వీడియోలో విజయ్ సేతుపతి, కమల్కు సంబంధిచిన పలు భారీ యాక్షన్ సీన్స్తో పాటు మూవీలో హైలేట్గా నిలిచి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరును చూపించారు. చదవండి: ‘ధాకడ్’ మూవీ ఫ్లాప్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ను చూస్తుంటే ప్రతి సీన్లో కోసం ఆయన ఎంతటి జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. మేకింగ్తో పాటు హీరో, విలన్ లుక్స్లోనూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఫైట్ సీన్స్ కోసం లోకేశ్.. కమల్ లుక్కు స్వయంగా మెరుగులు దిద్దుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి మేకింగ్కు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘విక్రమ్ మేకింగ్, ప్రతి ఫ్రేమ్లో విషయంలో మీరు పెట్టిన ఫోకస్ కనిపిస్తుంది’,‘ఈ సినిమా కోసం మీరు పెట్టిన ఎఫర్టే విక్రమ్ సక్సెస్’ అంటూ లోకేశ్ కనకరాజ్ను కొనియాడుతున్నారు. -
చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజు దర్శకత్వం వహించాడు. గత శుక్రవారం(జూన్ 3న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లోకి చేరింది. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్లో సైతం విక్రమ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న కమల్ ఈ మూవీ నటీనటులతో పాటు డైరెక్టర్, మూవీ బృందానికి బహుమతులు అందించాడు. చదవండి: అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి: ఆసక్తిగా హీరోయిన్ ట్వీట్ ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి లోకనాయకుడిని సత్కరించాడు. విక్రమ్ మంచి విజయం అందుకున్న సందర్భంగా కమల్ హాసన్తో పాటు డైరెక్టర్ లోకేశ్ కనగరాజును చిరు ఇంటికి ఆహ్వానించి అభినందనలు తెలిపాడు. అనంతరం ఇంట్లో వారికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వచ్చి విక్రమ్ మూవీకి అభినందలు తెలిపాడు. ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ విక్రమ్ టీంను సత్కరించిన ఫొటోలను షేర్ చేశాడు. ‘నా పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్హాసన్తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ మూవీ చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్గా ఉంది. అభినందనలు మిత్రమా. ఈ సినిమా విజయం నీకు మరింత శక్తిని ఇస్తుంది’ అంటూ చిరు ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా కమల్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. తమిళ స్టార్ సూర్య కీలకపాత్రలో నటించాడు. Absolute joy,celebrating & honouring my dearest old friend @ikamalhaasan for the spectacular success of #Vikram along with my dearest Sallu Bhai @BeingSalmanKhan @Dir_Lokesh & team at my home last night.What an intense & thrilling film it is!!Kudos My friend!! More Power to you! pic.twitter.com/0ovPFK20r4 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2022 -
కమల్గారు గ్లోబల్ స్టార్: విక్టరీ వెంకటేశ్
‘‘దక్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్హాసన్గారికి ముందు.. మరొకటి కమల్గారు వచ్చిన తర్వాత. ఆయనతో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది. కమల్గారు నాకు అపూర్వ సహోదరులు’’ అని అన్నారు హీరో వెంకటేశ్. కమల్హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమాను తెలుగులో ‘విక్రమ్: హిట్ లిస్ట్’ పేరుతో హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 3న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘విక్రమ్: హిట్ లిస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ – ‘‘కమల్గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్»ౌల్డ్. ఆయన నటించిన ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్కు జీపీఎస్. ‘దశావతారం’లాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్కు ధైర్యం సరిపోదు. ‘ఏక్ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. ఈ రోజు కమల్గారు గ్లోబల్ స్టార్. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. ‘విక్రమ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సుధాకర్, నితిన్లకు కంగ్రాట్స్’’ అన్నారు. కమల్హాసన్ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్గా హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్ తింటున్నాను. నా కెరీర్లో ఎన్నో హిట్స్ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. డైరెక్టర్ బాలచందర్గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్డీ. నా స్టైల్, రజనీకాంత్ స్టైల్ ఆయన్నుంచే వచ్చాయి. వెంకీగారు ఓసారి గోవాకు వస్తే, ఫిల్మ్ ఫెస్టివల్కు వచ్చారా? అన్నాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. నాకు తెలిసింది చెప్పాను. ఆయనకు మరో వేవ్ వచి్చంది. ఇప్పుడు నా బ్రదర్ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు ‘మర్మయోగి’ సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్లో మంచి హిట్గా నిలిచి ఉండేది. ‘విక్రమ్’ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా హిట్ మీ (ప్రేక్షకులు) చేతుల్లోనే ఉంది. డైరెక్టర్ లోకేశ్గారు నాలాగే (బ్యాక్గ్రౌండ్ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్ ఫిల్మ్స్... పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్. అది మీ (ప్రేక్షకులు) సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్ చేయాలి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కమల్గారి అద్భుతమైన యాక్షన్ను చూస్తారు’’ అన్నారు లోకేశ్ కనగరాజ్. ‘‘కమల్హాసన్గారు ప్రైడ్ ఆఫ్ ఇండియా’’ అన్నారు నితిన్. ‘‘తెలుగులో ‘విక్రమ్’ను రిలీజ్ చేసే చాన్స్ ఇచి్చన కమల్గారికి థ్యాంక్స్’’ అన్నారు సుధాకర్ రెడ్డి. -
రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య
Kamal Haasan Ex Wife Sarika About Her Financial Status: ఒకప్పుడు ఆమె స్టార్ హీరో భార్య, ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ తల్లి.. అయినా ఆమెకు మహమ్మారి కాలంలో ఆర్థిక సమస్యలు తప్పలేదు. లాక్డౌన్ సమయంలో కేవలం 3వేల కోసం ఆమె థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశానని చెప్పడం అందరిని షాక్కు గురిచేస్తోంది. ఆమె మరెవరో కాదు లెజెండరి నటుడు, హీరో కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్ తల్లి సారిక. సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ కమల్ హాసన్ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. ఇక ఆయనతో విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెజాన్ ప్రైం ‘మోడ్రన్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్ రింకిల్స్’ అనే పార్ట్లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్ రోటీన్గా అనిపించింది. చదవండి: బిగ్బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్? ఉదయం లేవడం వర్క్కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్డౌన్లు వచ్చాయి. దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది. చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో హాట్టాపిక్గా నిలిచాయి. ఓ స్టార్ హీరోయిన్ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్-సారికలు కొంతకాలం రిలేషన్లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు. -
కమల్ను పరామర్శించిన సూపర్ స్టార్ రజనీకాంత్
Kamal Haasan Health Condition: విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తన తండ్రి కోలుకుంటున్నారని ఆయన కుమార్తె, సినీనటి శృతిహాసన్ వెల్లడించారు. చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్ కమల్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమలహాసన్ ఆరోగ్యం బాగుందంటూ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ అధికారులు కూడా బులెటిన్ విడుదల చేశారు. కాగా పరిశ్రమలో కమలహాసన్, రజనీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కమల్కు కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న రజనీకాంత్... ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. చదవండి: విషమంగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. రంగంలోకి దిగిన సోనూసూద్ -
కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్
Kamal Haasan Tested Coronavirus Positive: విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. చదవండి: యానీ ఎలిమినేషన్కు కారణం ఇదేనా? అదే ఆమె కొంపముచ్చిందా..! ‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ కమల్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా ఆయన కొత్తగా అమెరికాలో దుస్తుల వ్యాపారం ప్రారంభిస్తున్నారు. తన బ్రాండ్ క్లాత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమల్హాసన్ అమెరికా వెళ్లారట. அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள். — Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021 -
లైంగిక వేధింపులు: బాలిక ఆత్మహత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమల్
లైంగిక వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ స్పందించారు. మృతురాలు బాలిక ఆత్మహత్యకు కారకుడైన సదరు పాఠశాల ఉపాధ్యాయుడిని కఠింగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కమల్ ట్వీట్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే బాలిక మృతికి కారకుడైన టీజర్కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావుతంగా కాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కమల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి నిందితుడిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సదరు పాఠశాల ఫిజిక్స్ టీజర్ మిథున్ చక్రవర్తిని ఆర్సీపురం పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్పై కూడా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. చదవండి: బిగ్బాస్ 5: శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే.. -
‘జై భీమ్’ మూవీ చూసి కమల్ హాసన్ ఏమన్నారంటే..
సాక్షి, చెన్నై: జై భీమ్ చిత్రంలో సూర్య నటనకు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని టి.జె. జ్ఞానవేల్ తెరకెక్కించారు. పోలీసులు, రాజకీయ నాయకుల అరాచకాలకు గురవుతున్న కొండ జాతి ప్రజలకు అండగా నిలిచే న్యాయవాది పాత్రలో సూర్య నటించారు. ఈ చిత్రం మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్ అవుతోంది. చిత్రం చూసిన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కొండజాతి ప్రజల జీవన విధానాన్ని, కష్టాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారని కొనియాడారు. చదవండి: Jai Bhim Review: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? నిజాయితీపరులైన పోలీసులు, న్యాయవాదులు న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించగలరని జై భీమ్ చిత్రంలో చూపించారంటూ చిత్ర యూనిట్ను, ముఖ్యంగా నటుడు సూర్యను ప్రశంసించారు. అదే విధంగా నటుడు, మకల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల హాసన్ జై భీమ్ చిత్రాన్ని ప్రత్యేకంగా తిలకించారు. ఈ సినిమా చూసి తన కళ్లు చమర్చాయని ట్విట్టర్లో పోస్టు చేశారు. పళంగుడి ప్రజల కష్టాలను తెరపై ఆవిష్కరించిన దర్శకుడి తీరు ప్రశంసనీయం అన్నారు. సూర్య, జ్యోతికలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్న కమల్హాసన్ ‘ఇండియన్ 2’?
కమల్హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం ‘ఇండియన్’. ఇదే తెలుగులో ‘భారతీయుడు’గా డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుండగా.. అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే చాలా భాగం షూటింగ్ పూర్తైన తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య వివాదం తలెత్తడంతో మూవీ ఆగిపోయింది. అయితే తాజాగా ఆ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు, డైరెక్టర్కి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తైన ఈ మూవీని మిగిలిన పార్ట్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి విడుదల చేయాలని వారు భావిస్తున్నారంట. అయితే శంకర్ ఇప్పటికే రామ్చరణ్ హీరో ‘ఆర్సీ15’, బాలీవుడ్ హీరో రణ్వీర్సింగ్ హీరో ‘అపరిచితుడు’ రీమేక్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో వాటికంటే ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాడా.. లేదా? అనేది చూడాలి. చదవండి: సింహం ఎప్పుడు సింహమే.. -
‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్కు అంత సమయమా..!
Allu Arjun Pushpa Movie: పాత్రలతో ప్రయోగాలు చేసే నటులలో కమల్ హాసన్, విక్రమ్ చియాన్లు ముందుంటారు. వారి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తారు. అందుకే ఎప్పుడూ వారు వైవిధ్యమైన కథలతో డిఫరెంట్లుక్తో ఆశ్చర్యపరుస్తుంటారు. అంతగా సినీ పరిశ్రమలో కమల్, విక్రమ్లు విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్ర ‘పుష్ప’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఇందులో స్టైలిష్ స్టార్ మునుపెన్నడు చూడని విధంగా మాస్ లుక్తో అలరించబోతున్నాడని ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్లుక్ చూస్తే తెలుస్తోంది. ఊరమాస్గా భయంకరమైన స్మగ్లర్ పుష్పరాజుగా నటించబోతున్నాడు. అయితే ఇందులో తన లుక్ కోసం బన్ని బాగానే కష్టపడుతున్నాడట. స్టైలిష్గా లవర్ బాయ్లా ఉండే బన్ని ఈ మూవీలో పుష్ప రాజులా కనిపించడానికి తనని తాను మేకోవర్ చేసుకుంటున్నాడు. రోజు సెట్లో మేకప్కు వేసుకోవడానికి, తీయడానికి 3 గంటల పైనే సమయం కేటాయిస్తున్నాడట. రింగులజుట్టు, గడ్డంతో వీరమాస్ లుక్లో టాన్ టచ్ అప్లు చేయించుకుంటున్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ మేకప్ వేయడానికి రెండు గంటలు, ఆ మేకప్ను తొలగించడానికి గంటకు పైనే సమయం పడుతుందా. ఆయన డెడికేషన్ను చూసి డైరెక్టర్తో పాటు సెట్లోని మిగతా బృందం ఫిదా అవుతున్నారట. అంతేగాక ప్రతిరోజు మేకప్ విషయంలో ఆయన ఓపిక చూసి వారంత ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట. ఇది తెలిసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా ‘పుష్ప’ పార్ట్ వన్ క్రిస్మస్ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ హాసన్ హాసన్ .. భారతీయుడు సినిమాలో సేనాపతి లుక్ కోసం 4 గంటలు మేకప్ వేసుకునే వాళ్లు. ఇక దశావతారం సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వరూపం వేషధారణకి సంబంధించిన మేకప్కు ఎక్కువ శ్రమించాడు. ఇక ఐ సినిమాలో విక్రమ్ తన లుక్కు బాగానే శ్రమించాడు. దీనికి ఆ సినిమాలో ఆయన లుక్యే ఉదాహరణ. చదవండి: చిరంజీవి బర్త్డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్, ఏమైంది.. -
సింహం ఎప్పుడు సింహమే..
విలక్షణమైన నటనతో భాషా భేదం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు కమల్హాసన్. చిత్ర పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి గురువార నాటికి 62 ఏళ్లు. నాలుగేళ్ల వయసులో తమిళంలో చేసిన ‘కలత్తూర్ కన్నమ్మ’ చిత్రంతో కమల్ సినిమా కెరీర్ ఆరంభమైంది. 1960 ఆగస్టు 12న ఈ సినిమా విడుదలైంది. తొలి సినిమాతోనే రాష్ట్రపతి గోల్డ్ మెడల్ సాధించారు కమల్. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన కమల్ 1974లో ‘కన్యాకుమారి’ అనే మలయాళ చిత్రంతో హీరోగా మారారు. ఇప్పటివరకు దక్షిణ, ఉత్తరాది భాషల్లో 231 చిత్రాల్లో నటించారు. ఇక కమల్ పరిశ్రమకి వచ్చి 62 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్’ సినిమా పోస్టర్ను ‘సింహం ఎప్పుడూ సింహమే’ అంటూ విడుదల చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ నెల 20న ఆరంభం కానుంది. -
దృశ్యం రీమేక్: కమల్ హాసన్ ‘పాపనాశం’ సీక్వెల్కు ప్లాన్!
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన థ్రిల్లర్ ‘దృశ్యం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయి, మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు ‘దృశ్యం’కి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, వెంకటేశ్-మీనా జోడీగా నటించారు. తమిళంలో ‘పాపనాశం’ పేరుతో కమల్హాసన్-గౌతమి జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. కాగా ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్గా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ, తెలుగు భాషల్లో ‘దృశ్యం 2’ రూపొందింది. మలయాళంలో ఇప్పటికే విడుదలైంది. తెలుగు ‘దృశ్యం 2’ రీమేక్ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు జీతూ తమిళ రీమేక్ని ప్లాన్ చేస్తున్నారట. రెండో భాగంలోనూ కమల్హాసన్ కథానాయకుడిగా నటించనున్నారట. అయితే మొదటి భాగంలో ఆయనకు భార్యగా నటించిన గౌతమి సీక్వెల్లో నటిస్తారా? అనే చర్చ ఆరంభమైంది. కమల్–గౌతమి తమ స్నేహానికి ఫుల్స్టాప్ పెట్టిన విషయం, కమల్ ఇంట్లోనే ఉంటూ వచ్చిన గౌతమి ఆ ఇంటి నుంచి బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమి నటిస్తారా? అసలు దర్శకుడికి ఆమెను తీసుకోవాలని ఉందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది. చదవండి: కరోనాపై వరలక్ష్మి శరత్కుమార్ అవగాహన -
మహేశ్-కమల్తో క్రియేటివ్ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్!
ఈ మధ్యకాలంలో పరిశ్రమతో సంబంధంగా లేకుండా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్తో సలార్ మూవీ తెరకెక్కిస్తుండగా, ఇక సెన్సెషనల్ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఓ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, విలక్షణ నటుడు కమల్ హాసన్లతో క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగుదాస్ ఓ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని సమాచారం. మహేశ్ ఇందులో సీబీఐ ఆఫీసర్గా కనిపించబోతుండగా, కమల్ హాసన్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తాడని వినికిడి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలి అంటే దీనిపై డైరెక్టర్ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే మురుగుదాస్ గతంలో మహేశ్తో స్పైడర్ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్స్గా అంతగా సక్సెస్ అందుకోలేదు. -
ప్రధాన పోటీ ఆ రెండింటి మధ్యే; ఆ ముగ్గురు ఫెయిల్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలోనే తమిళనాడు ఎన్నికలు ప్రత్యేకం. బరిలో ఎన్నిపార్టీలున్నా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ. అధికారంలోకి వచ్చేది ఆ రెండింటిలో ఒకటి అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎటొచ్చి ఎప్పటికప్పుడు మారేది ఏ పార్టీది మూడో స్థానం అనే. అయితే ఈసారి కూడా ఎప్పటి లాగానే ప్రత్యామ్నాయ ప్రయోగం మరోసారి విఫలమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అగ్రనేత కరుణానిధి మరణం తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్వస్థితే కొనసాగడం, మూడో కూటమి నాల్గోసారి మునిగిపోవడం గమనార్హం. తమిళనాడులో కాంగ్రెస్ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. డీఎంకే లేదా అదే పార్టీ నుంచి పుట్టుకొచ్చిన అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ పరిపాటిగా మారింది. ఆ రెండు కూటములంటే గిట్టని బలమైన ఓటు బ్యాంకు ఒకటుందని విశ్వసిస్తూ గతంలో మూడుసార్లు మూడో కూటమి యత్నాలు జరిగాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత 1988లో అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులు జీకే మూప్పనార్ నేతృత్వంలో ఏర్పడిన మూడో కూటమి 26 సీట్లు, 20 శాతం ఓట్లు సాధించింది. 1996లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన వైగో.. ఎండీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వామపక్ష పార్టీలతో కలిపి మూడో కూటమి ఏర్పాటు చేశారు. యథాప్రకారం ఇదీ విఫలమైంది. 2006 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి అన్ని స్థానాల్లో పోటీచేసినా తానొక్కడే గెలిచాడు. 2011 ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాలకే పరిమితం కాగా, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 29 స్థానాల్లో గెలిచి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తరువాత జయలలితతో విబేధించిన విజయకాంత్ విపక్షాలతో చేతులు కలిపాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైగో (ఎండీఎంకే) డీఎండీకే, వామపక్ష పార్టీలు, వీసీకే, తమకా పార్టీలతో కలిసి మరోసారి ‘ప్రజా సంక్షేమ కూటమి’పేరున ఏర్పడిన మూడో కూటమి కనీసం ఒక్క సీటూ గెలవలేక చేదు అనుభవాన్నే చవిచూసింది. మూడో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా బరిలోకి దిగిన విజయకాంత్ సహా దాదాపుగా అందరూ జయలలిత ధాటికి డిపాజిట్లు కోల్పోయారు. మూడో కూటమి యత్నం ముచ్చటగా మూడుసార్లు విఫలమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ప్రయత్నం జరుగింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 80–90 శాతం స్థానాలను తమకు ఉంచుకుని మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించడాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అనుసరిస్తున్నాయి. దీంతో కొన్ని పార్టీలు గత్యంతరం లేక సర్దుకుపోతుండగా, మరికొన్ని మూడో కూటమివైపు వచ్చేయడం జరుగుతోంది. సర్దుబాటు పరిస్థితి చిన్నపార్టీలకే కాదు, కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్దపార్టీలకూ తప్పడం లేదు. ఇక తాజా విషయానికి వస్తే డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ 25, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ 20 సీట్లు పొందాయి. ఈ రెండు జాతీయ పార్టీలకూ తమిళనాడులో పెద్ద బలం, బలగం లేదు. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కినా దక్కకున్నా ఆయా కూటముల్లో కొనసాగక తప్పలేదు. అన్నాడీఎంకే కూటమిలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్కుమార్ పార్టీ గుర్తు, పరిమిత సీట్ల కేటాయింపును నచ్చకే మూడో కూటమి ఐజేకేలో చేరారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్హాసన్ ఐజేకే కూటమిలో చేరి సీఎం అభ్యర్దిగా బరిలో నిలిచారు. అన్నాడీఎంకే కూటమిలో ఉండిన డీఎండీకే టీటీవీ దినకరన్ పంచన చేరింది. రాజకీయ సమీకరణలు మారినా అన్నాడీఎంకే, డీఎంకే ప్రత్యామ్నాయ ప్రయోగం నాల్గోసారి నగుబాటుగా మిగిలిపోయింది. పంచముఖ పోటీ తమిళనాట తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు మక్కల్ నీది మయ్యం (కమల్హాసన్), అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (టీటీవీ దినకరన్), నామ్ తమిళర్ కట్చి (సీమాన్) ఐదు కూటములకు సారథ్యం వహించాయి. అన్ని కూటముల సారథులు ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. పార్టీ పెట్టిన తరువాత కమల్హాసన్, టీటీవీ దినకరన్లు ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఎన్నికలకు ముందే స్పష్టమై పోవడంతో మూడోస్థానం ఎవరిది అనేది చర్చనీయాంశమైంది. 2016లో పార్టీ స్థాపించిన సీమాన్ అప్పటి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరి పోటీకి దిగి ఒక్కస్థానం కూడా గెలవకున్నా 1.07 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కమల్ తన సినీ ఆకర్షణను జోడించి మూడో ప్రత్యామ్నాయంగానే ప్రచారం చేసుకున్నాడు. అన్నాడీఎంకే అసంతృప్తవాదులను టీటీవీ దినకరన్ నమ్ముకున్నారు. శ్రీలంక ఈలం తమిళం, మాతృ (తమిళ) భాషాభిమానిగా సీమాన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సీమాన్కు యువత ఆదరణ ఒకింత ఉంది. అయితే ఓటమి పాలైన ముగ్గురు ముఖ్యమంత్రులు తమ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేక పోయినా, ఎంతవరకు ఓట్ల శాతం సాధించిపెట్టారనేది పూర్తి గణాంకాలు వచ్చాక తేలనుంది. చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు -
పోలింగ్ బూత్లోకి శృతి.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్లో హీరోయిన్ శృతి హాసన్ చేసిన పొరపాటు ఆమెను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. మంగళవారం తమిళనాడుతో పాటు కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరోయిన్స్ శృతి హాసన్, అక్షరా హాసస్లు కూడా తండ్రి కమల్ హాసన్తో కలిసి చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో కోమంబత్తూర్ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒటు వేసిన అనంతరం కమల్ ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలోని పోలీంగ్ బూతులోకి వెళ్లాడు. అయితే ఆయనతో పాటు శృతి హాసన్ కూడా లోపలికి వెళ్లింది. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రవర్తించిన శృతి తీరుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. శృతి హాసన్.. తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ అంతకన్న కాదు. మరెందుకు పోలీంగ్ బూతులోకి అనమతించారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూతులోకి ఆమెను ఎలా అనుమతించారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేగాక శృతి పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే కాకుండ.. ట్విట్టర్లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యంకు(ఎమ్ఎన్ఎమ్) ఓటు వేయమని చెప్పడం కూడా కమిషన్ నిబంధనలకు విరుద్దమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్ కూడా శృతిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ స్పందించడం కానీ చేయలేదు. మరి ఎన్నికల కమిషన్ శృతిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
రామ్ చరణ్-శంకర్ సినిమాకు ‘లైకా’ బ్రేక్..
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ ఓ భారీ ప్రాజెక్ట్ సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో చెర్రీ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడటం చకచకా అయిపోయాయి. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్పైకి వెళుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ మూవీ ఇప్పట్లో సెట్స్పై వచ్చేల కనిపించడం లేదు. కాగా శంకర్ ఇప్పటికే కమల్ హాసన్తో ‘ఇండియా 2’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 25 ఏళ్ల క్రితం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన భారతీయుడు సీక్వెల్గా శంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరగడం, ఈ ప్రమాదంలో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహరం కోర్టు దాకా వెళ్లింది. దీంతో ఈ మూవీ మేకర్స్ నష్టపరిహారాలు చెల్లించడం కూడా జరిగింది. ఆ షాక్లో ఉండిపోయిన డైరెక్టర్ మళ్లీ ఈ మూవీ రీ-షెడ్యూల్కు ప్లాన్ చేయడం లేదు. ఇందులో కథానాయికగా చేస్తున్న కాజల్ అగర్వాల్ సైతం ఈ మూవీ నుంచి తనకు ఎలాంటి అప్డేట్ రాలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇక ‘ఇండియా 2’ షూటింగ్ కొనసాగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ‘ఇండియా 2’ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తుండటంతో లైకా ప్రొడక్షన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. తాము కేటాయించిన 230 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇప్పటి వరకు రూ. 180 కోట్లు ఖర్చు పెట్టించిన డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పూర్తి చేయకుండానే వేరే కొత్త ప్రాజెక్ట్కు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహరం కాస్తా ముదిరెలా కనిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత శంకర్ ‘ఇండియా 2’ గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాకపోవడం, హీరో కమల్ హాసన్ ఏమో రాజకీయాల్లో బిజీ అయిపోవడం ఇదంత చూస్తుంటే శంకర్ ఇబ్బందుల్లో పడేసేలా ఉంది. చదవండి: మహేశ్ బాబు నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్ శంకర్-రామ్ చరణ్ కాంబో; ఊహించని స్క్రిప్ట్ -
వైరల్: ఆగ్రహంతో ‘టార్చ్లైట్’ విసిరిన కమల్ హాసన్
చెన్నె: రాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓపిక.. సహనం ఎంతో ఉండాలి. క్షణికావేశాలకు గురయితే పతనమే. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ అసహనానికి గురయ్యారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తుగా ఉన్న ‘టార్చ్లైట్’ను విసిరేశారు. కాన్వాయ్లో ఉండగా ఏదో విషయమై అసంతృప్తికి గురయి టార్చ్లైట్ విసిరివేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దక్షిణ కోయంబత్తూరు నుంచి అసెంబ్లీకి కమల్ హాసన్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కాన్వాయ్లో వెళ్తూ అభివాదం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుతుండగా కమల్ మైక్రోఫోన్ పని చేయలేదు. ప్రజలకు ఆయన మాటలు వినకపోవడం గమనించి వాహనంలో ఉన్న వారిని అడిగారు. ‘ఏమైంది?’ అని.. ఎంతకీ మైక్రోఫోన్ సరిగా పని చేయకపోవడంతో కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఎడమ చేతిలో ఉన్న తన పార్టీ గుర్తు ‘టార్చ్లైట్’ను వాహసంలోపలికి విసిరేశారు. వాహనంలో ఉన్న వ్యక్తిపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నెటిజన్లు ట్రోల్ చేస్తూ కమల్ అంత కోపం వద్దు.. అంటూ హితవు పలుకుతున్నారు. -
అడ్డదారిలో సీఎం కాలేదు..
సాక్షి, చెన్నై: ప్రచారంలో ప్రధాన కూటముల సీఎం అభ్యర్థులు పళనిస్వామి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆదివారం సాగిన ప్రచారంలో పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. మూడో కూటమి సీఎం అభ్యర్థి కమల్ కాలి గాయం వేధిస్తున్నా ప్రచారబాటలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జనం ఇళ్ల వద్దకే పరిమితం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటి ప్రచారం హోరెత్తింది. తమ నేతృత్వంలో గతంలో సాగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డీఎంకే, అన్నాఎంకే పార్టీలు రూపొందించి మేనిఫెస్టో అంశాలతో కూడిన కరపత్రాల్లో పథకాలకు ప్రత్యేక ఆకర్షణ పేరిట ఒకే మహిళ ఫొటోను పొందు పరిచి ఉండడం అనేక చోట్ల గందరగోళం తప్పలేదు. అగ్రనేతలు ప్రచారంలో మాటల జోరు పెంచారు. అనేకచోట్ల అధికార అభ్యర్థులకు ప్రజల నుంచి వ్యతిరేకత రాగా, మరికొన్ని చోట్ల పుష్పాలతో ఆహ్వానాలు పలికిన ఓటర్లూ ఉన్నారు. అనేక జిల్లాల్లో భానుడు భగభగ మని ప్రతాపం చూపించినా, ఉక్క పోత నడుమ ప్రచారంలో అభ్యర్థులకు ముచ్చెమటలు తప్పలేదు. ద్రోహం పెను విషం.. కాంచీపురం జిల్లా పరిధిలోని ఉత్తర మేరు పరిసరాల్లో స్టాలిన్ ప్రచారం సాగింది. ఆయన మాట్లాడుతూ ప్రకృతి విలయాలు, కరోనా విపత్తుల సమయంలో కేటాయించాల్సిన నిధుల్ని సరిగ్గా ఇవ్వలేదని ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న వ్యక్తి, ఎందుకు బీజేపీతో తాజాగా పొత్తు పెట్టుకున్నారో అని ప్రశ్నించారు. పదవి ఇచ్చిన శశికళ గుండెల్లోనే తన్నిన వ్యక్తి పళని స్వామి అని పేర్కొన్నారు. పదే పదే తానేదో రైతు అని పళని జబ్బలు చరస్తున్నాడని, నిజంగా రైతే అయితే, ఎందుకు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చారో అని ప్రశ్నించారు. అడ్డదారిలో సీఎం కాలేదు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, వందవాసిల్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో-కన్వీనర్ పళనిస్వామి సుడిగాలి పర్యటనతో ఓటర్ల వద్దకు వెళ్లారు. ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ను, కరుణానిధిని టార్గెట్ చేశారు. అన్నా మరణం తర్వాత నావలన్ నెడుం జెలియన్ సీఎం కావాల్సి ఉండగా, అడ్డదారిలో కరుణానిధి ఆ కుర్చీని కైవసం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆయనలా తానేమి అడ్డదారిలో సీఎం కాలేదని, అన్నాడీఎంకే శాసన సభా పక్షం మద్దతుగా ఆ పదవిలో కూర్చున్నట్టు పేర్కొన్నారు. తాను రైతునని, అందుకే రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్నానని తెలిపారు. అయితే, తననే కాదు, రైతుల్ని కూడా కించ పరిచే విధంగా హేళన చేస్తూ స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి చరిత్రను ఆయన చూసుకుంటే మంచిదని, లేని పక్షంలో గట్టిగానే స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తే, ప్రతి దాడికి తానూ రెడీ అని సవాల్ చేశారు. అన్నాడీఎంకేకు ప్రజలే వారసులని, అవినీతి పుట్ట డీఎంకేకు ఈ ఎన్నికల్లో మళ్లీ గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలి నొప్పితోనూ.. మక్కల్ నీది మయ్యం నేత, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి కమలహాసన్ గతంలో కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రచారంలో ఆయనకు ఇబ్బందిగా మారినట్టుంది. కాలి గాయం బాధిస్తున్నట్టుంది. అయినా, లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఆదివారం నియోజక వర్గం పరిధిలో ఉక్కడం పరిసరాల్లోని మైనారిటీలు అధికంగా ఉండే చోట్ల నడుచుకుంటూ కాసేపు, ఓపెన్ టాప్ వాహనంలో మరికాసేపు ప్రచారంలో ముందుకు సాగారు. డీఎంకేతో, బీజేపీతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయంగా తనను ఎదుర్కొనలేక ఈ విమర్శలు చేస్తున్నారని మైనారిటీల దృష్టికి కమల్ తీసుకెళ్లారు. తనకు కాషాయం రంగు పూయవద్దు అని విజ్ఞప్తి చేశారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రచార సభలతో దూసుకెళుతున్నారు. చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి! -
కమల్కు షాక్: రూ.11 కోట్లు సీజ్
సాక్షి, చెన్నై: అవినీతికి వ్యతిరేక పోరాటం పేరుతో ముందుకు సాగుతున్న కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్పై పలు అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వం మాస్క్లు, పీపీఈ కిట్లను చంద్రశేఖర్కు చెందిన అనితా టెక్స్కార్ట్ ఇండియా నుంచి సుమారు రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థపై ఐటీ దాడులు చేయడంతో విషయం బట్టబయలైంది. అలాగే ఈ సంస్థలో రూ.11కోట్ల లెక్కలో లేని నగదు పట్టుబడడమే కాకుండా సుమారు రూ.80కోట్ల పన్నును ఎగవేసినట్లు వెల్లడైంది. చదవండి: ఐటీ దాడులపై స్పందించిన తాప్సీ -
కమల్ మేనిఫెస్టో: నిరుద్యోగులు, గృహిణిలపై వరాల జల్లులు
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పదేళ్ల ప్రణాళికతో మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించారు. అధికారంలోకి వస్తే, నీట్ పరీక్షకు బదులుగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిల బస్తో సీట్ నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామ ప్రగతికి స్మార్ట్ విలేజ్ పథకం, ఆర్మీ తరహాలో ప్రజా క్యాంటీన్ల ద్వారా అన్ని రకాల వస్తువుల్ని చౌక ధరకే అందించనున్నామని ప్రకటించారు. మక్కల్ నీది మయ్యం, ఎస్ఎంకే, ఐజేకేలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతల కమల్ పోటీలో ఉన్నారు. ఈ దృష్ట్యా, కోయంబత్తూరు వేదికగా శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం కమల్ విడుదల చేశారు. ఇందులో తమిళనాడు సమగ్రాభివృద్ధి, అప్పు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగు, విద్య, వైద్య పథకాలతో ప్రజాకర్షణ అంశాలను పొందుపరిచారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేంద్రన్, పొన్రాజ్లతో కలిసి మేనిఫెస్టోను కమల్ ఆవిష్కరించారు. ప్రజల్ని బానిసలుగా, పేదలుగా మార్చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పార్టీలకు విశ్రాంతి ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో కొన్ని.. ∙రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పదేళ్ల ప్రణాళిక ∙రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ∙అన్ని రంగాల్లోనూ తమిళనాడు అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక ప్రగతి రానున్న పదేళ్లలో పది నుంచి 20 శాతం మేరకు వృద్ధి లక్ష్యంగా కార్యాచరణ ∙వ్యక్తి ఆదాయం సంవత్సరానికి 7 నుంచి పది లక్షల వరకు పెంపు ∙నదీ జలాల అనుసంధానం, జల అభివృద్ధి, వాటర్ మెనేజ్మెంట్బోర్డు, అందరికీ స్వచ్ఛమైన శుద్ధీకరించిన నీళ్లు ∙వ్యవసాయ రంగంలో హరిత విప్లవం లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, రైతుల హక్కుల పరిరక్షణ ∙జాలర్లకు జీవనాధారం, భద్రత లక్ష్యంగా చర్యలు ∙ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు. నీట్కు బదులు రాష్ట్ర స్థాయిలో స్టేట్ సిలబస్తో సిట్ పరీక్ష. అందరికీ వైద్యం, విద్య, ఉన్నత విద్యకు చర్యలు ∙గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ స్మార్ట్ విలేజ్ పథకం ∙ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం, అర్హులకు ఉద్యోగాలు, పారిశ్రామిక ప్రగతి, వృద్ధులకు భద్రత, అనాథలకు ఆపన్న హస్తం, రాజకీయ న్యాయం, సమష్టి నాయకత్వంఅభివృద్ధి చెందిన చిన్న దేశాలకు దీటుగా తమిళనాడును తీర్చిదిద్దడం లక్ష్యంగా పథకాలు అమలు. ∙గృహిణులకు జీతాలు (ఇది ఉచితం కాదు –వారికి వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం) ∙విద్యుత్, రవాణా సంస్థల బలోపేతం. ఈ సంస్థల్లో ఉద్యోగులకు వాటా. ∙ప్రజలు చౌక ధరకే అన్ని వస్తువుల్ని కొనుగొలు చేసుకునే రీతిలో ఆర్మీ క్యాంటీన్ల తరహాలో మక్కల్ క్యాంటీన్ల ఏర్పాటును మేనిఫెస్టోలో పొందుపరిచారు. సీపీఎం, టీఎంసీలు కూడా.. డీఎంకే కూటమిలోని సీపీఎం, అన్నాడీఎంకే కూటమిలోని తమాకా కూడా మేనిఫెస్టోలను శుక్రవారం ప్రకటించారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి బాలకృష్ణన్, సీనియర్ నేత టీకే రంగరాజన్ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యనిషేధం, ఖాళీగా ఉన్న 4.5 లక్షల ఉద్యోగాల భర్తీ, శరణార్థులుగా ఉన్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం అంశాలను ఇందులో పొందుపరిచారు. టీఎంసీ నేత జీకే వాసన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రభుత్వ పాఠశాలల ప్రగతి, ఫీజుల తగ్గింపు, వైద్య, వ్యవసాయ రంగాల బలోపేతం, ఆలయాలన్నీ భక్తులకు అప్పగింత, -
సొంత డబ్బుతో తిరుగుతున్నా.. అనుమతి ఎందుకివ్వరు!
సాక్షి, చెన్నై: సొంత డబ్బు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరుగుతున్నానని, ఇందుకు అనుమతి ఇవ్వకపోవడం ఎమిటో అని అధికారుల తీరుపై విశ్వనటుడు కమలహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గురువారం ఎన్నికల ప్రచారం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కమల్కు ఏర్పడింది. మక్కల్ నీది మయ్యం అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కమల్ ఉన్నారు. కోవై దక్షిణం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న దృష్ట్యా, అక్కడి నుంచే సమీప జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రైవేటు హెలికాప్టర్ సిద్ధం చేసుకున్నారు. బుధవారం కోవై నుంచి ఈరోడ్కు హెలికాప్టర్లో వచ్చి మళ్లీ ప్రచారం చేసి వెళ్లారు. గురువారం కోయంబత్తూరు నుంచి నీలగిరి జిల్లా ఊటి, కున్నురూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి కమల్ నిర్ణయించారు. ఉదయం కోయంబత్తూరు నుంచి బయలుదేరి కున్నూరు లేదా, దిట్టకల్ వద్ద హెలికాప్టర్ నుంచి దిగి, రోడ్డు మార్గంలో ప్రచారానికి నిర్ణయించారు. అయితే, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచారం ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డ సొమ్ముతో.. ప్రచారం రద్దు కావడంతో కోయంత్తూరు ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి తంగవేల్ నామినేషన్ దాఖలు కార్యాక్రమానికి కమల్ హాజరయ్యారు. మీడియాతో కమల్ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల్ని కలుసుకునేందుకు, సమయం వృథా కాకుండా వినియోగించు కునేందుకు హెలికాప్టర్ పర్యటనను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. కష్టపడ్డ సొమ్ముతో తిరుగుతున్నానని కమల్ పేర్కొన్నారు. 234 నియోజకవర్గాల్లోనూ ప్రజల్ని కలుస్తానని, లభిస్తున్న ఆదరణ చూసి అడ్డుకుంటున్నట్టుందని మండిపడ్డారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే! -
20 సీట్లు.. 30 మంది స్టార్ క్యాంపెయినర్లు!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక వీరితో పాటు స్థానిక బీజేపీ నేత, నటి గౌతమిని కూడా స్టార్ క్యాంపెయినర్గా అధిష్టానం ప్రకటించింది. కాగా అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కాషాయ పార్టీకి 20 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో రాజపాళయం సీటు కమలనాథుల చేజారడంతో, ఆ స్థానం నుంచి పోటీపడదామనుకున్న గౌతమికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్గా ఆమె సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. కాగా ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి. కమల్ వర్సెస్ గౌతమి! మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్, తమ పార్టీ 154 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ దూకుడు పెంచారు. కాగా కమల్ హాసన్- గౌతమి పదమూడేళ్ల పాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. విభేదాలు తలెత్తిన కారణంగా 2016లో వీరు విడిపోయారు. ఇక గౌతమిని స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించడంతో, ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కాగా ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కమల్కు శరత్ కుమార్, రాధిక వంటి ప్రముఖుల మద్దతు ఉంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే 1. నరేంద్ర మోదీ 2. జేపీ నడ్డా 3. రాజ్నాథ్ సింగ్ 4. అమిత్ షా 5. నితిన్ గడ్కరీ 6.నిర్మలా సీతారామన్ 7. స్మృతి ఇరానీ 8. ఎస్ జైశంకర్ 9. కిషన్రెడ్డి 10. జనరల్ వీకే సింగ్(రిటైర్డు) 11. యోగి ఆదిత్యనాథ్ 12. శివరాజ్ సింగ్ చౌహాన్ 13. సీటీ రవి 14. పురందేశ్వరి 15. పి సుధాకర్ రెడ్డి 16. తేజస్వి సూర్య 17. ఎల్ గణేషన్ 18. వీపీ దురైస్వామి 19.కేటీ రాఘవన్ 20. శశికళ పుష్ప 21. గౌతమి తాడిమల్ల 22. రాధారవి 23. కేపీ రామలింగం 24. గాయత్రీ దేవి 25. రాజ్కుమార్ గణేషన్ 26. విజయశాంతి 27. సెంథిల్ 28. వెల్లూర్ ఇబ్రహీం 29. ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్ 30. ప్రొఫెసర్ కనగ సబాపతి చదవండి: కమల్ సీఎం కావడం ఖాయం.. -
ద్రవిడ పార్టీల పెత్తనం చెల్లదంటున్న రాధిక శరత్ కుమార్
-
తమిళనాడులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
-
తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు..
-
పది చదవని హీరో కమల్హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..?
చెన్నె: సినిమాలతో అశేష జనాన్ని అలరించి లక్షలాది అభిమానం సొంతం చేసుకున్న తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్ తొలిసారి ప్రజల ముందుకు ఓటు కోసం వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి ఈసారి పోటీ చేయనుంది. ఈ సందర్భంగా కమల్ కోయంబత్తూర్ దక్షిణం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం ఆయన హాట్ టాపిక్ అయ్యారు. నామినేషన్ పత్రాల్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చర్చకు దారి తీశాయి. మొత్తం ఆస్తులు రూ.176.93 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో కమల్ ప్రకటించారు. వాటిలో స్థిరాస్తులు రూ.131.84 కోట్లుగా, చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. దీంతోపాటు లండన్లో రూ.2.50 వేల డాలర్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల లగ్జరీ కారు, రూ.కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉందని అఫిడవిట్లో పొందుపర్చారు. ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రూ.49.5 కోట్లు అప్పు ఉందని తెలిపారు. అయితే కమల్ మాత్రం పదో తరగతి కూడా చదవలేదు. తాను 8వ తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపారు. రూ.17.79 కోట్ల విలువైన వ్యవసాయ భూములు (37.59 ఎకరాలు), చెన్నెలో రూ.92.05 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. చెన్నెలో ఉన్న రెండు నివాసాలు విలువ రూ.19.5 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో కమల్హాసన్ మూడో కూటమిని ఏర్పాటు చేశారు. మూడో కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కమల్హాసన్ ఎలాంటి ప్రభావం చూపిస్తారోనని దక్షిణ భారతదేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. చదవండి: ఎన్నికల వేళ బీజేపీ షాకిచ్చిన తమిళనాడు సీఎం -
శుభముహూర్తం కలిసొచ్చింది..!
సాక్షి, చెన్నై: శుభముహూర్తం కావడంతో సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. సీఎం పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, మక్కల్ నీది మయ్యం నేత కమల్హాసన్, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. ఇక సోమవారం ముహూర్తం బాగుండడంతో నేతలందరూ నామినేషన్ల దాఖలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో కొన్ని సీట్లు మినహా మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎడపాడిలో పళనిస్వామి, కొళత్తూరులో స్టాలిన్, కోయంబత్తూరు దక్షిణంలో కమలహాసన్, కోవిల్ పట్టిలో దినకరన్, తిరువొత్తియూరులో సీమాన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అనంతరం ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. మంత్రులు, ముఖ్య నేతలంతా ఇదే రోజు నామినేషన్లు దాఖలు చేయనుండడంతో ఆయా కార్యాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో అభ్యరి్థతో పాటుగా మరొకరిని మాత్రమే రిటరి్నంగ్ అధికారుల వద్దకు అనుమతించనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రూ. 100 కోట్లు స్వాధీనం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో శనివారం నాటికి రూ. 100 కోట్ల నగదు, నగలు, వస్తువులు పట్టుబడినట్లు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. శని, ఆదివారాల్లోనూ పెద్దఎత్తున పట్టుబడిన నగదు, వస్తువుల వివరాలను సోమవారం ప్రకటించనున్నారు. ఆదివారం ఆవడిలో పాత సామాన్ల వ్యాపారి శరవణన్ ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 17 లక్షలు పట్టుబడింది. అలాగే తిరుప్పూర్లో మంత్రి ఉడములై రాధాకృష్ణన్ ముఖ చిత్రంతో వాచీలు, చీరలు, దోవతీలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కోవిల్ పట్టిలో తనిఖీని అడ్డుకున్న మంత్రి కడంబూరు రాజుపై కేసు నమోదుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరక్కాణం, చెంగల్పట్టు, వేలూరులో సాగిన సోదాల్లో రూ. 1.97 కోట్ల విలువ చేసే నగదు, నగలు, మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. మన్నార్కుడిలో 64 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. తిరుపతి నుంచి పట్టుచీరలు కొనేందుకు వచ్చిన ఓ బృందం వద్ద రూ. 2.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్లో ఓ హెలికాఫ్టర్ దిగడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అందులో తనిఖీలు జరిపారు. అయితే ఆ హెలికాఫ్టర్లో కేరళకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారి కల్యాణ రామన్ తన కుటుంబంతో అంకాల పరమేశ్వరి ఆలయ దర్శనానికి వచ్చినట్టు విచారణలో తేలింది. చదవండి: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..: అన్నాడీఎంకే వరాల జల్లు! -
తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కూటములైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కివచ్చింది. 178 స్థానాల్లో పోటీ చేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. మూడో కూటమి కోసం నటుడు కమల్హాసన్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి అన్నాడీఎంకే కూటమి 25 సీట్లు కేటాయించినట్లు తెలుస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. డీఎండీకే మినహా అన్ని పార్టీల్లో సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన డీఎండీకే 20–25 సీట్లు కోరుతుండగా 15 స్థానాలకు పరిమితం కావాలని అన్నాడీఎంకే సూచిస్తున్న దశలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మరోసారి అన్నాడీఎంకే, డీఎండీకే మధ్య మళ్లీ చర్చలు జరగ్గా 18 సీట్లు ఖరారైనట్లు సమాచారం. డీఎంకే సీట్ల పంపకాలు డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించినవి పోను మిగిలిన 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. డీఎంకే కూటమిలో ఇండియన్ ముస్లీం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చికి 2, సీపీఐకి 6, ఎండీంకేకు 6, వీసీకేకు 6 సీట్ల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్కు 25 సీట్లను కేటాయించారు. కన్యాకుమారి లోక్సభ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. సీపీఐ నేతలతో స్టాలిన్ సోమవారం చర్చలు జరిపి 6 సీట్లను, తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. సోమవారం వరకు జరిపిన కేటాయింపుల తరువాత 180 స్థానాలు మిగిలి ఉండగా వీటిల్లో 178 డీఎంకే నియోజకవర్గాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం అమ్మముక కూటమిగా చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే)పార్టీలో ఉన్నారు. వీర్పప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, డీఎంకే కూటమిలోని టీవీకే ద్వారా వేర్వేరు స్థానాల్లో వీరువూరు పరస్పర ప్రత్యర్ది పార్టీల నుంచి తలపడేందుకు సిద్దం అవుతున్నారు. -
రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్
సాక్షి, చెన్నై: రండి కలిసి పనిచేద్దాం అని పరోక్షంగా తలైవా రజనీకాంత్కు మక్కల్ నీది మయ్యం నేత కమల్హాసన్ పిలుపునిచ్చారు. శనివారం చెన్నై పోయెస్ గార్డెన్లో దక్షిణ భారత చలన చిత్ర సూపర్స్టార్ రజనీకాంత్తో కమల్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆదివారం చెన్నైలో కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కట్చి నాలుగో వసంతం వేడుక జరిగింది. ఇందులో పార్టీ నేతలతో మాట్లాడే సమయంలో తలైవాకు పరోక్షంగా కమల్ పిలుపునిచ్చారు. రండి కలిసి పనిచేద్దాం అని పిలుపునిస్తూ వ్యాఖ్యలు చేశారు. తలైవాగా పిలవబడే నాయకుడు రోజూ వారి రాజకీయ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారని, రండి కలిసి పనిచేద్దాం అని కమల్ పిలుపునివ్వడం గమనార్హం. చదవండి: అగ్ర హీరోల భేటీ: తమిళనాడులో కాక -
కమల్ కాలుకు సర్జరీ..
విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో ఇటీవల ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు మంగళవారం కమల్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కుడి కాలు ఎముకకు స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా కమల్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు వివరించారు. దీంతో ఆయన కాలికి సర్జరీ చేశామన్నారు. ప్రస్తుతం కమల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. కమల్ కోలుకుంటున్నారని మరో 4, 5 రోజుల్లో డిశ్చార్జీ కానున్నారని వైద్యులు తెలిపారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కమలహాసన్ కొన్ని నెలలుగా ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన ఆయన తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కమల్ ప్రణాళిక వేసి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం. -
కమల్ వ్యాఖ్యలను ఖండించిన కంగనా
ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైని పాక్ అక్రమిత కశ్మీర్గా పేర్కొనడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, కంగనాలు ఒకరిపై ఒకరు విరుచకుపడుతూ మాటల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలో కంగనా పలువురు ప్రముఖులపై అనుహ్య వ్యాఖ్యలు చేస్తూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ఆమె మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, హీరో కమల్ హాసన్పై విరుచుకుపడ్డారు. కాగా త్వరలో రాబోయే తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో కమల్ హాసన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి) Don’t put a price tag on sex we have with our love, don’t pay us for mothering our own, we don’t need salary for being the Queens of our own little kingdom our home,stop seeing everything as business. Surrender to your woman she needs all of you not just your love/respect/salary. https://t.co/57PE8UBALM — Kangana Ranaut (@KanganaTeam) January 5, 2021 దీంతో కంగనా, కమల్ ఆలోచనను తప్పుబడుతూ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి. మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగరానికి వెల కట్టడం కరెక్ట్ కాదు. ఓ భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు.. సమాజంలో గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ కంగనా మండిపడ్డారు. అయితే కమల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శిశీథరూర్ సమర్థించారు. ఆయన ఆలోచన తీరు ప్రశంసనీయమని థరూర్ ఆయనను కోనియాడారు. (చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!) -
రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!
సాక్షి, చెన్నై: రజనీకాంత్ కోరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంచీపురం జిల్లాల్లో పర్యటించారు. పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనే కోరితే మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు రజనీ తనను ప్రకటిస్తే అంగీకరిస్తానని బదులిచ్చారు. డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎందుకు చూపడం లేదని విమర్శించారు.రేషన్కార్డుదారులకు ప్రభుత్వం రూ.2,500 ఇస్తోందని.. తాను డబ్బులు కన్నా ప్రజలను విశ్వసిస్తానని చెప్పారు. చిన కాంచీపురంలోని చేనేత కార్మికులను కలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. -
తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి
సాక్షి హైదరాబాద్ : తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే సమాధానమిస్తాయి. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. బిహార్ అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మక్క ల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమల్ హాసన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ‘పొత్తు’పొడిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జట్టుగా, కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పో టీ చేయనున్నారని, ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్ సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ సోమవారం ప్రకటించారు. అయితేతా ము పోటీ చేసే నియోజకవర్గాలపై త్వరలోనే స్పష్టతనిస్తావన్నారు. జనవరి మా సాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాట 25 సీట్లలో పోటీ చేయాలని, ఈ స్థానాల్లో కమల్తో పొత్తు పెట్టుకోవాలని అసద్ నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడ మజ్లిస్ పాగా వేసేనా? ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అసద్ ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్కు చెంది న నేతలతో హైదరాబాద్లో శనివారం భేటీ అయిన ఒవైసీ ఫలవంతమైన చ ర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తమిళనాట మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి బిహార్ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలు స్తోంది. ‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు’ అని మజ్లిస్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!
చెన్నై: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్ నేతలతో హైదరాబాద్లో శనివారం భేటీ అయిన ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్, రాణీపేట్, తిరపత్తూర్, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ, తమిళనాడు ఆఫీస్ బేరర్లతో సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ హాసన్ సోమవారం ప్రకటించారు. అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం.(చదవండి: బెంగాల్లో ఎగరనున్న గాలిపటం!) కాగా 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్ ముస్లింలీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనితనేయ మక్కల్ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తోహీద్ జమాత్ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ గత నెలలో ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) జనరల్ సెక్రటరీ దురైమురుగన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టుకట్టే అంశం గురించి ప్రస్తావించామని, అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఏఐడీఎంకే పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు బదులుగా బీజేపీకి మద్దతు పలికే పార్టీతో తాము కలిసి నడిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే కమల్హాసన్తో ఒవైసీ జట్టుకట్టనున్నారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక సూపర్స్టార్ రజనీకాంత్ సైతం జనవరిలో రాజకీయ పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
అప్పులున్నాయి, ప్లీజ్ సపోర్ట్: అవినాష్ సింపథీ గేమ్?
బిగ్బాస్ హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్ మీదే ఆధారపడి ఉందని నాగార్జున మరోసారి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చెప్పేది నమ్మకండని సూచిస్తూ షో ప్రారంభించారు. కెప్టెన్ అమ్మ రాజశేఖర్ ఇంట్లో అందరినీ శివాలెత్తిస్తారని చెప్పుకొచ్చారు. హౌస్లో ఎవరి మీదైనా ఫిర్యాదులున్నాయా అని ఇంటిసభ్యులను ఆరా తీశారు. అభిజిత్ మాస్టర్ తాము చెప్పేది వినిపించుకోవడం లేదని చెప్పాడు. కానీ నాగార్జున మాత్రం మాస్టర్ కెప్టెన్ అంటూ అతడినే వెనకేసుకురావడం గమనార్హం. అలాగే టీ స్టాండు టాస్క్లో దగ్గర ఆత్మగౌరవం అంటూ ఆట మధ్యలో నుంచి నిష్క్రమించడాన్ని తప్పు పట్టారు. ఎవరు వెలిగే దీపం, ఎవరు ఆరిపోయే దీపం? కంటెస్టెంటు వెలిగే దీపం ఆరిపోయే దీపం అభిజిత్ మోనాల్ అమ్మ రాజశేఖర్ అరియానా అవినాష్ అభిజిత్ మోనాల్ అఖిల్ అరియానా సోహైల్ మెహబూబ్ అరియానా అవినాష్ అరియానా మోనాల్ హారిక లాస్య అవినాష్ లాస్య హారిక అరియానా మెహబూబ్ సోహైల్ అరియానా అమ్మ రాజశేఖర్ అరియానా అఖిల్ అఖిల్ మోనాల్ అమ్మ రాజశేఖర్ మోనాల్ను దగ్గరకు తీసుకున్న అఖిల్ మోనాల్ ఒంటరిగా ఫీలవడాన్ని చూసి ఏమైందని నాగ్ ప్రశ్నించారు. అఖిల్ నామినేట్ చేయడం తట్టుకోలేకపోయానని, తనతో మాట్లాడేందుకు ప్రయత్నించా కానీ పట్టించుకోలేదని వాపోయింది.. ఈ హౌస్లో అతడు నా ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీని గురించి అఖిల్ స్పందిస్తూ ఆమె స్ట్రాంగ్ అవ్వాలనే అలా చేశానని సమాధానమిచ్చాడు. దీంతో నాగ్ ఆమె నీకు ఫ్రెండా? అంత కన్నా ఎక్కువా? అని సూటి ప్రశ్న విసిరాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డ అఖిల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఇదే ప్రశ్నను మోనాల్ను అడగ్గా ఆమె కూడా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నోయల్ అవుట్, మోకరిల్లి దండం పెట్టిన అవినాష్) తన ముఖంలో చిరునవ్వులు వెలిగించే దీపం అఖిల్.. అయితే అఖిల్ను వెలిగే దీపమని మోనాల్ చెప్పడంతో అతడు సంతోషం పట్టలేక ఆమెను హత్తుకుంటూ ఇన్నాళ్ల ఎడబాటుకు చెక్ పెట్టాడు. ఇక అరియానా డిక్టేటర్ కెప్టెన్ అని చాలామంది ఇంటిసభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ ఆమె మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఆమె కెప్టెన్ అయినప్పుడు అందరికీ సమానంగా పనులు అప్పగించలేదని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. ఎందుకని ప్రశ్నిస్తే నాకు కొందరి కంఫర్ట్ కావాలని సమాధానమిచ్చిందని అరియానాలోని మరో కోణాన్ని వెల్లడించాడు. ఇక మోనాల్ను నామినేట్ చేసినందుకు అఖిల్ను ఆరిపోయే దీపమని చెప్పాడు. అఖిల్ ఆమెకు ట్రూ ఫ్రెండ్ కాదన్నాడు. (చదవండి: ఏయ్ హారిక, నోర్మూయ్: చెలరేగిన మాస్టర్) హారికను సేఫ్ చేసిన కమల్ హాసన్ నిజంగానే నాగ్ చెప్పినట్టు తొలిసారి బిగ్బాస్ షోలో అద్భుతం జరిగింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా వర్చువల్ తెరమీద కనిపించారు. మన కంటెస్టెంట్లను వారికి, అక్కడి వాళ్లను మనవారికి పరిచయం చేశారు. మీ హౌస్ ఫుల్లుగా ఉందేంటి అనగా అది నాకు నచ్చని మాట అని కమల్ కౌంటరేశారు. అలా కాసేపు సరదాగా సంభాషించి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు. అనంతరం కమల్ తెలుగు బిగ్బాస్కు వీడ్కోలు తీసుకునే ముందు హారికను సేఫ్ చేశారు. తర్వాత నాగ్ మరో ట్విస్టు ఇచ్చారు. టీ స్టాండు టాస్కులో చివరి వరకు ఆడిన మోనాల్, అవినాష్లు తర్వాతి వారం ఇమ్యూనిటీ పొందేందుకు మరో అవకాశాన్ని ఇచ్చారు. అందులో భాగంగా ఇద్దరికీ చెరో బుట్ట ఇచ్చి అందులో ఇంటిసభ్యులను ఒప్పించి వారి వస్తువులను త్యాగం చేయాలని కోరాలి. ఎవరి బుట్ట బరువెక్కితే వారు ఇమ్యూనిటీ పొందుతారు. (చదవండి: హిమాలయాలకు వీడ్కోలు) షో వదులుకున్నా, అప్పులున్నాయి, సపోర్ట్ చేయండి.. దీంతో అవినాష్ మిగతా మిగతా కంటెస్టెంట్ల దగ్గర బేరసారాలాడాడు. "నేను షోను వదులుకుని వచ్చాను. మళ్లీ తీసుకోమన్నారు. ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి. మా కుటుంబాన్ని నేనే చూసుకోవాలి" అని తన బాధను ఏకరువు పెట్టాడు. మరోవైపు మోనాల్ తనకు ఇమ్యూనిటీ అవసరమంటూ సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు చేయలేనని లాస్య నిర్మొహమాటంగా చెప్పింది. మిగతావాళ్లు సపోర్ట్ చేయలేమని నేరుగా చెప్పకుండా చేతల్లో నిరూపించారు. మోనాల్కు సపోర్ట్ చేద్దామనుకున్న సోహైల్ను మెహబూబ్ వద్దని వారించాడంతో అవినాష్ కోసం తన వస్తువుల త్యాగానికి సిద్ధపడ్డాడు. ఇమ్యూనిటీ పొందిన అవినాష్ హారికకు మోనాల్కు సపోర్ట్ చేయాలని ఉన్నప్పటికీ అవినాష్ తనకే చేయాలని పట్టుపట్టాడు. కానీ అతడు పక్కు వెళ్లగానే మోనాల్ బుట్టలో తన వస్తువులను వేయడానికి సిద్ధపడగా అప్పటికే బజర్ మోగింది. దీంతో అఖిల్ ఒక్కడే మోనాల్కు సపోర్ట్ చేయగా లాస్య, సోహైల్, మెహబూబ్, అరియానా.. అవినాష్కు మద్దతు తెలిపారు. దీంతో మోనాల్ బుట్ట 13 కిలోలు, అవినాష్ బుట్ట 23 కిలోల బరువు తూగగా తర్వాతి వారానికి గానూ అవినాష్కు ఇమ్యూనిటీ లభించిందని నాగ్ ప్రకటించారు. ఇక కెప్టెన్గా అందరి మీదా అజమాయిషీ చేస్తోన్న అమ్మ రాజశేఖర్ రేపటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. (చదవండి: బిగ్బాస్: కెప్టెన్గా మాస్టర్, మరి ఎలిమినేషన్?) -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- కమల్ హాసన్
-
శంకర్ సినిమాలో పాయల్కు అవకాశం?
ఆర్ఎక్స్-100తో కుర్రకారు మనసు దోచుకున్న నటి పాయల్ రాజ్పుత్. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సాధించిన ఈ నటికి ఊహించిన విధంగా ఆఫర్లు రావడం లేదు. వెంకీ మామ, డిస్కో రాజా వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కెరీర్ పరంగా ఆమెకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. అయితే ఈ అమ్మడికి ఊహించని అవకాశం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాయల్కు నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఆయన కమల్హాసన్ కథానాయకుడిగా ‘ఇండియన్ 2’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. (చదువులో నేను టాపర్: సమంత) ఈ చిత్రంలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ప్రత్యేక గీతం కోసం పాయల్ను చిత్ర బృందం సంప్రదించిందని టాక్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్కు అవకాశం వస్తే పెద్ద బ్రేక్ దొరికినట్లేనని, శంకర్ సినిమాలో కనిపిస్తే అటు నార్త్ ఇటు సౌత్లో ఫుల్ క్రేజ్ పెరుగుతుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (తండ్రి అయిన దర్శకుడు) -
రెండు గంటల్లో పాట రాసిన కమల్
-
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
అలా కూర్చుంటే తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది?
-
ఇండియన్-2 ప్రమాదం: హైకోర్టుకు కమల్
సాక్షి, చెన్నై : తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో అత్యవసర పటిషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్-2 చిత్ర షూటింగ్ సందర్భంగా చెన్నైలో ఇటీవల ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు టెక్నీషియన్ మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసుల విచారణ తీరుపై అభ్యంతకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కమల్ పిటిషన్ను అత్యవసర విచారణకు మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. (దర్శకుడు శంకర్కు తీవ్ర గాయాలు) -
కమల్ హాసన్కు పోలీసు నోటీసులు
విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు చైన్నై పోలీసులు నోటీసులు జారీ చేశారు. దర్శకుడు శంకర్.. లైకా పోడక్షన్లో నిర్మిస్తున్న ‘ఇండియన్ -2’ సినిమా సెట్లో బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు(28)తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ(34).. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్(60) ఉన్నారు. ఈ ఘటనపై చెన్నైలోని పూనమలి పోలీసులు లైకా ప్రొడక్షన్స్ అధినేత, చిత్ర నిర్మాత ఎ.సుబస్కరన్లపై కేసు నమోదు చేసి నోటిసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా ప్రమాదం నుంచి హీరో కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటీలో తప్పించుకోగా, డైరెక్టర్ శంకర్ కాలికి గాయమైంది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (కోటి రూపాయలు ప్రకటించిన కమల్హాసన్) కాగా మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల చోప్పు కమల్ హాసన్ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు. అంతేగాక హస్పీటల్లో చికిత్స పొందుతున్న గాయపడ్డ 10 మందిని ఆయన పరామర్శించి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. లైకా పోడక్షన్ సంస్థ కూడా వారికి సాయం అందిస్తుంది. దర్శకుడు శంకర్ కూడా తోడుంటానని హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై చైన్నై పోలీసులు లైకా సంస్థ యజమానితో పాటు, చిత్ర నిర్మాతలపై.. క్రేన్ యాజమాని, ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్ 287(యంత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించడం), 377 పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెట్లో ప్రమాదం: అసలేం జరిగింది? -
కోటి రూపాయలు ప్రకటించిన కమల్హాసన్
సాక్షి, చెన్నై: భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు టెక్నీషియన్ల కుటుంబాలకు హీరో కమల్హాసన్ ఆపన్న హస్తం అందించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్లో బుధవారం రాత్రి భారీ క్రేన్ పడిపోవడంతో సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని కమల్హాసన్ ట్విటర్లో పేర్కొన్నారు. గాయపడిన 9 మంది తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆకాంక్షించారు. కాగా.. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున, గాయపడిన వారికి తలా 50 లక్షలు ఇవ్వనున్నట్టు లైకా నిర్మాణ సంస్థ తెలిపింది. (భారతీయుడు–2 ప్రమాదం: ఎలా జరిగింది?) మాటలు రావడం లేదు: కాజల్ గుండెను బరువెక్కించే ఈ ఘటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఊహించని దుర్ఘటనలో ముగ్గురు సహచరులను కోల్పోవడం పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. కృష్ణ, చంద్రన్, మధుల మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ బాధను తట్టుకునే శక్తిని వారి కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని కోరుకున్నారు. సెట్లో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసిందని, కళ్లుమూసి తెరిచేలోగా అంతా జరిగిపోయిందన్నారు. ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన తాను, ఈ ఘటనతో సమయం, జీవితం విలువ గురించి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. -
సెట్లో ప్రమాదం: అసలేం జరిగింది?
సాక్షి, చెన్నై : భారతీయుడు–2 సినిమా షూటింగ్లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదం నుంచి హీరో కమల్హాసన్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరగడానికి 10 సెకన్ల ముందు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని కాస్టూమ్ డిజైనర్ అమృతరామ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఘోర ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. 10 సెకన్ల తేడాతో క్రేన్ ప్రమాదం నుంచి బయటపడ్డాం. మీ ఆశీర్వాదాల కారణంగానే కమల్ సార్, కాజల్, నేను సురక్షితంగా ఉన్నాం. మేము బస చేసిన టెంట్పైనే భారీ క్రేన్ కూలిపోయింది. మేమంతా క్షేమంగా ఉన్నాం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సహచరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాన’ని అమృత ట్వీట్ చేశారు. అసలేం జరిగింది? ఊహించని ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ‘ఇండియా టుడే’తో అమృత అన్నారు. ఫైటింగ్ సీన్ తీసేందుకు రెడీ అవుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అప్పటికే రెండు సీక్వెన్స్ పూర్తి చేసి మూడోది తీసేందుకు సమాయత్తమవుతుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. ప్రమాదజరిగిన తర్వాత కొన్ని నిమిషాల పాటు తాను షాక్లో ఉండిపోయానని చెప్పారు. ‘దర్శకుడు శంకర్ సార్ నాలుగు రోజులుగా భారీ ఫైటింగ్ సీక్వెన్స్ తీస్తున్నారు. అప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది. గతరాత్రి మేము రెండు షాట్స్ పూర్తి చేశాం. మూడో షాట్కు రెడీ అవుతుండగా సెకన్ల వ్యవధిలో ప్రమాదం జరిగిపోయింది. తర్వాతి షాట్కు జరుగుతున్న రిహార్సల్ను, లైటింగ్ను శంకర్, సినిమాటోగ్రాఫర్ లైటింగ్ పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి కొద్ది దూరంలోనే వారిద్దరూ ఉన్నారు. కమల్హాసన్ సార్, కాజల్ అగర్వాల్, నేను, మాతో పాటు ఉన్న హాలీవుడ్ మేకప్మేన్ మానిటర్ టెంట్లో కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇంతలోనే క్రేన్ అంటూ పెద్దగా అరుపులు వినిపించడంతో టెంట్ నుంచి బయటకు పరుగులు తీశాం. తర్వాత వచ్చి చూస్తే భారీ క్రేన్ కూలిపోయింది. అంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. కొద్ది నిమిషాల పాటు నా మెదడు స్తంభించిపోయింది. కమల్, కాజల్ కూడా షాక్కు గురయ్యారు. గతంలో ఎన్నో ప్రమాదాలకు గురైన కమల్ సార్ వెంటనే తేరుకుని అందరినీ అప్రమత్తం చేశారు. అంబులెన్స్ వచ్చే వరకు వేచివుండకుండా క్షతగాత్రులను మనమే ఆస్పత్రికి తీసుకెళదామని అన్నారు. తన సినిమా సెట్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో శంకర్ సార్ చాలా ఆవేదనకు గురయ్యారు. శృతిహాసన్ ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాను. తన తండ్రికి ఏమీ కాలేదన్న విషయం తెలియడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. సెట్లోని మిగతా వారి గురించి కూడా శృతి ఆరా తీసింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో తలుచుకుంటేనే వణుకు పుడుతోంద’ని అమృత అన్నారు. ప్రాణాలు కోల్పోయింది వీరే.. ఈ దుర్ఘటనలో ముగ్గురు మంచి సాంకేతిక నిపుణులను పోగొట్టుకున్నామని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. సహాయ దర్శకుడు కృష్ణ, ఆర్ట్ అసిసెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. భారతీయుడు–2 సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం జరగడం తమను ఎంతోగానో బాధించిందని ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భారతీయుడు–2 షూటింగ్లో ఘోర ప్రమాదం -
భారతీయుడు 2 షూటింగ్లో ఘోర ప్రమాదం
-
దర్శకుడు శంకర్కు తీవ్ర గాయాలు
సాక్షి, చెన్నై : కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు–2 సినిమా షూటింగ్లో బుధవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దర్శకుడు శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, సహాయ దర్శకుడు కృష్ణ, కేటరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన చంద్రన్ ఉన్నట్లు తెలిసింది. చెన్నై శివారు పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో భారతీయుడు–2 చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ క్రేన్లతో ప్రత్యేక సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో 150 అడుగులున్న క్రేన్ హఠాత్తుగా కిందకు పడిపోయింది. ఆ సమయంలో సమీపంలోని ఓ టెంటులో దర్శకుడు శంకర్ తన అసిస్టెంట్లతో కలిసి మానిటర్లో రషెస్ చూస్తుండగా.. ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆ సమయంలో చిత్రహీరో కమల్హాసన్ సెట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక కార్యక్రమాలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం. ప్రమాదం నా మనసును కలచివేసింది: కమల్హాసన్ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంపై కమల్హాసన్ ట్విటర్లో స్పందించారు. ‘ సెట్స్లో జరిగిన ప్రమాదం మనసుని కలచివేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం. నా బాధ కన్నా వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నోరెట్లు ఎక్కువ’ అని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సాగుభూతిని తెలిపారు. -
పౌర ప్రకపంనలు : కమల్ హాసన్ను అడ్డుకున్న పోలీసులు
-
కమల్ హాసన్ను అడ్డుకున్న పోలీసులు
చెన్నై : బీజేపీ నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మద్రాస్ యునివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు బుధవారం కమల్ అక్కడికి వెళ్లారు. కానీ కమల్ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేయడంతో బయటినుంచే విద్యార్థులతో మాట్లాడారు. 'ఈ బిల్లు దేశానికి సంబంధించినది. ఏ బిల్లు వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదు. ఇది ప్రజలకు మంచి చేయదనుకుంటే ప్రభుత్వం దానిని వెనుకకు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా నియంతృత్వ పాలనవైపు అడుగులు వేయడం దురదృష్టకరం' అని కమల్హాసన్ పేర్కొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో కమల్హాసన్ కూడా ఉన్నారు. (చదవండి : పౌర బిల్లుపై దీదీ కీలక వ్యాఖ్యలు..) Kamal Haasan: I am not allowed to go inside. Till I die, I will call myself a student, I have come here in that capacity to be their defender. I will keep voicing whether or not I have started a party and now that I have started a party it becomes my duty to be here. https://t.co/pkdsv1MFxP pic.twitter.com/56Kpn9AFHu — ANI (@ANI) 18 December 2019 -
కమల్ హాసన్ను కలిసిన రాఘవ లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ నటుడు రాఘవ లారెన్స్ తమిళ తలైవా రజనీకాంత్కు వీరాభిమాని. చెన్నైలో జరిగిన దర్బార్ ఆడియో లాంచ్లో ఆయన చేసిన ప్రసంగం ఎన్నో చిక్కులను తెచ్చిపెట్టింది. చిన్నతనంలో కమల్ హాసన్ పోస్టర్లపై పేడ విసిరాను అని చెప్పడంతో కమల్ అభిమానులు రాఘవను దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో రాఘవ ఈ విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా ఆయన కమల్ హాసన్ను కలిసి ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నాడు. అనంతరం వీరిద్దరూ ఆత్మీయంగా కలిసి దిగిన ఫొటోను రాఘవ ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. నన్ను ట్రోల్ చేసేముందు పూర్తి వీడియో చూడాలని కోరారు. చిన్నతనంలో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్పై ఉన్న ప్రేమతో ఇతర నటుడైన కమల్ హాసన్ పోస్టర్లపై పేడ విసిరానన్నారు. కానీ పెద్దయ్యాక రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నడుస్తుంటే సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. దయచేసి తన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కమల్ హాసన్ అభిమానులను కోరాడు. ‘నేను నిజంగా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు కోరేవాన్ని. కానీ, నేనేం తప్పుగా మాట్లాడలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి. నాకు కమల్ సర్ అంటే ఎంతో గౌరవం. నాపై ప్రేమ చూపించిన కమల్ హాసన్కు కృతజ్ఞతలు’ తెలిపారు. కాగా రాఘవ తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన హారర్ చిత్రం కాంచనను హిందీలో ‘లక్ష్మీబాంబ్ ’పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. (చదవండి: కమల్, రజనీ సెన్సేషనల్ న్యూస్) -
వారికి కూడా శివాజీ గణేశన్కు పట్టిన గతే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: వెండితెర నటులుగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్హాసన్, రజనీకాంత్ రాజకీయ అజ్ఞానులని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదని ఎద్దేవా చేశారు. సేలం జిల్లా, నగర అన్నాడీఎంకే నిర్వాహకులతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఓమలూరులో మంగళవారం సమావేశమై పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అనంతరం ఆయన పత్రికాప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకొంటున్న మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ ఇటీవలి ఉపఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని ఎడపాడి ప్రశ్నించారు. ‘కమల్ పెద్ద నాయకుడే కదా, గడిచిన లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. పాపం ఆయనకు వయస్సు దాటిపోయి వృద్ధాప్య దశలోకి చేరుకోవడంతో సినిమా అవకాశాలు రాక రాజకీయ ప్రవేశం చేశారు. సినిమాలు విజయం సాధించక పోవడంతో కనీసం తమ పార్టీవారైనా చూస్తారనే ఆశతోనే కమల్హాసన్ మక్కల్ నీది మయ్యం స్థాపించాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించవచ్చు. అది తప్పుకాదు. అయితే ఇతరులను దూషించడం తప్పు. ఇంతకాలం ఆయన ఎక్కడున్నారు. నేను 1974లో అన్నాడీఎంకేలో చేరి పార్టీ కోసం 45 ఏళ్లపాటు పాటుపడ్డాను. ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకెళ్లాను. ప్రజాభిమానంతో సీఎం దశకు చేరుకున్నాను. రజనీ, కమల్ వెండితెర నటులు, రాజకీయం తెలియదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల సంఖ్య కూడా తెలియదు. ప్రజల సమస్యలపై అవగాహన లేదు. శివాజీగణేశన్ సొంతపార్టీ పెట్టి ఎన్నికల సమయంలో ఏమైనారో అందరికీ తెలుసు’ అంటూ రజనీకాంత్, కమల్ హాసన్లపై విమర్శలు గుప్పించారు. కాళ్లపై పడి ఎవరైనా సీఎం అవుతారు.. శివాజీ గణేశన్ రాజకీయ జీవితంపై సీఎం పళనిసామి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమాన సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇతరులు కాళ్ల మీద పడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తికి.. ఆత్మాభిమానం గల మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది. పళనిసామికి అధికారం మాత్రమే ఉందని.. పదవి పోయిన తర్వాత ఆయనను ఎవరూ గుర్తుపెట్టుకోరని.. అదే శివాజీ గణేశన్ మాత్రం తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొంది. ఒకప్పడు తమ అభిమాన నటుడి ప్రచారంతో అన్నాడీఎంకే గెలుపొందిన విషయాన్ని సీఎం మరిచిపోయినట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కమల్, రజనీ అభిమానులు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికి సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. -
మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్లో ఉండటం ఖాయం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో రజనీ పోలీస్ గెటప్లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ను గ్రాండ్గా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ‘దర్బార్’ చిత్ర తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్ పోస్టర్లను కమల్ హాసన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు వంటి స్టార్ల చేతుల మీదుగా విడుదల చేయించింది. ప్రస్తుతం రజనీ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఆదిత్య అరుణాచలం’గా రజనీ విలన్లు రఫ్పాడించనున్నాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే తలైవా పదాలతో పాటు, రజనీ అడుగుల చప్పుడు హార్ట్ బీట్ను పెంచేస్తున్నాయి. దీంతో ‘దర్బార్’ బాక్సాపీస్ వద్ద దంచికొట్టడం ఖాయమని రజనీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది. -
వేడుక చేద్దాం.. లవ్ యూ పప్పా: శృతిహాసన్
చెన్నై : సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి.. విలక్షణ నటుడు కమల్ హాసన్. విభిన్న పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దశావతరంలో పది పాత్రలు పోషించి తను చేయలేని క్యారెక్టర్ లేదని నిరూపించుకున్నాడు. మరో చరిత్ర, భారతీయుడు, స్వాతి ముత్యం వంటి చిత్రాల్లో నటించి లెజెండ్ అనిపించుకున్నాడు. నవంబర్ 7(గురువారం) లోక నాయకుడి పుట్టిన రోజు. 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోడానికి కమల్ తన స్వగ్రామమైన ‘పరమక్కుడి’ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆయన 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. ఈ ట్రిప్కి కుటుంబ సభ్యులతోపాటు తన టీం మొత్తం వెళ్లారు. ఈ క్రమంలో ఊరుకు వెళ్లే ముందు ఎయిర్పోర్టులో కుటుంబంతో దిగిన ఫోటోలను అక్షర హాసన్ ఇన్స్టాగ్రామ్లో షేర్చేశారు. ఇక శ్రుతి హాసన్ సైతం తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యపీ బర్త్డే బాపూజీ. ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం మీ 60 ఏళ్ల సినీ ప్రయాణానికి ఓ నిదర్శనం. పుట్టిన రోజుకి మన స్వగ్రామానికి వచ్చాం. అక్కడ వేడుక చేసుకున్నాం. అలాగే మీ జీవితంలో మేము కూడా భాగమయ్యాం. లవ్ యూ లాట్స్ పప్పా’ అంటూ విషేస్ తెలిపారు. కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్తో సహా అన్నయ చారు హాసన్ ట్రిప్కు వెళ్లగా అక్కడ కమల్ తండ్రి శ్రీనివాసన్ విగ్రహన్నిఆవిష్కరించనున్నారు. వృత్తి పరంగా శ్రీనివాసన్ న్యాయమూర్తి అలాగే స్వాతంత్య్ర సమర మోధుడు. ఇక ఈ వేడుకల్లో పాల్గొనడానికి లజెండ్ శివాజీ గణేశన్ కొడుకు నటుడు ప్రభు సైతం పరమక్కుడికి వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకల అనంతరం కమల్ నవంబర్ 8న తిరిగి చెన్నైకి వచ్చి తన కార్యలయంలో సినీ గురువు, లెజెండరీ ఫిల్మ్మేకర్ కె.బాల చందర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక కమల్ హసన్ 1954లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమక్కుడిలో జన్మించారు. స్వతహాగా తమిళనటుడైనా తన విలక్షణ నటనతో దేశమంతటికీ సుపరిచితులయ్యారు. బాల నటుడిగా నటించిన(కలకత్తూర్ కన్నమ్మ) మొదటి చిత్రానికే కమల్ జాతీయ పురస్కరం అందుకున్నారు. అనంతరం మూడు సార్లు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కించుకున్నారు. నటుడిగానే కాకుండా నృత్యంలోనూ ముఖ్యంగా భారత నాట్యంలోనూ కమల్కి మంచి ప్రావీణ్యం ఉంది. 1960లోనే సినిమాల్లో ఆరంగేట్రం చేసిన కమల్ 1977లో తెలుగు చిత్రం(అంతులేని కథ)తో టాలీవుడ్కు పరిచయమయ్యారు. తెలుగులో నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతిముత్యం, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే వంటి హిట్ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కలైమామణి(కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది. ఈయన పద్మశ్రీ గ్రహీత.