
'భారత్లోని ప్రముఖ వ్యాపారవేత్త అతడి భార్యతో నిద్రించాలని నాకో ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు శని, ఆది వారాల కోసం నైట్ క్లబ్ బుక్ చేశాడు. అతడి భార్యతో బెడ్ షేర్ చేసుకుంటుండగా అతడు చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు
వివాదాస్పద నటి కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో లాకప్. ఈ షోలో కంటెస్టెంట్లు బయటపెడుతున్న సీక్రెట్లు వింటుంటే ప్రేక్షకుల మతి పోతోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు కంటెస్టెంట్లు. తాజాగా తెహ్సీన్ పూనావాలా ఓ షాకింగ్ రహస్యాన్ని వెల్లడించినప్పటికీ అతడు షో నుంచి ఎలిమినేట్ అవక తప్పలేదు.
ఇంతకీ అతడు బయటపెట్టిన సీక్రెట్ ఏంటో పూనావాలా మాటల్లోనే తెలుసుకుందాం.. 'భారత్లోని ప్రముఖ వ్యాపారవేత్త అతడి భార్యతో నిద్రించాలని నాకో ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు శని, ఆది వారాల కోసం నైట్ క్లబ్ బుక్ చేశాడు. అతడి భార్యతో బెడ్ షేర్ చేసుకుంటుండగా అతడు చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అదే జరిగింది కూడా! ఇప్పుడిది మీతో చెప్పడానికి కూడా నాకేం అభ్యంతరం అనిపించడం లేదు. ఎందుకంటే అందులో తప్పేం లేదు. అతడి కోరికను మేము నెరవేర్చాం. అంతే..' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: అవకాశాల కోసం అంట్లు తోమాను, బాత్రూంలు కడిగాను
సీక్రెట్ నీ భార్యకు తెలుసా? అని కంగనా అడగ్గా తెహ్సీన్ తెలుసని బదులిచ్చాడు. తన పెళ్లవకముందు జరిగిన విషయమని తెలిపాడు. తన భార్యతో డేటింగ్లో ఉన్నప్పుడే ఈ సీక్రెట్ను ఆమెకు చెప్పానన్నాడు. తర్వాత లాకప్ షోలోని మరో కంటెస్టెంట్ సాయేషా సైతం ఒక రహస్యాన్ని బయపెట్టాలనడంతో ఆమె పదేళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యానని తెలిపింది.