రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్‌‌ | Madras High Court Serious on Superstar Rajanikanth Over Tax Pay Petition - Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్‌‌

Oct 14 2020 2:30 PM | Updated on Oct 14 2020 4:21 PM

Madras High Court Serious On Rajani Kanth Over Tax Pay Petition - Sakshi

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని తలైవాను కోర్టు హెచ్చరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని కొడంబాకంలోరాఘవేంద్ర కళ్యాణమంటపం పేరిట రజనీకాంత్‌కు ఒక కళ్యాణమండపం ఉంది. అయితే దానికి సంబంధించి రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఆయనకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది. 

ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కళ్యాణమండపం మూసి ఉందని... అప్పటి నుంచి కళ్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టులో పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ పన్నును చెల్లించలేనని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ రజనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు.

చదవండి: మీరు లేకపోతే నేను లేను!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement