Property tax
-
రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుల కోసం పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ పథకానికి మంచి స్పందన లభించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఏడాది కాలంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా పురపాలక శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగా 2025–26 సంవత్సరానికి 5 శాతం రాయితీని ఉపయోగించుకొన్న ప్రజలు గత నెలలోనే రూ. 400.36 కోట్లు చెల్లించారు. మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 2,264.84 కోట్లు ఉండగా, ఒక్క నెలలోనే ముందస్తుగా 17.68 శాతం చెల్లించడం గమనార్హం. ఇది పురపాలక శాఖలో ఒక రికార్డుగా సీడీఎంఏ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో రూ. 900.9 కోట్లు ఎర్లీబర్డ్ కింద వసూలు కాగా, జీహెచ్ఎంసీ మినహా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో రూ. 400.36 కోట్లు వసూలు కావడం పట్ల పురపాలక శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం ఎర్లీబర్డ్ కింద రూ. 317.84 కోట్లు (14.80 శాతం) వసూలు కాగా, ఈ సంవత్సరం మరో 3 శాతం పెరిగింది. మొత్తం సంవత్సరానికి వసూలు చేసే పన్నుల్లో జమ్మికుంట మునిసిపాలిటీలో ఎర్లీబర్డ్ కింద 54.78% , హుజురాబాద్ 51.85% వసూళ్లుచేసి 50 శాతం కన్నాఎక్కువగా వసూలు చేసిన జాబితాలో అగ్రగామిగా నిలిచాయి. అధికారులను అభినందించిన సీడీఎంఏ కాగా బొల్లారం, రామగుండం కార్పొరేషన్, గుమ్మడిదల, పీర్జాదిగూడ కార్పొరేషన్, తూముకుంట, మద్దూర్, గుండ్లపోచంపల్లి, నిజాంపేట కార్పొరేషన్, చౌటుప్పల్, నాగారం, నార్సింగి, సిద్దిపేట, నారాయణఖేడ్, రాయికల్, కోదాడలలో 30 శాతం కన్నా ఎక్కువగా వసూళ్లు చేసినట్లు సీడీఎంఏ శ్రీదేవి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు గుమ్మడిదల (42%), మద్దూర్ (34.2%), గడ్డపోతారాం (26.24%), మొయినాబాద్ (21.41%), చేవెళ్ల (21.26%) ఎర్లీబర్డ్ వసూళ్లలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తగిన సమయంలో స్పందించి ముందస్తు పన్ను వసూళ్లు చేసిన కమిషనర్లను, ఇతర అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. కాగా 10 శాతం కన్నా తక్కువ వసూళ్లు సాధించిన పురపాలికల్లో వరంగల్ కార్పొరేషన్, మెదక్, వర్ధన్నపేట, చేర్యాల, వైరా, పోచంపల్లి, భైంసా, ఇంబ్రహీంపట్నం, జలపల్లి, సదాశివపేట, వనపర్తి, ఆదిలాబాద్, దేవరకొండ, బోధన్, అశ్వారావుపేట, స్టేషన్ ఘనపూర్, ఎదుల్లపురం, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఉన్నాయి. -
ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు 2024–25 సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే వడ్డీపై 50 శాతం రాయితీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. -
ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?
బెంగళూరులో ఇప్పటికే ఇంటి అద్దెలు సామాన్యుడికి అందనిరీతిలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటిది సమీప భవిష్యత్తులో అద్దెలు మరింత పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు ఇటీవల అక్కడి స్థానిక ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటిలోని వ్యర్థాల తొలగింపు కోసం యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు నివాసితుల ఆస్తి పన్నులు గణనీయంగా ప్రభావితం చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు.గృహ వ్యర్థాల నిర్వహణ కోసం నివాసితులకు కర్ణాటక ప్రభుత్వం యూజర్ ఛార్జీలు ఆమోదించడంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు ప్రాపర్టీ యజమానుల ప్రాపర్టీ ట్యాక్స్లు పెరుగనున్నాయి. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్డబ్ల్యూఎంఎల్) గత ఏడాది నవంబర్లో ఈ ఫీజును ప్రతిపాదించింది. అయితే అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పట్టణాభివృద్ధి శాఖ యూజర్ ఫీజును మంజూరు చేసింది. ఈ పద్ధతులు అశాస్త్రీయంగా ఉన్నాయని స్థానికంగా విమర్శలు ఎదురవుతున్నా, ఇంటింటికీ చెత్త సేకరణ, దాని నిర్వహణ సేవలకు నిధులు సమకూర్చే సాధనంగా ఈ ఫీజు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఛార్జీల వల్ల ఏటా సుమారు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని బీఎస్డబ్ల్యూఎంఎల్ అంచనా వేస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరికప్రభుత్వం విధించాలని తలపెట్టిన యూజర్ ఫీజును ఆస్తి పన్నులో జోడించనున్నారు. భవనం వైశాల్యాన్ని బట్టి ఇది మారుతుంది. నెలకు రూ.10 నుంచి రూ.400 వరకు ఫీజులు ఉండేలా ఆరు శ్లాబులను నిర్ణయించారు. 600 చదరపు అడుగుల వరకు ఉన్న భవనాలకు అతి తక్కువ రుసుము, 4,000 చదరపు అడుగులకు పైబడిన భవనాలకు గరిష్టంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బెంగళూరు వాసులకు వార్షిక ఆస్తి పన్ను గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెద్ద అపార్ట్మెంట్ సముదాయాలు, వాణిజ్య సంస్థలు వంటి అధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే భవనాలు వీటి ప్రాసెసింగ్ కోసం వేస్టేజ్ ఎంప్యానెల్డ్ ఏజెన్సీ(వర్థాల నిర్వహణకు కేటాయించిన ప్రత్యేక సంస్థలు)ని ఉపయోగించకపోతే కిలో వ్యర్థానికి అదనంగా రూ.12 వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
Hyderabad: ఆస్తి పన్ను బకాయి వడ్డీలపై 90% మాఫీ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను భారీ బకాయిదారులకు శుభవార్త. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీల మొత్తం భారీగా పేరుకుపోయిన వారి సదుపాయార్థం ప్రభుత్వం వన్ టైమ్ స్కీమ్ (ఓటీఎస్)గా పేర్కొంటూ 90 శాతం మాఫీతో రాయితీ సదుపాయం కల్పించింది. దీంతో.. ఈ మార్చి నెలాఖరుకు ముగియనున్న 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిల వడ్డీల్లో పది శాతం, అసలు చెల్లించేవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు కమిషనర్ ఇలంబర్తి రాసిన విజ్ఞప్తి లేఖకు స్పందించిన ప్రభుత్వం ఈ రాయితీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.2 వేల కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.1,540 కోట్లు వసూలైంది. వడ్డీ మాఫీ రాయితీ వర్తించే వారి నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.5 వేల కోట్లున్నాయి. రాష్ట్రప్రభుత్వం గతం సంవత్సరం, అంతకుముందు సైతం ఈ సదుపాయాన్ని కల్పించడం తెలిసిందే. భారీగా బకాయిలు పేరుకుపోయిన వారి నుంచి కనీసం రూ. 500 కోట్లయినా వసూలవుతాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వడ్డీలతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. వారు చెల్లించిన మొత్తాన్ని వారి రాబోయే ఆస్తిపన్ను చెల్లింపులో అడ్జస్ట్ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. -
Hyderabad: శనివారాల్లో ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
లక్డీకాపూల్ (హైదరాబాద్) : ఆస్తి పన్ను(Property Tax) సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి(GHMC Commissioner) తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పన్ను సమస్యలు, పునఃసమీక్ష అభ్యర్థనలు (ఆర్పీఎస్) ఆస్తిపన్ను అంచనాల్లో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా/ఆరీ్టజీఎస్ ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం (సెల్ఫ్ అసెస్ మెంట్) తదితరాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమం ఈ నెల 22న, మార్చి 1, 8, 15, 22,29 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డిప్యూటీ కమిషనర్స్ కార్యాలయాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించిన ఏవైనా సమస్యలున్న వారు తమ సంబంధిత జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలలో నిర్వహించే ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు. -
జీహెచ్ఎంసీ అడ్డగోలు నోటీసులు}
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్మెంట్ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు. దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి. లక్ష్యం ఒకటి.. పని మరొకటి నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులిలా.. భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. 1. సేల్ డీడ్ 2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే) 3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ 4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ? 5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6. టాక్స్ రసీదు 7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్ 8. భవనం కలర్ ఫొటో దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. -
Property Tax: ఇక నెలవారీగా ఆస్తి పన్ను చెల్లింపులు..!
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి పన్ను సంవత్సరంలో రెండు దఫాలుగా ఆర్నెల్లకోసారి చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకనుంచి అలా కాకుండా ఏకమొత్తంలో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్’ ద్వారా అయిదు శాతం రాయితీ సదుపాయం ఉంది. ఆస్తిపన్ను ఏడాదికో, ఆర్నెల్లకో కాకుండా కరెంటు బిల్లు మాదిరిగానే నెలనెలా చెల్లిస్తే తమకు సదుపాయంగా, పెద్ద భారంగా కనిపించకుండా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి వారికి సదుపాయంగా ఆస్తిపన్నును సైతం నెలనెలా చెల్లించే విధానాన్ని ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. ఆస్తిపన్ను, కరెంటు, నల్లా బిల్లులు వేర్వేరు పర్యాయాలు వేర్వేరు సంస్థలకు చెల్లించనవసరం లేకుండా ఒకే విండో ద్వారా, ఏకకాలంలో అన్ని పనులు నెలవారీగా చెల్లించే సదుపాయం కలి్పంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరించే వారికి చెల్లించే మొత్తాన్ని కూడా వాటితో పాటే చెల్లించే సదుపాయం అందుబాటులోకి తేవాలనుకుంటోంది. సీఎం ఆలోచనతో.. 👉 గ్రేటర్ పరిధిలో ప్రస్తుతమున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సిటీలో ప్రస్తుతం ఆస్తి పన్నులను జీహెచ్ఎంసీ, నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి వసూలు చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ఆర్నెల్లకోసారి చెల్లించే సదుపాయం ఉండగా, జలమండలి నల్లా బిల్లులను నెలకోసారి జారీ చేస్తోంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు వినియోగదారులకు మరింత వెసులుబాటుగా ఉండేలా కొత్త విధానం ఉండాలనే తలంపులో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారు. ఇటీవల అధికారులతో చర్చల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉 డిస్కంలు ప్రతి నెలా కరెంట్ బిల్లు పద్ధతి ప్రకా రం జారీ చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించే విధానం అనుసరిస్తున్నాయి. యూపీఐ ద్వారా ఆన్లైన్లోనే ప్రతి నెలా కరెంట్ బిల్లు చెల్లించే సదుపాయం అందుబాటు లో ఉంది. దీంతో వినియోగదారులు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదే తరహాలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, చెత్త సేకరణ బిల్లు కూడా నెల వారీగా జారీ చేసే లా కొత్త విధానం పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలా చేయడంవల్ల ఒకేసారి ప్రజలపై ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని, సులభ వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించినట్లు ఉంటుందని వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం నెల నెలా బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. యూపీఐతో పాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా నెల నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ప్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు.కరెంట్ బిల్లు చెల్లించకుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుము విధింపుతో పాటు కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అలాగే కొత్త గా జీహెచ్ఎంసీ, జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు కూడా నిరీ్ణత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింక్ ఉండేలా తగిన చర్యలకు అధికారులు కసరత్తు చేయనున్నారు.సక్రమంగా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు.. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు ఇవ్వాలని, లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనలున్నాయి. బిల్లుల చెల్లింపుల విషయంలో కచి్చతంగా ఉన్నట్లుగా అంతే బాధ్యతగా మున్సిపల్ సేవలను మహా నగర ప్రజలకు అందించే విషయంలో జవాబుదారీగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.భారీ బకాయిలకు అడ్డుకట్ట.. నెలనెలా ఆస్తిపన్ను విధానం వల్ల బకాయిలు పేరుకుపోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బకాయిలపై నెలకు 2 శాతం చొప్పున పెనాల్టీ విధిస్తుండటంతో చాలామందికి అసలు కంటే పెనాలీ్టల భారం ఎక్కువ కావడంతో చెల్లించడంలేదు. ముఖ్యంగా, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న భవనాల యజమానులు వీరిలో ఎక్కువగా ఉన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ల ద్వారా పెనాలీ్టల్లో 90 శాతం రాయితీలిచ్చినప్పటికీ చెల్లించని వారూ ఉన్నారు. నెలనెలా చెల్లించే విధానంతో, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోకుండా ఉంటాయనే అభిప్రాయాలున్నాయి. -
fact check: తిక్కరాతలతో రామోజీ తెలివి బొక్కబోర్లా!
రాష్ట్ర ప్రగతికి నిధులు గాల్లోంచి సృష్టించాలన్నదే రామోజీ మతిచలించిన రాతల పరమార్థంలా కనిపిస్తోంది. ఏటా పెరిగే ఆస్తుల విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని కేంద్రం చట్టమే తెచ్చి, అమలు చేసి తీరాలన్న నిబంధనను విధించింది. అయినా సరే...పన్ను పెంపు అనేది పేద వర్గాలకు పెనుభారం కారాదని సీఎం జగన్ ప్రభుత్వం పన్ను పెంపు 15 శాతానికి మించకుండా చర్యలు తీసుకుంటే అదేదీ ఈనాడుకు కనిపించదు. నోటికొచ్చిన లెక్కలు గట్టి రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఇళ్లకు పన్ను పెంపు భారం ...అంటూ తప్పుడు రాతలు రాసింది. నిజానికి 2020 నుంచే అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త పన్ను విధానం అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. తెలంగాణతో సహా పది రాష్ట్రాలు పన్ను పెంపు విధానంలో కేంద్రం చెప్పిందే అమలు చేస్తున్నాయి. తద్భిన్నంగా .. రాష్ట్రంలో సీఎం జగన్ పేదల పట్ల కారుణ్యంతో వ్యవహరిస్తున్నారు. పేదలపై పెనుభారం మోపడానికి ఆయన ససేమిరా అంటారు...అందుకే 2021 ఏప్రిల్ నుంచి 375 చదరపు అడుగుల లోపు ఇళ్లకు కేవలం రూ.50 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడంలోని జగన్ మానవత్వ భావన రామోజీ బుర్ర కెక్కినట్లు లేదు. లెక్కలేనన్ని తిక్కరాతలతో రాష్ట్రంలో అభివృద్ధికి మోకాలడ్డడానికి ఈ అతి తెలివి వక్రమార్కుడు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఖాళీ స్థలాలపై పన్నే పెంచని ఉదారత జగన్ ప్రభుత్వానిది... అంతేకాదు ఒకేసారి పన్ను మొత్తాన్ని చెల్లిస్తున్న వారికి రెండేళ్లుగా వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పించడం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరో వరం...ఇదంతా రామోజీకి తెలియదా అంటే తెలుసు..తెలిసినా ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి ఏదో ఒక తప్పుడు కారణాన్ని వెదుక్కుని వాస్తవాల పునాదులపై అడ్డగోలుగా అబద్ధాల మేడలు కట్టడమే ఈ కుహనా మేధావి లక్ష్యం... ఈయన తెలివి తెల్లారినట్లే ఉందని చెప్పడమే ఈ ఫ్యాక్ట్ చెక్ ఉద్దేశం... సాక్షి, అమరావతి: అబద్ధాలను అచ్చు వేయడంలో రామోజీ అందెవేసిన చేయిగా మారిపోయారు. తెల్లారి లేచిందే తడవుగా ప్రభుత్వంపై ఎలా రాళ్లేయాలా? అనే దురాలోచన నుంచి ఈనాడు బయటపడడం లేదు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ఒక్కరోజూ చెప్పకపోగా, అబద్ధాన్ని నిజమని ప్రజలను నమ్మించేందుకు వాస్తవాలను కప్పిపుచ్చి అదే అబద్ధాన్ని పదేపదే అచ్చు వేస్తోంది. పన్ను మదింపును పరిగణనలోకి తీసుకున్న విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఇళ్లకు గాలిలో తప్పుడు లెక్కలు వేసి అన్యాయం జరిగిపోతున్నట్టు గగ్గోలు పెట్టింది. వాస్తవానికి పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆస్తిపన్ను పెంపు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తిపన్ను పునరీకరణ (రివిజన్) చేయాలని సూచించింది. ద్రవ్య లోటును తగ్గించేందుకు ఈ విధానం తప్పనిసరని చెప్పడంతో పాటు 2019లో ‘‘ఫిస్కల్ రెస్పాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్’’ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం సంస్కరణల్లో భాగంగా పట్టణ ఆస్తి పన్ను వార్షిక అద్దె విధానం కాకుండా, ఆస్తుల వార్షిక విలువ ఆధారంగా లెక్కించాలని సూచించింది. 2020 నుంచి అన్ని రాష్ట్రాలు కొత్త పన్ను విధానం అమలు చేయాలని ఆదేశించింది. అందుకు మున్సిపాలిటీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లెక్కల ప్రకారం ప్రాంతాన్ని బట్టి ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. తెలంగాణతో సహా 10 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అదే ఏడాది నుంచి అమలు చేస్తుండగా, ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం 2021 ఏప్రిల్లో అమల్లోకి తేవడంతో పాటు 375 చ.అ. లోపు ఇంటికి ఆస్తిపన్ను గరిష్ఠంగా రూ.50 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది నిరుపేదలకు ఎంతో మేలు చేసింది. ఖాళీ స్థలాలపై అసలు పన్ను పెంపే లేదు. రెండేళ్లుగా మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తున్న వారికి వడ్డీ రాయితీనీn ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించాలన్న కేంద్రం... కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును ఐదేళ్లకోసారి మదింపు చేసి, తదనుగుణంగా పన్ను పెంచాలి. స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో నివాస ఆస్తులపైన, 2007లో కమర్షియల్ ఆస్తుల పన్నును మదింపు చేశారు. తర్వాత పన్ను మదింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో పన్ను విధింపు ఆస్తి వార్షిక అద్దె ప్రకారం వసూలు చేసేవారు. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం పన్ను విధింపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ఈ విధానంలో ఆస్తి పన్ను భారీగా పెరిగి ప్రజలకు అధిక భారం పడే ప్రమాదముందని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను పెంపు గరిష్టంగా 15 శాతం మించరాదని షరతు పెట్టింది. ప్రజలపై భారం లేకుండా చూసిన రాష్ట్రం... కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం పన్ను నిర్ణయించినట్టయితే అది మున్సిపాలిటీల్లోని ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడే ఇబ్బంది ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్లాబులను అందుబాటులోకి తెచ్చింది. నివాస ఆస్తులపై స్థానిక మార్కెట్ ధర ప్రకారం 0.10 నుంచి 0.50 శాతం, కమర్షియల్ ఆస్తులపై 0.02 నుంచి 2 శాతం మధ్య పన్ను ఎంత ఉండాలనే నిర్ణయాధికారం పట్టణ స్థానిక సంస్థల కౌన్సిళ్లకే అప్పగించింది. ఆస్తి విలువ ఎంత పెరిగినా పన్ను పెంపు 15 శాతం మించరాదని, పేదలు నివసించే 375 చ.అ విస్తీర్ణం గల ఇళ్లకు పన్ను వార్షిక రూ.50 మాత్రమే ఉండాలని అదేశాలు జారీ చేసింది. గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను పెరగని ఆస్తులకు గరిష్టంగా 2 శాతం పెంపు అమలు చేయాలంది. పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పన్ను విధానంపై అధ్యయనం, ప్రజల అభ్యంతరాలను తీసుకున్న తర్వాతనే అధికారులు పన్ను వసూలు చేపడుతున్నారు. పట్టణాభివృద్ధికి ఎల్లో మీడియా వ్యతిరేకం... పట్టణ స్థానిక సంస్థల్లో ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, అభివృద్ధి పనులకు నిధులు అవసరం. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు అధికంగా ఉండేవి. కేంద్రం 2019లో తెచ్చిన ఎఫ్ఆర్బీఎం చట్టంతో యూఎల్బీలు పన్ను ఆదాయాన్ని పెంచుకుంటేనే సాయం అందుతుంది. ఈ విషయంలో ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన నారా చంద్రబాబుకు, ఆయనకు శిక్షణ ఇచ్చిన రాజగురువు రామోజీకి తెలియంది కాదు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి ఆస్తి పన్ను డిమాండ్ రూ.3950.15 కోట్లు ఉంటే, గతేడాది వసూళ్లు 50 శాతం (రూ.1686.46 కోట్లు) దాటలేదు. మరి స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలో వారికే తెలియాలి. కేపిటల్ వ్యాల్యూ పన్ను విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు.. ఛత్తీస్గఢ్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ -
AP: ఆస్తి పన్ను బకాయిలుపై వడ్డీ మాఫీ
సాక్షి, విజయవాడ: ఆస్తి పన్ను బకాయిలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్టైం సెటిల్మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తీ పన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనాలు, ఖాలీ స్థలాలు పన్నులపై వడ్డీ మాఫీ అమలు కానుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. చదవండి: ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం: సీఎం జగన్ -
ఐటీ సిటీలో డబుల్ ట్యాక్స్.. ఇంటి అద్దెలు మరింత పెరుగుతాయా?
బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది. కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది. కొత్త ఆస్తి పన్ను విధానం ఇదీ.. ప్రస్తుత పన్ను విధానంలో పీజీలు, కన్వెన్షన్ హాళ్లు, లేదా మాల్స్ వంటి అద్దె ఆస్తులకు ఏడు సుంకాలు ఉన్నాయి. అయితే ఎయిర్ కండీషనర్ లేదా ఎస్కలేటర్లు ఉన్న భవనాలకు ప్రత్యేకంగా పన్నులేమీ విధించడం లేదు. గైడెన్స్ విలువను 33 శాతం పెంచినందున వ్యాపారులు, ఆస్తి యజమానులు వార్షిక బీబీఎంపీ పన్నులో కనీసం 40 శాతం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే బీబీఎంపీ కొత్త నోటిఫికేషన్లో ఆస్తి పన్ను పెంపును 20 శాతానికి పరిమితం చేసింది. బెంగళూరు నగరంలోని అద్దె ఇళ్లు, ఫ్లాట్లపై బీబీఎంపీ రెట్టింపు పన్నులు వేస్తోందని, అయినప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని నగరంలో అద్దె నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కొత్త పన్ను నియమంతో అద్దెదారులు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుందని వాపోతున్నారు. అయితే ఆస్తి పన్ను 5 శాతానికి మించి పెరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. -
Hyderabad: ఆస్తిపన్ను బకాయిలపై రాయితీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: వన్టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)గా ఆస్తిపన్ను బకాయిల పెనాల్టీలపై 90 శాతం రాయితీ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నే. త్వరలో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ. 2100 కోట్లు అయినప్పటికీ, గతనెల 20 వరకు రూ.1269 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆరి్థక కష్టాల్లో ఉంది. నెలనెలా సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో పలు పర్యాయాలు కల్పించిన ఓటీఎస్ సదుపాయాన్ని మరోమారు కల్పించాల్సిందిగా కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే ఆస్తిపన్ను బకాయిదారులు అసలుతో పాటు బకాయిల వడ్డీలపై కేవలం 10 శాతం పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. అది ఎందరికో వెసులుబాటుగా ఉండటమే కాక జీహెచ్ఎంసీ ఆరి్థక కష్టాల నుంచి గెట్టెక్కేందుకూ ఉపకరిస్తుంది. ఈ అంశాన్ని వివరిస్తూ లేఖ రాశారు. పరిశీలనలోకి తీసుకుని ప్రభుత్వం అవకాశం కల్పించగలదని ఆశిస్తున్నారు. ఆస్తిపన్ను బకాయిలు (వడ్డీలపై పెనాల్టీలతో సహా).. ► 4,95,628 ప్రైవేట్ యజమానుల భవనాలకు సంబంధించి బకాయిలు రూ.1887.59 కోట్లు కాగా, వడ్డీల పెనాల్టీలతో కలిపి అవి రూ.4522.18 కోట్లకు పేరుకుపోయాయి. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1800 భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు రూ. రూ.1622.16 కోట్లు కాగా, వడ్డీల పెనాలీ్టలతో సహ అవి రూ.5281.21 కోట్లకు పేరుకుపోయాయి. ► అన్నీ వెరసి పేరుకు పోయిన మొత్తం బకాయిలు రూ.9803.39 కోట్లు. -
ఆస్తిపన్ను గడువులోపు చెల్లించకుంటే భారమే
వికారాబాద్ అర్బన్: మున్సిపాలిటీల్లో గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆలస్య రుసుం పేరుతో 2శాతం వడ్డీ వేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 30లోపు సగం ఆస్తి పన్ను చెల్లించని వారికి ఈ వడ్డీ భారం తప్పదు. నిబంధనల ప్రకారం మున్సిపాల్టీలో భవన యజమానులు ప్రతి ఏటా రెండుసార్లు (ఆరు నెలలకు ఒక సారి) ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్ధ సంవత్సరానికి చెందిన ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే యజమానులు ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలైన ఫిబ్రవరి, మార్చిలోనే ఎక్కువగా పన్ను చెల్లిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఏటా వడ్డీ చెల్లించక తప్పడంలేదు. ఈ ఏడాది తప్పకుండా అర్ధవార్షిక పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. యజమానులకు నోటీసులు ఆస్తి పన్నును ముందస్తుగా వసూళ్లు చేసేందుకు మున్సిపల్ అధికారులు సంబంధిత యజమానులకు డిమాండ్ నోటీసులు పంపిస్తున్నారు. మున్సిపల్ బిల్ కలెక్టర్లను ఇంటింటికి ఒకటి రెండు సార్లు పంపి అర్ధ సంవత్సరం పన్ను చెల్లించాలని లేకుంటే అస్సలు పన్నుపై 2శాతం వడ్డీ పడుతుందని చెప్పిస్తున్నారు. అయితే ఆస్తిపన్ను చెల్లింపునకు అర్ధ వార్షిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తుంది. ఇప్పుడు చెల్లించకుంటే వచ్చేనెల నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. యజమానులు వెంటనే మున్సిపల్ బిల్ కలెక్టర్లకు లేక ఆన్లైన్లో పన్ను చెల్లించుకోవడం మంచిదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఐదుశాతం మినహాయింపు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభం కాగా ఆస్తపన్ను చెల్లింపుపై పురపాలక శాఖ ఐదు శాతం రాయితీ అవకాశాన్ని కల్పించింది. అంటే ఈ ఏడాదికి సంబంధించిన పన్నును ఒకేసారి చెల్లిస్తే మొత్తం పన్నులో ఈ ఐదు శాతం రాయితీ వర్థిస్తుంది. దీంతో కొంత మంది యజమానులు ఆసక్తి చూపి పన్ను చెల్లించడంతో మున్సిపాల్టీలకు కొంత నిధులు సమకూరాయి. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించినవారిని మినహాయిస్తే మిగిలిన వారంతా గడువులోగా పన్ను చెల్లింపకపోతే వడ్డీ భారం భరించాల్సిందే. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఆస్తిపన్ను చెల్లిస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించడం కూడా భారమే. అందుకే అర్ధవార్షిక సంవత్సరంలో చెల్లిస్తే ఇంటి యజమానులకు భారం తగ్గుతుంది. – శరత్ చంద్ర, వికారాబాద్, మున్సిపల్ కమిషనర్ -
ఆన్లైన్కే సై
సాక్షి, హైదరాబాద్: సదుపాయాలు కల్పిస్తే ప్రజలు వినియోగించుకుంటారు. తమకు అత్యంత సదుపాయంగా ఉంటే.. ఎవరూ వెళ్లి ఒత్తిడిచేయకున్నా చెల్లింపులు చేస్తారనేందుకు నిదర్శనం జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు. ఆర్థిక సంవత్సరం మొదటినెలలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం కింద 5 శాతం రాయితీ ఉంటుంది. ఈ రాయితీని వినియోగించుకోవడం ద్వారా చాలామంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. జీహెచ్ఎంసీ ఆర్థిక సంవత్సర లక్ష్యమే దాదాపు రూ. 2వేల కోట్లయితే.. ‘ఎర్లీబర్డ్’ను వినియోగించుకోవడం ద్వారా ఒక్క నెలలోనే మూడో వంతుకుపైగా ఆదాయం సమకూరింది. ఎక్కువ మంది ఆన్లైన్ ద్వారా ఎర్లీబర్డ్ను వినియోగించుకున్న ఇళ్ల యజమానులు 7.35 లక్షల మంంది కాగా, వారిలో 4.95 లక్షల మంది ఆన్లైన్ ద్వారానే ఆస్తిపన్ను చెల్లించారు. అంటే దాదాపు 67 శాతం మంది ఆన్లైన్ను వినియోగించుకున్నారు. వీరి చెల్లింపుల ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు రూ.786.75 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయం పెరుగుతున్నా.. జీహెచ్ఎంసీ ఖజానాకు ఆస్తిపన్ను వసూళ్ల ద్వారా ఏటికేడాది ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అంతకుమించి పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు తప్పడం లేదు. వేల కోట్లు ఖర్చయ్యే భారీ ప్రాజెక్టులకు సైతం జీహెచ్ఎంసీ నుంచే ఖర్చు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణం కాగా, అధికారులు, పాలకమండలి మితిమీరిన ఖర్చులు కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆనందించేలోగా.. అదనపు భారం ఎర్లీబర్డ్ ద్వారా టార్గెట్ను మించి ఆదాయం రావడంతో సంతోషపడిన అధికారుల ఆనందం అంతలోనే ఆవిరైంది. పారిశుద్ధ్య కార్మి కుల వేతనాలను అదనంగా రూ.1000 పెంచుతూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. ఈమేరకు అదనపు వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఖజానా నుంచే చెల్లించాలని పేర్కొనడమే ఇందుకు కారణం. దీంతో జీహెచ్ఎంసీ ఖజనాకు సంవత్సరానికి దాదాపు రూ.30 కోట్ల అదనపు భారం పడనుంది. -
ఆస్తిపన్ను వసూళ్లు రూ. 825.87 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, సంస్థల నుంచి ఆస్తిపన్ను రూపంలో రూ.825.87 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్ఎంసీ మినహా 128 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.1,146.56 కోట్లలో 72.03 శాతం మేర వసూలైంది. 2021– 22 ఏడాది ఆస్తిపన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.127.62 కోట్లు అదనంగా సమకూరాయి. ఆస్తిపన్ను వసూళ్లలో హైదరాబాద్ మినహా 12 కార్పొరేషన్లలో 92.33 శాతం పన్ను వసూళ్లతో ఫిర్జాదిగూడ మొదటిస్థానంలో నిలవగా, 55.02 శాతం పన్ను వసూళ్లతో నిజామాబాద్ చివరిస్థానంలో ఉంది. మునిసిపాలిటీలలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 97.39 శాతం, నిర్మల్ జిల్లా బైంసాలో అత్యల్పంగా 26.93 శాతం మాత్రమే వసూలైంది. ఆస్తిపన్ను, భవన నిర్మాణాల ఫీజుల వసూళ్లతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. చిన్న మునిసిపాలిటీల్లో కూడా పన్నువసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏయేటికాయేడు ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలల ముందు నుంచే కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ మునిసిపల్ కమిషనర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం, ఆదాయలక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సమీక్షలు ఎప్పటికప్పుడు చేయడంవల్ల పన్నువసూళ్లలో పురోగతి స్పష్టంగా కనిపించింది. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్లతోపాటు స్వయంగా ఆదాయం సమకూర్చుకోవడం తప్పనిసరని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30లోగా ఆస్తిపన్నుచెల్లిస్తే 5 శాతం రాయితీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించినవారికి ఎర్లీబర్డ్ స్కీమ్ వర్తిస్తుందని కమిషనర్, డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తెలిపారు. ఆస్తిపన్ను మొత్తం చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ లభిస్తుందన్నారు. ఆస్తిపన్ను మునిసిపల్ కార్యాలయానికి రాకుండానే పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పన్నుచెల్లింపు దారులకు మునిసిపాలిటీలు పంపించే ఎస్ఎంఎస్లలో లింక్ తెరిచి పన్ను చెల్లించవచ్చని, లేదంటే వాట్సాప్ చాట్బాట్ నంబర్ 90002 53342 ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
పెరిగిన మున్సిపల్ ఆస్తి పన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి సాధించింది. గత ఏడాదికంటే ఈసారి 41.50 శాతం అధికంగా పన్నులు వసూలు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం సాయంత్రానికి సుమారు రూ.1,998 కోట్లు వసూలు చేసింది. మొత్తం పన్నుల డిమాండ్ రూ.3,763.44 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకు 53.10 శాతం వసూలైంది. గత ఆర్థిక సవంత్సరంలో మార్చి 31 నాటికి వసూలైంది రూ.1,414 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1,651.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.49.54 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 12.73 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల నుంచి రూ.48.99 కోట్లు, ఖాళీ స్థలాల నుంచి రూ.235.74 కోట్లు వసూలైంది. మార్చి 31 లోగా పన్ను చెల్లించినవారికి బకాయిలపై 5 శాతం రాయితీ కల్పించడంతో రెండు వారాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. వడ్డీ మాఫీ కింద పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ.178.91 కోట్లు మినహాయింపు పొందినట్టు సీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బకాయి చెల్లింపులు కూడా పెరిగాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులతోపాటు ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిల చెల్లింపునకు ముందుకు రావడం విశేషం. నిర్ణీత పన్ను చెల్లింపు గడువునాటికి మొత్తం వసూళ్లు రూ.2 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ నీటి పన్ను డిమాండ్ రూ.632.63 కోట్లు ఉండగా, రూ.228.78 కోట్లు వసూలైంది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ–మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ
-
Hyderabad:‘ఇంటెలిజెన్స్’తో లోపాలకు చెక్! 360 డిగ్రీ వ్యూతో పరిశీలన
జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో పారదర్శకత, ఖచ్చితత్వం ఉండేందుకు అధికారులు దృష్టి సారించారు. వివిధ స్థాయిల్లో ఆస్తిపన్ను విషయంలో తలెత్తుతున్న లోపాలను సవరించి సక్రమంగా పన్నులు రాబట్టాలని, డిఫాల్టర్లను గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని భావిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను అసెస్మెంట్లలో.. పన్నుల విధింపులో వింతలెన్నో. ఒకే ప్రాంతంలో ఒకే విస్తీర్ణంలో ఉన్న భవనాలకే ఒక భవనానికి రూ.12 వేల ఆస్తిపన్ను ఉంటే...ఇంకో భవనానికి రూ.7 వేలే ఉంటుంది. కొందరు యజమానులకు ఒక్క ఏడాది ఆస్తిపన్ను బకాయి ఉంటేనే చెల్లించేంతదాకా ఒత్తిడి తెచ్చే సిబ్బంది, కొందరు ఏళ్ల తరబడి చెల్లించకున్నా పట్టించుకోరు. భవనం ప్లింత్ ఏరియాకు.. ఆస్తిపన్ను విధించే ఏరియాకు పొంతన ఉండదు. వాణిజ్య ప్రాంతాల్లో వాణిజ్య భవనాలుగా కొనసాగుతున్న వాటికి సైతం నివాస భవన ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. పక్కపక్కనే ఉన్న ఇళ్లకైనా సరే కొందరికి ఆస్తిపన్ను చదరపు మీటరుకు రూ.3 ఉంటే.. కొందరికి రూపాయికన్నా తక్కువే ఉంటుంది. ఇలాంటి వాటితో జీహెచ్ఎంసీ ఖజానాకు వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్ను రావడం లేదని గుర్తించిన అధికారులు ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందో గుర్తించాలనుకున్నారు. అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఆన్లైన సంబంధిత ‘అనలిటిక్స్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్’ను అనుసరించాలని నిర్ణయించారు. తద్వారా లోపాలెక్కడున్నాయో గుర్తించి సరిదిద్దాలని భావించారు. అందుకు గాను ప్రతిష్టాత్మక ఐటీ సంస్ధ నుంచి ‘ప్రాపర్టీటాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్’ను సమకూర్చుకోవడంతోపాటు మూడేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు సైతం అప్పగించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సైతం ఈ సిస్టమ్ను వినియోగించడంలో శిక్షణ ఇవ్వనున్నారు. అసెస్మెంట్ లోపాలకు చెక్.. ► ఈ ఇంటెలిజెన్స్ ద్వారా, ముఖ్యంగా తక్కువ ఆస్తిపన్ను మాత్రమే ఉన్న భవనాలను గుర్తించి టాక్స్ అసెస్మెంట్లోనే తక్కువగా ఉంటే సరిచేస్తారు. ► భారీ మొత్తంలో బకాయిలున్నవారిని గుర్తించి వసూళ్ల చర్యలు చేపడతారు. అసెస్మెంట్ కాని భవనాలెన్ని ఉన్నాయో గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ► ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించడంలో ఏయే ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వంటి వివరాలను సైతం తెలుసుకుంటారు. తద్వారా టాక్స్సెక్షన్ సిబ్బంది ప్రమేయాన్ని సైతం తెలుసుకునే వీలుంటుందని సమాచారం. ► రిజిస్ట్రేషన్, వాణిజ్యపన్నులశాఖ, తదితర ప్రభుత్వశాఖల నుంచి సేకరించే సమాచారంతోనూ భవన వాస్తవ విస్తీర్ణాన్ని, వినియోగాన్ని గుర్తించి వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును విధిస్తారు. ► 360 డిగ్రీ వ్యూతో భవనాన్ని అన్నివిధాలుగా పరిశీలించి రావాల్సిన ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..రావాల్సిన ఆస్తిపన్నును ముందస్తుగా అంచనా వేసి..అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ ఖర్చులకు ప్రణాళిక తయారు చేసుకుంటారు. ► ఈ సిస్టమ్ డెవలప్ ఆయ్యాక ఆస్తిపన్నుకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలనుకున్నా వెంటనే పొందే వీలుంటుంది. ► ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)ని సంప్రదించాల్సి వస్తోంది. తమకు ఏ విధమైన వివరాలు కావాలో చెబితే.. తర్వాత ఎన్నో రోజులకు కానీ అది సమకూరడం లేదు. ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. ► ఆస్తిపన్ను డిమాండ్, వసూళ్లను సైతం ప్రాంతాలవారీగా లెక్కించి తక్కువ వసూలవుతున్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటారు. ► ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా ఆస్తిపన్ను చెల్లించే యజమానులను గుర్తించడంతోపాటు వారు మూడేళ్లుగా చెల్లించిన ఆస్తిపన్ను వివరాలను కూ డా బేరీజు వేస్తారు. ప్రత్యేక డ్యాష్బోర్డులు విని యోగించి భవనయజమానుల్లో డిఫాల్టర్లను కూ డా గుర్తించి అవసరమైన చర్యలు చేపడతారు. భవన వినియోగం తెలుస్తుంది.. ఖైరతాబాద్లోని ఒక వాణిజ్యప్రాంతంలో 90 శాతం వాణిజ్య భవనాలు కళ్లముందు కనబడుతున్నా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నురికార్డుల్లో మాత్రం వాణిజ్య భవనాలు 50 శాతానికి మించి లేవు.మిగతావన్నీ నివాసభవనాలుగా రికార్డుల్లో నమోదయ్యాయి. తద్వారా జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు గండి పడుతోంది. ఇలాంటి అవకతవకలు సైతం ఈ సిస్టమ్ద్వారా వెల్లడవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రాపరీ్టట్యాక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను వినియోగించనున్నారు. దీని ద్వారా పరిపాలనపరంగా పర్యవేక్షణ సైతం సులభం కానుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: కరోనా కేసుల్లేవ్ -
రేషన్కార్డుకు ఆస్తి పన్ను నంబర్ లింక్
సాక్షి, చెన్నై: రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబరు లింక్ చేయడానికి నగర పాలక, స్థానిక సంస్థలు నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని గుర్తింపు కార్డులకు, ప్రభుత్వ రాయితీ, పథకాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత నెల రోజులుగా విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం శరవేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డుకు ఆస్తి పన్ను నంబర్ను లింక్ చేయాలన్న నిర్ణయానికి నగర పాలక, స్థానిక సంస్థలు వచ్చాయి. బియ్యం కార్డు కలిగి ఉన్న రేషన్కార్డుదారులు ఏ మేరకు సొంతిళ్లను కలిగి ఉన్నారో, వారి ఆస్తుల వివరాలు రాబట్టేందుకు ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. లగ్జరీ కార్లు, బంగళాలు కలిగి ఉన్న వారు సైతం రేషన్ ద్వారా ప్రభుత్వ రాయితీలను పొందుతూ వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టడం లక్ష్యంగా ఈ లింక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఎస్ఐ -
Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్మహల్కు నోటీసులు..
లక్నో: ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టాలని చారిత్రక కట్టడం తాజ్మహల్కు నోటీసులు పంపారు ఆగ్రా మున్సిపల్ అధికారులు. రూ.1.94 కోట్లు నీటి పన్ను, రూ.1.47లక్షలు ఇంటిపన్ను కట్టాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అడిగారు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే స్మారక కట్టడమైన తాజ్మహల్కు.. పన్ను కట్టాలని నోటీసులు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021-22, 2022-23కు సంబంధించిన ఈ ట్యాక్స్ను 15 రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాజ్మహల్కు నోటీసులు పంపిన విషయం తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండే తెలిపారు. పన్ను లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ఆధారంగా చాలా ప్రాపర్టీలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన స్థలాలు సహా అన్నింటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే చట్టపరంగా పన్నులో రాయితీ ఉంటుందన్నారు. మరోవైపు తాజ్మహల్కు పొరపాటుగా నోటీసులు వచ్చి ఉంటాయని ఆర్కియలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. దీన్ని రక్షిత స్మారక కట్టడంగా 1920లోనే ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. తాజ్మహల్కు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. చదవండి: మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్.. -
క్షీణిస్తున్న మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల సొంత ఆదాయం, సామర్థ్యం క్షీణిస్తోందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాలు దశాబ్ద కాలంలో దేశ జీడీపీలో ఒక్క శాతం వద్ద స్తబ్దుగా ఉన్నట్లు తెలిపింది. మెజారిటీ మునిసిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ కాగితాలకే పరిమితమని, వాస్తవికతను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంట్లపైనే మునిసిపల్ కార్పొరేషన్లు ఆధారపడుతున్నాయని, సొంత ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ తొలిసారిగా అధ్యయన నివేదికను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా తరహాలో.. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగినట్లుగా సేవల్లో నాణ్యత పెరిగేందుకు తక్షణం సొంత ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం దక్షిణాఫ్రికా తరహాలో సంస్కరణలు తేవాలని సూచించింది. బ్రెజిల్, రష్యన్ ఫెడరేషన్, చైనా, దక్షిణాఫ్రికాతో పోల్చి చూస్తే దేశంలో పట్టణ ప్రజలకు కనీస నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు అందించడం చాలా తక్కువ శాతం ఉందని తెలిపింది. పెరుగుతున్న పట్టణ జనాభాకు మెరుగైన మౌలిక సదుపాయాలు, కనీస ప్రాథమిక సేవలందించేందుకు ఆస్తి పన్ను సంస్కరణలతో పాటు పాలనా సంస్కరణలు తేవాలని సూచించింది. ఆస్తి పన్ను మరింత సమర్థంగా వసూలు చేసే చర్యలు చేపట్టడంతోపాటు యూజర్ చార్జీలు, ప్రకటన పన్ను, పార్కింగ్ ఫీజు, ట్రేడ్ లైసెన్సుల జారీలో పటిష్ట విధానాలను అమలు చేయాలని పేర్కొంది. రహదారులు, సీవరేజ్, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపల్ బాండ్లను జారీ చేయాలని సూచించింది. సీఆర్డీఏ బాండ్లతో అత్యధిక రుణం దేశంలో తొలిసారిగా 1997లో బెంగళూరు మునిసిల్ కార్పొరేషన్, 1998లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రుణాలను సేరించాయని, 2000 సంవత్సరం వరకు తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లు బాండ్ల జారీ ద్వారా రూ.1200 కోట్ల వరకు సమీకరించినట్లు నివేదికలో ప్రస్తావించింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రారంభమయ్యాక 2005 నుంచి మున్సిపల్ బాండ్ల జారీ ఆకస్మాత్తుగా నిలిచిపోయిందని పేర్కొంది. తిరిగి 2017–2021 మధ్యలో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రూ.3840 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఏపీ సీఆర్డీఏ బాండ్ల ద్వారా రూ.2000 కోట్లు రుణం తీసుకున్నాయి. సొంత వనరులు పెంచుకునేలా.. ప్రైవేట్ భూ యజమానులపై భూమి విలువ పన్నులు, బెటర్మెంట్ లెవీ, డెవలప్మెంట్ చార్జీలు, ఖాళీ భూమి పన్ను మొదలైన మార్గాల ద్వారా సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని నివేదిక సూచించింది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయం కోసం ప్రత్యేకంగా వినియోగించాలని పేర్కొంది. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల ద్వారా మున్సిపాలిటీలకు రుణాల సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తలసరి అప్పుల్లో తెలంగాణ టాప్ దేశంలో మునిసిపల్ కార్పొరేషన్ల తలసరి రుణాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. తలసరి అప్పు రూ.1750 ఉండగా బిహార్, మహారాష్ట్రలో రూ.600 ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో మునిసిపల్ కార్పొరేషన్లలో తలసరి అప్పు రూ.400 చొప్పున ఉంది. షరతుల బాండ్లతో అవరోధాలు దేశంలో మునిసిపల్ బాండ్లకు అనేక షరతులతో అనుమతించడం అవరోధంగా ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో బాండ్ల జారీకి అనుమతించినా ద్వితీయ మార్కెట్ లేకపోవడంతో కీలకమైన అడ్డంకిగా ఉందని పేర్కొంది. ఈ సెక్యూరిటీల కోసం మరింత విస్తృతమైన పెట్టుబడిదారుల వ్యవస్థ అవసరమని సూచించింది. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మునిసిపల్ బాండ్ల ద్వారా స్థిరమైన వనరుల సమీకరణకు ప్రోత్సహించాలని తెలిపింది. ఆర్థిక పెట్టుబడికి అవసరమైన వాతావరణం, సమర్థ నియంత్రణ, పారదర్శకత, మెరుగైన పాలనకు చర్యలు తీసుకోవాలని, స్టాక్ ఎక్సే్చంజీలలో మునిసిపల్ బాండ్లు నమోదయ్యేలా ద్వితీయ మార్కెట్ను అభివృద్ధి చేయాలని పేర్కొంది. బాండ్ల జారీతో రూ.37,600 కోట్లు మునిసిపల్ పాలన మెరుగుపరచేందుకు దక్షిణాఫ్రికా రెండు దశాబ్దాలుగా పలు చర్యలు తీసుకుంది. మూడంచెల విధానంలో జనాభా ఆధారంగా షరతులు లేకుండా సమానంగా వనరుల పంపిణీ చేపడుతోంది. అక్కడ 97 మునిసిపాలిటీలు 4.7 బిలియన్ డాలర్లు (రూ.37,600 కోట్లు) బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించాయి. -
ఆస్తిపన్ను పరిధిలోకి రాని గృహాలు లక్షల్లో..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లలో క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పురపాలికలకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. నిధుల్లేక పురపాలికలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్ష్రేత్రస్థాయిలో ఇంకా లక్షల సంఖ్యలో ఆస్తుల పన్ను మదింపు జరగడం లేదు. ఒకవేళ మదింపు జరిగి, నోటీసులు జారీ చేసినా, వందశాతం వసూళ్లు కావడం లేదు. స్థానిక సంస్థలు అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. ప్రభుత్వాలు నిధులు విదిలించకపోతే ఆ స్థానిక సంస్థలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితులుంటున్నాయి. చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల.. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో సహా మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 17.50 లక్షల స్థిరాస్తులపై ఏటా రూ.4,500 కోట్ల ఆస్తిపన్నులు విధించి వసూలు చేస్తున్నారు. మిగిలిన 141 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో 22 లక్షల స్థిరాస్తులను ఆస్తి పన్నుల పరిధిలోకి తెచ్చి మొత్తం రూ.1,322 కోట్ల పన్నులను వాటిపై విధించారు. మిగిలిన వాటితో పోల్చితే ఒక్క జీహెచ్ఎంసీ 3.2 రెట్లు అధిక ఆదాయాన్ని పొందుతోంది. వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, కార్యాలయాలు పెద్దసంఖ్యలో ఉండటం, అద్దె విలువ సైతం అధికంగా ఉండటంతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వస్తోంది. క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిపన్ను వసూళ్లలో లోపాలను అరికట్టేందుకు ఉన్నతస్థాయిలో కొత్త ఆలోచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావట్లేదు. జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)ను ప్రత్యేకంగా సీనియర్ అధికారిగా నియమించినా.. ఆస్తిపన్ను పెంపులో పెరుగుదల ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు పెరుగుతూ..కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. అయినా, స్థానిక సంస్థల ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లలో వందకు వందశాతం వసూలైన దాఖలాలు లేవు. మదింపులోనే అసలు సమస్య ఆస్తిపన్ను మదింపులోనే అసలు సమస్యలు వస్తున్నాయి. టాక్స్ ఇన్స్పెక్టర్లు ఆస్తిపన్ను మదింపు సమయంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులు పుచ్చుకుని ఆస్తిపన్ను తక్కువగా వేస్తున్నారని, ముడుపులివ్వకపోతే అధికంగా వేస్తున్నారని అంటున్నారు. టాక్స్ ఇన్స్పెక్టర్లకు ఈ అవకాశం ఇవ్వకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలోనే.. నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. చాలామంది అనుమతులకు మించిన సంఖ్యలో అంతస్తులను నిర్మిస్తుండటంతో.. అక్రమంగా నిర్మించిన అనుమతులు పన్నుల పరిధిలోకి రావడం లేదు. అనుమతిలేకుండా కట్టిన నిర్మాణాలకు పన్నుల చెల్లింపు విషయంలోనూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తిపన్నుల సవరణ ప్రతీ ఐదేళ్లకోమారు జరగాల్సి ఉన్నా.. నివాస గృహాలపై గత 20 ఏళ్లుగా జరగలేదు. భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆస్తిపన్ను ఆటోమెటిక్గా పెంచేందుకు పురపాలక శాఖ యత్నిస్తోంది. 141 మునిసిపాలిటీలు/ కార్పొరేషన్లలో ఇప్పటివరకు 76 మునిసిపాలిటీల్లో భూముల విలువలు పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరిగే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మరో 65 మునిసిపాలిటీల్లో ఈ విధానం అమలు కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో గత ఐదేళ్లలో ఆస్తి పన్ను ఇలా..(ఆగస్టు10 వరకు) సంవత్సరం ఉన్న ఇళ్లు (లక్షల్లో) డిమాండ్ (రూ.కోట్లలో) వసూళ్లు (రూ.కోట్లలో) శాతం 2018-19 17.53 501.20 445.89 88.96 2019-20 19.18 650.13 561.05 86.30 2020-21 20.27 799.14 719.34 90.01 2021-22 20.76 811.48 698.25 86.04 2022-23 21.95 1,322.89 334.18 25.26 -
అధికారులు పరిధులు దాటారు..
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వివాదంలో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కార్పొరేషన్ అధికారులపై నిప్పులు చెరిగింది. కోర్టుకిచ్చిన హామీని ‘ఏదో పని ఒత్తిడిలో’ ఇచ్చామంటూ మునిసిపల్ కమిషనర్ తన కౌంటర్లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ అధికారులు పరిధులన్నీ దాటేశారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి అధికారం లేకున్నా బలవంతంగా పన్ను వసూలు చర్యలకు పాల్పడ్డారని మండిపడింది. కోర్టుకిచ్చిన హామీని తుంగలో తొక్కడమే కాకుండా, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించారని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదంది.నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ఏకపక్షమే కాక రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది రాష్ట్రం ఓ పౌరురాలిని వేధింపులకు గురి చేసిన వ్యవహారమని, ఇలాంటి చర్యలను వీలైనన్ని మార్గాల్లో అడ్డుకుని తీరాల్సిందేనని స్పష్టం చేసింది. పిటిషనర్ నుంచి వసూలు చేసిన రూ.34.12 లక్షల మొత్తాన్ని 24 శాతం వార్షిక వడ్డీతో రెండు వారాల్లో వాపసు చేయాలని మునిసిపల్ కమిషనర్ను ఆదేశించింది. అంతేకాక పిటిషనర్కు రెండు వారాల్లో రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలంది. రూ.34.12 లక్షల వాపసు, రూ.25 వేల చెల్లింపు చేసినట్టు రుజువులను హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్) ఎదుట సమర్పించాలని కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇదీ వివాదం నెల్లూరు పట్టణం, ట్రంక్ రోడ్డులో తనకున్న భవన సముదాయానికి సంబంధించిన ఆస్తి పన్ను వివాదంపై విజయలక్ష్మి 2012లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సివిల్ జడ్జి కోర్టు.. పెంచిన ఆస్తి పన్ను మొత్తాన్ని రద్దు చేసింది. పాత పన్నులో 50 శాతం పెంచుకునేందుకు కార్పొరేషన్ అధికారులకు అనుమతిచ్చింది. అప్పటికే అధికంగా వసూలు చేసిన పన్ను మొత్తాన్ని విజయలక్ష్మి భవిష్యత్తులో చెల్లించే ఆస్తి పన్నులో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో, ఆదేశాల అమలు కోసం ఆమె.. ఎగ్జిక్యూషన్ పిటిషన్(ఈపీ) దాఖలు చేశారు. దీంతో కోర్టులో మునిసిపల్ కమిషనర్ ఓ మెమో దాఖలు చేస్తూ.. అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించే ఆస్తి పన్నులో సర్దుబాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు విజయలక్ష్మి దాఖలు చేసిన ఈపీని కోర్టు మూసివేసింది. అనంతరం విజయలక్ష్మికి రూ.13.71 లక్షలను వాపసు చేయాల్సి ఉందని, ఈ మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించే పన్ను మొత్తంలో సర్దుబాటు చేస్తామని కమిషనర్ ఓ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మునిసిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.34.12 లక్షలకు విజయలక్ష్మికి పన్ను పంపింది. అంత మొత్తం ఎందుకు చెల్లించాలో ఆ నోటీసులో ఎక్కడా పేర్కొనలేదు. ఈ నోటీసు అందుకున్నాక.. సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని విజయలక్ష్మి కార్పొరేషన్ అధికారులకు ఇచ్చారు. దీనిని పట్టించుకోకుండా అధికారులు విజయలక్ష్మికి చెందిన షాపును సీజ్ చేశారు. రూ.34.12 లక్షలు చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి చేసి చెక్కు తీసుకుని, దాన్ని నగదుగా మార్చుకున్నారు. దీనిపై విజయలక్ష్మి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు విచారణ జరిపారు. -
ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది
ఆస్థిపన్ను దాఖలు చేసే విషయంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తూ అడ్డంగా దొరికిపోయింది. పన్ను తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నం వికటించి అసలుకే ఎసరు తెచ్చింది. లక్షల్లో పన్ను తప్పించుకోవాలని చూస్తే చివరకు జరిమానాతో కలిపి వ్యవహారం కోట్లకు చేరుకుంది. హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బాచుపల్లి ఏరియాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆస్పత్రికి 9 అంతస్థులతో భవన నిర్మాణ అనుమతులు కూడా వచ్చాయి. అయితే మున్సిపాలిటీకీ ఆస్తి పన్ను చెల్లించాల్సిన సమయంలో ఉన్న విలువ కంటే తక్కువ విలువ చూపిస్తూ దరఖాస్తు చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు అనుమానం వచ్చి విచారణ చేపట్టగా ఆస్తి వివరాలు తక్కువ చేసి చూపినట్టుగా తేలింది. దీంతో ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన మున్సిపల్ చట్టాల ప్రకారం.. ఎంత పన్నును తక్కువ చూపించారో దానికి 25 రెట్లు జరిమానాగా విధించారు. దీంతో సదరు హాస్పిటల్ యాజమాన్యానికి ఏకంగా రూ.24 కోట్ల రూపాయలు జరిమానా పడింది. చదవండి: హైదర్గూడ డీ మార్ట్కి షాక్! ఇకపై అలా చేయొద్దంటూ హెచ్చరిక -
ఫలితాలిచ్చిన ఆస్తి పన్ను తగ్గింపు
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్లో ప్రకటించిన ఆస్తి పన్నుపై ఐదు శాతం తగ్గింపు అవకాశాన్ని పుర ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కంటే 55 శాతం అధికంగా పన్ను చెల్లించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత సంవత్సరం ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపు రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని, ఇందులో వార్డు సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. పలు దఫాలుగా ఆస్తి పన్ను చెల్లింపులపై సమీక్షలు నిర్వహించామన్నారు. దాంతో పన్ను చెల్లింపులు గత సంవత్సరం వసూలైన రూ.320.13 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది గడువు ముగిసే సమయానికి 55 శాతం అధికంగా రూ.496.51 కోట్లు వసూలైందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ వివరించారు. -
ఎర్లీబర్డ్’..యమా సక్సెస్!
సాక్షి హైదరాబాద్: కరువు కాలంలో 5 శాతం రాయితీ అయినా ఎంతో ఊరటే. అందుకే కాబోలు ‘ఎర్లీబర్డ్’ స్కీమ్కు నగర వాసులు బాగా స్పందించారు. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 36 శాతం మంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. తద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు ఒక్కనెలలోనే రూ.600 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. శుక్రవారం సాయంత్రం వరకు రూ.616 కోట్ల ఆస్తిపన్ను జీహెచ్ఎంసీ ఖజానాలో చేరింది. శనివారం వరకు ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీతో చెల్లించేందుకు అవకాశం ఉంది. దీంతో గడువు ముగిసేలోగా దాదాపు రూ.700 కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. ఇది ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు మిగతా సంవత్సరమంతా ఎలా నెట్టుకురావాలా అన్న ఆలోచనలోనూ అధికారులున్నారు. ఎర్లీబర్డ్ పథకం పాత బకాయిలు లేని, కొత్త ఆర్థికసంవత్సరం(2022–23)ఆస్తిపన్ను చెల్లించేవారికి వర్తిస్తుంది. ఎర్లీబర్డ్ రాయితీ వినియోగించుకోవాలనుకుంటే ముందు బకాయిలన్నీ చెల్లించాలి. పాత బకాయిలు కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను అంచనా దాదాపు రూ.1500 కోట్లు. అంటే వచ్చే ఆస్తిపన్నులో దాదాపు సగం మొత్తం ఈ ఒక్కనెలలోనే వసూలైతే మిగతా 11 నెలలు ఎలా నెట్టుకురావాలన్నదే అధికారుల ఆలోచన. జీహెచ్ఎంసీకి ఉన్న ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తిపన్నే. వీటిద్వారానే సిబ్బంది, పెన్షన్దారుల జీతభత్యాల చెల్లింపులు తదితరమైనవి జరుపుతున్నారు. మున్ముందు వసూలయ్యే ఆస్తిపన్ను తగ్గనున్నందున ఆదాయం ఎలా సమకూర్చుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. నేడు రాత్రి 10 గంటల వరకు సీఎస్సీలు పనిచేస్తాయి.. జీహెచ్ఎంసీ ఆస్తిపన్నును ఆన్లైనా ద్వారా, మీసేవా కేంద్రాలు, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీలు)ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉంది. ఎర్లీబర్డ్ అవకాశానికి చివరి రోజైన శనివారం ప్రజల సదుపాయార్థం జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లలోని సీఎస్సీలు రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటాయని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. గత రెండు సంవత్సరాల్లో కరోనాను దృష్టిలో ఉంచుకొని ఎర్లీబర్డ్ అవకాశాన్ని ఏప్రిల్ నెలలోనే కాకుండా మే నెలాఖరు వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో రెండునెలల గడువు ఇచ్చినా ఏ ఒక్క సంవత్సరం కూడా రూ.600 కోట్లు వసూలు కాలేదు. (చదవండి: టైమ్సెన్స్ లేక..) -
ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తిపన్ను పెంపు! ఈ నిబంధనలే కారణం ?
తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచబోత్నుట్టు ప్రకటించింది. ప్రతిపక్షాలతో పాటు మిత్ర పక్షం నుంచి విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గేది లేదంటోంది స్టాలిన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ శనివారం న్యూఢిల్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. తమిళనాడులో ఉన్న పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను భారీగా పెరగనుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై విషయాన్ని పరిశీలిస్తే... 600 చదరపు అడుగుల లోపు ఉన్న ఆస్తులపై 50 శాతం, 600ల నుంచి 1200 చదరపు అడుగుల స్థలంలో విస్తరించిన ఆస్తులపై 75 శాతం పన్ను, 1200 నుంచి 1800 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఉన్న ఆస్తులపై వంద శాతం పన్ను పెరగబోతుంది. 1800 చదరపు అడుగులకు మించితే 150 శాతం పన్ను పెంచనున్నట్టు సమాచారం. డీఎంకే సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పాటు మిత్రపక్షం కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా కాటు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, పెట్రోలు ధరల వాతలతో ప్రజలు ఉక్కిరిబిక్కరవుతున్న సమయంలో ఈ పన్ను పెంపు సరికాదంటున్నాయి. పదిహేనో ఫైనాన్స్ కమీషన్ నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు రావాలంటే ఆస్తి పన్ను పెంచక తప్పడం లేదంటూ స్టాలిన్ ప్రభుత్వం చెబుతోంది. పన్నులు పెంచినప్పటికీ అవి బెంగళూరు, లక్నో, అహ్మాదాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా కంటే తక్కువగానే ఉంటాయని అక్కడి ప్రభుత్వం అంటోంది. చదవండి: జీఎస్టీ వసూళ్లు.. రికార్డ్ -
అధికారుల ఓవరాక్షన్.. ఇంటి పన్న కట్టలేదని తలుపులు, కుర్చీలు తీసుకెళ్లి..
సాక్షి,మేడిపల్లి(హైదరాబాద్): ఇంటి పన్ను కట్టలేదంటూ అధికారులు ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యం చేస్తూ ఇంటి తలుపులు, కుర్చీలు, టీవీ తీసుకెళ్లిన సంఘటన పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని బుద్ధానగర్ వీధి నంబరు–8లోని మురళి అపార్టుమెంట్లోని ఓ ప్లాట్లో అస్లాం పాషా అద్దెకు ఉంటున్నాడు. సదరు ప్లాట్ యజమాని మూడేళ్లుగా ఇంటి పన్ను కట్టలేదు. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను కట్టాలంటూ ఇంట్లో ఉండే వారిని అడిగారు. వారు ఇదే విషయమై ప్లాట్ యజమానికి చెప్పారు. ఈ లోపు మంగళవారం బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఇంటికెళ్లి పన్ను కట్ట లేదంటూ ఇంటి తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి అస్లాం పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న అధికారులు, బిల్ కలెక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటాం.. మార్చి 31వ తేదీ లోపు ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలో చొరబడి ఇష్టానుసారంగా వ్యవహరించడం తప్పు. తలుపు ఊడదీసి, కుర్చీలు, టీవీ తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని యథావిధిగా ఏర్పాటు చేశాం. ఇలా ప్రవర్తించిన బిల్ కలెక్టర్లు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రామకృష్ణారావు, పీర్జాదిగూడ కమిషనర్ చదవండి: Hyderabad: డ్రైవింగ్ లైసెన్సుల జారీ.. ట్రాఫిక్ పోలీస్ కొత్త ఐడియా అధికారులు.. ఇదేం తీరు..! -
ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 6 నుంచి మార్చి చివరి ఆదివారం 27వ తేదీ వరకు ఆదివారాల్లో ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అసెస్మెంట్స్ వ్యత్యాసాలు, కోర్టు వివాదాలకు సంబంధించి ప్రజలు అధికారులతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చని కమిషనర్ లోకేశ్కుమార్ పేర్కొన్నారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఇతరత్రా సమస్యలను సైతం సత్వరం పరిష్కరించుకు నేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయని చెప్పారు. ఏయే తేదీల్లో.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమం నిర్వహించే ఆదివారాల తేదీలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి: 6, 13, 20, 27. మార్చి: 6, 13, 20, 27 8 వారాల్లో ప్రజల ఇబ్బందులు తొలగించడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏటికేడాది ఆస్తిపన్ను వసూళ్లు పెరుగుతు న్నప్పటికీ, వివిధ ప్రాజెక్టుల పేరిట ఖర్చులు పెరిగిపోవడంతో దీని ద్వారా మరింత ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు రూ.1362 కోట్లు వసూలు కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 వరకు రూ.1180 కోట్లు వసూలైంది. గ్రేటర్లోని ఆరు జోన్లకుగాను శేరిలింగంపల్లి జోన్ గత సంవత్సరం ఫిబ్ర వరి నెలాఖరు వరకు వసూలైన దానికంటే ఎక్కువ వసూలు చేసింది. ఫిబ్రవరి నెలా ఖరు వరకు రూ.245 కోట్లు వసూలు కాగా, రూ.251 కోట్లు వసూలయ్యాయి. -
Tekkali: మరో నకిలీ బాగోతం: రశీదు అబద్ధం.. దోపిడీ నిజం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలిలో తవ్వుతున్న కొద్దీ అక్రమాల పుట్టలు బయటపడుతున్నాయి. అక్కడి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఎంత అండగా నిలిచారో తెలీదు గానీ వెతికిన చోటల్లా అవినీతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు భూములకు సంబంధించి ఆయన హయాంలో సృష్టించిన ఫేక్ వన్బీ, అడంగల్ బయటపడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చేసిన బాగోతాలు వెలుగు చూశాయి. నకిలీ పట్టాలతో బ్యాంకు రుణాలు కాజేసిన వ్యవహారాలూ బయటకొచ్చాయి. భూరికార్డులను తారుమారు చేసి కబ్జా చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా టెక్కలి పంచాయతీలో నకిలీ బిల్లులతో ఆస్తి పన్నుల ఆదాయాన్ని కొల్లగొట్టిన బండారం బయటపడింది. ఇందులో టెక్కలి బిల్లు కలెక్టర్గా పనిచేసిన సీహెచ్ కైసును బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినా మరో ఇద్దరు దీని వెనుక ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి రిటైరైనా అప్పటి నేతల అండతో అక్కడే తిష్టవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సొంతంగా నోటీసులు.. టెక్కలిలో నకిలీ డిమాండ్ నోటీసులు సృష్టించారు. నకిలీ రశీదు పుస్తకాలు సొంతంగా తయారు చేయించారు. టెక్కలి పంచాయతీ పరిధిలోని ఆస్తి పన్నులు చెల్లించాల్సిన వారికి తొలుత ఆ నకిలీ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. పబ్లిక్కు ఆ విషయం తెలియక జారీ చేసిన డిమాండ్ నోటీసుకు తగ్గట్టుగా ఆస్తి పన్ను చెల్లింపులు చేశారు. ఇలా నకిలీలతో వసూలు చేసిన పన్నుల సొమ్మును వారు తమ జేబులోకి వేసుకున్నారు. అనుమానం రాకుండా కొంత మొత్తం మేర మాత్రం అధికారికంగా చూపించారు. ఇలా టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు రూ.16 లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. పంచాయతీలో వసూలు చేసిన ఇంటి పన్ను సొమ్మును పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా బిల్ కలెక్టర్ చేతివాటం చూపించారు. వీరితో పాటు గతంలో పనిచేసిన ఓ ఉద్యోగి, రిటైరైన ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు 9 వేల పై చిలుకు ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే 2018– 19 సంవత్స రం నుంచి సుమారు మూడేళ్లుగా వసూళ్లు చేసిన ఇంటి పన్ను సొమ్ములో కొంత భాగాన్ని పంచాయతీ ఖాతాకు మళ్లిస్తూ మిగిలిన సొమ్మును స్వాహా చేశారు. గత కొద్ది రోజుల కిందట ఈ బాగోతం బయట పడడంతో, ప్రస్తుత పంచాయతీ ఈఓ తన స్థాయి మేరకు విచారణ జరిపి, రూ.16.46లక్షలకు పైగా సొమ్ము కాజేసినట్టు గుర్తించారు. ఇది ఇంకా పెరగొచ్చు. దీంతో ఈఓ అజయ్బాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇన్చార్జి డీఎల్ పీఓ ఎస్.హరిహరరావు వివరాలను సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. 2018–19లో రూ. 7,67,999, 2019–20లో రూ.4,22,416, 2020– 21లో రూ.4,55,787 స్వాహా చేశారు. ఈ మూడేళ్ల లో సుమారు రూ.16,46,202 మేర పక్కదారి పట్టినట్టు ప్రాథమికంగా తేల్చారు. పూర్తి అవినీతి బయటపడాలంటే సమగ్ర విచారణ అవసరమని గుర్తించారు. ఆ మేరకు విచారణకు కూడా ఆదేశించారు. బిల్ కలెక్టర్ సస్పెన్షన్.. పన్నుల వసూలులో అక్రమాలకు పాల్పడ్డారని, నకిలీ రశీదులు జారీ చేయడం వంటి అంశాలు బయట పడటంతో పాటు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో బిల్ కలెక్టర్ సీహెచ్ కైసును జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు అనుమతి లేకుండా టెక్కలి వదిలి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
గ్రామాల్లో ఆస్తి పన్ను ఏటా 5 శాతం పెంపు జీవో బాబు సర్కారుదే
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను (ఇంటి పన్ను) ఏటా ఐదు శాతం చొప్పున పెంచాలని 2002లో చంద్రబాబు సర్కారు జీవో 98 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ప్రకారం అధికారుల స్థాయిలోనే గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తూ వస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఏటా ఇంటి పన్ను పెంచుకుంటూ వెళ్లింది. ఐదేళ్లలో పెంచిన ఇంటి పన్నుల భారం రూ.266 కోట్లు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు సర్కారు తెచ్చిన జీవో ప్రకారమే ఈ ఏడాది కూడా గ్రామాల్లో ఇంటి పన్ను నిర్ధారిస్తున్నా రాజకీయ విమర్శలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేదో ప్రజలపై కొత్తగా పన్ను భారం మోపుతున్నట్లు అపోహలు సృష్టించేందుకు టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు రెట్లు పెరుగుదల... 2013–14లో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మొత్తం గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు లక్ష్యం రూ.157.96 కోట్లు కాగా 2018–19 నాటికి రూ.423.69 కోట్లకు చేరుకుంది. అంటే ఐదేళ్లలో ఇంటి పన్ను లక్ష్యం దాదాపు మూడు రెట్లు పెరిగింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే కూడా అధికంగా గత సర్కారు ఇంటి పన్ను భారం మోపింది. చదవండి: విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి నాటి జీవో ప్రకారమే.. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇంటి విలువపై రూ.వందకు 12 పైసల నుంచి ఒక్క రూపాయి మధ్య ఇంటి పన్నును సంబంధిత గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని నిర్ధారించుకోవచ్చు. 2000–2001లో ఇంటి విలువ ఆధారంగా ప్రస్తుతం పన్ను నిర్ధారణ జరుగుతోంది. అప్పుడు నిర్ధారించిన ఇంటి పన్ను ఏటా ఐదు శాతం చొప్పున పెరుగుతోంది. కొత్తగా ఇంటి విలువ నిర్ధారణ జరిగే వరకు 2000–2001 నాటి ఇంటి విలువ ఆధారంగానే పన్ను వసూలు చేయాలని టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో 98లో పేర్కొన్నారు. ఎన్నికల భయంతో ప్రయోగం వాయిదా 2017–18లో పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గత సర్కారు ప్రయోగాత్మకంగా అప్పటి ధరల ప్రకారం ఆస్తి విలువను నిర్ధారించి కొత్తగా ఇంటి పన్ను వసూలు చేసింది. ఈ నిర్ణయంతో ఒక్కో యజమాని చెల్లించాల్సిన ఇంటి పన్ను ఒకేసారి రెండు రెట్లకు పైగా పెరిగినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. 2018–19లో పశ్చిమ గోదావరి తరహాలోనే అప్పటి విలువ ఆధారంగా కొత్తగా ఇంటి పన్ను నిర్ధారణకు నాటి పంచాయతీరాజ్శాఖ మంత్రి లోకేశ్ కసరత్తు చేపట్టారు. చదవండి: అతడి అవినీతికి 2,320 ఎకరాలు హాంఫట్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లను కొత్తగా సర్వే చేసి అప్పటి విలువ ప్రకారం లెక్కకట్టి ఆన్లైన్లో నమోదు చేశారు. సర్వే ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటం, అసెంబ్లీ ఎన్నికల భయంతో ఇంటి పన్ను పెంపును గత సర్కారు తాత్కాలికంగా వాయిదా వేసింది. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2019లోనే పంచాయతీల్లో ఇంటి పన్ను రెండు మూడు రెట్లు పెరిగేదని అధికారులు పేర్కొంటున్నారు. 2014–19 గ్రామాల్లో ఇంటి పన్ను పెరిగిన తీరు ఆర్థిక ఏడాది వసూలు లక్ష్యం రూ.కోట్లలో 2013–14 157.96 2014–15 186.33 2015–16 257.95 2016–17 299.60 2017–18 369.40 2018–19 423.69 -
ఆస్తి పన్ను మదింపు చట్టంపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆస్తి పన్నును భూములు, భవనాల అద్దె విలువ ఆధారంగా కాకుండా వాటి మూలధన విలువ ఆధారంగా మదింపు చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టంతో పాటు తదనుగుణ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి వీరాంజనేయులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. -
ఆస్తి పన్ను మదింపు విధానాన్ని మార్చండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆస్తి పన్నును భూములు, భవనాల అద్దె విలువ ఆధారంగా కాకుండా.. వాటి మూలధన విలువ ఆధారంగా మదింపు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబర్ 24న జారీ చేసిన జీవో 198, అదే రోజున జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జీవో 198తో పాటు గెజిట్ నోటిఫికేషన్ను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ‘అవగాహన’ కార్యదర్శి కె.శివరామిరెడ్డి, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. పాత విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. -
ప్రక్షాళన దిశగా జీహెచ్ఎంసీ.. ఇక బిల్లు కలెక్టర్లు ఉండరా?
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తిపన్ను అసెస్మెంట్ కోసం ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లవద్దంటూ ఇప్పటికే బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ.. ఆస్తిపన్ను వసూళ్ల కోసం కూడా ఇళ్ల యజమానులకు వెళ్లకుండా చేసే ఆలోచనలో ఉంది. జీహెచ్ఎంసీలో పలువురు బిల్ కలెక్టర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు ఆస్తిపన్ను వసూళ్ల కోసం ప్రైవేటు అసిస్టెంట్లను నియమించుకోవడం వంటి ఘటనలు గతంలో వెలుగు చూశాయి. (చదవండి: KBC-13 : కేబీసీలో అనూహ్యంగా కేటీఆర్...ఎలాగంటే!) ప్రజల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్నును సైతం వెంటనే ఖజానాలో జమ చేయకపోవడం తదితరమైనవి బల్దియా వర్గాలకు సుపరిచితమే. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్తిపన్ను వసూళ్ల కోసం కోసం బిల్ కలెక్టర్లు వెళ్లనవసరం లేకుండా ప్రజలే తమ బాధ్యతగా ఆస్తిపన్ను చెల్లించేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ► ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుతో పాటు నిర్ణీత వ్యవధుల్లో పన్ను చెల్లించాల్సిందిగా ఎస్ఎంఎస్లు పంపించడం.. నిర్ణీత వ్యవధిలో చెల్లించని పక్షంలో పెనాల్టీ పడే అంశాన్ని తెలియజేయడం వంటివి చేయనున్నారు. వీటితోపాటు అధికారులు ర్యాండమ్గా తనిఖీలు చేయాలని భావిస్తున్నారు. ► తనిఖీల్లో భవనం వాస్తవ విస్తీర్ణం వంటివి గుర్తించనున్నారు. విస్తీర్ణం ఎక్కువగా ఉండి తక్కువ ఆస్తిపన్ను ఉంటే సరిచేస్తారు. దీర్ఘకాలంగా ఆస్తిపన్ను చెల్లించని వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. తదుపరి దశల్లో విద్యుత్, నీటి కనెక్షన్ వంటివి తాత్కాలికంగా నిలిపివేయాలనే ఆలోచనలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ► ఎటొచ్చీ బిల్ కలెక్టర్లు వెళ్లకుండానే ప్రజలే తమ ఆస్తిపన్ను చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఆస్తిపన్నును ఎక్కడినుంచైనా ఆన్లైన్లో చెల్లించే వెసులుబాటు మాత్రమే కాక, సిటిజెన్ సర్వీస్ సెంటర్లలోనూ చెల్లించే వీలుంది. డాకెట్ల విధానం ఎత్తివేత.. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్ల కోసం డాకెట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు 20 లక్షల ఇళ్లు 314 డాకెట్లలో ఉన్నాయి. డాకెట్ల వారీగానే బిల్కలెక్టర్లు తమకు కేటాయించిన డాకెట్లో ఇళ్లపన్ను వసూలు చేస్తారు. బిల్ కలెక్టర్లను ఆస్తిపన్ను వసూళ్ల కోసం వినియోగించనందున డాకెట్ విధానం కూడా అవసరం లేనందున ఆ విధానాన్ని కూడా ఎత్తివేయనున్నారు. ఓవైపు బల్దియాలో అవినీతి ప్రక్షాళన.. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగానే ఆస్తిపన్ను చెల్లించేలా చేయాలనేది లక్ష్యం. (చదవండి: నేడు మహా గణపతికి నేత్రోత్సవం) -
ఆస్తి జానెడు.. పన్ను బారెడు
ఈ ఫొటోలోని మహిళ బుర్జుగడ్డతండా వాసి లక్ష్మి.. ఈమె ఇంటికి సంబంధించి గత ఏడాది రూ.899 ఆస్తి పన్ను చెల్లించారు. ఈ ఏడాది రూ.5,371 ఆస్తి పన్ను చెల్లించాలని ఐదు రోజుల కిందట పంచాయతీ నుంచి నోటీసులు వచ్చాయి. ఒకే సారి ఆస్తి పన్ను ఇష్టానుసారంగా పెంచితే ఎలా..? వ్యవసాయం చేసుకునే మేము ఇంత ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు.. రెండు తండాల్లోని అందరికీ ఎదురవుతోన్న సమస్య. అధికారుల అత్యుత్యాహం.. పాలకుల అనాలోచిత చర్యలతో తండా ప్రజలకు ఆస్తి పన్ను భారంగా మారింది. ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి ఐదు వంతులకు పెంచడంతో గిరిజనులు ఆందోళనకు చెందుతున్నారు. మండల పరిధిలోని పెద్దషాపూర్తండా పంచాయతీ, అనుబంధ గ్రామం బుర్జుగడ్డతండాలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నులను భారీగా పెంచేశారు. గతేడాది రూ.5,32,264 ఉండగా.. ఈ ఏడాదికి రూ.9,01,351 డిమాండ్ నమోదు చేసి ఇంటి యజమానులకు వారం రోజుల నుంచి డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న స్థానికులు పన్ను మొత్తాన్ని చూసి షాక్ తింటున్నారు. పంచాయతీ పరిధిలోని రెండు తండాల్లో 312ఇళ్లు ఉండగా.. సుమారు 1,100 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో చాలా వరకు వ్యవసాయం, రోజూ కూలీ పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇది వరకు రూ.1000 ఉన్న ఆస్తి పన్ను ఇప్పుడు ఏకంగా రూ.5వేలు దాటిపోయింది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి పన్నులు వసూలు చేయరని, గిరిజన తండాల్లో రూ.వేలకు వేలు ఆస్తి పన్నులకు డిమాండ్ నోటీసులు పంపించడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్ను మదింపు విధానం ఆస్తి పన్ను మదింపును పంచాయతీ పాలక వర్గం తీర్మాణం మేరకు ధర నిర్ణయించాల్సి ఉంటుంది. ఖాళీ స్థలానికి చదరపు గజం, నిర్మాణానికి చదరపు అడుగుల మేరకు కొలతలు తీసుకుని పన్ను మదింపు చేయాలి. గజానికి రూ.1500 చొప్పున వంద గజాల ఖాళీ స్థలం విలువ రూ.1,50,000 అవుతుంది. ఇందులో ఆర్సీసీ ఇంటి నిర్మాణం ఉంటే 900 చదరపు అడుగుల విస్తీర్ణం అవుతుంది. దీంతో ఇంటి విలువ చదరపు అడుగుకు రూ.1250గా లెక్కిస్తే రూ.11,25,000గా నిర్ధారించాలి. ఖాళీ స్థలం, నిర్మాణం విలువలను కూడితే మొత్తం రూ.12,75,000 ఆస్థి విలువ అవుతుంది. దీనికి రూ.0.12 పైసల నుంచి ఒక రూపాయి వరకు ఆస్తి పన్ను మదింపు చేయవచ్చు. రూ.0.12 పైసలుగా వంద గజాల ఇంటికి ఆస్తి పన్ను రూ.1530లు కాగా.. దీనికి 8 శాతం గ్రంథాలయం ఫీజు రూ.122 జత చేసి ఆస్తి పన్ను మదింపు చేపట్టాలి. ఏళ్ల నాటి ఇళ్లకు కొత్తగా మదింపు కొత్తగా నిర్మించే ఇళ్లకు పైన సూచించిన విధంగా ఆస్తి పన్ను మదింపు చేయాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన ఇళ్లకు చాలా వరకు గ్రామాల్లో ఆస్తి పన్ను తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రతి ఏటా ఐదు శాతం పెంచుతూ పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం సుమారు 20ఏళ్ల కిందట నిర్మించిన ఇళ్లకు కొత్తగా అసెస్మెంట్ చేస్తూ ఆస్తి పన్ను మదింపు చేశారు. పైగా ఇటీవల నిర్మించిన ఇళ్ల కంటే కూడా ఏళ్ల నాటి ఇళ్లకు ఎక్కువ మొత్తంలో ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. చదవండి: Radhe Shyam Shooting: గండికోటలో ‘రాధేశ్యామ్’ షూటింగ్.. ఫోటోలు వైరల్ ఇంట్లో పనిచేస్తున్న యువతి ఫొటోలను.. -
నిరీక్షణకు తెర.. సెల్ఫ్ అసెస్మెంట్తో పాటే ‘పీటీఐఎన్’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కున్న/నిర్మించుకున్నవారికి జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు సంబంధించిన పీటీఐఎన్ (ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య) కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆస్తిపన్ను అసెస్మెంట్ కోసం ఆన్లైన్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్ను ఎంతో కాలం క్రితమే జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఆన్లైన్ ద్వారా ప్రజలు సమర్పించిన వివరాలను నిర్ధారించుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశాకే పీటీఐఎన్ కేటాయించేవారు. ఇప్పుడిక సెల్ఫ్ అసెస్మెంట్కు సంబంధించి జతపర్చాల్సిన పత్రాలు జత చేశాక, నివాస గృహమా, వాణిజ్య భవనమా, జోన్, సబ్జోన్ తదితర అవసరమైన వివరాలన్నీ నమోదు చేశాక చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలు తెలుస్తాయి. ఆస్తిపన్నును ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించగానే పీటీఐఎన్ జనరేట్ అవుతుంది. చెల్లించిన ఆస్తిపన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీటీఐఎన్ జనరేట్ అయ్యాక సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలతో ఆస్తిపన్ను ఖరారు చేస్తారు. హెచ్చుతగ్గులుంటే సవరిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ.. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరగ్గానే పీటీఐఎన్ జనరేట్ అయ్యే ప్రక్రియ కూడా అందుబాటులోకి తెచ్చినప్పటికీ, పూర్తిస్థాయిలో అమలుకు మరికొంత సమయం పట్టనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పీటీఐఎన్ జనరేట్ అయితే ఆ వివరాలు జీహెచ్ఎంసీకి చేరతాయి. జీహెచ్ఎంసీలో సంబంధిత సర్కిల్స్థాయి అధికారులు సంబంధిత ఆస్తిని తనిఖీ చేసి ఆస్తిపన్ను నిర్ధారిస్తారు. అలాంటి వారు సెల్ఫ్అసెస్మెంట్ చేసుకోవాల్సిన పని ఉండదు. అంటే ఇప్పటి వరకు ఆస్తిపన్ను నిర్ధారణ అయ్యాక పీటీఐఎన్ జనరేట్ చేసేవారు. కొత్త పద్ధతి వల్ల పీటీఐఎన్ ముందుగానే జనరేట్ అవుతుంది. బర్త్ సర్టిఫికెట్ ఫైల్ ట్రాకింగ్ సిస్టం.. ఆస్పత్రుల్లో శిశువుల జననం జరిగినప్పటి నుంచి బర్త్ సర్టిఫికెట్ రెడీ అయ్యేంత వరకు ఫైల్ ట్రాకింగ్ సైతం తల్లిదండ్రులకు తెలిసేలా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. డెత్ సర్టిఫికెట్ల జారీకి సైతం దాదాపుగా ఇదే విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. -
దరఖాస్తు చేయగానే బర్త్ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: ఇకపై మీ–సేవా కేంద్రాల్లో దర ఖాస్తు చేసుకుంటే తక్షణమే (ఇన్స్టంట్గా) పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జారీ కానుంది. పురపాలక శాఖ పౌర సేవల పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే ఆస్తి పన్నుల మదింపు, వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మదింపు, ట్రేడ్ లైసెన్సు జారీ, ట్రేడ్ లైసెన్సు పునరుద్ధరణ వంటి సేవలు లభించనున్నాయి. ఆస్తి పన్నులపై పునః సమీక్ష దరఖాస్తుతో పాటు ఈ పునః సమీక్షలో తీసుకున్న నిర్ణయంపై అప్పీళ్లను 15 రోజుల గడువులోగా పరిష్కరించనున్నారు. ఖాళీ భవనాలు/ ఇళ్లకు ఆస్తి పన్నుల నుంచి ఉపశమనం కల్పించడానికి వెకెన్సీ రెమిషన్ దరఖాస్తులను సైతం 15 రోజుల్లోగా పరిష్కరించనున్నారు. కొత్త మున్సిపల్ చట్టంలోని షెడ్యూల్–3లో పొందుపర్చిన ‘పౌర సేవల పట్టిక’లో నిర్దేశించిన గడువుల్లోగా ఆయా సేవలను ఇకపై కచ్చితంగా పౌరులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం అన్ని పురపాలికలకుఆదేశాలు జారీ చేశారు. పురపాలికల్లో ఆన్లైన్ ద్వారా పౌరులకు సత్వర సేవలను అందించాలని సరళీకృత వాణిజ్యం(ఈఓడీబీ) సంస్కరణలు–2020 పేర్కొం టున్నాయని తెలిపారు. ఆన్లైన్/ మీ–సేవా ద్వారా పౌరులకు నిర్దిష్ట గడువులోగా సేవలు అందించాలని ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం సైతం పేర్కొంటోందని, ఈ క్రమంలో చట్టంలో పేర్కొన్న పౌర సేవల పట్టికను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పౌర సేవల పట్టికను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డు, పౌర సేవల కేంద్రం, పురపాలిక పోర్టల్లో ప్రదర్శనకు ఉంచాలని కోరారు. పురపాలక శాఖ పోర్టల్ https://cdma.telangana.gov.in లేదా మీ–సేవా కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ కింద పేర్కొన్న సేవలను నిర్దిష్ట గడువులోగా పొందవచ్చు. వాట్సాప్లో ఆస్తిపన్నుల వివరాలు ఆస్తిపన్నుల వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు ‘తెలంగాణ ఈ–పట్టణ సేవలు’పేరుతో పురపాలకశాఖ కొత్త సేవలను ప్రారంభించింది. 9000253342 నంబర్కు ఆస్తిపన్ను ఇండెక్స్ నంబర్ (పిన్) లేదా ఇంటి నంబర్ను వాట్సాప్ ద్వారా పంపిస్తే సదరు ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను వివరాలను పంపించనుంది. అలాగే ఈ పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవసరమైన లింక్లను కూడా పంపించనుంది. ఈమేరకు పురపాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. -
గ్యాగ్ ఆర్డర్ తప్పని ఆ రోజే చెప్పాం: మంత్రి బొత్స
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో ఆస్తి పన్ను చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఉత్తర్వులపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కొత్త ఆస్తి పన్ను విధానంపై ఆస్తి పన్ను మోత అంటూ పిచ్చి రాతలు రాస్తున్నారని విమర్శించారు. కేవలం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికే ఆ పత్రికలు నిర్ణయించుకున్నాయన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం అందరికి తెలుసని అన్నారు. అలాంటి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందా అని ప్రశ్నించారు. ఆస్తి పన్ను సవరిస్తూ జారీ చేసిన జీవో అర్థం కాకపోతే తమను అడగాలని, దాని గురించి వివరంగా చెప్తామని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటగా కోరుతున్నామని, ఇలాంటి తప్పుడు రాతలను విశ్వసించవద్దని ప్రజలను కోరారు. చదవండి: పదేళ్లలో రూ. వెయ్యి కోట్లు చెల్లిస్తాం : సీఎం జగన్ ఈ ప్రభుత్వం ప్రజలదని, దేశం మొత్తం కేంద్రం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. స్థానిక సంస్థలు బలోపేతానికి, మెరుగైన సేవల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇవని స్పష్టం చేశారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను విషయంలో కేంద్రం సూచన మేరకు మార్పులు చేశామని పేర్కొన్నారు. ఒక్క ఏపీ రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే అవలంబిస్తున్నాయని తెలిపారు. 0.10 శాతం మేర పన్ను వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, అన్ని విధాలా ఆలోచన చేసి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. విధానం మార్పుచేయండి, కానీ ప్రజలపై భారం పడకూడదు అని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఇంటికి ఉన్న పన్నుకు 10 నుంచి 15 శాతం కంటే ఎక్కువ పెరిగే అవకాశం లేదని అన్నారు. రాష్ట్రంలో 375 చదరపు అడుగుల లోపు ఉన్న వారికి 50 రూపాయలు మాత్రమే పన్ను ఉంటుందని, మిగతా వారికి 0.10 శాతం నుంచి 0.50 వరకు పన్ను ఉంటుందన్నారు. చదవండి: ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించాం. దానికీ భారీగా పెరగకుండా 100 నుంచి 350 రూపాయల కంటే నీటి పన్ను ఎక్కువ ఉండకూడదని నిర్ణయించాం. ఇది కూడా 5 శాతం కంటే పెంచకూడదని నిర్ణయించాం. సీవరేజ్ కూడా 30 నుంచి 35 రూపాయలు మించకూడదని నిర్ణయించాం. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయాలు తీసుకున్నాం. సామాన్యులకు, మధ్యతరగతి వారికి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థల బలోపేతమే మా ధ్యేయం. ఓ పత్రిక ఇసుక మీద కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామంటూ రాతలు రాశారని, ఏదైనా ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలనేది తమ ప్రయత్నం. కొత్త వ్యవస్థను రూపొందించి అవినీతి జరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాం. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందుకు ప్రజలందరి సహకారం అవసరం. చదవండి: పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ గ్యాగ్ ఆర్డర్ తప్పు అని ఆ రోజే మేము చెప్పాం. ఈ అదే విషయం సుప్రీం కోర్టు చెప్పింది. న్యాయం అనేది అందరికీ సమానమే. దానికి అందరం కట్టుబడి ఉన్నాం. మేము ఊహించిందే. ఆరోజు అందరూ వ్యతిరేకించారు. చంద్రబాబుకి మేము ఎందుకు భయపడతాం. ఎస్టీలు ఒడిస్తారా...? మీ లాగా కులాల మధ్య చిచ్చు పెట్టామా..? బలహీన వర్గాలకు మహిళలకు మేము ఎంతో చేస్తున్నాం. నువ్వు మహిళల్ని మోసం చేస్తే మేము వారిని ఆదుకున్నాం. వారంతా ఆనందంగా ఉన్నారు. ఈ ఒక్క రోజే సుమారు 10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందించాం. మళ్లీ రెండో దఫా కరోనా వచ్చే అవకాశం ఉందని ప్రజల క్షేమం కోసం ఎన్నికలు వాయిదా వేయాలన్నాం. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
ప్రభుత్వంపై కావాలని బురద చల్లుతున్నారు: మంత్రి బొత్స
-
పట్టణాల్లో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేటగిరీలవారీగా సవరించిన పన్ను రేట్లను ప్రతిపాదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకమండళ్లు ఆస్తి పన్ను, ఖాళీ జాగాలపై పన్ను రేట్లను నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి తీర్మానాలు చేయాలి. అనంతరం ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించాలి. దీనిపై పురపాలకశాఖ తుది నిర్ణయం తీసుకుని పన్ను రేట్లను నిర్ణయిస్తుంది. పురపాలకశాఖ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. ఆస్తి పన్ను రేట్లు ఇలా.. ► నివాస గృహాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.10 శాతానికి తగ్గకుండా 0.50 శాతానికి మించకుండా ఆస్తి పన్నును ప్రతిపాదించారు. ► వాణిజ్య భవనాలకు ప్రభుత్వ ధర ప్రకారం ఆస్తి విలువలో 0.20 శాతానికి తగ్గకుండా 2 శాతానికి మించకుండా ఆస్తి పన్ను ప్రతిపాదించారు. ► ఒక మున్సిపాలిటీ / మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంతటా ఆస్తి పన్ను రేట్లు ఒకేలా ఉండాలి. ► 375 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలోపు నిర్మించిన ఇళ్లలో ఇంటి యజమాని నివాసం ఉంటే ఏడాదికి నామమాత్రంగా రూ.50 ఆస్తిపన్నుగా నిర్ణయించారు. ఖాళీ జాగాలపై పన్ను రేట్లు ఇలా ► మున్సిపాలిటీలలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.20 శాతం. ► మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ ధర ప్రకారం ఖాళీ జాగా అంచనా విలువపై 0.50 శాతం. ► ఖాళీ జాగాలలో చెత్త / ఇతర వ్యర్థాలు వేస్తే మున్సిపాలిటీలలో అదనంగా 0.10 శాతం, కార్పొరేషన్లలో అదనంగా 0.25 శాతం పెనాల్టీ విధిస్తారు. అనధికార నిర్మాణాలపై జరిమానాలు ► అనుమతులకు మించి 10 శాతం అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 25 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులకు మించి 10 శాతాని కంటే ఎక్కువగా అతిక్రమణలు ఉంటే విధించిన ఆస్తిపన్నుపై 50 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. ► అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు (ఫ్లోర్లు) నిర్మిస్తే విధించిన ఆస్తిపన్నుపై 100 శాతం జరిమానాతో సహా చెల్లించాలి. మొత్తం భవనమే అనధికార నిర్మాణం అయితే కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది. వీటికి పన్ను మినహాయింపులు ► ప్రభుత్వం గుర్తించిన చౌల్ట్రీలు, సేవా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, లైబ్రరీ/ మైదానాలు లాంటి ప్రజోపయోగ స్థలాలు, పురాతత్వ ప్రదేశాలు, ఛారిటబుల్ ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, శ్మశానాలు మొదలైన స్థలాలకు ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ► సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు నివసించే ఒక ఇంటికి లేదా ఖాళీ జాగాకు పన్ను మినహాయింపు కలి్పంచారు. -
సగం ఆస్తి పన్ను మాఫీ
సాక్షి, హైదరాబాద్ : గృహ యజమానులు, వరద బాధితులు, జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దీపావళి రోజు పండుగ కానుకలు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రూ.15 వేలలోపు వార్షిక ఆస్తిపన్ను ఉన్న ఇళ్ల యజమానులకు 2020–21 సంవత్సరానికి సంబంధించి 50 శాతం ఆస్తిపన్ను మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని మిగిలిన 140 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సైతం రూ.10 వేలలోపు ఆస్తిపన్ను ఉన్న వారికీ ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో 13.72 లక్షల ఇళ్ల యజమానులకు రూ.196.48 కోట్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 31.40 లక్షల ఇళ్ల యజమానులకు రూ.326.48 కోట్ల రాయితీ లభిస్తుందన్నారు. ఇప్పటికే 2020–21కి సంబంధించిన ఆస్తిపన్నులను చెల్లించిన వారికి సైతం ఈ మాఫీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది (2021–22)కి సంబంధించిన వీరి ఆస్తిపన్నులను ఆ మేరకు సర్దుబాటు చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో మంత్రి కేటీఆర్ శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కలున్న 15 పురపాలికల ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కోసం ఇంకేమైనా చేస్తే బాగుంటుందని గత శుక్రవారం జరి గిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోమంత్రులందరూ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ మేరకు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రకటన మేరకు 50 శాతం ఆస్తిపన్నును మాఫీచేస్తూ అదేరోజు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మాఫీచేసిన ఆస్తిపన్నును సంబంధిత పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మీ–సేవ ద్వారా ‘వరద సాయం’ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాల్లోతు నీళ్లున్న ముంపు కాలనీల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారని, ఎవరూ అడగక ముందే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించడానికి రూ.530 కోట్లను విడుదల చేశారని గుర్తుచేశారు. శనివారం నాటికి 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్ల సహాయం పంపిణీ చేశామన్నారు. ఇంకా ప్రభుత్వ సహాయం అందని బాధిత కుటుంబాలు మీ–సేవ కేంద్రాల ద్వారా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులపై విచారణ జరిపి అర్హుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామన్నారు. పేరు, ఇంటి నంబర్, ప్రాంతం, మొబైల్, ఆధార్ నంబర్, పిన్కోడ్, బ్యాంకు ఖాతా నంబర్ వివరాలను దరఖాస్తుతో పాటు అందజేస్తే సరిపోతుందన్నారు. ఈ మేరకు మీ–సేవ కేంద్రాల ద్వారా వరద బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల బ్యాంకు ఖాతాల్లో సహాయాన్ని జమ చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ ప్రత్యేక మెమో జారీచేశారు. గ్రేటర్ పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంపు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది వేతనాలను రూ.14 వేల నుంచి రూ.17 వేలకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలను రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వచ్చినా పారిశుధ్య, వైద్య సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ఈపీఎఫ్, ఈఎస్ఐ కలిపి రూ.3 వేల పెంపు వర్తిస్తుందన్నారు. ఫిబ్రవరి 10 వరకు టైం ఉంది.. ‘తొందరేం ఉంది.. ఫిబ్రవరి 10 వరకు మాకు టైం ఉంది.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం.. మీరెందుకు తొందర పడుతున్నారు’అని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్న సమయంలో మంత్రి కేటీఆర్ ఇలా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ముందే అనుకున్నట్టు ప్రస్తుత నవంబర్లోషెడ్యూల్ జారీచేస్తారా? లేక కొంత కాలం వేచిచూస్తారా? అన్న అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
హైదరాబాద్: దీపావళి కానుక
-
తెలంగాణ ప్రజలకు దీపావళి బొనాంజా
సాక్షి, హైదరాబాద్ :దీపావళి పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2020-21 ప్రాపర్టీ ట్యాక్స్లో రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలియజేశారు. జీహెచ్ఎంసీలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో జీహెచ్ఎంసీలో 13.72 లక్షలు.. మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షలు.. తెలంగాణ వ్యాప్తంగా 31.40 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆస్తి పన్ను కట్టిన వారికి వచ్చే ఏడాది రాయితీ ఇస్తామన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ హాజరయ్యారు. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ 4,75,871 కుటుంబాలకు వరద సాయం రూ.10 వేల చొప్పున అందించాం. వరద సాయం అందని వారికి మరో అవకాశం ఇస్తాం. వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. జీహెచ్ఎంసీ వర్కర్ల జీతాన్ని రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నాం. ప్రజల పక్షాన నిలబడిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తలకిందులు అయ్యింది. ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేశాం. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేసిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మెచ్చుకొన్నార’’న్నారు. -
రజనీకాంత్పై మద్రాస్ హైకోర్టు సీరియస్
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని తలైవాను కోర్టు హెచ్చరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని కొడంబాకంలోరాఘవేంద్ర కళ్యాణమంటపం పేరిట రజనీకాంత్కు ఒక కళ్యాణమండపం ఉంది. అయితే దానికి సంబంధించి రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఆయనకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది. ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కళ్యాణమండపం మూసి ఉందని... అప్పటి నుంచి కళ్యాణమండపం ద్వారా తమకు ఎలాంటి ఆదాయం రాలేదని ఆయన కోర్టులో పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ పన్నును చెల్లించలేనని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ రజనీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. చదవండి: మీరు లేకపోతే నేను లేను! -
ప్రాపర్టీ ట్యాక్స్పై వడ్డీ భారం తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రాపర్టీ టాక్స్పై వడ్డీ భారాన్ని తగ్గిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకే ఈ నిర్ణయం వెలువడింది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కింద ప్రాపర్టీ టాక్స్పై కేవలం 10శాతం వడ్డీ కడితే సరిపోతుంది. ఈ అవకాశం కేవలం 45 రోజులు పాటు (ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15) మాత్రమే కల్పించారు. భారీగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 5.64లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా.. ఇప్పటి వరకు రూ. 1477.86 బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆస్తి పన్ను చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన మేరకు ఆస్తిపన్ను చెల్లింపు గడువును 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపు గడువు మార్చి 31తో ముగియగా, అపరాధ రుసుం లేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మే 31వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. -
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం సెక్షన్ 100 (2)ను సవరిస్తూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగరపాలక సంస్థల్లో పొడిగించిన గడువుకు అదనంగా ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను, ఇతర బకాయిల చెల్లింపు గడువును మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. చదవండి : ఆపరేషన్ ‘ఢిల్లీ రిటర్న్’ -
పన్ను పెంపు లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను పెంచాలనే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పన్నుల పెంపునకు సంబంధించిన అన్ని కసరత్తులను పక్కనపెట్టేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాం గానికి సూచించినట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యమనే కోణంలోనే ముందుకెళ్లాలని, మిగిలిన అన్ని అంశాలను పక్కనపెట్టాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారనే చర్చ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడటమే బాధ్యతగా ముందుకెళ్లాలని ఆయన ప్రతిరోజూ నిర్దేశిస్తున్నారని అధికారులు చెపుతున్నారు. ఈ విషయమై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపు అంశం ఇప్పట్లో సీఎం ముందు చర్చకు పెట్టే పరిస్థితి కూడా లేదని, అన్నీ సర్దుకున్న తర్వాత జూలైలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతోపాటు ఇప్పటికే చెల్లించాల్సిన ఆస్తిపన్ను మార్చి 31లోపు వసూలు చేయాలని, లేదంటే యజమానులకు నోటీసులు జారీ చేయాలని గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది. దీని రీషెడ్యూల్కు సంబంధించిన ప్రకటనను త్వరలోనే సీఎం అధికారికంగా వెల్లడిస్తారని, రాష్ట్రంలో ఎలాంటి దైనందిన కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఆస్తి పన్ను చెల్లింపు రీషెడ్యూల్ తథ్యమని అధికార వర్గాలంటున్నాయి. -
జీహెచ్ఎంసీ టూ డైమెన్షన్ సర్వే..
సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఖర్చులు ఏటికేడాది పెరుగుతున్నాయి. అయితే, అనుకున్నంత ఆదాయం మాత్రం సమకూరడం లేదు. దీంతో ఖర్చులకు అనుగుణంగా రాబడిని పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓ వైపు ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయడంతో పాటు మరోవైపు అన్ని భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్నును పొందేందుకు ‘2డీ’ (టూ డైమెన్షన్) సర్వే నిర్వహిస్తోంది. జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను ద్వారా దాదాపు రూ.1400 కోట్లు వసూలవుతున్నప్పటికీ, ఈ ఆదాయం ఇంకా పెరిగేందుకు అవకాశముందని భావించిన అధికారులు అన్ని ఇళ్ల నుంచి వాస్తవ ఆస్తిపన్ను వసూలు చేసేందుకు శాటిలైట్ చిత్రాలను అనుసంధానం చేస్తున్నారు. ప్రతి భవనాన్ని ‘వీ మ్యాప్’ (వెక్టర్ మ్యాప్)తో జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు. సంబంధిత యాప్ను వినియోగిస్తూ బిల్ కలెక్టర్లతో – పాటు ఇతర సిబ్బంది డాకెట్ల వారీగా ఇళ్ల సర్వే చేపట్టారు. సర్వే ప్రారంభానికి ముందు సాంకేతిక ఇబ్బందులను పరిశీలించేందుకు, రోజుకు ఎన్ని ఇళ్లు సర్వే చేయవచ్చో అంచనాకు వచ్చేందుకు వారం క్రితం ఒకేరోజు దాదాపు 340 ఇళ్లను సర్వే చేశారు. అందులో 70 ఇళ్లకు వాస్తవంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువ పన్ను ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 10 ఇళ్లు అసలు ఆస్తిపన్ను జాబితాలో లేవు. మరో 17 ఇళ్ల విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికే పన్ను ఉంది. ఇలా మూడు విధాలా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువే వస్తోంది. శాంపిల్ డ్రైవ్లోనే దాదాపు 28 శాతం ఇళ్లు వాస్తవంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను చెల్లించడం లేదని గుర్తించారు. ఇలా అన్ని ఇళ్ల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను భారీ మొత్తంలో ఉండే అవకాశముండడంతో ఇళ్ల సర్వేపై దృష్టి పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వసూలు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు కనీసం మూడో వంతు ఇళ్ల సర్వే పూర్తిచేసి.. ఆస్తిపన్ను రివైజ్ చేసి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అదనంగా వచ్చే పన్నుతో సహా వసూలు చేయాలని యోచిస్తున్నారు. సర్వే పేరిట ఆస్తిపన్ను వసూళ్లు ఆగకుండా ఉండేందుకు ఒకపూట వసూళ్లు, మరో పూట సర్వేలో పాల్గొనాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ ఆదేశించారు. అంతే కాకుండా సర్వే నిర్వహించినప్పటికీ, వెంటనే పెరిగిన ఆస్తిపన్ను విధించకుండా లక్ష్యం మేరకు మూడో వంతు ఇళ్ల సర్వే మొత్తం పూర్తయ్యాకే.. పెరిగే ఆస్తి పన్నును రివైజ్ చేయాలని సూచించారు. తద్వారా గతేడాది వసూలైన ఆస్తిపన్ను కంటే దాదాపు 20 శాతం అదనంగా వసూలు కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వేలో భాగంగా ఎక్కువ అంశాల్లోకి పోకుండా ప్రస్తుతానికి భవన వినియోగంలో తేడా (వ్యాపారానికి వినియోగిస్తూ నివాస ఆస్తిపన్ను చెల్లింపు), ఇంత వరకు ఆస్తిపన్ను జాబితాలోలేని ఇళ్లు, ప్లింత్ ఏరియా కంటే తక్కువ ఏరియాకు మాత్రమే పన్ను చెల్లిస్తున్న వివరాలు మాత్రమే తీసుకుంటున్నట్లు అడిషనల్ కమిషనర్(ఐటీ) సిక్తా పట్నాయక్ తెలిపారు. సర్వేలో భాగంగా ఎక్కువ ఆస్తిపన్ను వచ్చేందుకు అవకాశమున్న డాకెట్లలో తొలుత సర్వే చేపట్టనున్నారు. ఎక్కువ పన్ను వచ్చే వాణిజ్య భవనాలు అధికంగా ఉన్న ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా, తర్వాత పెద్ద భవనాలున్న ప్రాంతాలను ‘బి’ కేటగిరీగా, మిగతావాటిని ‘సి’ కేటగిరీగా గుర్తిస్తారు. తొలుత ‘ఎ’ కేటగిరీ ఎక్కువగా ఉన్న డాకెట్లలో సర్వే పూర్తి చేయనున్నారు. సర్వేలో భాగంగా బిల్ కలెక్టర్లు ఇళ్లను రెండు ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అవి కార్యాలయంలోని ఉన్నతాధికారులకూ తెలుస్తాయి. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 15.93 లక్షల ఆస్తులు(ఇళ్లు/భవనాలు) ఉన్నాయి. వీటిలో 13.59 లక్షలు నివాస భవనాలు కాగా, వాణిజ్య జాబితాలో 2.06 లక్షలు ఉన్నాయి. నివాసం/వాణిజ్యం కలిసి ఉన్న భవనాలు దాదాపు 28 వేలు. సమగ్ర సర్వే పూర్తయితే వాణిజ్య కేటగిరీలో భవానాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పటి దాకా ఆస్తిపన్ను జాబితాలోకి ఎక్కని భవానాలు కూడా చేరి మొత్తం భవనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. -
ఐలా.. చూస్తూ ఉంటే ఎలా..?
చింతల్: పన్నులు చెల్లించని వాణిజ్య సముదాయాలపై కొరడా ఝులిపించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. లక్షల్లో అద్దెలు తీసుకుని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని సదరు యజమానిపై గాంధీనగర్ ఐలా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సుమారు రూ.30 లక్షల మేర ప్రభుత్వానికి గండి పడింది. ఆర్థిక సంవత్సరం చివర్లో ఐలా అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. ఎంత హడావిడి చేసినా రూ.8, 9 కోట్లు రావాల్సిన ఆదాయం రూ.3 కోట్లకు మించి రావడం లేదు. ట్యాక్స్ వసూళ్ల సమయంలో హడావుడి చేసి ఒక్క రోజు గేట్లకు తాళాలు వేసి నోటీసులు ఇచ్చినా కొంతమంది భవన యజమానులు పన్నులు చెల్లించడం లేదు. గాంధీనగర్ ఐలా పరిధిలో 225 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో కొంతమేర 2005కు ముందు భవనాలను నిర్మించగా మరి కొంత మంది 2005 తర్వాత భవనాలను నిర్మించారు. ప్రభుత్వం ట్యాక్స్లను 100 శాతం మేర పెంచడంతో పారిశ్రామికవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఇందులో కొంతమంది పాత ట్యాక్స్ ప్రకారం చెల్లిస్తుండ గా కొందరు పారిశ్రామికవేత్తలు కేసు కోర్టు పరిధిలో ఉందన్న సాకుతో ట్యాక్స్లను చెల్లించడం మానేశారు. అక్కడే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నా ఐలా అధికారులు కళ్లు మూసుకున్నారు. ఏళ్ల తరబడి ట్యాక్స్ కట్టని వారిపై చర్యలేవి..? ఐలా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పన్నులు చెల్లించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా 11 ఏళ్లలో కేవలం రూ.5 లక్షలు వరకు పన్నులు చెల్లించి మిగిలిన సొమ్మును చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. సీఐఈ గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ప్లాట్ నెం 56/1, 56/2లో సదరు యజమాని 800 గజాలలో 2008లో రెండు ప్లాట్లలో కలిపి రెండు అంతస్తులు, పెంట్హౌజ్ నిర్మించి మొత్తం 30కి పైగా షెట్టర్లను వేసి లక్షల్లో అద్దెకు ఇస్తున్నాడు. 2008–19 వరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తి మొత్తం రూ.28,67,196 లక్షల్లో బకాయిపడ్డాడు. ప్రతినెలా అతను అద్దెకు ఇస్తూ ఏకంగా రూ.5 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూడటం అనుమానాలకు తావిస్తోంది. ట్యాక్స్ వసూళ్ల సమయంలో హడావుడి చేసే ఐలా అధికారులు ఇన్నేళ్లుగా పన్నులు చెల్లించని భవనాన్ని సీజ్ చేయాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇంతమేర బకాయి రూపంలో గండి పడింది. నోటీసులకే పరిమితమవుతున్న అధికారులకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఉన్న వాటిని సీజ్ చేసే అధికారం ఉంది. కానీ ఇక్కడ అధికారుల తీరుచూస్తుంటే మాత్రం పలు అనుమానాలకు తావివ్వక మానదు. రెడ్ నోటీసులు జారీ చేస్తాం.. గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉన్న సదరు భవనాల యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేస్తామని జీడిమెట్ల ఐలా కమిషనర్ నజీర్ అన్నారు. 2005 తరువాత నిర్మించిన అన్ని భవనాల యజమానులు పూర్తిస్థాయిలో ట్యాక్స్ చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. బకాయి ఉన్న భవనాల వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తాం.– నజీర్, జీడిమెట్ల ఐలా కమిషనర్ -
ఇంటి నిర్మాణం పూర్తికాగానే వసూలుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఆదాయం పెంపునకు కమిషనర్ లోకేష్కుమార్ చర్యలు ప్రారంభించారు. ఇకపై ప్రతి ఇంటి నిర్మాణదారుడి నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణం పూర్తికాగానే ఆటోమేటిక్గా అసెస్మెంట్తో పాటు ఆస్తిపన్ను చెల్లించాల్సిందిగా సదరు యజమానికి డిమాండ్ నోటీసు కూడా అందించనున్నారు. ఇందుకోసం టౌన్ప్లానింగ్, రెవెన్యూ విభాగాలను అనుసంధానం చేయనున్నారు. -
మనీ మోర్ మనీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ప్రధానంగా ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు సర్వేల ద్వారా అండర్ అసెస్డ్, అన్అసెస్డ్ భవనాలను గుర్తిస్తోంది. ఇటీవల మూసాపేటలో నిర్వహించిన శాటిలైట్ ఆధారిత 2డీ సర్వేతో ఒక్క సర్కిల్లోనే ఆదాయం గణనీయంగా పెరగడంతో గ్రేటర్ వ్యాప్తంగానూ ఈ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మూసాపేట సర్కిల్లో మొత్తం 30వేల ఇళ్లకు గాను 9వేల ఇళ్లు ఆస్తిపన్ను రాయితీలోనివి ఉండగా... 6వేల ఇళ్లు ఆస్తిపన్ను జాబితాలోనే లేవు. వాస్తవ విలువ కంటే తక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తున్నవి దాదాపు 3వేల ఇళ్లు ఉన్నాయి. ఇలాంటి సర్వేతో బెంగళూర్లో ఆస్తిపన్ను ఏకంగా రూ.1,080 కోట్లు పెరగడాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ప్రస్తావించారు. జీహెచ్ఎంసీకి వివిధ పనుల కోసం నెలకు సగటున దాదాపు రూ.147 కోట్లు ఖర్చవుతుండగా... ఆదాయం మాత్రం దాదాపు రూ.110 కోట్లు ఉంటోంది. మిగతా మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకోవాలని, ట్రేడ్ లైసెన్సు లేని వ్యాపారుల నుంచి వసూళ్లు తదితర చర్యలకు సిద్ధమవుతోంది. వీటి ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల రూ.5లక్షల కంటే ఎక్కువ ఆస్తిపన్ను ఉన్న వాణిజ్య భవనాల తనిఖీ చేపట్టగా దాదాపు రూ.9 కోట్లు అదనంగా పెరిగింది. అదనపు అంతస్తులు తదితరమైనవి గుర్తిస్తే మరింత ఆదాయం పెరగనుంది. ఓవైపు ఆదాయం పెంచుకోవడంతో పాటు మరోవైపు ఎస్సార్డీపీలో భాగంగా జరుగుతున్న పనుల్లో భూసేకరణను వేగవంతం చేసేందుకు కూడా బల్దియా ప్రణాళిక రచిస్తోంది. వీటికి చెల్లించాల్సిన పరిహారాన్ని నగదు రూపేణా కాకుండా వీలైనంత మేరకు టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇటీవల కాలంలో ఈ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ముందుకొస్తున్నవారు పెరగడంతో అధికారులు ఈ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఎల్బీనగర్ పరిసరాల్లో ఎస్సార్డీపీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తిచేసేందుకు భూ యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పలు ప్రాంతాల్లో నివాస భవనాలు వాణిజ్య భవనాలుగా మారడంతో వాటిని కమర్షియల్ కారిడార్లుగా గుర్తించి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో జీవో రానుంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఆర్కిటెక్ట్ల ప్రమేయం తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. త్వరలో రూపొందించనున్న జీహెచ్ఎంసీ యాక్ట్లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. రోడ్ల మరమ్మతుల బాధ్యత బల్దియాదే... నగరంలో రోడ్లు వివిధ సంస్థలకు చెందినవి ఉన్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఆర్డీసీఎల్, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీల రోడ్లున్నాయి. రోడ్లు ఎవరివైనా వర్షాకాలం ముగిసేంత వరకు ఏర్పడే మరమ్మతుల బాధ్యత జీహెచ్ఎంసీనే చేపట్టాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసిందని కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీలో వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు తగిన యంత్రాంగం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
రూ.లక్ష ఇస్తే పీటిన్!
సాక్షి, సిటీబ్యూరో: భారీ మొత్తం తీసుకుని ఒకరి ఇంటిపై వేరే వారికి అక్రమంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) సృష్టించి ఇచ్చిన జీహెచ్ఎంసీ ఉద్యోగితో పాటు అతడికి సహకరించిన వ్యక్తినీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 2016లో అప్పటి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఏదైనా ఓ ప్లాట్లో ఇల్లు కట్టిన తర్వాత ఇంటి నంబర్ ఇవ్వడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) జీహెచ్ఎంసీ క్రియేట్ చేస్తుంది. అందుకు గాను సదరు యజమాని సేల్డీడ్ తదితరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ జరిగి, అధికారులు అన్నీ సరిచూసిన తర్వాతే పీటిన్ కేటాయిస్తారు. రాజేంద్రనగర్లోని ప్రేమావతిపేటలో ఉన్న ఓ ఆస్తిపై కొందరి మధ్య వివాదం ఉంది. దీనిని కాజేయాలని చూసిన ముగ్గురు బోగస్ పత్రాల సాయంతో రాజేంద్రనగర్ అధికారులను సంప్రదించి పీటిన్ కోసం దరఖాస్తు చేశారు. ఇది తిరస్కారానికి గురికావడంతో వీరు అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్æ ఆపరేటర్గా పని చేస్తున్న జయ చంద్ర వెలగను సంప్రదించారు. రూ.లక్ష తీసుకున్న అతగాడు అక్రమంగా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్వర్లోకి చొరబడి ఆ ముగ్గురి పేరుతో ఆస్తి ఉన్నట్లు పీటిన్ సృష్టించి ఇచ్చాడు. ఇలా పొందిన పత్రంతో వారు సదరు స్థలాన్ని విక్రయించారు. ఈ విషయం తెలిసిన ఆస్తి యజమాని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2016లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఏసీపీ సీహెచ్వై శ్రీనివాస్కుమార్ నేతృత్వం లోని బృందం దీన్ని దర్యాప్తు చేసింది. ఈ స్కామ్కు బాధ్యుడైన జయ చంద్ర వెలగతో పాటు అతడికి సహకరించిన నాగేంద్ర బాబులను శుక్రవారం అరెస్టు చేశారు. -
ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి బిల్ కలెక్టర్
సాక్షి, కూకట్పల్లి: ఆస్తి పన్ను తగ్గించేందుకు ఓ షాపు యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసిన ఓ బిల్ కలెక్టర్ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూకట్పల్లి సర్కిల్–24లోని ఆస్బెస్టాస్ కాలనీ ఏరియాకు బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న మహేంద్రనాయక్ కాలనీలోని రాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు సంబంధించి ఆస్తి పన్నును తగ్గించేందుకు రూ.36 వేలు డిమాండ్ చేయగా షాపు యజమాని ఎం.నాగరాజు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అధికారులు కెమికల్ కలిపిన నోట్లను నాగరాజుకు ఇచ్చి పంపారు. డబ్బులు తీసుకునేందుకు షాపు వద్దకు వచ్చిన మహేంద్రనాయక్కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు మహేంద్రనాయక్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
‘ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగింది’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయం 750 కోట్ల నుంచి 1450 కోట్ల రూపాయలకు చేర్చామన్నారు. తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ ఎవరు మెచ్చుకోరని అన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజల నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు సంబంధం ఉన్న సంస్థ తమదని పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని.. జన సాంద్రత పెరిగినప్పుడు మౌళిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఆగస్టులో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 74 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయని.. అవి రానున్న కొద్ది రోజుల్లో 146 కానున్నాయని ప్రకటించారు. అలాగే తొమ్మిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయన్నారు. హైదరాబాద్లో రోడ్ల కోసం హెచ్ఆర్డీసీ, మూసీ నది ప్రక్షాళన కోసం మూసి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బాండ్లను సేకరించడం ద్వారా జీహెచ్ఎంసీ నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. కొల్లూరులో అతి పెద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల టౌన్ షిప్ను నిర్మిస్తున్నామని.. దీన్ని అందరు గుర్తించాలని కోరారు. కేంద్ర రక్షణ శాఖ సహకారం లేకపోవడం వల్ల రెండు పెద్ద స్కైవేలు ఆగిపోయాయని పేర్కొన్నారు. -
ఆస్తి పన్ను మూడింతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడనున్న 71 పురపాలికల్లోని ప్రజలకు ముందుంది ముసళ్ల పండగే. గ్రామ పంచాయతీలు కాస్త పురపాలికలుగా మారగానే స్థానికంగా ఆస్తి పన్నులు మూడింతలై పోతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని బాదెపల్లి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు రూ.74.48 లక్షల ఆస్తి పన్నులుండగా, మునిసిపాలిటీగా మారిన తర్వాత రూ.2 కోట్లకు పైగా పెరిగిపోయాయి. గ్రామ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా కల్పించిన తర్వాత రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం ప్రకారం ఆస్తి పన్నుల వసూళ్లు జరిపేందుకు పురపాలక శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మునిసిపాలిటీల చట్టంలోని నిబంధనల ప్రకారం అక్కడి నివాస, వాణిజ్య, ప్రభుత్వ స్థిరాస్తులపై విధించాల్సిన ఆస్తి పన్నులను గణించేందుకు ప్రత్యేకంగా ఆస్తి పన్నుల గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రామ పంచా యతీ స్థాయి నుంచి రెండేళ్ల కింద మునిసిపాలిటీగా మారిన బాదెపల్లిలో ఆస్తి పన్నుల సవరణ కార్యక్రమాన్ని ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ పూర్తి చేసింది. ఈ పురపాలికలో 9 వేలకు పైగా గృహాలు, భవ నాలు, ఇతర స్థిరాస్తులపై ఆస్తి పన్నులు సగటున మూడింతల వరకు పెరిగిపోయాయి. ఇదిలా ఉండ గా, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఏడాది కింద మునిసిపాలిటీగా మారిన దుబ్బాకలో త్వరలో ఆస్తి పన్నులు పెరగనున్నాయి. వచ్చే ఆగస్టు 1 నుంచి దుబ్బాకలో ఆస్తి పన్నుల సవరణ అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. స్థానికంగా ఆస్తి పన్నుల పెంపునకు కసరత్తు జరుగుతోంది. ఆస్తి పన్నుల సవరణకు కసరత్తు కొత్తగా 71 మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. 173 గ్రామ పంచాయతీల విలీనం చేయడంతో ఈ పట్టణ ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోకి మరో 136 గ్రామ పంచాయతీలు విలీనం కానున్నాయి. వచ్చే జూలై 31తో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన పాలక మండళ్ల పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే వీటికి మునిసిపాలిటీల హోదా లభించనుంది. ఈ 71 మునిసిపాలిటీలతో పాటు ఇప్పటికే ఉన్న పురపాలికల్లో విలీనం కానున్న గ్రామ పంచాయతీల పరిధిలో మునిసిపాలిటీల చట్టం ప్రకారం ఆస్తి పన్నుల సవరణ జరిపేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ముందస్తుగా కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి నేతృత్వంలోని ఆస్తి పన్నుల బోర్డు ఇటీవల సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 308 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఆస్తి పన్నులకు సంబంధించిన డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలను స్థానిక జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించింది. ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు, జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్ రిజిస్ట్రీ తదితరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని కోరింది. కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికల్లో ఆస్తి పన్నుల సవరణ కార్యక్రమాన్ని చేపట్టి, కసరత్తు పూర్తి చేసే వరకు మరో ఏడాది సమయం పట్టనుందని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
పూరి గుడిసెపై రూ.500 పన్నా!
సాక్షి, హైదరాబాద్: వృద్ధ దంపతులు నివాసముంటున్న ఓ గుడిసెపై స్థానిక పంచాయతీ కార్యదర్శి రూ.500 ఆస్తి పన్నును వసూలు చేసిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్లూర్ మండలం కర్దెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉదంతాన్ని ట్విట్టర్ ద్వారా రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు చెల్లించిన ఆస్తి పన్నును వెనక్కి ఇప్పించడంతో పాటు వారికి డబుల్బెడ్ రూం ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులు నిర్దయగా వ్యవహరించారని ఉత్తమ్ తప్పుపట్టారు. దీనికి కేటీఆర్ స్పందించి ఈ పొరపాటును సరిదిద్దాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆ దంపతులకు డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేయాలని కోరారు. వృద్ధాప్య పింఛన్ రాని పక్షంలో అదీ మంజూరు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఉత్తమ్కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ ఆదేశాలపై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ ట్వీటర్లో స్పందించారు. ఈ విషయం తన దృష్టికి నాలుగు రోజుల క్రితమే వచ్చిందని.. వెంటనే బాధితులకు ఆస్తిపన్ను తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. ఆ వృద్ధ దంపతులకు ఇప్పటికే ఆసరా పింఛన్ అందుతోందని.. డబుల్ బెడ్రూం పథకం కింద ఇంటిని మంజూరు చేస్తామని కేటీఆర్కు ఆయన బదులిచ్చారు. -
క్రమబద్ధీకరణపై ‘పన్ను’పోటు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అనుమతిలేని భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నుల పిడుగు పడింది. భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్ఎస్) దరఖాస్తుదారుల సమాచారాన్ని వినియోగిం చుకుని పురపాలికలు అనుమతి లేని కట్టడాలపై జరిమానాల పేరుతో ఆస్తి పన్నులను ఏకంగా 25 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచేశాయి. అలాగే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖా స్తుల సమాచారాన్ని వినియోగించుకుని ఆయా లేఅవుట్లు, ప్లాట్లపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లను వడ్డించాయి. అసాధారణ రీతిలో ఆస్తి పన్నులు పెరిగిపోవడంతో బీఆర్ఎస్ దరఖాస్తుదారులు, కొత్తగా ఖాళీ స్థలం పన్నులు వడ్డించడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. పెంచిన ఆస్తి పన్నులను తగ్గించాలని కోరుతూ నేరుగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటు న్నారు. మరికొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. చేతికి అందిన సమాచారం.. అనధికార భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో 3 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 1.6 లక్షల దరఖాస్తులు జీహెచ్ఎంసీకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ కింద మరో 1.65 లక్షల దరఖాస్తులొచ్చాయి. అనధికార భవనాల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రెండేళ్లు గడిచినా ఈ కేసులో పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. మరోవైపు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూపంలో చేతికి అందిన సమాచారం ఆధారంగా ఆయా అనధికార భవనాలపై జరిమానాలు, లే అవుట్లపై ఖాళీ స్థలాల పన్నులు విధించేందుకు పురపాలక శాఖ వినియోగించుకుంది. అనుమతి లేని/పూర్తిగా అక్రమ కట్టడాలపై జరిమానాలతో కూడిన ఆస్తి పన్నులు విధిస్తూ జారీ చేసే గులాబీ రంగు డిమాండ్ నోటీసులను బీఆర్ఎస్ దరఖాస్తుదారులకు పురపాలికలు జారీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి లభించే వరకు ఈ భవన యజమానులు జరిమానాలు చెల్లించక తప్పదని పురపాలక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గులాబీ రంగులో పెనాల్టీ నోటీసులు పూర్తిగా అనుమతి లేకుండా లేక అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల ప్రకారం 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులు పెంచి జరిమానాల రూపంలో వసూలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జరిమానా వసూళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణ ప్లాన్లో అనుమతించిన ప్రకారమే అంతస్తులు నిర్మించినా, సెట్బ్యాక్ విషయంలో 10 శాతం లోపు ఉల్లంఘనలు ఉంటే 25 శాతం ఆస్తి పన్నును పెంచి జరిమానాగా వసూలు చేయాలి. అనుమతించిన సంఖ్యలోనే అంతస్తులు కలిగి ఉండి సెట్బ్యాక్ విషయంలో 10 శాతానికి మించి ఉల్లంఘనలుంటే 50 శాతం ఆస్తి పన్నులను పెంచి వసూలు చేయాలి. అనుమతించిన అంతస్తుల మీద అనుమతి లేకుండా అదనపు అంతస్తులు కడితే 75 శాతం ఆస్తి పన్ను పెంచాలి. పూర్తిగా అనుమతి లేని కట్టడంపై 100 శాతం ఆస్తి పన్ను వడ్డించాలి. జరిమానాలతో కూడిన ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసులను గులాబీ రంగులో భవన యజమానులకు అందించాలి. -
ఇక ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణ!
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇకపై ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణలు జరపాలని మునిసిపాలిటీలను పురపాలక శాఖ ఆదేశించింది. కొత్తగా నిర్మించిన, పునర్ నిర్మాణం చేసిన, విస్తరించిన భవనాలు, కట్టడాలను ఎప్పటికప్పుడు పన్ను పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. భవనాల నిర్మాణం పూర్తయితే 30 రోజుల్లోగా, పూర్తికాకున్నా గృహ ప్రవేశం చేస్తే తక్షణమే పన్ను పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది. భవన యజమాని మారినా, భవన వినియోగం (గృహ, వాణిజ్య) మారినా సవరణలు జరపాలని పేర్కొంది. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి అధ్యక్షతన ఇటీవల సమావేశమైన తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు.. ఆస్తి పన్ను వసూళ్లలో మునిసిపాలిటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పన్ను సవరణల కోసం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, క్షేత్ర స్థాయిలో పని చేసే ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని సూచించింది. మునిసిపాలిటీల్లోని అన్ని గృహాలు, భవనాలకు సంబంధించిన ఆస్తి పన్నుల జాబితాలను యజమానుల ఆధార్ నంబర్తో అనుసంధానం చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను ఆదేశించింది. మునిసిపాలిటీలకు జారీ చేసిన ఆదేశాలివే.. కొత్తగా ఏర్పాటైన బాదెపల్లి మునిసిపాలిటీలో ఆస్తి పన్ను పెంపును ఏప్రిల్ 1 నుంచి, దుబ్బాక మునిసిపాలిటీలో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలి. కొత్తగా ఏర్పాటవనున్న 68 పురపాలికల పరిధి లో వసూలు చేస్తున్న ఆస్తి పన్నుల వివరాలను ఆయా గ్రామ పంచాయతీల నుంచి పు రపాలక శాఖ పన్నుల విభాగం ముందస్తుగా సేకరించాలి. (మునిసిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఆ చట్టాలకు అనుగుణంగా ఆస్తి పన్నుల పెంపును చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు) 72 పురపాలికల్లో ఉన్నఆస్తులను జీఐఎస్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ జరిపించి ఆస్తి పన్నుల జాబితాలోని ఆస్తుల సమాచారాన్ని పోల్చి చూడగా 50% తక్కువగా పన్నులు వసూలైనట్లు వెల్లడైంది. దీంతో ఈ నెల 15 లోగా ఆస్తి పన్నుల జాబితాను సవరించాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలోనే బిల్డింగ్ నమూనా ఆధారంగా ఆస్తి పన్ను గణన చేసేందుకు కొత్త విధానం తీసుకురావాలి. ఆస్తి పన్నుల సవరణలపై భవన యజమానుల నుంచి వచ్చిన 4,292 అభ్యంతరాలు ముని సిపల్ కమిషనర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలి. అనుమతి లేకుండా నిర్మించిన.. ప్రైవేటు, ప్రభు త్వ, వక్ఫ్, దేవాదాయ, ఇతర భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై అదనంగా 100% ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గతం లో ఇచ్చిన ఉత్తర్వులను మునిసిపాలిటీలు అమ లు చేయాలి. పన్నుల డిమాండ్ నోటిసులో ‘భవ న యజమాని’పేరుకు బదులు ‘భవనాన్ని అధీనంలో పెట్టుకున్న వ్యక్తి పేరు’అని రాయాలి. -
ఆస్తిపన్నుపై 5% రాయితీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30 లోపు పన్ను చెల్లించే వారికి ఈ రిబేట్ వర్తింపజేస్తామని వెల్లడించింది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే రిబేట్ను అమలు చేస్తుం డగా.. ఇకపై రాష్ట్రంలోని 73 మున్సిపల్ కార్పొ రేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆస్తి పన్నుల వసూళ్లతో ఆదాయం పెరిగితే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిబేట్పై విస్తృత ప్రచారం కల్పించి వసూళ్లు ప్రోత్సహించాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. గడువులోగా చెల్లించని ఆస్తి పన్నుల బకాయిలపై పెనాల్టీలు విధించడం.. తర్వాత మిగిలిన బకాయిలను రాబట్టుకోడానికి మళ్లీ కొత్త గడువు విధించి ఆలోపు చెల్లిస్తే పెనాల్టీలు మాఫీ చేయడం కొన్నేళ్లుగా అనవాయితీగా వస్తోంది. దీంతో సకాలంలో పన్ను చెల్లింపులు ప్రోత్సహించేందుకు 2016–17 నుంచి పెనాల్టీల మాఫీకి పురపాలిక శాఖ స్వస్తి పలికింది. ‘నేమ్ అండ్ షేమ్’పద్ధతిలో.. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లో ఆస్తి పన్ను ఎగవేసిన టాప్–100 మంది జాబితాను పురపాలక శాఖ తన వెబ్సైట్లో పొందుపరిచింది. కమర్షియల్ ఆస్తులకు సంబంధించి ఏళ్లుగా చెల్లించని మొండి బకాయిలు రూ.కోట్లకు ఎగబాకడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వసూళ్ల కోసం పలు మార్లు నోటిసులిచ్చినా లాభం లేకపోవడంతో ‘నేమ్ అండ్ షేమ్’పద్ధతిలో ఎగవేతదారుల పేర్లు బహిర్గతం చేసేందుకు ఆ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీంతో ఎగవేతదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తారని ఈ నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆస్తి పన్నులు ఎగవేస్తే సంబంధిత వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే అధికారం పురపాలికలకు ఉందని ఓ అధికారి తెలిపారు. రూ.294 కోట్లు వసూలు.. 2017–18లో 73 పురపాలికల ద్వారా రూ.294 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. 2016–17లో వసూలైన రూ.232.77 కోట్లతో పోల్చితే గతేడాది 26 శాతానికి పైగా అధిక రాబడి వచ్చింది. సిరిసిల్ల, మెట్పల్లి, కొత్తగూడెం, పీర్జాదిగూడ పురపాలికల్లో 100 శాతం.. మీర్పేట్, దుబ్బాక, కోరుట్ల, బోడుప్పల్, హుజూరాబాద్ పురపాలికల్లో 98 శాతానికి పైగా పన్ను వసూలైంది. నల్లగొండ, ఐజా, నారాయణ్పేట్, భూపాలపల్లి పురపాలికల్లో వసూళ్లు 50 శాతానికి మించలేదు. -
ఆస్తి పన్ను సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు
సాక్షి, హైదరాబాద్ : 2017-18 సంవత్సరానికిగానూ ఆస్తి పన్నుల సేకరణలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 1205 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా 1320.26 కోట్లతో రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 115 కోట్లు అధికం. గత ఏడాదితో పోల్చితే అడ్వర్టైజ్మెంట్ వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైంది. 2016-17లో రూ. 26.19 కోట్లు వసూలు కాగా ప్రస్తుతం రూ. 38.44 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం 42 కోట్లు ఉన్న ట్రైడ్ లైసెన్స్ వసూళ్లు ప్రస్తుతం రూ. 52 కోట్లకు చేరాయి. రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను సేకరించడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్డన్రెడ్డి అధికారులకు అభినందనలు తెలిపారు. -
41 శాతం అతిక్రమణలే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పెచ్చరిల్లిన అవినీతి అవినీతి అధికారుల జేబులు నింపుతోందని కాగ్ నివేదిక సాక్షిగా తేలింది. 2012–2017 కాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో మచ్చుకు 75,387 ఇళ్లను తనిఖీ చేసిన కాగ్, అతిక్రమణల స్థాయి చూసి అవాక్కైంది. ఏకంగా 30,864 ఇళ్ల నిర్మాణంలో అతిక్రమణలు బయటపడ్డాయి. అంతేకాదు, వీటిలో 10,460 అక్రమ నిర్మాణాలేనని కూడా తేలింది! అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందిలో కొందరు ఆస్తి పన్ను మదింపులో చేతివాటం ప్రదర్శించి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలకూ కాగ్ నివేదిక బలం చేకూర్చింది. 708 కట్టడాలను పరిశీలించగా, రూ.5.24 కోట్ల మేర ఆస్తి పన్ను తక్కువగా మదింపు చేసినట్టు కాగ్ గుర్తించింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ సమయంలో పన్ను చెల్లించేప్పుడు కూడా ఇలాంటి మతలబులే చోటుచేసుకుంటున్నట్టు తేలింది. ఆయా భవనాల విస్తీర్ణం టౌన్ ప్లానింగ్లోని వివరాలకు, ఆస్తి పన్ను మదింపులోని వివరాలకు చాలా తేడా ఉంది. ఆరు సర్కిళ్ల పరిధిలో కేవలం 287 నిర్మాణాలను పరిశీలించగా రూ.1.25 కోట్ల మేర పన్ను తక్కువగా చెల్లించినట్టు తేలింది. పదేళ్లలో 26 చెరువుల్ని మింగారు జీహెచ్ఎంసీ ఆవిర్భవించే నాటికి (2007) దాని పరిధిలో 185 చెరువులుండగా వాటిలో 26 చెరువులు ఇప్పుడు ‘కనపడుట లేదు’. మిగతా వాటిలోనూ 17 చెరువులు ఎక్కడుండాలో కూడా జాడ కనుక్కోలేని దుస్థితి ఉందని కాగ్ తేల్చింది! మరో 9 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని జీహెచ్ఎంసీ నివేదిక ఆధారంగా కాగ్ గుర్తించింది. -
30 రోజులు.. రూ. 400 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మిగిలింది కేవలం 30 రోజులే. ఇంకా వసూలు కావాల్సిన ఆస్తి పన్ను మాత్రం దాదాపు రూ. 405 కోట్లు. దీంతో రోజుకు రూ. 13.52 కోట్లకు తగ్గకుండా ఆస్తి పన్ను వసూలుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జోనల్, డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి దాకా స్వచ్ఛ మంత్రం పఠించిన జీహెచ్ఎంసీ యంత్రాంగమంతా ఇక వసూళ్ల పర్వం లో మునగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18) రూ. 1400 కోట్ల ఆస్తిపన్ను లక్ష్యం కాగా, బుధవారం వరకు రూ. 994.40 కోట్లు వసూలయ్యాయి. మిగతా మొత్తాన్ని సేకరించేందుకు జోన్ల వారీగా లక్ష్యాన్ని నిర్ధారించారు. జీహెచ్ఎంసీ డాకెట్లవారీగా బిల్ కలెక్టర్లకు లక్ష్యాలు నిర్దేశించి, ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాల్సిందిగా కమిషనర్ డిప్యూటీ, జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి దాదాపు రూ. 852 కోట్లు వసూలైంది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువే వసూలైనప్పటికీ, లక్ష్యాన్ని చేరుకునేం దుకు కసరత్తు చేపట్టారు. ఇప్పటి వరకు బిల్ కలెక్టర్ల ద్వారా దాదాపు రూ. 556 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా రూ. 181 కోట్లు, మీసేవ కేంద్రాల ద్వారా రూ. 82.25 కోట్లు, ఆన్లైన్ ద్వారా రూ. 174 కోట్లు వసూలయ్యాయి. ఆస్తిపన్నుతో పాటు ట్రేడ్లైసెన్సుల ఫీజులు కూడా వసూలు చేయా ల్సిందిగా కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఈ సంవత్సరం ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల లక్ష్యం రూ. 50 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ. 38 కోట్లు వసూలయ్యాయి. -
నత్తనడక
మండపేట: జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం డిమాండ్ రూ.115.31 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ.61.63 కోట్లు మాత్రమే వసూలైంది. 74.5 శాతం పన్నుల వసూళ్లతో జిల్లాలో పెద్దాపురం పురపాలకసంఘం ముందంజలో ఉండగా 43 శాతంతో పిఠాపురం చివరిస్థానంలో ఉంది. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా నూరుశాతం వసూళ్లు ప్రశార్థకంగా మారింది. ఆర్థిక సంఘం నిధుల విడుదలకు నూరుశాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేయడంతో అధికారుల అలసత్వం పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరకార్పొరేషన్లతోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 2,41,493 ప్రైవేటు భవనాలున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు నాటికి ఆయా భవనాలు ద్వారా మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 115.31లు డిమాండ్ కాగా ఇప్పటి వరకు కేవలం రూ. 61.63 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాకినాడ నగర పాలక సంస్థలో 52.8 శాతం వసూలు కాగా, రాజమహేంద్రవరంలో 51.27 శాతం వసూలయ్యాయి. అమలాపురం మున్సిపాల్టీలో 56.3 శాతం, రామచంద్రపురంలో 48.8 శాతం, పిఠాపురంలో 43.9 శాతం, మండపేటలో 68.2 శాతం, తునిలో 72 శాతం, పెద్దాపురంలో 74.5 శాతం, సామర్లకోటలో 49.6 శాతం పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 69.2 శాతం, ఏలేశ్వరంలో 65 శాతం, ముమ్మిడివరంలో 50 శాతం పన్నులు వసూలయ్యాయి. నూరుశాతం వసూలు గగనమే 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు మేరకు స్థానిక సంస్థలు నూరుశాతం పన్నులు వసూలు తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్నుల వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతర సమీక్ష జరుగుతోంది. మరో ఐదు వారాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితితో నూరుశాతం వసూలు గగనమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బాధ్యతగా పన్నులు చెల్లించండి
విశాఖసిటీ: ఆస్తి పన్ను, నీటి పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని గ్రేటర్ ప్రజలను జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ విజ్ఞప్తి చేశారు. కోట్ల రూపాయల బకాయిలుండటం వల్ల అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ చాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పోలిస్తే జీవీఎంసీలో పన్నుల విలువ తక్కువైనా నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ఏడా ది అక్టోబర్ వరకూ మొత్తం నీటి పన్ను బకాయిలు రూ.29 కోట్లుండగా, ఆస్తి పన్ను బకాయిలు రూ.37 కోట్లున్నాయని ఇవన్నీ వసూలైతే.. నగర ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించే అవకాశముంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్లకు నిధులు అవసరమని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి ఇంట్లోనూ తడి పొడి చెత్తను కచ్చితంగా వేరు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 100 కిలోలు, అంతకంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు.. తమ పరిసర ప్రాంతాల్లోనే కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలా చేయని వారి ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. అదే విధంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలన్నారు. లేకుంటే ఆ ప్రాంతాలకు చెత్త బండిని పంపించే ది లేదని స్పష్టం చేశారు. చెత్త బండి రాలేదని పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. తడి పొడి చెత్త వేరు చేయడం ప్రతి ఇంటి వద్ద బాధ్యతగా చేపట్టాలనీ, త్వరలోనే ఈ అంశాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేరు చేస్తున్నారని, అన్ని జోన్లకూ కలిపి రోజుకి 105 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు. భీమిలి జోన్కు సంబంధించి 279 జీవో టెండర్ పరిశీలనలో ఉందనీ, మిగిలిన జోన్లకు సంబంధించి కోర్టులో స్టే నడుస్తోందని కమిషనర్ హరినారాయణన్ తెలిపారు. నీటి పన్నుల విషయంలో కమర్షియల్ కేటగిరీల్లో కొన్ని తప్పులు దొర్లాయనీ, నోటీసులు వచ్చిన వారు ఆయా జోన్లకు వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. వర్షపునీటిని ఒడిసి పట్టాల్సిందే.. జీవీఎంసీ పరిధిలోని సెమీ బల్క్, బల్క్ వాటర్ కనెక్షన్లు కలిగిన వారంతా విధిగా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని కమిషనర్ సూచించారు. కేవలం ఇంకుడు గుంతల నిర్మాణానికే పరిమితం కాకుండా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. దీన్ని అమలు చేసేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఇస్తామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు జీవీఎంసీ సిద్ధమవుతోందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీడీపీఎంఎస్ ద్వారా ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాల కోసం ఆన్లైన్లో 3,600 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పది ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ జీవీఎంసీ పరిధిలోని 27 హైస్కూల్స్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు. ఏఏ సబ్జెక్టుల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని గుర్తించి, వారికి స్పెషల్ కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారి బలాలు, బలహీనతలు గుర్తించి దానికనుగుణంగా విద్యార్థుల్ని సన్నద్ధులు చేస్తామన్నారు. ఈ పరీక్షల మార్కుల్ని ఆన్లైన్లో పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. -
ప్రతి ఇంటికి జియోట్యాగ్
మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు మెదక్మున్సిపాలిటీ: ఆస్తిపన్ను మదింపునకు సంబంధించి ప్రతి ఇంటికి(అసెస్మెంట్) జియోట్యాగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భువన్ యాప్ను ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలోని ఫతేనగర్ వీధిలో జియోట్యాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా మెదక్ పట్టణంలో జియోట్యాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పన్నులు వసూలు చేసే బిల్ కలెక్టర్లు ముందుగా ఫోన్లో భువన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్ కావాలన్నారు. దీంతో అతని పరిధిలో గల అసిస్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఫోన్లోకి చేరతాయన్నారు. అనంతరం బిల్ కలెక్టర్ ప్రతి అసిస్మెంట్ను పరిశీలించి, భవనాల ఫొటో తీసుకొని వాటిని జియోట్యాగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్ఐ ఆయా వివరాల్లో తప్పులు సరిచేయడంతో పాటు వాటిని కంప్యూర్లో నిక్షిప్తం చేస్తారన్నారు. గతంలో జీఐఎస్ సర్వే ద్వారా ప్రతి ఇంటికి కొలతలు తీసుకున్నామని, జియోట్యాగింగ్ ద్వారా అందులో ఏమైనా అనుమానాలుంటే సరిచేసుకోవచ్చన్నారు. మెదక్ పట్టణంలో 9,470 అసిస్మెంట్లు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అందులో ఇప్పటి వరకు 450 అసిస్మెంట్లకు జియోట్యాగ్ పూర్తిచేశామన్నారు. జూలై 15వ తేదీలోగా జియోట్యాగ్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. భువన్యాప్లో సేకరించిన సమాచారాన్ని ప్రజలు ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్ఐ రమేశ్, బిల్ కలెక్టర్ శివ తదితరులు ఉన్నారు. -
ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగం
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగమయ్యింది. ప్రా థమికంగా సుమారు రూ.75 వేలు స్వాహా అయినట్టు తేలింది. అయితే ఇది మరింత పెరగవచ్చని అంచనా. దీనిపై నగర పంచాయతీ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాలిలా ఉన్నా యి.. నగర పంచాయతీలో ఆస్తిపన్ను (ఇంటి పన్ను) వసూళ్లకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి సిబ్బంది సౌలభ్యాన్ని బట్టి ఒకరిని నియమిస్తుంటారు. ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ కౌంటర్లో పనిచేస్తుండగా రూ.75 వేలు దుర్వి నియోగం చేసినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. బయటపడిందిలా.. ఈ నెల 10న రెండో శనివారం సెలవు కావడంతో ఆస్తిపన్ను వసూలుకు అధికారులు కౌంటర్ ఏర్పాటు చేయలేదు. 12న సోమవారం ఆర్ఐ సీహెచ్ వెంకటేశ్వరరావు శుక్రవారం వరకు వసూలైన వివరాలు, రికార్డులు కంప్యూటర్లో పరిశీలించగా, శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో 8 ఇంటి పన్నులకు సంబంధించి రూ.75 వేల రశీదులు ఇచ్చినట్టు గుర్తించారు. అయితే దీనిపై ఆరా తీయగా స్థానిక చింతల బజారులోని ఓ ఈ–సేవ కేంద్రం నుంచి నగర పంచాయతీ వెబ్సైట్కు లాగిన్ అయ్యి రశీదులు ఇచ్చినట్టుగా గుర్తించారు. దీనిపై ఆయన కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావుకు రిపోర్ట్ చేశారు. విచారించగా ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ సేవ కేంద్రం ద్వారా రశీదులు జారీ చేసినట్టు తేలింది. క్యాన్సిలేషన్ను క్యాష్ చేసుకున్న వైనం నగర పంచాయతీ వెబ్సైట్లో ఆస్తిపన్నుల క్యాన్సిలేషన్కు ఆప్షన్ ఉంది. దీనిని ఆమె సొమ్ము చేసుకుంది. గతంలో కొందరు యజమానులు ఆస్తి పన్ను చెల్లించగా వారికి రశీదులు ఇచ్చి వెంటనే క్యాన్సిలేషన్ చేసి సొమ్మును స్వాహా చేసింది. అయితే ఇటీవల ఒకరిద్దరికి తాము ఆస్తిపన్ను చెల్లించినా డిమాండ్ నోటీసులు రావడంతో నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి ప్రశ్నిం చారు. దీంతో కంగారు పడిన ఆమె హడావుడిగా ఈ–సేవ కేంద్రం ద్వారా గత శనివారం రశీదులు జారీ చేసింది. అధికారులు ఆమెను నిలదీయడంతో భిన్నకథనాలు చెప్పుకొచ్చింది. అయితే చివరకు ఆమెకు కావాలి్సన ఒక కౌన్సిలర్తో మాట్లాడించడంతో సొమ్ము స్వాహా చేసినట్టు మంగళవారం ఒప్పుకున్నట్టు సమాచారం. ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన ఆమె నగర పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆత్మహత్యాయత్నం అవకతవకలకు పాల్పడిన ఆమె రాజమండ్రి గోదావరి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిపైకి చేరుకుని ఆత్మహత్యకు యత్నించగా ఓ కానిస్టేబుల్ చూసి పో లీస్స్టేషన్కు తరలించారు. వివరాలు అడిగి తెలుసుకుని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తండ్రి , నగర పంచాయతీ సిబ్బంది అక్కడకు వెళ్లి ఆమెను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. సంఘటనపై నగర పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నాం నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై విచారణ చేస్తున్నామని కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రాథమికంగా 8 ఇంటి పన్నుల రశీదులకు సంబంధించి రూ.75 వేలు దుర్వినియోగమయ్యాయని, ఇంకా నిధులు ఏవైనా దుర్వినియోగమయ్యాయా అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
‘టవర్ల’ టోకరా!
- జీహెచ్ఎంసీ నెత్తిన ‘సెల్’ టోపీ - అనుమతుల్లేకుండానే టవర్ల ఏర్పాటు - ఆ తర్వాత ఫీజులు, ఆస్తిపన్ను కట్టని వైనం - రూ.50 కోట్ల మేర జీహెచ్ఎంసీకి నష్టం సాక్షి, హైదరాబాద్: సామాన్యులు నివాస గృహానికి అనుమతి తీసుకోకున్నా.. ఆస్తిపన్ను చెల్లించకున్నా పెనాల్టీలతో కలిపి ముక్కుపిండి వసూలు చేసే జీహెచ్ఎసీ యంత్రాంగం.. సెల్ టవర్ల నిర్వాహకులు విషయంలో చూసిచూడనట్టు వదిలేస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సెల్ టవర్ నిర్వాహకులు అనుమతులే తీసుకోకున్నా, ఆస్తి పన్ను చెల్లించకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఫీజులు ఎగ్గొడుతున్న కంపెనీలు.. నగరంలో సెల్ టవర్ ఏర్పాటు చేసిన కంపెనీ జీహెచ్ఎంసీకి వన్టైమ్ ఫీజు కింద రూ.లక్ష చెల్లించాలి. సెల్ టవర్ను ఏర్పాటు చేసిన స్థల విస్తీర్ణాన్ని బట్టి ఏటా ఆస్తిపన్ను చెల్లించాలి. అనుమతులే లేకుండా టవర్లను ఏర్పాటు చేస్తున్న కంపెనీల నిర్వాహకులు, ఏర్పాటు తర్వాత ఫీజులు కూడా చెల్లించడం లేదు. గ్రేటర్లో అనధికారికంగా 3,303 సెల్ టవర్లను గుర్తించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో వెల్లడించారు. ఈ లెక్కన జీహెచ్ంఎసీకి రూ.33 కోట్లకుపైగా రావాలి. ఇది టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ఫీజు మాత్రమే. ఆస్తిపన్ను రూపేణా ఒక్కో టవర్ నుంచి సగటున రూ.20 వేల వరకు రావాలి. అనుమతి పొందిన, అనుమతి లేని అన్ని టవర్ల నుంచి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆస్తిపన్ను రావాల్సి ఉంటుందని అంచనా. అనుమతి తీసుకున్న సంస్థలు సైతం సెల్ టవర్లకు సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించడం లేవు. ఇలా జీహెచ్ఎంసీకి రావాల్సిన దాదాపు రూ.50 కోట్లు రాకుండా పోయాయి. పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు.. ప్రస్తుతం భాగ్యనగరంలో పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు పుట్టుకొస్తున్నాయి. అక్రమంగా అనధికారి కంగా ఏర్పాటు చేస్తున్న ఈ టవర్లతో రేడి యేషన్ ప్రభావం ఉంటుందని, ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హైదరా బాదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, ఒకవేళ రేడి యేషన్ తీవ్రతపై ఫిర్యాదులు అందితే వాటిని డాట్ టర్మ్ సెల్కు తగిన చర్యల నిమిత్తం తెలియజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెపుతున్నారు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ను అది నియంత్రిస్తుందని తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ తన పరిధి లోని అక్రమ టవర్ల ఏర్పాటును చూసీ చూడనట్లు వదిలేయడం విమర్శలకు తావి స్తోంది. టవర్ల నిర్వాహకులతో అధికారుల లాలూచీయే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► 2013లో వెలువడిన జీవో మేరకు స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆస్ప త్రుల వంటి ప్రదేశాలకు వంద మీటర్ల లోపు సెల్ టవర్ల ఏర్పాటు నిషిద్ధం. ఆ మేరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొంది సెల్ టవర్ను ఏర్పాటు చేయాలి. ► 2015లో వెలువరించిన జీవో మేరకు సెల్ టవర్ను ఏర్పాటు చేశాక సమాచారం ఇవ్వవచ్చు. దీన్ని ఆసరా చేసుకునే సమాచారమే ఇవ్వకుండా సెల్టవర్లు ఏర్పాటు చేసేస్తున్నారు. -
జీహెచ్ఎంసీ ఆల్టైమ్ రికార్డ్
⇒పెరిగిన ఆస్తిపన్ను వసూళ్లు ⇒గత ఆర్థిక సంవత్సరం రూ.1025 కోట్లు ⇒ఈ మార్చి 30 నాటికి రూ.1137 కోట్లు ⇒నేడు అర్ధరాత్రి వరకు సీఎస్సీల సేవలు సిటీబ్యూరో: పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినప్పటికీ జీహెచ్ఎంసీకి మాత్రం కాసుల వర్షం కురిపించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆస్తిపన్నుగా రూ.180 కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరింది. గతంలో ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చినెల చివరి వారం.. చివరి రెండు రోజుల్లోనే ఎక్కువ పన్ను వసూలయ్యేది. మార్చి 31న ఒక్కరోజే రూ.వందకోట్లకు పైగా వసూలైన ఘటనలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులో పన్ను బకాయిలపై వడ్డీ రద్దు చేయడం వంటి కారణాలతో ప్రజలు చివరి వరకు వేచి చూసేవారు. ఈసారి వడ్డీ మాఫీ ఉండదని ముందే జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. పెద్దనోట్లరద్దు, వడ్డీ మాఫీ ఉండదని తెలియజేయడంతో ఆస్తిపన్ను చెల్లించేవారిలో మెజారిటీ ప్రజలు ఇప్పటికే చెల్లింపులు చేశారు. ఇంకా చెల్లించని వారుంటే గతంలో మాదిరిగా చివరిరోజు చెల్లిస్తారని భావిస్తున్నారు. ఇలా మరో రూ.50 కోట్లకు పైగా వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఆస్తిపన్ను వసూళ్లతో ఆల్టైమ్ రికార్డు సృష్టించిన జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.1200 కోట్లకు చేరే అవకాశముందని లెక్కలు వేస్తున్నారు. అర్ధరాత్రి వరకు సీఎస్సీలు సేవలు ఆస్తిపన్ను చెల్లింపునకు శుక్రవారం చివరిరోజు కావడంతో జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఆన్లైన్లో చెల్లించండి.. ఆస్తిపన్ను చెల్లింపునకు చివరి రోజైన శుక్రవారం సీఎస్సీలు, మీసేవా కేంద్రాల్లో అధిక రద్దీ ఉండే దృష్ట్యా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి సూచించారు. ఇందుకు జీహెచ్ఎంసీ వెబ్సైట్ www.ghmc.gov.inÌZలోని పేమెంట్స్ ట్యాబ్పై క్లిక్చేసి, అందులోని సూచనలకు అనుగుణంగా పన్ను చెల్లించవచ్చని విజ్ఞప్తి చేశారు. -
7 రోజులు..38 కోట్లు..
–మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు మిగిలింది వారం రోజులే - ఈ సారైనా లక్ష్యం సాధించేరా? కార్పొరేషన్ : 1 మునిసిపాలిటీలు : 8 నగర పంచాయతీలు : 3 మొత్తం అసెస్మెంట్లు : 2,42,248 వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను : రూ.6,455.54 లక్షలు ఇప్పటి దాకా వసూలైన మొత్తం : రూ.2,614.91 లక్షలు వారం వ్యవధిలో వసూలు చేయాల్సిన మొత్తం : రూ.3,840.63 లక్షలు ధర్మవరం : పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలు, మడకశిర, పామిడి, పుట్టపర్తి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.6,455.54 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. గురువారం సాయంత్రం నాటికి రూ.2,614.91 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. 40.50 శాతం మాత్రమే వసూళ్లు సాధించి.. పూర్తిగా వెనుకంజలో ఉన్నారు. అనంతపురం నగర పాలక సంస్థలో రూ.2,608.45 లక్షల డిమాండ్ ఉండగా.. రూ.1,140.97 లక్షలు మాత్రమే (43.74 శాతం) వసూలు చేయగలిగారు. ఇక మడకశిర నగర పంచాయతీ కేవలం 12.78 శాతం పన్ను వసూళ్లతో జిల్లాలోనే చివరిస్థానంలో ఉంది. ఎప్పటిలాగే తాడిపత్రి మునిసిపాలిటీ లక్ష్యంలో ఇప్పటికే 65.14 శాతం వసూలు చేసి మరోసారి జిల్లా టాపర్గా నిలిచింది. మున్సిపాలిటీల్లో అత్యధిక అసెస్మెంట్లు కల్గిన హిందూపురం 39.42 శాతం వసూలు సాధించగా, ధర్మవరం 40.69 శాతం మాత్రమే చేయగల్గింది. తప్పెట మోగించినా పెరగని వసూళ్లు మొండి బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు కదిరి మునిసిపల్ అధికారులు వినూత్న పద్ధతిని అవలంబించారు. బకాయిదారుల ఇళ్ల ముందు తప్పెట మోగించారు. ఇళ్లు, సంస్థలకు తాళాలు కూడా వేశారు. అయినా మొత్తం లక్ష్యంలో 28.09 శాతం పన్నులు మాత్రమే వసూలు చేయగలిగారు. కదిరి మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 20,042 అసెస్మెంట్లకు గాను రూ.510.2 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.143.3 లక్షలు మాత్రమే రాబట్టారు. ఇదేవిధంగా జిల్లాలోని చాలా మునిసిపాలిటీలు తమ లక్ష్యంలో సగం కూడా వసూలు చేయలేకపోయాయి. మిగిలింది వారమే.. పన్నుల వసూలుకు వారం గడువు మాత్రమే ఉంది. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో 2,42,248 అసెస్మెంట్లకు గాను దాదాపు 10 వేల దాకా ప్రభుత్వ కార్యాలయాలకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల నుంచి దాదాపు రూ. 10 కోట్ల మేర బకాయిలు రావాలి. పాత బకాయిలపై ప్రభుత్వం వడ్డీమాఫీ ఎత్తివేయడం కూడా వసూళ్లు మందగించడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉన్న వారం వ్యవధిలో 80 శాతమైనా వసూళ్లు చేయగలిగితే ఆయా మునిసిపాలిటీలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలవుతుంది. -
పన్నులు చెల్లిస్తారా? జప్తు చేయమంటారా?
స్కిట్ కళాశాల బకాయిలపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాల యజమాన్యం 2011 నుంచి రూ.60లక్షల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని..నోటీసులిచ్చినా పట్టించుకోవడంలేదని మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డికి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో పన్నుల బకాయిలపై చర్చించారు. పన్ను చెల్లించకపోతే కళాశాలను సైతం జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్ 2013 నుంచి మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉందని, అది కూడా రూ.26లక్షల లోపే ఉందని సమాధానమిచ్చారు. ఏప్రిల్ 1వతేదీలోపు బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు. మరో తలపోటుగా పన్నుల భారం స్కిట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు. మొన్నటి వరకు స్కిట్ను అనంతపురం జేఎన్టీయూకి, కర్ణాటకలోని మఠాలకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో లీజుపై స్కిట్ యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఈనేపథ్యంలో మున్సిపాలిటి పన్నుల భారం కళాశాల యాజమాన్యానికి మరో తలపోటుగా పరిణమించింది. -
మంత్రి ‘పల్లె’ కళాశాల సీజ్
⇒ ఆస్తి పన్ను చెల్లించని ఫలితం ⇒ ‘వాళ్లకెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే’ అంటూ సమాధానం కదిరి: ఆస్తి పన్ను చెల్లించని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి సంబంధించిన ఓ కాలేజీని మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. కదిరిలో మంత్రి పల్లెకు చెందిన శ్రీనివాస జూనియర్ కాలేజీకి రూ. 1.61 లక్షల మేర ఆస్తి పన్ను బకాయి ఉంది. మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కాలేజీ వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలంటూ గంటకు పైగా డప్పు వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆస్తిపన్ను గురించి బిల్డింగ్ యజ మానితో మాట్లాడుకోవాలని ఆ కాలేజీ ప్రిన్సి పల్ సూర్యప్రకాశ్ చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ అక్కడి నుంచే బిల్డింగ్ యజమాని రామ సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. బిల్డింగ్ పన్నులన్నీ కడతానని మంత్రి పల్లె తనకు అగ్రిమెంట్ రాసిచ్చాడని ఆయన సమాధానం చెప్పారు. నా కాలేజీలోనే డప్పు వాయిస్తారా! ఇదంతా జరుగుతుండగానే సదరు కాలేజీ ప్రిన్సిపాల్ అసెంబ్లీలో ఉన్న మంత్రి పల్లెకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. స్పందిం చిన మంత్రి ‘మన కళాశాల ఆవరణలోకి వచ్చి డప్పు వాయిస్తారా? వారికెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే.. ఆ విషయం నేను మున్సి పల్ మంత్రి నారాయణతో మాట్లాడతాను’ అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బకాయి కోసం వారం కిందటే రెడ్ నోటీస్ ఇచ్చామని చెప్పిన కమిషనర్.. కాలేజీ ఆఫీస్ రూం, స్టాఫ్ రూంలకు తాళం వేసి, సీల్ వేశారు. కాగా, కదిరిలోనే మంత్రి పల్లె నిర్వహిస్తున్న వివేకానంద డిగ్రీ కాలేజీ కూడా రూ. 84 వేల ఆస్తి పన్ను బకాయి ఉంది. ఆ పన్ను బిల్డింగ్ ఓనర్కే సంబంధం కదిరిలో మా శ్రీనివాస కాలేజీ బిల్డింగ్కు సంబంధించి ఆస్తి పన్నుకు మాకు ఎలాంటి సబంధం లేదు. ఆ బకాయి బిల్డింగ్ యజమానే చెల్లించాలి. అయినప్పటికీ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన బకాయి చెక్కు రూపంలో పంపాను. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి -
ఆస్తి పన్నుకు ‘ఆధార్’ లింకు!
⇒ యజమాని ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో ఆస్తుల అనుసంధానం ⇒ తనఖా ఆస్తుల జాబితాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నులు, ఖాళీ స్థలంపై పన్నుల మదింపు సమాచారాన్ని సంబంధిత ఆస్తి యజమానుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్లతో తక్షణమే అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఆస్తులు, స్థలాల జాబితాలను సైతం రూపొందించి, బహిర్గతం చేయాలని సూచించింది. రాష్ట్రంలో సులభ వాణిజ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పురపాలక డైరెక్టరేట్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాలన్నీ అందుబాటులో: అన్ని పుర పాలికలు అధికారిక వెబ్సైట్లను ఏర్పాటు చేసుకోవాలని పురపాలక డైరెక్టరేట్ సూచిం చింది. ఆస్తి పన్నుల డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలతో పాటు సంబంధిత యజమాని పేరు, ఆధార్, పాన్, ఫోన్ నంబర్ల సమాచారాన్ని వాటిలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన భవనాలు/ప్లాట్లు/ఖాళీ స్థలాల కు సంబంధించి అయితే.. ఆ ఆస్తి యజమాని పేరు, తనఖా పెట్టిన బ్యాంకు, బ్రాంచీ వివరాలను సైతం పేర్కొనాలని తెలిపింది. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లతో సమావేశమై తమ ప్రాంత పరిధిలో తనఖా పెట్టిన ఆస్తుల వివరాలను సేకరించాలని సూచించింది. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద ఎంపికైన నగరాలు, పట్టణాల్లో సంస్కరణల అమల్లో భాగంగా ఆస్తి పన్నుల మదింపు వివరాలను సంబంధిత పురపాలిక వెబ్సైట్లో ప్రదర్శించాలన్న నిబంధనలు న్నాయి. అదే తరహాలో అన్ని మున్సిపాలిటీ ల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి పన్నుల మదింపు వివరాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసి, బహిర్గతం చేస్తే సంబంధిత యజ మానుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడి కానున్నాయి. వెబ్సైట్ నిర్వహణ తప్పనిసరి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ అధికారిక వెబ్సైట్ను క్రియాశీలకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 23 పురపాలికలు క్రియాశీలంగా వెబ్సైట్లను నిర్వహిస్తుండగా, మరో 45 పురపాలికలు వెబ్సైట్లు రూపొందించుకున్నా సరిగా నిర్వహించడంలేదు. నాలుగు పురపాలికలకు అధికారిక వెబ్సైట్ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పురపాలిక ఎప్పటికప్పుడు సమాచారాన్ని నవీకరిస్తూ (అప్డేట్ చేస్తూ) వెబ్సైట్ను క్రియాశీలకంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. మ్యూటేషన్ రుసుము పెంపు అధికారం పురపాలికలకే.. స్థిరాస్తుల క్రయవిక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసే మ్యూటేషన్ రుసుముల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్స్కు ఉందని పురపాలక శాఖ స్పష్టం చేసింది. మ్యూటేషన్ రుసుము పెంపుపై కౌన్సిల్లో చేసే తీర్మానాన్ని స్థానిక సబ్ రిజిస్ట్రార్కు పంపించాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు స్పష్టతనిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆస్తిపన్ను అసెస్మెంట్ ఇక ఈజీ...
→ ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్కు అవకాశం → జీహెచ్ఎంసీ మరో కొత్త కార్యక్రమం → అక్రమాల సిబ్బందికి ముకుతాడు → పారదర్శకంగా ఆస్తిపన్ను నిర్ధారణ సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తయితే.. కొత్త ఇంటికి ఆస్తిపన్ను చెల్లించేందుకు అసెస్మెంట్ చేయించుకోవడం ఒక ఎత్తు. తాము కొత్తగా ఇల్లు కట్టుకున్నామని, ఆస్తిపన్ను కట్టేందుకు ఇంటి కొలతలు తీసి ఎంత మేర ఆస్తిపన్ను కట్టాలో వెల్లడించాలని, ఆస్తిపన్ను జాబితాలో తమ పేరు నమోదు చేయాలని కోరిన వారికి ట్యాక్స్ సెక్షన్ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేసినా అసెస్మెంట్కు వెళ్లరు. అసెస్మెంట్ చేయాలంటే చేయి తడపాలి. అసెస్మెంట్లో కట్టాల్సిన ఆస్తిపన్నుకుంటే ఎక్కువ మొత్తం పడకుండా ఉండాలంటే ముడుపులు ముట్టజెప్పాలి. అంతేకాదు.. ఇంటి విస్తీర్ణం మేరకు చెల్లించాల్సిన దానికంటే తక్కువ మొత్తమే చెల్లించేలా అసెస్మెంట్ చేయమన్నా చేస్తారు. అయితే ఒక కండీషన్. వారు కోరినంత భారీ మొత్తాన్ని చెల్లించాలి. మాకు చెల్లించేది ఇప్పుడే కదా.. మీరు ప్రతియేటా చెల్లించే ఆస్తిపన్నులో లాభమేకదా అంటూ అందిన కాడికి దండుకుంటారు. ఏ మామూలు ఇచ్చుకోలేని వారి వినతులు అసలు పట్టించుకోరు. ఈ పరిస్థితికి చెక్పెడుతూ ఇళ్ల యజమానులే జీహెచ్ఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునే విధానాన్ని జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్లో ఈ–రిజిస్ట్రేషన్స్లో ప్రాపర్టీటాక్స్లోకి.. అక్కడినుంచి ‘అసెస్మెంట్ ఫామ్’లోకి వెళితే సెల్ఫ్ అసెస్మెంట్ అప్లికేషన్ ఫారమ్ వస్తుంది. దాన్లోని సూచనల మేరకు వెళితే యూనిట్రేట్ తదితర వివరాలు కనిపిస్తాయి. చేతివాటంలో ఘనాపాఠీలు.. తాము కట్టుకున్న భవనాలు, వ్యాపార సముదాయాలకు ఆస్తిపన్ను చెల్లించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పటికీ వారు చెల్లించలేకపోతున్నారు. అందుకు కారణాలు.. →భవనాన్ని కొలతలు తీసి ఆస్తిపన్ను నిర్ధారించాల్సిన ట్యాక్స్ సిబ్బంది జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అసలు కనిపించరు. అదేమని అడిగితే క్షేత్రస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లకు, ఇతరత్రా పనులకు వెళ్లారని చెబుతారు. → అయితే వీరిలో చాలామంది ఈ పనులకు సైతం ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకొని, వారితోనే ఈ పనులు చేయిస్తుంటారు. భారీగా అందే ముడుపులతో వారికి జీతాలు చెల్లించడం టాక్స్ సిబ్బందికి సమస్యే కాదు. → ఒకవేళ కార్యాలయాల్లో కనిపించినా ఇళ్ల యజమానులు చెప్పేది వినిపించుకోరు. అసలు స్పందించరు. తమ చేయి తడిపితేనే స్పందిస్తారు. భారీ ముడుపులు ముడతాయనుకుంటేనే కదులుతారు. → నిబంధనల మేరకు.. ఏరియాను బట్టి, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఆస్తిపన్ను నిర్ధారించాల్సి ఉండగా, తమ ఇష్టానుసారం అధిక మొత్తంలో ఆస్తిపన్నును నిర్ధారిస్తారు. ఇదేమని అడిగితే.. తమ వాటా ముడితే అందులో సగానికన్నా తగ్గించేందుందుకు సిద్ధమవుతారు. ఇలా ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన సొమ్ముతో వేసవిలో విదేశీ టూర్లు, ముజ్రాపార్టీలు చేసుకోవడం పరిపాటి అనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఏసీబీ దాడుల్లో ఈ విభాగం వారే ఎక్కువగా దొరుకుతున్నారు. ఖజానాకు చిల్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా దాదాపు 80వేల భవనాల నిర్మాణం జరుగుతున్నప్పటికీ, కేవలం 30 వేల లోపు మాత్రమే ఆస్తిపన్ను జాబితాలో చేరుతున్నాయి. వీటిద్వారా జీహెచ్ఎంసీకి ఏటా దాదాపు రూ. 40 కోట్లు ఆస్తిపన్ను రూపేణా వసూలవుతోంది. కొత్త భవనాలన్నింటినీ ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తే దాదాపు రూ.100 కోట్లు ఖజానాకు జమ అవుతాయి. అయితే తమ జేబులు నింపుకునేందుకు అలవాటుపడ్డ సిబ్బంది భవనాలను ఆస్తిపన్ను జాబితాలోకి తేవడం లేరు. జాబితాలో చేర్చకుండా తాము చూసుకుంటామని అందినకాడికి దండుకుంటున్నారు. ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు ఎన్ని దరఖాస్తులొచ్చిందీ తెలుస్తుంది కనుక, వారి ఆటలకు అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటినుంచి దాదాపు నెలన్నర రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. ప్రాక్టికల్గా ఎదురయ్యే ఇబ్బందుల్ని తొలగిస్తూ నెలరోజుల్లో నే ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. -
గట్టెక్కేదెలా!
చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన ఇంటిపన్ను బకాయిలు కార్యదర్శులకు గుదిబండగా మారాయి. మార్చి 15వ తేదీలోగా నూరు శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు హుకుం జారీ చేయడంతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సిబ్బంది కొరత వేధిస్తుండటంతో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక కార్యదర్శులు, సర్పంచ్లు సతమతమవుతున్నారు. తలకు మించిన పనులతో ఇబ్బంది పడుతున్న కార్యదర్శులకు పన్నుల వసూలు సాధ్యం కావడం లేదు. పంచాయతీల్లో రోజువారీ కార్యకలాపాలతో పాటు ఇతర పనులు కూడా చేయడం వల్ల పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టలేక పోతున్నారు. మరోవైపు ఒక్కొక్క కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఏ పనీ ముందుకు సాగడం లేదు. పన్నులను తక్షణమే వసూలు చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులు తాఖీదులు ఇవ్వడంతో ఈఓపీఆర్డీలు, డివిజన్ స్థాయి పంచాయతీ అధికారుల దీనిపైనే కార్యదర్శులను ఒత్తిడి చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్తోపాటు కార్యాలయ సిబ్బందిని సైతం పన్నుల వసూలు కోసం కేటాయించారు. అయినా ఆశించినమేర వసూలు కావడం లేదని తెలుస్తోంది. పంచాయతీల్లో పోస్టులు ఖాళీ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులతో పాటు బిల్లు కలెక్టర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేకం ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి పనులపై సర్పంచ్లు, కార్యదర్శుళు దృష్టి సారించలేకపోతున్నారు. ముఖ్యంగా పాలన కష్టంగా మారింది. ప్రతినెలా పింఛన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులన్నీ కార్యదర్శులే చూడాలి. దీంతో వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న కార్యదర్శి, బిల్లు కలెక్టర్ పోస్టులను భర్తీ చేస్తే పంచాయతీల్లో పాలన గాడిన పడుతుంది. 40 శాతం మించని వసూళ్లు జిల్లాలో 48 మండలాల్లోని నాలుగు డివిజన్ల పరిధిలో 908 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నోటిఫైడ్ పంచాయతీలు 204, నా¯ŒS నోటిఫైడ్ పంచాయతీలు 704. డివిజన్ వారీగా చూస్తే ఒక్కొక్క డివిజన్లో ఇప్పటివరకు 40 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యాయి. జంగారెడ్డిగూడెం డివిజన్లో 177 పంచాయతీలు ఉండగా, రూ.10.50 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇందులో 34 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఏలూరు డివిజన్ పరిధిలో 272 పంచాయతీలు ఉండగా, రూ. 19.72 కోట్లకు గాను, 41శాతం మాత్రమే వసూలయ్యాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో 209 పంచాయతీలు ఉండగా, రూ.20.75 కోట్లకు గాను 41శాతం పన్నులు వసూలయ్యాయి. నరసాపురం డివిజన్ పరిధిలో 250 పంచాయతీలు ఉండగా, రూ.12.90 కోట్లకు గాను 45శాతం పన్నులు వసూలయ్యాయి. 34 శాతం మాత్రమే వసూలు చేసి జంగారెడ్డిగూడెం డివిజన్ చివరి స్థానంలో ఉంది. మార్చి 31 నాటికి పన్నులు వసూలు చేయాలంటే.. 44 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇటీవల జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులతో సమావేశమై పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగవంతం చేశాం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేశాం. గత ఏడాది 97శాతం వసూలు చేశాం. ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నాం. ఇందుకోసం అధికారులు , సిబ్బందిని అప్రమత్తం చేశాం. – కె.సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు -
కంటోన్మెంట్లో శశికళ ట్యాక్స్ డిఫాల్టర్!
రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని వైనం హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ట్యాక్స్ డిఫాల్టర్! మారేడ్పల్లి రాధిక కాలనీలో శశికళ నటరాజన్ పేరిట ఉన్న ప్లాట్ నెంబర్ 16లోని ఇంటికి సంబంధించి రెండేళ్లకు రూ. 35,424 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం బకాయిల వసూలు లక్ష్యంగా కంటోన్మెంట్ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు పంపిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు, శశికళ పేరిట ఉన్న ఇంటికీ నోటీసు పంపారు. 1990 ప్రాంతంలో జయలలిత నగర శివారులోని జీడిమెట్ల గ్రామపరిధిలో జేజే గార్డెన్ పేరిట వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన సమయంలోనే, మారేడ్పల్లిలో శశికళ పేరిట ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో తరచూ హైదరాబాద్కు వచ్చే సమయాల్లో జయలలిత ఇక్కడ నివాసం ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ–2గా సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చిన సందర్భంలో ఆమె పేరిట నగరంలో ఉన్న ఆస్తుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలం క్రితం ప్రైవేటు వ్యక్తులు ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారని, నాలుగేళ్లుగా సదరు నివాసం ఖాళీగానే ఉంటోందని స్థానికులు అంటున్నారు. మొత్తానికి కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆమె ఆస్తి అక్రమమా లేక సక్రమమా అనే చర్చ మొదలైంది. -
పన్నులు వసూలు చేయాలి
గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనూరాధ కావలిఅర్బన్ : మున్సిపల్ పరిధిలోని పన్నులను 100 శాతం వసూలు చేయాలని గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనురాధ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కావలి పట్టణంలోని 4, 5, 33, 34వ వార్డులతో పాటు పట్టణ ప్రధాన వీధుల్లో పారిశుద్ధ్యాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 14, 13వ ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్ప్లాన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ నిధుల ద్వారా చేపట్టబడిన పనులను ఇంజనీరింగ్ శాఖ ద్వారా తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డులో పొందుపరిచి ఎప్పటికప్పుడు సరిచూసి చర్యలు చేపట్టాన్నారు. పనులకు సంబంధించిన చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగాన్ని సమీక్షించి అన్ని రకాల పన్నులను ఏడాదిలోగా వసూలు చేయాలన్నారు. జనన, మరణ నివేదికలు, ఆస్తి పన్ను పేరు మార్పు బదిలీ, కొళాయిల మంజూరు వంటి లావాదేవీలు ఆన్లైన్ ద్వారానే జరపాలన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ రాని గుమస్తాలు వెంటనే నేర్చుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకటేశ్వర్లు, డీఈ మదర్ అలీ, మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాత నోట్లతో.. ఆస్తిపన్ను చెల్లింపు బంద్
సిటీబ్యూరో: పాత పెద్ద నోట్ల(రూ500, రూ.1000)తో ఆస్తిపన్ను, ఎల్ఆర్ఎస్ తదితర ఫీజుల చెల్లింపు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. ఇకపై పాతనోట్లను స్వీకరించబోమని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. గురువారం రాత్రి 11 గంటల వరకు రూ.26.19 కోట్లు వసూలు అరుునట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. సర్కార్ తీసుకున్న పాతనోట్ల రద్దు ప్రకటనతో 15 రోజుల్లో జీహెచ్ఎంసీకి మొత్తం రూ.246.02 కోట్లు వసూలు అరుుంది. -
జిల్లాలో రూ. 8కోట్ల ఆస్తిపన్ను బకాయి
నిడమనూరు : జిల్లాలోని 31మండలాల్లో ఆస్తిపన్ను బకాయిలు 8 కోట్లు పేరుకుపోయాయని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయ న నిడమనూరుకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన పంచాయతీ సిబ్బం ది, గ్రామస్తులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో ఆస్తిపన్ను వసూళ్లు మందగించాయన్నారు. సిబ్బంది జీతభత్యాలకే పన్నుల వసూలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దైన నోట్లతో ఆస్తిపన్ను చెల్లించవచ్చని తెలి పారు. నిడమనూరులో డీపీఓ ప్రభాకరరెడ్డి స్వయం గా ఆస్తిపన్ను వసూలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కరోజే 45వేల రూపాయల ఆస్తిపన్ను వసూలైంది. ఆయన వెంట ఎంపీడీఓ ఇందిర, సర్పంచ్ ముత్తయ్య, కార్యదర్శి పద్మ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
పంచాయతీలకు వసూళ్లే వసూళ్లు
- వారంలో రూ.32.08 కోట్ల ఆస్తి పన్ను వసూలు - 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపు సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుకు గ్రామ పంచాయతీల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో రూ.32,08,29,499 పన్ను వసూలైంది. వారం రోజుల్లో ఆస్తి పన్ను వసూలు తీరు పరిశీలిస్తే.. 11న అత్యధికంగా రూ.8.16 కోట్లు, శుక్రవారం రూ.2.45 కోట్ల పన్ను వసూలు జరిగింది. 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపులు జరిగాయి. కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.8.38కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.4.96 కోట్ల పన్ను వసూలైంది. సంగారెడ్డి జిల్లాలో రూ.2.54 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.1.75 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.1.32 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.1.23 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1.21 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.1.10 కోట్లు, నల్లగొండ జిల్లాలో రూ.1.07 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 10 వరకు రూ.73.50 కోట్ల ఆస్తి పన్ను వసూలవగా, వారం రోజుల్లోనే రూ.32.08 కోట్లు వసూలవడం గమనార్హం. ఈ నెల 24 వరకు పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు ఉన్న వెసులుబాటును గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని బకారుులు చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. గ్రామాల్లో అన్ని కుటుంబాలు ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
నోట్ల రద్దుతో పంచాయతీల పంట పండింది!
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు అంశం తెలంగాణలోని గ్రామపంచాయతీలకు అనూహ్యంగా కలిసివచ్చింది. రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లతో ఆస్తిపన్ను చెల్లించేందుకు అవకాశం ఇస్తుండటంతో జనాలు తమ ఆస్తిపన్నును, బకాయిలు చెల్లించేందుకు పోటెత్తుతున్నారు. దీంతో తెలంగాణ అంతటా ఆస్తిపన్ను చెల్లింపులకు విశేషమైన స్పందన లభిస్తోంది. మూడురోజుల్లో రాష్ట్రంలోని పంచాయతీలకు ఆస్తిపన్ను రూపంలో ఏకంగా రూ. 16 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. బాకాయిపడ్డ ఆస్తిపన్ను చెల్లించేందుకు సైతం గ్రామీణులు పంచాయతీల ముందు బారులు తీరుతున్నారు. పాతనోట్లతో పన్ను చెల్లించేందుకు రేపటివరకు గడువు ఉండటంతో సోమవారం కూడా భారీమొత్తం ఆస్తిపన్ను చెల్లింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిపడిన ఈ అనూహ్య ఆదాయంతో గ్రామపంచాయతీలు నిధులతో కళకళలాడుతున్నాయి. -
కొరడా
► ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.700 కోట్లు ► దుకాణాలపై కార్పొరేషన్ కొరడా సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కార్పొరేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం పన్ను బకాయిలు పడిన దుకాణాలు, నివాస గృహాలపై కొరడా ఝుళిపిం చడం ప్రారంభించింది. చెన్నై కార్పొరేషన్కు వచ్చే వార్షిక ఆదాయంలో ఆస్తిపన్ను రూపేణా లభించే శాతమే ఎక్కువ. ఆస్తిపన్ను ద్వారా గత ఏడాది రూ.600 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకోగా రూ.586.46 కోట్లు వసూలైంది. కార్పొరేషన్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను అత్యధిక సొమ్ముగా రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం చెన్నై కార్పొరేషన్ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఆస్తిపన్నే దిక్కని భావిస్తూ రూ.650 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్తిపన్ను వసూలులో తొలి అర్ధ సంవత్సరం రూ.308 కోట్లు వసూలు చేశారు. ఇక లక్ష్యసాధనలో మిగిలిన రూ.342 కోట్లకు అక్టోబర్ 1వ తేదీ నుంచి కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. రోజుకు సగటున అందరూ కలిపి రూ.4 కోట్లు వసూలు చేయాలని బిల్ కలెక్టర్లకు నిబంధన విధించారు. అత్యధిక బకాయి ఉన్న వర్తక దుకాణాల జాబితాను సిద్ధం చేసుకుని కఠిన చర్యలు చేపడుతున్నారు. దుకాణాలకు జారీ చేసిన జీఎస్టీలను రద్దు చేయించడం, కాలుష్య నియంత్ర మండలి నుంచి సర్టిఫికెట్ జారీ కాకుండా అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా మొండి బకాయిలను వసూలు చేస్తున్నారు. పురసైవాక్కం జాతీయ రహదారి, ఠాకూర్ రోడ్డు ప్రాంతాల్లో రాయపురం మండల అధికారులు గురువారం దాడులు జరిపి 18 దుకాణాలకు సీలు వేశారు. ఇదే ప్రాంతంలోని రెండు వర్తక దుకాణాల వారు రూ.50 లక్షల వరకు ఆస్తిపన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు కావడం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం అంతగా లేకపోవడం వల్ల కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి పన్ను వసూలు మినహా మరే ముఖ్యమైన బాధ్యతలు లేవు. దీంతో ఆస్తిపన్ను వసూలుపైనే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదే వేగాన్ని మరి కొన్ని నెలలు కేటాయించి రూ.700 ఆస్తిపన్ను వసూలుతో సరికొత్త రికార్డును స్థాపించగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆస్తిపన్ను లక్ష్య సాధన, చెల్లింపు బకాయిలపై కార్పొరేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ కేవలం కాంట్రాక్టర్లకే రూ.400 కోట్ల బకాయిని కార్పొరేషన్ చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఆస్తిపన్ను ద్వారా వసూలయ్యే నగదులో నిర్వహణ ఖర్చులకు, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు. ఆస్తిపన్ను వసూళ్ల ద్వారానే కార్పొరేషన్ ఆర్థిక భారాన్ని నెట్టుకొస్తున్నామని తెలిపారు. 2012-13లో ఆస్తిపన్ను కింద రూ.461 కోట్లు, వృత్తిపన్ను ద్వారా రూ.221.04 కోట్లు వసూలు చేశామని తెలిపారు. అలాగే 2013-14లో ఆస్తిపన్ను కింద రూ.480.13, వృత్తి పన్ను ద్వారా రూ.234.68, 2014-15లో ఆస్తిపన్ను ద్వారా రూ.581.82, వృత్తిపన్ను కింద రూ.264.79 వసూలు చేశామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల మొదటి వారం వరకు రూ.400 కోట్లు వసూలైనట్లు తెలియజేశారు. -
‘గ్రేటర్’కు కాసుల పంట..
జీహెచ్ఎంసీకి భారీగా సమకూరిన ఆదాయం ► ఆస్తి పన్ను కింద శుక్రవారం ఒక్కరోజే రూ.50 కోట్ల రాబడి ► గ్రేటర్ లో వివిధ ప్రభుత్వ సంస్థలకు రూ.100 కోట్ల వసూలు ► కిటకిటలాడిన ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా సెంటర్లు ► 14వ తేదీ వరకూ పన్ను చెల్లింపుల గడువు పొడిగింపు ► సెలవు దినాల్లోనూ పన్నులు, వినియోగ చార్జీల చెల్లింపునకు అవకాశం ► ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను, నీటి, విద్యుత్ బిల్లులు తదితర ఫీజులను పాత రూ.500, రూ.1,000 నోట్ల ద్వారా చెల్లించేందుకు వినియోగదారులకు శుక్రవారం అర్ధరాత్రి వరకూ గడువు ఇవ్వడంతో ‘గ్రేటర్’కు కాసుల పంట పండింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను చెల్లింపుల కింద శుక్రవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు రూ.48 కోట్లు వసూలయ్యాయి. ఈ మొత్తం రూ.50 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. సాధారణ రోజుల్లో రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలవుతుంది. కానీ శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 50 కోట్ల వరకూ ఆస్తి పన్ను వసూలవ్వడం గమనార్హం. కాగా, అన్ని రకాల బిల్లులు, పన్నులు వెరసి గ్రేటర్లోని వివిధ ప్రభుత్వ శాఖలకు దాదాపు రూ.100 కోట్ల రాబడి వచ్చింది. పాత నోట్లతో పన్నులు, వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ప్రజలు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు(సీఎస్సీలు), మీసేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను మొత్తంతోపాటు పాత బకాయిల చెల్లింపులకూ అవకాశం ఉండటంతో అనేక మంది బకాయిలతో సహా చెల్లించారు. మరికొందరు అడ్వాన్సగా రెండు, మూడేళ్ల ఆస్తి పన్ను ముందస్తుగానే కట్టేందుకు ముందుకొచ్చినా.. వాటిని స్వీకరించలేదు. జీహెచ్ఎంసీలోని పౌరసేవా కేంద్రాలతోపాటు బిల్ కలెక్టర్లకు.. మీసేవా, ఏపీ ఆన్లైన్, నెట్బ్యాంకింగ్ ద్వారా ప్రజలు పన్నులు చెల్లించారు. మీసేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్షమంది వివిధ రకాలైన పన్నులు, ఫీజుల్ని చెల్లించినట్టు సమాచారం. భారీ మొత్తంలో బకాయిలు ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులతో జీహెచ్ఎంసీ అధికారులు సంప్రదింపులు జరపడంతో పలువురు బకాయిలు చెల్లించారు. మొత్తంగా ఆరు వేల మందికి పైగా తమ ఆస్తిపన్ను చెల్లించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సంస్థల ఆదాయం జీహెచ్ఎంసీ : రూ.50 కోట్లు జలమండలి : రూ.15 కోట్లు విద్యుత్శాఖ : రూ.30 కోట్లు హెచ్ఎండీఏ : రూ.4.10 కోట్లు డిస్కంకు రూ.71 కోట్లు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు పాత నోట్ల స్వీకరణతో శుక్రవారం ఒక్కరోజే రాత్రి 7 గంటల వరకు రూ.71 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లోని ఆరు సర్కిళ్ల నుంచి రూ.30 కోట్ల బిల్లులు రాగా, జిల్లాల నుంచి రూ.41 కోట్లు వసూలైనట్లు డిస్కం ఆపరేషన్స డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. 14 వరకూ చెల్లింపులు జరపొచ్చు.. తమ పిలుపునకు స్పందించిన ప్రజలకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం మరో 72 గంటలపాటు పాత నోట్లను చెల్లింపులకు అనుమతించడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచు కోవాలని మేయర్ సూచించారు. భవన నిర్మాణ అనుమతులకు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో ఫీజు సమా చారం జనరేట్ అరుున వారు, పాత బకారుులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చెల్లింపుల కోసం శుక్రవారం పౌరసేవా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు సోమవారం వరకు కొనసాగుతాయని చెప్పారు. సెలవు దినాల్లోనూ పనిచేస్తాయ న్నారు. ట్రేడ్ లెసైన్సుల రెన్యువల్, వేకెంట్ ల్యాండ్ టాక్స్ తదితర మైన వాటికి పాతనోట్లతో చెల్లింపులు జరపొచ్చని స్పష్టం చేశారు. సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజుల కోసం చెల్లించే పోస్ట్ డేటెడ్ చెక్కులను సమర్పించిన వారు వాటిని ఉపసంహరించుకుని పాతనోట్లతో నగదు చెల్లించవచ్చన్నారు. పాతనోట్లతో చెల్లించే ఈ పన్నులకు, ఇన్కమ్ట్యాక్స్కు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జలమండలికి రికార్డు ఆదాయం.. పాత నోట్ల స్వీకరణతో జలమండలికి శుక్రవారం రికార్డు స్థారుులో ఆదాయం సమకూరింది. క్యాష్ కౌంటర్లు, ఆర్టీజీఎస్, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా సుమారు 53 వేల మంది వినియోగదారులు పెండింగ్ నీటి బిల్లులు చెల్లించారు. దీంతో రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. పాతనోట్ల స్వీకరణ గడువును కేంద్రం పొడిగించడంతో జలమండలికి సుమారు రూ.50 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు వసూలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జలమండలికి నెలవారీగా నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీ ద్వారా సుమారు రూ.90 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. -
ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఆశ్రమాలకు ఆస్తి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఆశ్రమాలకు ఆస్తి పన్ను మినహాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్శాఖలను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఆస్తి పన్ను మినహాయింపునకు వీలుగా పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలకశాఖ, పంచాయతీరాజ్శాఖలు చర్యలు చేపట్టాయి. చట్ట సవరణ జరిగి ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రా‘పల్టీ’
ఈ ఏడాది వసూలు కావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ రూ.15.12 కోట్లు ఇప్పటి వరకు వసూలైంది రూ.5.75 కోట్లు గతేడాది బకాయిలు రూ.4.38 కోట్లు ఐదు నెలల్లో వసూలు చేయాల్సింది రూ.13.75 కోట్లు ఖమ్మం : ఆస్తిపన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ తీరు మారడం లేదు. గతేడాది పన్ను వసూళ్లలో వరంగల్ రీజియన్ లో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ కు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూలుపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించలేదనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 54,387 గృహ సముదాయాలున్నాయి. ఇందులో నివాస గృహాలు 39,248, కమర్షియల్ బిల్డింగ్లు 6,536, పార్ట్లీ రెసిడెన్షియల్ భవనాలు 8603. వీటి ద్వారా ఈ ఏడాది మొత్తం రూ.15.12 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే రెండేళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. సాధారణంగా ఆరునెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దీంతో ఏడాది ఆస్తి పన్ను ఒకే దఫా చెల్లించాలి. గత ఏడాది ఆస్తి పన్నుకు సంబంధించి రూ.20.22 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.15.84 కోట్లు మాత్రమే వసూలైంది. రూ.4.38 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యం రూ.15.12 కోట్లు. గత ఏడాది బకాయి కలిపి రూ.19.50 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అయితే 2016–17 వార్షిక సంవత్సరంలో అర్థ సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తునప్పటికీ ఇప్పటి వరకు కేవలం 29.50 శాతం పన్ను వసూలు మాత్రమే సాధ్యపడింది. ఇప్పటివరకు కేవలం రూ.5.75 కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే చేపట్టారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు కార్పొరేషన్ వర్గాలే పేర్కొంటున్నాయి. వరంగల్ రీజియన్ లో ఖమ్మం వెనుకంజ.. వరంగల్ రీజియన్ లో నాలుగు కార్పొరేషన్లు ఉండగా, పన్ను వసూళ్లు లక్ష్యంలో ఖమ్మం వెనుకంజలో నిలిచింది. గత ఏడాది కరీంనగర్ కార్పొరేషన్ 99.54 శాతం పన్ను వసూళ్లతో నంబర్వ¯ŒS స్థానంలో నిలవగా, రామగుండం కార్పొరేషన్ 91.79 శాతంతో రెండో స్థానంలో, తర్వాతి స్థానంలో వరంగల్ కార్పొరేషన్ 81.72 శాతం పన్ను వసూళ్లు సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ మాత్రం కేవలం 78.32 శాతం పన్ను వసూళ్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం కార్పొరేషన్ లో కలిపిన తొమ్మిది గ్రామపంచాయతీల్లో పన్ను చెల్లింపులపై సరైన అవగాహన కల్పించని కారణంగా నగరంలోని చివరి గ్రామాల్లో పన్న వసూళ్ల శాతం తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అరకొర సిబ్బందితో నెరవేరని లక్ష్యం.. ఖమ్మం కార్పొరేషన్ లో ఆస్తి పన్ను వసూళ్లుకు సంబంధించి నలుగురు రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, 14 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 50 డివిజన్లుండగా... ఒక్కో బిల్ కలెక్టర్ మూడుకుపైగా డివిజన్లలో పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపడా లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పన్ను వసూళ్లకు మాత్రమే వీరిని వినియోగించాల్సి ఉండగా, అదనపు పనులు సైతం వీరికే అప్పగిస్తుండటంతో అసలు లక్ష్యం మరుగునపడింది. ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తి పన్ను రివిజన్ చేయడంతో ప్రస్తుతం ఆ పనుల్లో బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు నిమగ్నమై ఉన్నారు. అదీగాక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సైతం బిల్ కలెక్టర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పన్ను వసూళ్లు లక్ష్యం చేరడం లేదు. -
ప్రా‘పల్టీ’
♦ ఈ ఏడాది నూరుశాతం పన్ను వసూళ్లు అసాధ్యమే ♦ ఆస్తి పన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ వెనుకంజ ఖమ్మం : ఆస్తిపన్ను వసూళ్లలో ఖమ్మం కార్పొరేషన్ తీరు మారడం లేదు. గతేడాది పన్ను వసూళ్లలో వరంగల్ రీజియన్లో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నారుు. కార్పొరేషన్కు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూలుపై అధికార యంత్రాంగం పూర్తిస్థారుు దృష్టి సారించలేదనే ఆరోపణలున్నారుు. ♦ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 54,387 గృహ సముదాయాలున్నారుు. ఇందులో నివాస గృహాలు 39,248, కమర్షియల్ బిల్డింగ్లు 6,536, పార్ట్లీ రెసిడెన్షియల్ భవనాలు 8603. వీటి ద్వారా ఈ ఏడాది మొత్తం రూ.15.12 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అరుుతే రెండేళ్లుగా ఆస్తి పన్ను వసూళ్లలో కార్పొరేషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. సాధారణంగా ఆరునెలలకు ఒకసారి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దీంతో ఏడాది ఆస్తి పన్ను ఒకే దఫా చెల్లించాలి. ♦ గత ఏడాది ఆస్తి పన్నుకు సంబంధించి రూ.20.22 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.15.84 కోట్లు మాత్రమే వసూలైంది. రూ.4.38 కోట్ల బకారుులు పేరుకుపోయారుు. ఈ ఏడాది నిర్దేశించిన ఆస్తిపన్ను లక్ష్యం ♦ రూ.15.12 కోట్లు. గత ఏడాది బకారుు కలిపి రూ.19.50 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలి. అరుుతే 2016-17 వార్షిక సంవత్సరంలో అర్థ సంవత్సరం ముగిసి నెల రోజులు కావస్తునప్పటికీ ఇప్పటి వరకు కేవలం 29.50 శాతం పన్ను వసూలు మాత్రమే సాధ్యపడింది. ఇప్పటివరకు కేవలం రూ.5.75 కోట్ల పన్ను వసూళ్లు మాత్రమే చేపట్టారు. దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు కార్పొరేషన్ వర్గాలే పేర్కొంటున్నారుు. వరంగల్ రీజియన్లో ఖమ్మం వెనుకంజ.. వరంగల్ రీజియన్లో నాలుగు కార్పొరేషన్లు ఉండగా, పన్ను వసూళ్లు లక్ష్యంలో ఖమ్మం వెనుకంజలో నిలిచింది. గత ఏడాది కరీంనగర్ కార్పొరేషన్ 99.54 శాతం పన్ను వసూళ్లతో నంబర్వన్ స్థానంలో నిలవగా, రామగుండం కార్పొరేషన్ 91.79 శాతంతో రెండో స్థానంలో, తర్వాతి స్థానంలో వరంగల్ కార్పొరేషన్ 81.72 శాతం పన్ను వసూళ్లు సాధించింది. ఖమ్మం కార్పొరేషన్ మాత్రం కేవలం 78.32 శాతం పన్ను వసూళ్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం కార్పొరేషన్లో కలిపిన తొమ్మిది గ్రామపంచాయతీల్లో పన్ను చెల్లింపులపై సరైన అవగాహన కల్పించని కారణంగా నగరంలోని చివరి గ్రామాల్లో పన్ను వసూళ్ల శాతం తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అరకొర సిబ్బందితో నెరవేరని లక్ష్యం.. ఖమ్మం కార్పొరేషన్లో ఆస్తి పన్ను వసూళ్లుకు సంబంధించి నలుగురు రెవెన్యూ ఇన్సపెక్టర్లు, 14 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. మొత్తం 50 డివిజన్లుండగా... ఒక్కో బిల్ కలెక్టర్ మూడుకుపైగా డివిజన్లలో పన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. అరుుతే ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపడా లేకపోవడంతో వారు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పన్ను వసూళ్లకు మాత్రమే వీరిని వినియోగించాల్సి ఉండగా, అదనపు పనులు సైతం వీరికే అప్పగిస్తుండటంతో అసలు లక్ష్యం మరుగునపడింది. ఈ ఏడాది ప్రభుత్వం ఆస్తి పన్ను రివిజన్ చేయడంతో ప్రస్తుతం ఆ పనుల్లో బిల్ కలెక్టర్లు, ఆర్ఐలు నిమగ్నమై ఉన్నారు. అదీగాక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సైతం బిల్ కలెక్టర్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో పన్ను వసూళ్లు లక్ష్యం చేరడం లేదు. -
ఇల్లు అమ్మితే పన్ను కట్టాలా?
లాభాలపై ‘టర్మ్’ ఆధారంగా పన్ను లాంగ్టర్మ్ అయితే 20 శాతానికే పరిమితం (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : ఆస్తిని అమ్మినప్పుడు పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతుంటుంది. అమ్మే వారికి భారీగా నగదు చేతికొస్తుంది. మరి దీనిపై పన్ను కట్టాలా? దీన్నెలా లెక్కిస్తారు? ఇల్లో, ఫ్లాటో అమ్మినవారందరికీ ఇలాంటి సందేహాలే ఉంటాయి. అవన్నీ వివరిస్తూ... పన్ను నిపుణులిస్తున్న సలహా ఇదిగో... మీరు ఆస్తికొని మూడేళ్ల లోపే అయింది. దీనిని ఇప్పుడు అమ్మేశారు. కాబట్టి ఈ లావాదేవీపై వచ్చిన లాభం స్వల్పకాలిక షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందకు వస్తుంది. యజమాని మొత్తం ఆదాయం, అతని శ్లాబ్ రేటుకు అనుగుణంగా ఇది అమలవుతుంది. అటువంటి ఆదాయం వార్షికంగా రూ.10 లక్షలకుపైన ఉంటే, సంబంధిత అమ్మకం నుంచి వచ్చే లాభంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన మూడు ఆర్థిక సంవత్సరాల తరవాత గనక ఇంటిని విక్రయిస్తే... దానిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్గా పరిగణిస్తారు. ఈ మేరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇండెక్షేషన్ (ఇంటి హోల్డింగ్ పిరియడ్లో ద్రవ్యోల్బణం, తదనుగుణంగా కొనుగోలు ధరల పరిశీలన) పరిగణనలోకి తీసుకుని, దీనికి లోబడి 20 శాతం పన్ను భారమే పడుతుంది. 80సీ కింద ప్రిన్సిపల్ రీమేమెంట్ విషయంలో అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కు సంబంధించి కంప్యూటరీకరణ విషయంలో రిపేర్లు, ఆధునికీకరణ వంటి అంశాలను అన్నింటినీ జోడించుకోవచ్చు. పన్ను భారాలు తగ్గించుకునేదిలా.. ఠ మీకు వచ్చిన మొత్తంతో మరో ఇంటిని రెండేళ్లలో కొనుగోలు చేసినా లేక మూడేళ్లలో మరో ఇంటిని కట్టించుకున్నా పన్ను భారం ఉండదు. మొదటి ఇంటిని అమ్మే ఏడాదికి ముందు మరో ఇంటిని కొన్నా కూడా పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే ఇంటిని అమ్మిన వ్యక్తిపేరే కొత్త ఇల్లు కూడా ఉండాలి. మీరు ఒకవేళ ఇంటిని విక్రయించారు. తద్వారా మీకు వచ్చిన లాభాన్ని తిరిగి మరో ఆస్తి కొనుగోలుకు వెచ్చించడం మీకిష్టంలేదు. అలాంటపుడు కూడా మీకు ఒక అవకాశం ఉంటుంది. ఇల్లు అమ్మిన ఆరు నెలల లోపు ఎన్హెచ్ఏఐ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ బాండ్లలో మూడేళ్ల కాలానికి లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనిపై సెక్షన్ 54 (ఈసీ) కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకరు రూ.50 లక్షల విలువైన బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అమ్మకందారు పూర్తి లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్ను టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లో సైతం పెట్టుబడిగా పెట్టి, పన్ను భారం తగ్గించుకునే వీలుంది. టీడీఎస్ సంగతి... ఏ దశలోనూ పన్ను ఎగవేతలు జరక్కుండా ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంది. రూ.50 లక్షల పైన ఇంటిని కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు దారు నుంచి సోర్స్ వద్ద పన్ను కోత (టీడీఎస్) వసూలును ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. అమ్మకందారుకు పేమెంట్కు ముందే టీడీఎస్ అమలవుతుంది. ఈ పేమెంట్ అమ్మకందారు పేరుపై జరుగుతుంది. దీనితో ఇది సంబంధిత అమ్మకందారు పాన్కు కూడా అనుసంధానమై ఉండడం వల్ల, ఫామ్ 26ఏఎస్పై ఇది ప్రతిబింబిస్తుంటుంది. కొనుగోలుదారు నుంచి అమ్మకందారు తప్పనిసరిగా టీడీఎస్ సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. ఇంటి అమ్మకంపై నష్టం లేదా లాంగ్టర్మ్ గెయిన్స్ నుంచి మినహాయింపు సందర్భాల్లో అమ్మకందారు టీడీఎస్ రిఫండ్ను క్లెయిమ్ చేసే వీలుంది. -
ఆస్తిపన్నుపై అపరాధ రుసుం మాఫీ!
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుంను రద్దు చేయాలని జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ప్రస్తుత ఏడాది ఆస్తి పన్నులతో పాటు పాత బకాయిలను ఏకమొత్తంలో గడువులోగా చెల్లిస్తే అపరాధ రుసుం మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గడిచిన ఆగస్టు 31లోగా బకాయిలను చెల్లిస్తే మాఫీని వర్తింపజేయాలని కోరినప్పటికీ... నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో సెప్టెంబర్ 30 వరకు అపరాధ రుసుం లేకుండా బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించవచ్చని పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 67 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మాఫీ వర్తించనుంది. పురపాలక సంస్థల్లో ఆస్తి పన్నుల బకాయిల వసూళ్లను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా అపరాధ రుసుంను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఇప్పటికే ఈ రుసుంతో పాటు పాత బకాయిలను చెల్లించిన వారికీ మాఫీ వర్తించనుంది. అపరాధ రుసుంను తిరిగి చెల్లించకుండా వచ్చే ఏడాది పన్నుల్లో సర్దుబాటు చేస్తారు. -
ఇక ఏటా ఆస్తి పన్ను మోత!
ఐదేళ్లకోసారి పెంచితే ప్రజలపై ఒక్కసారిగా భారం ఏటా కనీసం 5 శాతంపెంచే యోచనలో ప్రభుత్వం ప్రస్తుత పద్ధతిలోని పెంపు ప్రతిపాదనలను తిప్పి పంపిన మంత్రి కేటీఆర్.. ఏటా కొంత పెంపు కోసం త్వరలో కొత్త విధానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఏటా నిర్ణీత మొత్తంలో ఆస్తి పన్నులను పెంచేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఐదేళ్లకోసారి ఆస్తి పన్నులు పెంచుతుండడంతో ప్రజలపై ఒక్కసారిగా భారం పడుతోందని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆస్తి పన్నులను ఏటా కనీసం 5 శాతం పెంచాలని.. ఇందుకోసం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుత విధానంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్నుల సవరణ చేపట్టేందుకు పురపాలక శాఖ ఇటీవల సమర్పించిన ప్రతిపాదనలను ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు తిప్పిపంపడానికి ఇదే కారణమని తెలిసింది. ప్రజలపై ఒక్కసారిగా భారం పడకుండా ఏటా నిర్ణీత మొత్తంలో ఆస్తి పన్నులు పెంచేందుకు కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. చట్టాలకు సవరణలు.. వార్షిక అద్దె విలువ ఆధారంగా ఐదేళ్లకోసారి ఆస్తి పన్నులను సవరిస్తుండడంతో ప్రజలపై ఒక్కసారిగా భారం పడుతోంది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో గత ప్రభుత్వాలు గడువు సమయాల్లో ఆస్తి పన్నుల సవరణ చేపట్టలేదు. దాంతో రాష్ట్రంలో 2007 నుంచి నివాస భవనాలపై, 2012 నుంచి నివాసేతర భవనాలపై ఆస్తి పన్నుల సవరణ జరగలేదు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది 23 కొత్త నగర పంచాయతీలు, 3 కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణకు అనుమతించింది. దీంతో 30 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులు పెరగడంతో పలు చోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్లకోసారి కాకుండా.. ఏటా కొంత శాతం లెక్కన ఆస్తి పన్నులు పెంచాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు పురపాలక చట్టాలకు సవరణలు చేయనుంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి పెంపు! రాష్ట్రంలో నివాస గృహాలపై 2002 ఏప్రిల్ 1న, నివాసేతర భవనాలపై 2007 అక్టోబర్ 1న చివరిసారిగా ఆస్తి పన్నుల సవరణ జరిపారు. తదుపరి సవరణ నివాస భవనాలపై 2007లో, నివాసేతర భవనాలపై 2012లో జరపాల్సి ఉండగా.. అప్పటి ప్రభుత్వాలు అనుమతివ్వలేదు. కొత్త నగర పంచాయతీల్లో గతేడాది ఆస్తి పన్నులను పెంచారు. ఇక జీహెచ్ఎంసీ సహా 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లోనూ పెంచాలన్న ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా తర్జనభర్జన పడుతోంది. ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలు 2015 జనవరిలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినా ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఆస్తి పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. ఏళ్ల తరబడిగా ఆస్తి పన్నులు పెంచకపోవడంతో మున్సిపాలిటీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే గ్రాంట్లు సైతం సకాలంలో అందడం లేదు. పట్టణీకరణకు తగ్గట్లు మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు ఉండడం లేదు. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు సైతం సక్రమంగా వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆస్తి పన్నుల వసూళ్లలో లోపాలను అధిగమించి ఆదాయాన్ని పెంచుకోవాలని, ప్రతి పురపాలిక స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి కేటీఆర్ ప్రతి సమావేశంలో అధికారులను ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ 1 నుంచే కొత్త విధానంలో ఆస్తి పన్నుల సవరణను అమలు చేయాలని పురపాలక శాఖ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ప్రస్తుత విధానంలోనే సవరణ చేసినా అమల్లోకి తెచ్చేందుకు కనీసం 9 నెలల సమయం పట్టనుంది. -
కొత్త ఇంట్లో చెట్లు తప్పనిసరి
- లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు - ప్రతిపాదనలకు కేటీఆర్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా చెట్ల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కొత్తగా నిర్మించిన ఇళ్లల్లో విస్తీర్ణం ఆధారంగా నిర్ణీత సంఖ్యలో చెట్లను పెంచితేనే ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తాజాగా ఆమోదించడంతో ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2012లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన బిల్డింగ్ నిబంధనల ప్రకారం... కొత్తగా నిర్మించిన భవనం ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లకు మించి ఉన్నా, లేక ఎత్తు 7 మీటర్లకు మించినా గృహ ప్రవేశానికి ముందే స్థానిక మునిసిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ లేని భవనాలకు విద్యుత్, నల్లా, డ్రైనేజీ కనెక్షన్ చార్జీలను మూడింతలకు పెంచాలని, ఆస్తి పన్నును రెండింతలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్తో ముడిపెట్టి చెట్ల పెంపకాన్ని ప్రతి ఒక్కరికి తప్పనిసరి చేసింది. ఒకటి రెండు రోజుల్లో అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం భవన నిర్మాణ ప్లాన్ను స్థానిక మునిసిపాలిటీ ఆమోదించిన వెంటనే మొక్కలు నాటాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తైఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే నాటికి మొక్కలు కొంతైనా పెరిగుండాలి. అప్పటికప్పుడు నాటేసి దరఖాస్తు చేసుకొంటే వాటిని తిరస్కరిస్తారు. 200 చదరపు మీటర్ల లోపు స్థలంలో నిర్మించిన ఇళ్లల్లో కనీసం రెండు చెట్లు ఉండాలనేది నిబంధన. -
గ్రేటర్లోఆస్తిపన్ను పెంపునకు రంగం సిద్ధం
-
గ్రేటర్లోఆస్తిపన్ను పెంపునకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ప్రజలపై ఆస్తిపన్ను భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఓ వైపు ఖజానా నిల్వలు రోజురోజుకూ తగ్గడం... మరోవైపు చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ్యయం వందల కోట్ల రూపాయల్లో ఉండటం... ఇప్పటికే ఆస్తి పన్ను జాబితాలో లేని ఇళ్లు, నివాస భవనాల్లో కొనసాగుతున్న వాణిజ్య భవనాల గుర్తింపు వంటి చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ ఆస్తిపన్నును సైతం పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చింది. జీహెచ్ఎంసీలో 2002 తర్వాత నివాస గృహాలకు, 2007 అనంతరం వాణిజ్య భవనాలకు ఆస్తి పన్ను పెంచలేదు. నాటితో పోలిస్తే నేడు అన్నింటి ధ రలు ఎన్నో రెట్లు పెరిగాయి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఆస్తిపన్ను రివిజన్ చేస్తామని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ప్రకటించారు. ఈ క్రమంలో పన్ను పెంపు కోసం అవసరమైన రివిజన్కు అనుమతించాల్సిందిగా ఇటీవల ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ లేఖ రాసింది. దీనికి ప్రభుత్వ అనుమతి లాంఛనమే! శాస్త్రీయంగా సర్వే... గత ఏప్రిల్ నుంచి 7,912 భవనాలను కొత్తగా ఆస్తిపన్ను జాబితాలో చేర్చడం ద్వారా జీహెచ్ఎంసీకి రూ.10.86 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు... పన్ను పెంపు కోసం శాస్త్రీయంగా సర్వే జరపాలని నిర్ణయించారు. రివిజన్ చేసేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. గ్రేటర్లోని ఆయా ప్రాంతాల్లోని స్థలాల డిమాండ్, మౌలిక సదుపాయాలు, వసతులు, సంపన్న ప్రాంతాలు, పేద వాడలు, జోన్, లొకేషన్, భవనం తీరు మొదలైన వాటికనుగుణంగా ఆయా ప్రాంతాల్లోని వార్షిక అద్దె విలువ (ఏఆర్వీ)లను అంచనా వేసి ఆస్తిపన్ను సవరించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి తెలిపారు. వాస్తవానికి ఏటా ఆస్తి పన్ను పెంచాల్సి ఉందన్నారు. అయితే పన్ను వసూళ్లలో లోపాలను సరిదిద్దుతూ, లొసుగుల్ని సవరిస్తూ అంతర్గత సామర్థ్యం మెరుగుపరుచుకోవడం వంటి చర్యలతో ఏటికేడు ఆదాయం పెంచుకోవడం తప్ప పెంపు జోలికెళ్లలేదన్నారు. ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదన మూడేళ్ల కిందటే వచ్చినా... ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో విరమించుకున్నారు. పెంచి చాలా కాలమైనందున ఇప్పుడా పరిస్థితి రాదని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అయితే... పేదలుండే ప్రాంతాల్లో ఎక్కువ భారం పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. పన్ను పెంపు ప్రతిపాదనలను ప్రజల ముందుంచి నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఒకవేళ పెంచితే జీహెచ్ఎంసీకి ఆస్తి పన్నుపై వచ్చే ఆదాయం దాదాపు రెట్టింపవుతుందని అంచనా. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు దాదాపు ఐదారు నెలలు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. -
అక్రమ కట్టడాలపై ‘ఆస్తి పన్ను’ పిడుగు
* జరిమానాల వసూళ్లకి కొత్త నిబంధనలపై సర్కార్ కసరత్తు * ఆస్తి పన్నులో 25 నుంచి 100 శాతం జరిమానాలు సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కూల్చివేత జరిగే వరకు ఆ భవనాలపై ఆస్తి పన్నుల రూపంలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేవిధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని అక్రమ కట్టడాలపై ఈ నిబంధనలను అమల్లోకి తెస్తూ త్వరలో రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా అక్రమ కట్టడాలపై ఆస్తిపన్నులో 25 నుంచి 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేయాలని మున్సిపల్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీలో కొన్ని భవనాలపై ఈ జరిమానాలను వసూలు చేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి ఆస్తిపన్నులు, జరిమానాలు చెల్లిస్తున్నందున తమ భవనాల క్రమబద్ధీకరణ జరిగినట్లేనని ఆదేశించాలని కొందరు భవనాల యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడిగా కేసులు పెండింగ్లో ఉండిపోతుండడంతో ఈ భవనాల యజమానుల నుంచి ఆస్తిపన్ను, జరిమానాలను వసూలు చేయలేకపోతున్నారు. ఈక్రమంలో జరిమానా చెల్లించినంత మాత్రాన అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదనే విధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. త్వరలో టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అక్రమ కట్టడాలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిర్ణయించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఈ నెల 22న అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
ఆస్తిపన్ను చెల్లించిన సినీ నటుడు
నార్సింగి: బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులు తమ ఆస్తిపన్ను చెల్లించి మరింత మెరుగైన సేవలు పొందాలని గ్రామ సర్పంచ్ హరికృష్ణ కోరారు. సినీనటుడు రాజా బుధవారం బండ్లగూడ గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి సాయిరామ్నగర్ కాలనీలోని తమ ఇంటి ఆస్తిపన్ను చెల్లించారు. సర్పంచ్ స్వయంగా ఆస్తిపన్ను స్వీకరించి రాజాకు రసీదు అందజేశారు. హీరో రాజా లాగ అందరు తమ ఆస్తిపన్నును విధిగా చెల్లించాలని కోరారు. మార్చి నెల చివరి రోజు వరకు వేచి చూడకుండా ఆస్తిపన్ను చెల్లించాలన్నారు. చెల్లించిన పన్నుతోనే అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. అందరూ ఆస్తిపన్ను చెల్లించి అభివృద్ధికి పాటుపడాలని సినీహీరో రాజా పిలుపునిచ్చాడు. -
‘టవర్స్’ ప్రతిపాదనలు మార్చండి
- రిలయన్స్ ఇన్ఫ్రా ప్రతినిధులకు కేటీఆర్ సూచన - పెనాల్టీ మాఫీ తదితర అంశాలపై త్వరలో స్పష్టత - 2017 డిసెంబర్ నాటికి ఓఆర్ఆర్ వెలుపలకు పరిశ్రమలు - సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలపై సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : వంద అంతస్తుల ఆకాశ హర్మ్యం ‘రిలయన్స్ టవర్స్’ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం రూపొందించిన ఆ ప్రతిపాదనల్లో మార్పుచేర్పులు చేయాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాకు సూచించారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన పలు కీలకాంశాలపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాల్సిందిగా సంస్థ ప్రతినిధులను కోరారు. టీఎస్ఐఐసీ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం తామిప్పటికే రూ.150 కోట్లు చెల్లించామన్న రిలయన్స్ ఇన్ఫ్రా, తమ నిధులు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఖాతాలో వున్నందున పెనాల్టీని మాఫీ చేయాలని కోరినట్టు సమాచారం. ప్రాజెక్టు కాలపరిమితికి సంబంధించి తుది షెడ్యూలును రూపొందించాల్సిందిగా మంత్రి సూచించినట్టు తెలిసింది. కాగా, కాలుష్యకారక కంపెనీలను 2017 డిసెంబర్లోగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. రాజధానివాసుల జీవితాల్లో నాణ్యత పెంచే లక్ష్యంతో తొలి దశలో 1,068 కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తామన్నారు. ఇది సవాలుతో కూడిందే అయినా పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వడం, నూతన పరిశ్రమలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను అధిగమిస్తామన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జి వంటి విధానాలతో జల, వాయు కాలుష్యాలను తగ్గించవచ్చన్నారు. ల్యాండ్ కన్వర్షన్, పన్ను రాయితీలు, పరిశ్రమల ఆవరణలో గృహాలకు అనుమతి తదితరాలపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఒకే రంగానికి చెందిన పరిశ్రమలను ఒకే క్లస్టర్లో ఏర్పాటు చేసేలా హెచ్ఎండీఏ వంటి సంస్థలతో కలసి పని చేయాల్సిందిగా టీఎస్ఐఐసీకి మంత్రి సూచిం చారు. హైదరాబాద్లోని రసాయన, ఫార్మా కంపెనీలను ఫార్మా సిటీకి తరలిస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు ఆస్తి పన్నులో స్పెషల్ కేటగిరీ సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల సమస్యలపై తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆస్తి పన్ను వసూలులో ఎంఎస్ఎంఈలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించే అంశంపై పరిశ్రమల శాఖ కమిషనర్ అధ్యక్షతన కమిటీ వేస్తామన్నారు. హైదరాబాద్ పరిసరాల్లోని 18 పారిశ్రామికవాడల్లోని కార్మికుల కుటుంబాలు వినియోగించే మంచినీటి కుళాయిలను కమర్షియల్ కేటగిరీగా పరిగణిస్తూ కిలో లీటరుకు రూ.120 చొప్పున వసూలు చేస్తున్నారని సుధీర్రెడ్డి చెప్పారు. దాన్ని రూ.60కి తగ్గించాలని కోరారు. సమాఖ్య సభ్యుల్లో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న 438 మందికి ఏడాదిన్నర కాలపరిమితితో ఉత్పత్తి ప్రారంభించే షరతుపై భూమి కేటాయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఓఆర్ఆర్ వెలుపలకు తర లేందుకు సిద్ధంగా వున్న పరిశ్రమలకు కన్వర్షన్ చార్జీలు మాఫీ చేయడంతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీలు ఆలస్యమైతే బ్యాంకర్ల నుంచి బ్రిడ్జి లోన్లు ఇప్పించాలని సమాఖ్య కోరగా సానుకూలంగా స్పందించారు. చిన్న పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం మూలంగా మూత పడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య (ఎఫ్ఎస్ఎంఈ) జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. టీఎస్ఐపాస్లో నూతన పరిశ్రమలకు ఇస్తున్నట్టే మూసివేత దిశలో వున్న పరిశ్రమల పునరుద్ధరణకూ రాయితీలిచ్చేందుకు కేటీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. సీజనల్ పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా యూనిట్వారీ బిల్లింగ్ విధానానికీ సానుకూలంగా స్పందించారు. తమిళనాడు తరహాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తక్షణం ఆదేశాలిచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను పేరు మార్పిడిపై చైర్మన్ విచారణ
- ఆర్డీకి ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయిస్తా ప్రొద్దుటూరు టౌన్: ఆస్తిపన్ను పేరుమార్పిడిలో.. అవినీతికి పాల్పడ్డ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులపై ఆర్డీ విజయలక్ష్మికి ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయిస్తానని మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రికలో ఈనెల 13న ‘ఆస్తిపన్ను పేరు మార్పిడిలో.. గోల్మాల్’ కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన చైర్మన్ శనివారం తన చాంబర్కు, అసిస్టెంట్ కమిషనర్ నటరాజన్, ఆర్ఐ గిరిధర్బాబు, పౌరసేవ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ సింగరయ్యలను పిలిపించారు. మున్సిపాలిటీకి చెలానా కట్టకుండా, ఎలాంటి రికార్డులు లేకుండా నేరుగా ఆస్తి పన్ను పేరును ఏవిధంగా మార్పు చేశారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని పేర్లు మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి బిల్ కలెక్టర్లు మార్చారో పూర్తి నివేదికను తయారు చేయాలని అసిస్టెంట్ కమిషనర్కు చెప్పారు. మున్సిపాలిటీ జీతాలు తీసుకుంటూ మున్సిపల్ ఆదాయానికే గండి కొట్టిన బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది ఎవరు ఉన్నా ఆర్డీకి ఫిర్యాదు చేసి వారిని సస్పెండ్ చేయిస్తానని మండిపడ్డారు. సవరణ పేరుతో ఏకంగా పేర్లే మార్చేస్తే ఆస్తులు ఉన్న వారు కొట్టుకుని చావాలనా అని ప్రశ్నించారు. 8వ వార్డులో పేర్లు మార్పు చేసిన మరో బిల్ కలెక్టర్ 8వ వార్డు బిల్ కలెక్టర్ రవీంద్రారెడ్డికి తెలియకుండా మరో బిల్ కలెక్టర్ నేరుగా కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో ఆస్తి పన్ను పేర్లు మార్చిన విషయం ఇప్పటికే నిర్ధారణ అయింది. సంబంధిత ఆిస్తి యజమానులను కలిసి బిల్ కలెక్టర్ రవీంద్రారెడ్డి మాట్లాడి ఏవిధంగా పేర్లు మార్చారో ప్రశ్నించగా వారు సమాధానం చెప్పలేదు. సంబంధిత యజమానులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి పేరు మార్పును రద్దు చేసేందుకు ఫైల్ను సిద్ధం చేశారు. ఈ విధంగా మొత్తం 40 వార్డుల్లో ఎన్ని మున్సిపాలిటీకి చెలానా కట్టకుండా నేరుగా పేర్లు మార్చారన్న విషయం మరో రెండు రోజుల్లో తేలనుంది. ఫొటో:16పిడిటిఆర్ 101- సిబ్బందిని విచారిస్తున్న చైర్మన్ గురివిరెడ్డి -
ఆరు సేవలతో ‘మై జీహెచ్ఎంసీ’
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పౌరసేవలందించేందుకు ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ను అందుబాటులోకి తెచ్చింది జీహెచ్ఎంసీ. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా జనన సర్టిఫికెట్లు, మరణ సర్టిఫికెట్లు, ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సు, ఎల్ఆర్ఎస్, వివిధ సమస్యల ఫిర్యాదులు మొదలైన ఆరు రకాల సేవలు అందించనున్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదైన వారి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రజలే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ సంతకంతో కూడిన ఇవి ఎక్కడైనా చెల్లుబాటవుతాయి. ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్సుల వివరాలతోపాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. వీటితోపాటు రహదారులు, మ్యాన్హోల్స్, పాట్హోల్స్, డంపర్ బిన్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, వీధి దీపాలు.. ఇలా ఏ సమస్య కనిపించినా మొబైల్లో ఫొటో తీసి, అప్లోడ్ చేయాలి. జీపీఎస్ సాంకేతికతతో సమస్య ఎక్కడ ఉందో తెలియడంతోపాటు ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్ తదితర వివరాలు సంబంధిత అధికారులకు చేరతాయి. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. పరిష్కారమయ్యాక ఫిర్యాదుదారులకు మెసేజ్ అందుతుంది. ఒకవేళ పరిష్కారంపై సంతృప్తి చెందని పక్షంలో ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. ఏ పనిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తారు. లేనిపక్షంలో పైఅధికారికి చేరుతుంది. అలా కమిషనర్, మేయర్ వరకు చేరుతుంది. దీర్ఘకాలం పరిష్కారం కానివాటిని తనకు కూడా పంపించాల్సిందిగా శుక్రవారం ఈ యాప్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. చెల్లింపులు కూడా..: ఆస్తిపన్ను, ట్రేడ్లెసైన్సులకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ నంబర్లు, చివరిసారిగా ఎంత చెల్లించింది.. ఎంత బకాయి ఉంది వంటి వివరాలను తెలుసుకోవడంతోపాటు బకాయిలు, ఫీజుల్ని సైతం యాప్ నుంచే చెల్లించవచ్చు. చెల్లించిన వెంటనే ఎస్ఎంఎస్ వస్తుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లకే పరిమితమైన ఈ యాప్ను నెల రోజుల్లో ఐఓఎస్ ఫోన్లకు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. -
భలే యాప్
‘మై జీహెచ్ఎంసీ’ యాప్కు విశేష స్పందన తొలి అరగంటలోనే 272 మంది... రాత్రి 9 వరకు 10,654 మంది డౌన్లోడ్ రూ. 1.36 లక్షల ఆస్తి పన్ను చెల్లింపులు సేవలు బాగున్నాయని సిటీజనుల కితాబు సిటీబ్యూరో: సేవల్లో పారదర్శకత, జాప్యం నివారణకు జీహెచ్ఎంసీ రూపొందిం చిన ‘మై జీహెచ్ఎంసీ’ యాప్కు తొలి రోజే విశేష స్పందన లభించింది. టెక్నాలజీ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందేలా రూపొందించిన ఈ యాప్ను శుక్రవారం ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపులు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు, వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఈ సేవలను సత్వరమే వినియోగించుకోవచ్చు. కాగా యాప్ను ఆవిష్కరించిన అరగంటలోనే 272 మంది డౌన్లోడ్ చేసుకోగా, రాత్రి 9 గంటల వరకు 10,654 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. తొలిరోజే 54 మంది భవన యజమానులు రూ. 1,36,145 ఆస్తిపన్నుగా చెల్లించారు. 607 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి సెర్చ్ చేశారు. 372 మంది వివిధ సమస్యలను ఫొటోలతో ఫిర్యాదు చేశారు. 4395 మంది బర్త్ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. 466 మంది డెత్ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పలువురు యాప్ బాగుందని రేటింగ్స్ ఇచ్చారు. ఇంకా అభివృద్ధి పరచాల్సింది ఎంతో ఉందని మరికొందరు సూచించారు. యాప్ బాగున్నప్పటికీ, ఆస్తిపన్నుకు సంబంధించి అన్ని ప్రాంతాల వివరాలు రావడం లేవన్నారు. హోమ్ స్క్రీన్కు వెళ్లేందుకు నేవిగేషన్ లేదని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకొందరు ‘మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ...’ అంటూ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఫిర్యాదుల విభాగంలో ఒకే ఫొటో కాకుండా మరికొన్ని ఫొటోలకు అవకాశమివ్వాలని కోరారు. బర్త్ సర్టిఫికెట్లు ఆశ్చర్యకరంగా బాగున్నప్పటికీ, మిగతా అంశాల్లో అభివృద్ధి చేయాల్సి ఉందని పలువురు సూచించారు. ఇలా వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చారు. మొత్తానికి జీహెచ్ఎంసీ ప్రయత్నాన్ని ఎక్కువ మంది సిటీజనులు అభినందించారు. భేష్.. సురేంద్ర! జీహెచ్ఎంసీ ఐటీ విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న అడిషనల్ క మిషనర్ సురేంద్రమోహన్పై మునిసిపల్ మంత్రి కేటీ రామారావు ప్రశంసల జల్లు కురిపించారు. అనుకున్న దానికంటే తక్కువ సమయంలో నగరంలోని ప్రజలకు ఉపయోగపడేలా ‘ మై జీహెచ్ఎంసీ’ యాప్ను అందుబాటులోకి తేవడంపై అభినందించారు. ఐటీ విభాగంలోని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందించారు. వారితో కరచాలనం చేశారు. శుక్రవారం ఈ యాప్ను ఆవిష్కరించిన కేటీఆర్.. ఆవిష్కరణ తర్వాతే అందులోని వివరాలు.. తద్వారా ప్రజలకు కలిగే సౌలభ్యాల గురించి పూర్తిగా తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు యాప్ కోసం.. ఐటీ విభాగంలో సురేంద్రమోహన్ చేస్తున్న విశేష కృషి గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి మంత్రికి వివరించారు. అందుకు స్పందిస్తూ ఆయన ‘అయితే.. సురేంద్రమోహన్ లీవ్ను క్యాన్సిల్ చేస్తున్నా’ అని నవ్వుతూ అన్నారు. రెండు వారాల లండన్ పర్యటన కోసం సురేంద్రమోహన్ సెలవు కోరడాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నువ్విక్కడ లేకుంటే ఎలా.. అనడంతో లండన్నుంచి కూడా యాప్ను పరిశీలించవచ్చునని సురేంద్రమోహన్ బదులిచ్చారు. ఐటీ వినియోగం ద్వారా కొత్తపుంతలు తొక్కుతామని, అందుకోసం ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమించనున్నామని గతంలో తాను చెప్పానని, ఇప్పుడు అది సురేంద్రమోహన్ జరిగిందని మంత్రి కితాబిచ్చారు. యాప్ పనితీరును, ప్రజల స్పందనను ప్రతివారం సమీక్షించాల్సిందిగా ఆయనకు సూచించారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రతి స్టెప్ స్పష్టంగా, విపులంగా అర్థమయ్యేలా మరింత అభివృద్ధి పరచాల్సిందిగా సూచించారు. టెక్నాలజీని, ఐటీని వినియోగించుకోవడం ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లు తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని అంతకుముందు సురేంద్రమోహన్ మంత్రి దృష్టికి తెచ్చారు. -
లెక్క తేలదు..!
ఆస్తిపన్ను రాయితీలో గందరగోళం సర్వేలో వెల్లడవుతున్న వైనం సగానికి పైగా అనర్హులే..! సిటీబ్యూరో: చిన్న నివాసాల వారికి ఆస్తిపన్నులో ఇచ్చిన మినహాయింపు జీహెచ్ఎంసీలో గందరగోళంగా మారింది. ఇంతవరకు రూ. 1200 లోపు ఆస్తిపన్ను ఉన్నవారు రూ. 101 చెల్లిస్తే చాలని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన నాటికి జీహెచ్ఎంసీలో రాయితీ పరిధిలోకి వచ్చేవారు 5.09 లక్షల మంది ఉండగా, అనంతరం 5.42 లక్షలకు పెరిగారు. ఈ ఇళ్లను తాజాగా సర్వే చేస్తుండగా, ఇందులో సగంమంది అసలు పథకానికి అర్హులే కారని తేలింది. ఇదే అవకాశంగా బిల్ కలెక్టర్లు ఇళ్ల యజమానులతో లాలూచీ పడి జేబులు నింపుకునే పనిలో పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కథా కమామిషు ఇలా.. ప్రభుత్వం ఆస్తిపన్ను రాయితీ నిచ్చిన నేపధ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు రూ. 1200 లోపు పన్ను ఉన్న ఇళ్లపై తాజాగా సర్వే చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను రాయితీని అమల్లోకి తెచ్చిన గత ఏడాది డిసెంబర్ 31 నాటికి వీరి సంఖ్య 5,09,187 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 5,42,990కి పెరిగింది. అప్పడు ఆస్తిపన్ను జాబితాలో లేనివారిని జాబితాలో చేర్చడం ద్వారా ఈ సంఖ్య పెరిగి ఉండవచ్చు. తాజాగా 35 వేల ఇళ్లను తనిఖీ చేయగా.. అందులో సగానికి పైగా.. అసలు ఆస్తిపన్ను రాయితీకి అర్హులు కారని తేలింది. జీహెచ్ఎంసీ జాబితాలో వారు చెల్లించాల్సిన ఆస్తిపన్ను రూ. 1200 లోపునే ఉన్నప్పటికీ, వాస్తవంగా ఇప్పుడు జరిపిన క్షేత్రస్థాయి తనిఖీతో వీరు చెల్లించాల్సిన పన్ను రూ. 2 వేల నుంచి లక్ష రూపాయల దాకా కూడా ఉండటం గమనార్హం. గతంలో గ్రౌండ్ఫ్లోర్ ఉన్నప్పుడు నిర్ధరించిన ధరలనే నేటికీ చెల్లిస్తూ మూడు, నాలుగు అదనపు అంతస్తులు నిర్మించినా వాటిని ఆస్తిపన్ను జాబితాలో చూపకపోవడం వంటి కారణాలతో వారు రాయితీకి అనర్హులని గుర్తించారు. తిరిగి 35 వేల ఇళ్లను సర్వే చేయగా, అందులో 16 వేల ఆస్తులు మినహాయింపు పరిధిలో లేవని తేలింది. వీటి ద్వారా దాదాపు రూ. 8 కోట్లు జీహెచ్ఎంసీకి అదనంగా రావాల్సి ఉందని గుర్తించారు. ఆదాయం పెరగనుందని జీహెచ్ఎంసీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మినహాయింపు ఇచ్చినట్లే ఇచ్చి భారీ మొత్తం భారం మోపుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అదనుగా కొందరు బిల్ కలెక్టర్లు రాయితీ పరిధిలోనే మీ ఇళ్లను ఉంచుతామని ఇళ్ల యజమానులతో ఒప్పందం చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. విచిత్రం.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివరాలు ఒకలా ఉండగా, సర్కిళ్ల అధికారుల వద్ద మరో రకమైన వివరాలు ఉండడం సందేహాలకు తావిస్తోంది. ఉదాహరణకు ఓ సర్కిల్కు సంబంధించి ప్రధాన కార్యాలయంలో దాదాపు 40 వేల ఇళ్లు మినహాయింపు జాబితాలో ఉండగా.. ఆ సర్కిల్ కార్యాలయంలో ఆ సంఖ్య 25 వేలుగా ఉంది. ఆన్లైన్లో ఎవరికి వారు ఇష్టానుసారం ఈ జాబితాను మారుస్తున్నారని, ఇందులో భారీ స్కామ్కు ఆస్కారం ఉన్నట్టు అనుమానాలున్నాయి. అధికారులు ఈ అంశంపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. -
పంచ‘తంత్రం’!
జీహెచ్ఎంసీ నిధుల వేట ఖజానా భర్తీకి భారీ కసరత్తు ఆస్తి పన్ను, వీఎల్టీ,{sేడ్ లెసైన్స్ తదితరాలపై నజర్ ఐదు అంశాల ఆధారంగా ఆర్థిక పరిపుష్టికి యత్నం రోజురోజుకూ తరుగుతున్న జీహెచ్ఎంసీ ఖజానాను భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆదాయం పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ గ్రాంట్ల కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 492 కోట్లు రాగా, 2015-16లో కేవలం రూ. 48 కోట్లు మాత్రమే అందాయి. దీంతో రూ. 444 కోట్ల మేర ఖజానా లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ. 500 కోట్లు తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులకు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలన్నా...ఖజానా పరిపుష్టంగా ఉండాల్సి ఉన్నందున ఆదాయ మార్గాలన్నింటిపై దృష్టి సారించింది. ప్రస్తుతానికి ఐదు అంశాల (ఆస్తిపన్ను, వీఎల్టీ, ఓసీ, ట్రేడ్ లెసైన్సుల జారీ, పన్నుల పెంపు)పై ప్రధానంగా కన్నేసింది. - సాక్షి,సిటీబ్యూరో సిటీబ్యూరో: గ్రేటర్ ఖజానా నిండాలంటే ఎలాంటి మార్గాలను అనుసరించాలనే దానిపై అధికారులు భారీ కసరత్తు చేస్తున్నారు. ప్రజలపై అధిక భారం మోపకుండానే చిత్తశుద్ధితో పనిచేసి పన్నులు రాబట్టాలని భావిస్తున్నారు. ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తిగా నెరవేరితే కొంత ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుందంటున్నారు. అలాగే ట్రేడ్ లెసైన్సులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, అవసరాన్ని బట్టి పన్నుల పెంపు ద్వారా నిధులు సాధించాలని వ్యూహరచన చేస్తున్నారు. ఆస్తిపన్ను .. జీహెచ్ఎంసీ ఆదాయమార్గాల్లో ఆస్తిపన్నే ప్రధాన వనరు కావడంతో వివిధ కోణాల్లో ఆలోచనలు చేసి ఆస్తిపన్ను మరింతగా పెంచుకోవచ్చునని అంచనా వేసింది. వాటిల్లో అన్ అసెస్డ్ భవనాలను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ నివాస కేటగిరీలోనే ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను గుర్తించి వాణిజ్య కేటగిరీలో చేర్చడం, చెల్లించాల్సిన ఆస్తిపన్ను కంటే లొసుగులతో తక్కువ ఆస్తిపన్ను మాత్రమే చె ల్లిస్తున్న భవనాలను గుర్తించడం వంటివి ఉన్నాయి. ఈ చర్యల ద్వారా రూ.100 నుంచి రూ. 200 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని అంచనా. వీటితోపాటు రెంటల్ వాల్యూ కనుగుణంగా హేతుబద్ధీకరణ జరపడం తదితరమైనవి ఉన్నాయి. వీఎల్టీ .. వేకెంట్ ల్యాండ్ టాక్స్(వీఎల్టీ) విధింపు ద్వారా దాదాపు రూ.30 కోట్ల మేర ఆదాయం రాగలదని అంచనా. ఎల్ఆర్ఎస్ పథకం కింద జీహెచ్ఎంసీకి దాదాపు 57 వేల దరఖాస్తులందాయి. పరిష్కారమైన వాటన్నింటికి వీఎల్టీ వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలను ఇప్పటికే జోనల్, డిప్యూటీ కమిషనర్ల పరిశీలన కోసం పంపారు. ఎల్ఆర్ఎస్ అవసరం లేని భూములపై ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చేందుకు వీఎల్టీని తగ్గించే ఆలోచన కూడా చేశారు. వీఎల్టీ ప్రస్తుతం మార్కెట్ ధరలో 0.5 శాతంగా ఉంది. దీన్ని 0.1 శాతానికి తగ్గించడం ద్వారా ఎక్కువ మంది ముందుకు వస్తారని అంచనా. ట్రేడ్ లెసైన్సులు.. జీహెచ్ఎంసీ నుంచి వ్యాపారాలకు అనుమతులు తీసుకున్నవారు దాదాపు 1.48 లక్షమంది ఉండగా, ట్రేడ్ లెసైన్సు జాబితాలో మాత్రం 43 వేలమంది మాత్రమే ఉన్నారు. అంటే లక్షమందికి పైగా ట్రేడ్ లెసైన్సు ఫీజు కట్టడం లేరు. వీరందరినీ ట్రేడ్ లెసైన్సు పరిధిలోకి తేవడం ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా. దీంతోపాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రేడ్లెసైన్సు ఫీజుల విధానాన్ని కూడా మార్చే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం నాలుగు కేటగిరీల్లో ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. సోమేశ్కుమార్ కమిషనర్గా ఉన్నప్పుడు ట్రేడ్లెసైన్సు విధింపు సులభంగా ఉంటుందని దీన్ని అమల్లోకి తెచ్చారు. షాపుల మందు ఉండే రోడ్ల వెడల్పును బట్టి 20 అడుగుల లోపు వరకు, 30 అడుగుల రోడ్ల వరకు, 30 అడుగులకు మించిన రోడ్లకు మూడు కేటగిరీల్లో, స్టార్ హోటళ్లు, కార్పొరేట్ ఆస్పత్రుల వంటివాటికి మరో కేటగిరీలో ట్రేడ్లెసైన్సుల ఫీజులు విధించారు. దీనివల్ల గతంలో కంటే ఆదాయం ఎన్నోరెట్లు తగ్గినట్లు గుర్తించారు. దీంతో ఈ విధానాన్ని కూడా తిరిగి మార్చే యోచనలో ఉన్నారు. తద్వారా దాదాపు రూ. 100 కోట్ల మేర అదనంగా ఆదాయం రాగలదని అంచనా. ఓసీ ఆధారంగా.. ప్రస్తుతం భవననిర్మాణ అనుమతులు ఆన్లైన్ ద్వారా ఇస్తుండటంతో అనుమతి పొందగానే తెలుస్తుంది. దీంతో ఏదైనా కొత్త భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ కాగానే, దాన్ని ఆస్తిపన్ను జాబితాలో చేర్చి పన్ను వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కొత్త భవనాల నిర్మాణం పూర్తవుతున్నా, ఆమేరకు ఆస్తిపన్ను మాత్రం పెరగడం లేదు. ఏళ్ల తరబడి చాలామంది ఆస్తిపన్నును చెల్లించకపోవడంతో ఆమేరకు జీహెచ్ఎంసీ ఖజానాకు లోటు ఏర్పడుతోంది. ఓసీల ఆధారంగా దీన్ని భర్తీచేయవచ్చునని భావిస్తున్నారు. పన్నుపోటు.. పై మార్గాలతో పాటు అంతిమంగా ఆస్తిపన్ను తదితరాల పెంపునకూ రంగం సిద్ధం చేస్తున్నారు. నగరంలో 2002 తర్వాత ఇంతవరకు నివాసగృహాలపై ఆస్తిపన్ను పెంచలేదు. వాణిజ్య భవనాలకు సైతం 2008 తర్వాత పెంచలేదు. ఈ రెండింటిపైనా ఆస్తిపన్ను పెంచేందుకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యకలాపాలపై సోమవారం మునిసిల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే వర్క్షాప్లో వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఆస్తిపన్ను పెంపు?
ఆదాయం పెంచేందుకు బహుళ అంతస్తుల మదింపు సిద్ధమవుతున్న గ్రేటర్ అధికారులు సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఆదాయమార్గాలపై దృష్టిసారించిన ప్రభుత్వం...ఇందుకు ఆస్తిపన్ను పెంపుదల, వాణిజ్య భవనాల రీ అసెస్మెంట్ను ఓ మార్గంగా భావిస్తోంది. పన్ను పెంపుదల జరగకముందే నగరంలోని పలు వాణిజ్య భవనాల రీ అసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలో పలుచోట్ల ఎక్కువ విస్తీర్ణంలోని భవనాలకు తక్కువ విస్తీర్ణం చూపుతూ తక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ సిబ్బంది పాత్ర సైతం ఉందనే ఆరోపణలున్నాయి. మరోవైపు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, నివాస కేటగిరిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలు సైతం గణనీయంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ భవనాలు, బహుళ అంతస్తుల భవనాలను మరోమారు అసెస్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. -
పన్ను కట్టు..బహుమతి పట్టు
ఆస్తిపన్ను చెల్లింపుదార్లకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ జూన్లో ప్రతివారం లక్కీడ్రా మే నెలలో రూ.లక్ష గెలుచుకున్న బాపిరెడ్డి సిటీబ్యూరో: మే నెలలో చివరి మూడు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి లక్కీడ్రా ద్వారా రూ. 5 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేస్తున్న జీహెచ్ఎంసీ ప్రజల్లో వార్షిక సంవత్సరం ఆరంభంలోనే ఆస్తిపన్ను చెల్లించేలా అలవాటు చేసేందుకు జూన్ నెలలో వారం వారం లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై ప్రతివారం ఆస్తిపన్ను చెల్లించిన వారి పేర్లను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి వారానికి రూ. 3లక్షల మేర నగదు బహుమతులు అందజేయనున్నారు. జూన్ 1 నుంచి 7వ తేదీ లోగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 8న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. మేనెల 29, 30, 31 తేదీల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి బుధవారం సాయంత్రం లక్కీడ్రా నిర్వహించగా, రూ. 51 ఆస్తిపన్ను బకాయి చెల్లించిన మల్కాజిగిరి సర్కిల్లోని నేరెడ్మెట్ కాకతీయనగర్కు చెందిన జి. బాపిరెడ్డి రూ. లక్ష బంపర్ ప్రైజ్ దక్కించుకున్నారు. మొదటి బహుమతికి ఆబిడ్స్ (9ఎ) సర్కిల్ పరిధిలోని డయారా ప్రాంతానికి చెందిన పి. ఆశ ఎంపికయ్యారు. రెండో బహుమతి రూ. 25 వేల చొప్పున చార్మినార్ సర్కిల్ (4బి)లోని సరూర్ నగర్కు చెందిన ఎం. సునీత, ఖైరతాబాద్ (సర్కిల్ 10ఎ) ఎల్లారెడ్డిగూడకు చెందిన వారు ఎంపికయ్యారు. రూ.10వేల చొప్పున మూడో బహుమతి ఐదుగురికి, రూ. 5వేల చొప్పున, నాలుగో బహుమతి 10 మందికి, రూ. 2వేల చొప్పున, 100 మంది కన్సొలేషన్ బహుమతులకు గాను ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ద్వారా డ్రా తీశారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.జనార్దన్రెడ్డి విజేతల పేర్లను ప్రకటించారు. వారం వారం తీసే డ్రాలో బంపర్ బహుమతిగా రూ. లక్ష పాటు రూ. 25,000 , రూ.12,500, రూ.5, 000, రూ. 1,000 చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజలు ఆస్తిపన్ను, ట్రేడ్ లెసైన్స్ఫీజులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. జూన్ నెలాఖరులోగా ఆస్తిపన్ను చెల్లించని పక్షంలో జూలై ఒకటి నుంచి ప్రతినెలా రెండు శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు విద్యుత్,నీటి బిల్లుల మాదిరిగా ఆస్తిపన్నును కూడా నెలనెలా చెల్లించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మేనెలలో రూ. 12.92 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, ఈ ఏడాది మేలో రూ. 24. 37 కోట్లు వసూలయ్యాయన్నారు. ట్రేడ్ లెసైన్సు ఫీజులు రూ. 29.20 కోట్లు వసూలైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, రామకృష్ణారావు, శంకరయ్య, కెనెడి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.50 పన్నుకడితే.. బంపర్ ఆఫర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ లక్కీ డ్రా ఆఫర్లో భాగంగా రూ. 50 ఆస్తిపన్ను బకాయి చెల్లించిన ఓ పౌరుడికి లక్ష రూపాయల బంపర్ ప్రైజ్ వరించింది. మల్కాజిగిరి సర్కిల్లోని నేరెడ్మెట్ కాకతీయనగర్కు చెందిన జి. బాపిరెడ్డి రూ.100 రూపాయల పన్నుకు గాను మొదటి విడత బకాయి కింద రూ. 50 చెల్లించారు. మే నెల 29, 30,31 తేదీల్లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి బుధవారం సాయంత్రం లక్కీడ్రా నిర్వహించారు. ఇందులో బంపర్ ప్రైజ్ కింద లక్ష రూపాయల బహుమతికి బాపిరెడ్డి ఎంపికయ్యారు. మొదటి బహుమతి రూ. 50 వేలు సైతం రూ. 101 చెల్లించిన ఆబిడ్స్ కు చెందిన పి. ఆశకు దక్కింది. రెండో బహుమతిగా రూ. 25 వేల వంతున గెలుచుకున్న ఇద్దరిలో చార్మినార్ సర్కిల్ కు చెందిన ఎం. సునీత, ఖైరతాబాద్ (సర్కిల్ 10ఎ) ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. రూ.10 వేల చొప్పున మూడో బహుమతి ఐదుగురికి, రూ. 5 వేల చొప్పున నాలుగో బహుమతి పది మందికి, రూ. 2 వేల చొప్పున కన్సొలేషన్ బహుమతులు వందమందికి గాను ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ద్వారా డ్రా తీశారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.జనార్దన్రెడ్డిలు ల క్కీడ్రాలో విజేతల పేర్లు ప్రకటించారు. వారం వారం లక్కీ డ్రా వార్షిక సంవత్సరం ఆరంభంలోనే మొత్తం ఆస్తిపన్ను చెల్లించే అలవాటును పెంపొందించేందుకు గాను జూన్ నెలలో వారం వారం లక్కీ డ్రా నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జూన్ 1 నుంచి 7వ తేదీ లోగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 8వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నారు. డ్రా ద్వారా బంపర్ బహుమతిగా లక్షరూపాయలతో పాటు 25,000 , 12,500, 5000, 1000 రూపాయల చొప్పున బహుమతులందజేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. . -
దుబ్బాక, బాదెపల్లిలకు ‘పన్ను’ పోటు
సిద్దిపేటలో విలీనమైన 6 గ్రామ పంచాయతీలకు సైతం సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన దుబ్బాక, బాదెపల్లి(జడ్చర్ల) నగర పంచాయతీలతో పాటు సిద్దిపేట మునిసిపాలిటీలో విలీనమైన 6గ్రామపంచాయతీల్లో వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆస్తి పన్నుల మోత మోగనుంది. ఈమేరకు ఆస్తి పన్ను ల సవరణకు ప్రత్యేక ఆదేశాలిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆస్తి పన్నుల పెంపు అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక మునిసిపల్ కమిషనర్లకు సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం ఈ నెల 10వ తేదీలోపు ఆయా నగర పంచాయతీ/మునిసిపాలిటీ పాలకవర్గాలు.. భవనాలు, స్థలాలపై విధించే ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ తీర్మానం చేయాలి. ఆస్తి పన్నుల పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని ఈ నెల 15లోపు ప్రకటించి వచ్చే నెల 10వ తేదీలోపు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలి. అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ఆస్తి పన్నుల సవరణకు అనుమతిస్తూ వచ్చే నెల 30వ తేదీలోపు కౌన్సిల్లో మళ్లీ తీర్మానం చేస్తారు. అనంతరం పన్నుల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. వార్షిక అద్దె విలువలో 25 శాతానికి మించకుండా నివాస భవనాలపై, 35 శాతానికి మించకుండా నివాసేతర భవనాలపై ఆస్తి పన్నులను విధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాలపై మార్కెట్ విలువలో 0.20 శాతాన్ని ఆస్తి పన్నుగా విధిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటా సర్వే జరిపి శాస్త్రీయ పద్ధతుల్లో తీసుకున్న కొలతల ఆధారంగా ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసులను ప్రజలకు అందజేస్తారు. -
పెంచిన పన్ను రద్దు చేయకపోతే ఉద్యమబాట
బెంగళూరు(బనశంకరి) : నగరంలో పెంచిన ఆస్తిపన్నును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్రపోరాటం చేస్తామని మాజీ డిప్యూటీసీఎం ఆర్.అశోక్ హెచ్చరించారు. బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు సుబ్బణ్ణ, బీబీఎంపీ విపక్షనేత పద్మనాభరెడ్డి, మాజీ మేయర్లు కట్టెసత్యనారాయణ, శాంతకుమారి తదితరులతో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లులో నగరప్రజలపై ఆరుసార్లు పన్ను భారం మోపిన సీఎం సిద్దరామయ్య తుగ్లక్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు నగర ప్రజలు మండేఎండలకు భయపడటం లేదని బీబీఎంపీ విధించిన ఆస్తిపన్నుతో భయపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే నీరు, విద్యుత్, పాలు, బస్చార్జీలు పెంచారని ప్రస్తుతం ఆస్తిపన్ను పెంచడం కేఎంసీ చట్టానికి వ్యతిరేకంగా ఉందన్నారు. గతంలో రూ.10 వేలు ఆస్తిపన్ను చెల్లించేవారు ఇక రూ.50 వేలు చెల్లించాల్సిన పరిస్దితి ఏర్పడిందన్నారు. మొత్తం మీద 200 శాతం పైగా ఆస్తిపన్ను పెంచారని, దీంతో స్లం ప్రాంతాల్లో నివసించే పేదలపై కూడా భారం పడుతోందన్నారు. సిద్దరామయ్య ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్టాంపు డ్యూటీ నుంచి వచ్చే ఆదాయాన్ని పాలికెకు లభించకుండా చేశారన్నారు. దీంతో పాలికె కు వచ్చే రూ.300, 400 కోట్లు ఆదాయం నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం పెంచిన ఆస్తిపన్నును ఉపసంహరించకపోతే శుక్రవారం నిర్వహించే పాలికె సమావేశంలో నిరంతర ధర్నా చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే మే 3 తేదీన బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప నేతృత్వంలో భారీ ఉరేగింపు ద్వారా పాలికెను ముట్టడిస్తామని అశోక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జేడీయస్తో పొత్తు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అఖండవిజయం సాధించిందని ఇది రానున్న రాజకీయాలకు దిక్సూచి అని ఆర్.అశోక్ అన్నారు. జిల్లాపంచాయతీ అధ్యక్ష స్థాన ఎన్నికల్లో జేడీఎస్తో కలిసి పొత్తు పెట్టుకోవాలని తీర్మానించామన్నారు. దీనికోసం ఆ పార్టీ సీనియర్నేతలైన హెచ్డీ.కుమారస్వామి, కుమారస్వామి కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. బెంగళూరునగర, తుమకూరు, మైసూరు, రాయచూరు జిల్లాల్లో పొత్తు పై చర్చలు జరిపామని, శివమొగ్గ ఇతర ప్రాంతాల్లో పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. 30 జిల్లా పంచాయతీ స్దానాల్లో 15 స్ధానాలకు దక్కించుకుంటామని ఆర్.అశోక్ తెలిపారు. జేడీఎస్, బీజేపీ పొత్తుతో బీబీఎంపీలో కూడా అధికారంలోకి వస్తారా అని లేకరులు అడిగిన ప్రశ్నకు అర్.అశోక్ సమాధానమిస్తూ దీనిపై కూడా చర్చలు జరిపామన్నారు. ఇప్పటికే జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యతో మాట్లాడామని నూతన మేయర్ ఎన్నికకు ఇంకా నాలుగునెలలు సమయం ఉందని జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటామని ఆర్.అశోక్ తెలిపారు. -
ఆస్తి పన్ను ఆరగించేశారు !
బీబీఎంపీలో రూ. కోట్ల గోల్మాల్ మాజీ మేయర్ సహా పలువురు సభ్యుల వెల్లడి బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని ఆస్తిపన్ను వసూలు విషయంలో రూ.5,649 కోట్ల గోల్మాల్ జరిగినట్లు మాజీ మేయర్లు బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు ఎస్.కే నటరాజ్, కట్టె సత్యనారాయణలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదే పార్టీకి చెందిన నాయకులు, మాజీ ఉపమేయర్ ఎస్. హరీష్, మాజీ బీబీఎంపీ సభ్యుడు ఏ.హెచ్ బసవరాజ్తో కలిసి నగరంలో సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వసూలైన ఆస్తి పన్నును బ్యాంకులో జమ చేయడం తదితర విధుల కోసం గతంలో ఇండియన్ సెంటర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగించేవారన్నారు. ఈ నేపథ్యంలో 2012-13,2013-14 ఏడాదిలో బీబీఎంపీ పరిధిలో రూ.6,680 కోట్లు ఆస్తి పన్ను వసూలైందని, అయితే అందులో కేవలం రూ.1,031 కోట్ల మాత్రం బీబీఎంపీ ఖాతాల్లో జమైందని, మిగిలిన రూ.5,649 కోట్లకు సంబంధించి వివరాలు తెలియడం లేదని వివరించారు. ఇక ఆస్తి పన్ను చెల్లింపుల కోసం కొంతమంది డీడీలు, చెక్కులు ఇస్తారని అయితే వాటిలో 60 శాతం చెక్కుల బౌన్స్ కావడం, సంతకం సరిగా లేకపోవడంతో తదితర కారణాలతో చెల్లుబాటు కాలేదన్నారు. ఇలా చెల్లుబాటు కాని చెక్కులు, డీడీలు ఇచ్చిన వారి నుంచి తిరిగి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదని వారు పేర్కొన్నారు. ఇందుకు మెకానికల్ ఇంజనీర్ అయిన శేషాద్రిని బీబీఎంపీ ఐటీ విభాగం అధిపతిగా నియమించడమే ప్రధాన కారణమని, ఆయనను తొలగించి సమర్థుడైన అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆస్తిపన్ను వసూలు కోసం కావేరి పేరుతో నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్పై కూడా అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. అందువల్ల ఈ సాఫ్ట్వేర్ వినియోగాన్ని కూడా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీబీఎంపీలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 16 లక్షల ఆస్తులు ఉన్నట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిందన్నారు. అయితే ప్రస్తుతం బీబీఎంపీ పరిధిలో 10 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలిన ఆరు లక్షలు ఎక్కడికి వెళ్లినట్టు అని వారు ప్రశ్నించారు. ఆస్తుల సంఖ్య తగ్గిపోవడం వల్ల బీబీఎంపీ ఖజానాకు వేల కోట్ల గండి పడుతోందని పేర్కొన్నారు. నగరంలో 2వేలకు పైగా అనధికార అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉన్నాయన్నారు. అదే విధంగా 370 ఐటీ బీటీ కంపెనీలు వేలకొద్ది హాస్టల్స్, నర్సింగ్హోంలు ఆస్తిపన్ను చెల్లించడం లేదన్నారు. ఈ విషయమై ప్రతి ఏడాది కోట్లాది రుపాయలు చేతులు మారుతున్నాయని వారు ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్చేశారు. -
ఆస్తి పన్నుపై జీఐఎస్ కన్ను..!
♦ సాంకేతిక పరిజ్ఞానంతో ఆస్తి పన్ను ఎగవేతకు చెక్ ♦ తొలి విడతగా రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో అమలు ♦ పన్ను పరిధిలోకి రాని భవనాల గుర్తింపు ఇక సులభం సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లింపునకు ఎగనామం పెడితే.. ‘శాటిలైట్ కన్ను’ ఈజీగా పట్టేయనుంది. ఆస్తి పన్నుల గణన, వసూళ్లలో లోపాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ఆధారిత మ్యాపులను ఉపయోగించబోతోంది. నగర, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, వాణిజ్య సముదాయాల ఆస్తి పన్ను గణన కోసం తొలిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. తొలుత ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని సర్కారు అమలు చేయనుంది. ఆస్తి పన్నుల గణన జరగని భవనాలను గుర్తించి.. ఆస్తి పన్నుల పరిధిలోకి తేవడంతో పాటు ఉండాల్సిన మొత్తం కన్నా తక్కువ ఆస్తి పన్ను గల భవనాలను గుర్తించి పునఃగణన నిర్వహించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. తొలివిడతగా ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్నగర్ మున్సిపాలిటీల్లో జీఐఎస్ ఆధారిత ఆస్తి పన్నుల గణనను త్వరలో ప్రారంభించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధమైంది. ఈ మున్సిపాలిటీల కమిషనర్లకు ఈ నెల 13న హైదరాబాద్లో అవగాహన సదస్సును తలపెట్టింది. ఆస్తి పన్ను గణనలో లోపాల కారణంగా ఆస్తి పన్ను పరిధిలోకి రాని భవనాలు, చెల్లించాల్సిన మొత్తం కన్నా తక్కువ పన్ను చెల్లిస్తున్న భవనాలు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉంటాయని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సర్వేల్లో తేలింది. దీంతో మున్సిపాలిటీలకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. ఇకపై కచ్చితంగా అన్ని వర్గాల నుంచి ముక్కుపిండి ఆస్తి పన్ను వసూళ్లు జరిపేందుకే ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ దీనిని అమలు చేయనుంది. గణన ఇలా... తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు సంబంధించిన జీఐఎస్ ఆధారిత మ్యాపులను రాష్ట్ర పురపాలక శాఖ రూపొందిస్తోంది. ఉపగ్రహాల సహాయంతో తీసిన భూఉపరితల చిత్రాలను క్రోడీకరించి ఆయా నగరాలు, పట్టణాల పటాలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే పలు పట్టణాలకు సంబంధించిన జీఐఎస్ మ్యాపులు సిద్ధమయ్యాయి. పట్టణంలోని ఏ ప్రాంతంలో ఏ భవనం, ఏ రోడ్డు, ఏ మురికి కాల్వ ఎక్కడ ఉందో తెలుసుకునేలా సూక్ష్మమైన సమాచారం వీటిలో కనిపించనుంది. ఆస్తి పన్ను గణన జరగని భవనాలను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. అలాగే భవన నిర్మిత ప్రాంతం(ప్లింత్ ఏరియా) ఎంతో ఈ ఉపగ్రహ చిత్రాలు చెప్పేయనున్నాయి. భవన వాస్తవ నిర్మిత ప్రాంతం, ఆస్తి పన్ను పరిధిలో ఉన్న ప్రాంతాన్ని పోల్చి చూడనున్నారు. ఒక వేళ తక్కువ ప్రాంతానికి ఆస్తి పన్ను చెల్లిస్తున్నట్లు గుర్తిస్తే ఆయా భవనాలకు కొత్తగా కొలతలు స్వీకరించి ఆస్తి పన్ను గణన నిర్వహించనున్నారు. గణన అనంతరం పెరిగిన ఆస్తి పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను యజమానులకు అందజేస్తారు. -
వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : ఆస్తిపన్ను వసూలుకు ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో వందశాతం వసూలు చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో మున్సిపల్ కమిషనర్లతో ఆస్తి పన్ను వసూలు, ఐఎస్ఎల్ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. గ్రామాల్లో ఏప్రిల్ 15 వరకు, పట్టణాలలో ఏప్రిల్ 10 వరకు పన్ను వసూళ్లకు గడువు ఉందన్నారు. వార్డులవారీగా టీంలు ఏర్పాటుచేసి వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పన్నుల వసూళ్లకు సంబంధిత కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సహకారం తీసుకోవాలన్నారు. పన్నులు బకాయిలు ఎక్కువ ఉన్న రైస్మిల్లర్లు, ఫంక్షన్హాలు, పౌల్ట్రీఫాంలు తదితర వాటిపై ఒత్తిడి తెచ్చి వంద శాతం పన్నులు వసూలు చే యాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చాలాచోట్ల వంద శాతం వసూలు చేశారని, అంతకంటే తక్కువ పట్టణ ప్రాంతాలలో ఉండకూడదని సూచించారు. పట్టణ ప్రాంతాలలో వంద శాతం, ఐఎస్ఎల్ను నిర్మించాలని ఆదేశించారు. మెప్మా పీడీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యులపై శివతాండవం!
ఆస్తిపన్ను వసూళ్లలో అధికారుల ఇష్టారాజ్యం అధికారపార్టీ నేతలవైపు కన్నెత్తి చూడని వైనం చివరి రోజున రూ.24 కోట్ల వసూళ్లు స్తంభన ‘ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గీర్వాణి భర్త చంద్రప్రకాష్ పేరిట ఉన్న ఈ భవనం చిత్తూరు కార్పొరేషన్కు రూ.7.17లక్షల ఆస్తిపన్ను చెల్లించాలి. పన్ను బకాయిలు ఉంటే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదనే నిబంధన ఉండటంతో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్కు పన్ను చెల్లించారు. అప్పటి నుంచి రెండేళ్లుగా కార్పొరేషన్కు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. అత్యధిక బకాయిల జాబితాలో ఈ పెద్ద మనిషి పేరున్నా అధికారపార్టీ నాయకుడు కావడంతో ఏ అధికారీ ఆయనచేత పన్నుకట్టించే దైర్యం చేయలేకపోయారు.’ ..ఇలా పేదలకో న్యాయం.. పెద్దలకో ధర్మం ఎలా ఉంటుందో చిత్తూరు కార్పొరేషన్ అధికారులు స్పష్టంగా చూపించారంతే. మిగిలిన మునిసిపాలిటీల్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. జిల్లాలో ఆస్తిపన్ను వసూళ్లలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉదాసీనంగా వ్యవహరించాయి. మార్చి దగ్గరపడుతుందని ఊదరగొడుతూ ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తూ పన్నుల వసూళ్లకు పరుగులు పెట్టిన మునిసిపల్ అధికారులు రూ.లక్షల్లో బకాయిలు పడ్డ పెద్దల జోలికి వెళ్లలేదు. అందులోనూ టీడీపీకి చెందిన నాయకులు రూ.లక్షల్లో అప్పులున్నా వాళ్ల వద్దకువెళ్లి అడగలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో గురువారంతో 2015-16 ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియ పూర్తయింది. అయితే కేవలం మధ్య తరగతి కుటుంబాలు, నిరుపేదలు, సమాజంలో గౌర వం కోసం బతికేవాళ్లనే లక్ష్యంగా చేసుకుని పన్నులు వసూలు చేశారే తప్ప పెద్దమనుషులుగా, అధికారపార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్లు రూ.లక్షల్లో బకాయిలు పడ్డా పట్టించుకోలేదు. ఇలా జిల్లాలో మొత్తం రూ.24 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాకుండా స్తంభించిపోయింది. పుత్తూరు టాప్.. ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలో పుత్తూరు మునిసిపాలిటీ ముందజంలో నిలిచింది. ఇక్కడ గత గురువారం నాటికి మొత్తం రూ.1.39 కోట్లు (99 శాతం)వసూలయిం ది. తరువాతి స్థానాల్లో పుంగనూరు రూ.3.15 కోట్లు(83 శాతం), పలమనేరు రూ.1.25 కోట్లు(82 శాతం), తిరుపతి కార్పొరేషన్ రూ. 31.66 కోట్లు(80 శాతం), శ్రీకాళహస్తి రూ.3.58 కోట్లు (73 శాతం), మదనపల్లె రూ.6.62 కోట్లు (63 శాతం) చిత్తూరు రూ.10.10 కోట్లు (60 శాతం) వసూలు చేసింది. అన్నింటికంటే అట్టడుగులో నగరి మునిసిపాలిటీ రూ.63 లక్షలు వసూలుచేసి 19 శాతం వసూళ్లతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. -
ఆస్తి పన్ను వసూలులో ఫస్ట్
పన్నుల వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం సత్తాచాటింది. రాష్ర్టస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి 98.81 శాతం పన్నులు వసూలు చేసి శెభాష్ అనిపించుకుంటున్నారు. బొబ్బిలి: పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని పురపాలక సంఘాల్లో కంటే బొబ్బిలిలో ఈ ఏడాది 98.81 శాతం పన్నులు వసూలు చేశారు. ఏటా మార్చి నెలకు పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. కోర్టు కేసులు, ప్రభుత్వ భవనాలు వంటి కారణాలతో వసూలులో జాప్యం ఉంటుంది. అయినా బొబ్బిలిలో మాత్రం 98 శాతం దాటి పన్నులు వసూలు చేయడంతో ఉద్యోగులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కమిషనర్ హెచ్.శంకరరావు, ఆర్వో రమేష్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఇలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. లక్ష్యం రూ.4.72 కోట్లు.. సాధించింది రూ.4.66 కోట్లు పట్టణంలో 11,767 ఇళ్లు ఉన్నాయి. వాటి ద్వారా 4 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో రూ.4 కోట్ల 66 లక్షలు వసూలు చేసి 98.81 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచా రు. ప్రతి వార్డుకు కొన్ని బృందాలను నియమించి బకాయిలు లేకుండా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేశా రు. మొండి బకాయిదారుల వద్దకు కమిషనర్ శంకరరావుతో పాటు అధికారులు వెళ్లి అవగాహన కల్పించి అక్కడికక్కడే వసూలు చే శారు. ప్రత్యేక వ్యాను ద్వా రా ఉద్యోగులు ఊరంతా తిరిగి మైక్ ద్వారా ప్రచారం చేసి వసూలు చే యడంలో సఫలీకృతమయ్యారు. ఏటా మార్చి నెలాఖరు న పన్ను చెల్లింపుల్లో వడ్డీ రాయితీ ఇవ్వడం ప్రభుత్వం అలవాటు చేసింది. రెండేళ్లుగా ఆ పద్ధతి లేకపోవడంతో ఆఖరి నిమిషం వరకూ బకాయిదారులకు, ఆశతో ఉండేవారికి మున్సిపల్ ఉద్యోగులు కల్పించారు. అలాగే బకాయిలు కట్టడానికి పదే పదే తిప్పుతున్న వారింటికి వెళ్లి దండోరా మంత్రం ప్రయోగించడం కూడా ఫలితమిచ్చింది. సమష్టి కృషికి ఫలితమిది... బొబ్బిలి పురపాలక సంఘ ఉద్యోగుల సమష్టి కృషికి ఫలితమిది. లక్ష్యాలను ముందు నుంచి చేరుకోవాలని ప్రణాళిక ప్రకారం వెళ్లాం. రాత్రింబవళ్లు కష్టపడ్డాం. రాజకీయ నాయకులు పన్నులు చెల్లించడానికి పూర్తిగా సహకరించారు. పట్టణ ప్రజలు కూడా పన్నుల చెల్లింపునకు ముందుకొచ్చారు. -హెచ్.శంకరరావు, కమిషనర్, బొబ్బిలి -
ఎమ్మెల్యే చొరవతోనే ఆస్తి పన్ను తగ్గింపు
{పజలను తప్పుదోవ పట్టించడం సరికాదు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మార్నేని వెంకన్న మహబూబాబాద్ : ఆస్తిపన్ను తగ్గింపు విషయంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చొరవ తీసుకున్నారని, ఆయన కృషితోనే ఆస్తి పన్ను తగ్గిందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మార్నేని వెంకన్న అన్నారు. స్థానిక టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్షన్ 81 ప్రకారం ఆస్తిపన్ను తగ్గే అవకాశం ఉందని సూచించినందునే మున్సిపాలిటీలో తీర్మాణం చేసి ఆస్తిపన్నును తగ్గించినట్లు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సీడీఎంఏతో మాట్లాడి మాట్లాడినట్లు గుర్తు చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు ఎమ్మెల్యేను హేళన చేసే విధంగా మాట్లాడడం సరికాదని సూచించారు. కొన్ని పార్టీల నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యేను బదనాం చేయడం సరికాదన్నారు. అందరి సమష్టి కృషితోనే చివరికి ఆస్తిపన్ను తగ్గించుకోగలిగామన్నారు. వార్డు కౌన్సిలర్ ఫరీద్ మాట్లాడుతూ.. ఆదాయం పెంచాలనే ఉద్దేశ్యంతో అధికారులు తీర్మానం ప్రవేశపెట్టడం, చైర్పర్సన్ అవగాహనలోపంతోనే ఆస్తిపన్నుపై తీర్మానం చేసినట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్న, చౌడవరపు రంగన్న, పొనుగోటి రామకృష్ణారావు, నిమ్మల శ్రీనివాస్, భూక్య ప్రవీణ్, తూము వెంకన్న, ఆదిల్, చిట్యాల జనార్ధన్, పోతురాజు, చాంద్, ఎక్బాల్, నీలేష్రాయ్, కమలాకర్, చెట్ల జయశ్రీ, ఇబ్రహీం, పెద్దబోయిన కృష్ణ, కొండ భిక్షం, తదితరులు పాల్గొన్నారు. -
కలెక్షన్లు అదుర్స్
► 104 శాతం మేర ఆస్తిపన్ను వసూలు ► ఫలించిన స్పెషల్ డ్రైవ్ ఖాళీ స్థలాలు, ► మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఆస్తిపన్ను వసూళ్లు అంచనాలకు మించాయి. నూరుశాతం పన్ను వసూళ్ల కోసం కమిషనర్ జి.వీరపాండియన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాన్నిచ్చింది. మున్నెన్నడూ లేని విధంగా ఆస్తిపన్ను 104 శాతానికి(పాతబకాయిలుతో కలిపి)చేరింది. డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్ఓ)ట్రేడ్ లెసైన్స్లు 96 శాతం మేర వసూలయ్యాయి. సీవరేజ్, నీటి పన్నులు కూడా అదేవరుసలో నిల్చాయి. ఖాళీస్థలాల పన్ను వసూళ్లు మాత్రం మొరాయించాయి. రూ.58.39 కోట్లకుగాను రూ.8.35 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వీటి వసూళ్లకు ఈనెల మొదటి వారం నుంచి మరోమారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. నిరంతరం సమీక్ష కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టి లో ఉంచుకొని కమిషనర్ జి.వీరపాండియన్ నూరుశాతం పన్ను వసూ లు లక్ష్యంగా నిర్ణయించారు. రెవెన్యూ విభాగంతోపాటు ప్రజారోగ్య, ఎస్టే ట్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, యూసీడీ తదితర శాఖల సిబ్బందికి పన్ను వసూళ్ల బాధ్యత అప్పగించారు. అవకాశం ఉన్నప్పుడల్లా రాత్రి 9 తరువాత సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఫిబ్రవరి నాటికి 80 శాతం ఆస్తిపన్ను వసూలైంది. అదే స్పీడ్ కొనసాగించాల్సిందిగా రెవెన్యూ సిబ్బందికి సూచించారు. నూరుశాతం పన్నులు వసూలు కాకుంటే సంబంధిత ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేస్తానని, మార్చినెల జీతం నిలుపుదల చేస్తామంటూ హెచ్చరించారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేశారు. లక్ష్యాన్ని అధిగమించారు. కోర్టు కేసులు, మొండిబకాయిలు కలిపి మరో రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.22 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. వీటిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలనే యోచనలో కమిషనర్, మేయర్ ఉన్నారు. ఫలించిన మినహాయింపు డీఅండ్ఓ ట్రేడ్ లెసైన్స్లకు సంబంధించి యూజర్ చార్జీలను మినహా యించారు. సుమారు కోటిన్నర మినహాయింపు రావడంతో వ్యాపారులు ట్రేడ్లెసైన్స్లు కట్టేందుకు ముందుకువచ్చారు. 96 శాతం మేర ఫీజులు వసూలయ్యాయి. మిగిలిన నాలుగు శాతానికి సంబంధించి శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లో ఫీజులు చెల్లించకుంటే షాపు ల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొరుకుడుపడని ఖాళీస్థలాలు పన్ను వసూళ్లలో దూకుడు ప్రదర్శించిన అధికారులు ఖాళీస్థలాల విషయంలో చతికిలపడ్డారు. నగరంలో 14 వేల ఖాళీస్థలాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.58,39,50,480 బకాయిలు రావాల్సి ఉండగా, రూ. 8,35,92,419 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. స్థలాల యజమానులు, చిరునామాలను గుర్తించడం కష్టతరంగా మారిందన్నది ఉద్యోగుల వాదన. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో కమిషనర్ ఉన్నారు. -
‘లక్ష్యం’ సాధించారు...
గ్రేటర్లో రూ.1010 కోట్ల ఆస్తి పన్ను వసూళ్ళు ► గ్రేటర్లో ప్రభుత్వ శాఖలు కళకళ ► ఆదాయం, పన్నుల వసూళ్లలో ముందంజ ► రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసిన జీహెచ్ఎంసీ ► హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు ఈ ఆర్థిక సంవత్సరం(2015-16)లో గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ఆదాయం పరంగా లక్ష్యాలను సాధించాయి. కొన్ని శాఖలు లక్ష్యానికి చేరువలో ఉండగా..కొన్ని పూర్తి స్థాయిలో టార్గెట్ను పూర్తిచేశాయి. ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ ముందంజలో ఉంది. లక్ష్యాన్ని మించి పన్నులు వసూలయ్యాయి. ఇక ఆబ్కారీ శాఖ సైతం లక్ష్యాన్ని మించి ఆదాయం పొందింది. వాణిజ్య పన్నుల శాఖ రాబడి బాగానే ఉంది. ఆర్టీఏ 85 శాతం లక్ష్యం సాధించగా..ఈసారి రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం మాత్రం కాస్త నిరాశాజనకంగా ఉంది. జలమండలి కూడా ఈ ఏడాది లక్ష్యాన్ని మించి రెట్టింపు ఆదాయం పొందింది. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం అర్ధరాత్రి వరకు రూ.1010 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశారు. ఆస్తిపన్ను చెల్లింపులకు అర్ధరాత్రి వరకు గడువున్నందున మరో రూ. 30 కోట్లు వచ్చే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి తెలిపారు. గత (2014-15) ఆర్థిక సంవత్సరం రూ. 1063 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ సంవత్సరం రూ.1065 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, రూ.1200 లోపు ఆస్తిపన్ను వారికి ప్రభుత్వం మాఫీ చేయడంతో దాదాపు రూ. 88 కోట్లు కోత పడిందని పేర్కొన్నారు. అందుకనుగుణంగా వసూళ్ల లక్ష్యాన్ని కూడా రూ. 977 కోట్లకు తగ్గించారు. ఈ లెక్కన లక్ష్యాన్ని అధిగమించామని జీహెచ్ఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మార్చినెల ఒకటో తేదీ నుంచి 31 వరకు రూ. 351 కోట్ల ఆస్తిపన్ను వసూలు కాగా, ఈ సంవత్సరం రూ.375 కోట్లు వసూలైందని అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) జె.శంకరయ్య తెలిపారు. పూర్తి లెక్కలు తేలేవరకు మరో రూ.15 కోట్ల వరకు రావచ్చని అంచనా. ఆస్తిపన్ను వసూళ్ల కోసం గతంలో ఇళ్ల ముందు చెత్త డబ్బాలు ఉంచడం వంటి చర్యలకు పాల్పడ్డా.. ఈసారి పరస్పర సంప్రదింపులు, ఎస్సెమ్మెస్లు వంటి పద్ధతులతోనే ఇంత భారీ లక్ష్యం సాధించడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో ఈసారి దుందుడుకు చర్యలకు దిగలేదు. 2012-13లో రూ. 779 కోట్లు వసూలు కాగా, 2013-14లో ఏకంగా రూ. 1020 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం రూ. 1464 కోట్ల లక్ష్యం పెట్టుకోగా, రూ. 1463 కోట్లు వసూలయ్యాయి. గత సంవత్సరం పాత బకాయిలపై పెనాల్టీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ఎన్నికలు, బీసీ గణన, వార్డుల పునర్విభజన తదితర కార్యక్రమాలతో సిబ్బంది మొత్తం ఆ పనుల్లో తలమునకలయ్యారు. ఫిబ్రవరి వరకు ఆస్తిపన్ను వసూళ్లపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. గత నెలన్నర రోజులుగా మాత్రం విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలను.. దిగువస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరినీ ఆస్తిపన్ను వసూళ్లకు నియమించారు. ఉన్నతాధికారులకు సూపర్వైజర్ బాధ్యతలప్పగించారు. భారీ బకాయిలున్న గృహయజమానులు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు. కమిషనర్ సైతం పలు సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపారు. అంచనాలను మించిన ‘కిక్కు’... సాక్షి, సిటీబ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం గ్రేటర్ ఆబ్కారీశాఖకు కాసుల పంట పండినట్లేనని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈసారి ఆబ్కారీశాఖ అంచనాలకు మించి అమ్మకాల్లో వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. గతేడాది(2014-15)సంవత్సరంతో పోలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో నగర ఆబ్కారీశాఖ ఆదాయంలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నాయి. ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాల్లో 20 శాతం ఆదాయం అధికమని పేర్కొన్నాయి. మొత్తంగా ఈ గత ఏడాదిగా హైదరాబాద్, సికింద్రాబాద్, ధూల్పేట్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించామన్నారు. కాగా గ్రేటర్ పరిధిలోని సుమారు 400 మద్యం దుకాణాలు, మరో 500 బార్లలో అమ్మకాల కిక్కు ఊపందుకుందని తెలిపారు. లక్ష్యానికి చేరువైన ఆర్టీఏ 85 శాతం ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ఆదాయం ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యానికి చేరువలో ఉంది. కొత్తవాహనాలపై వచ్చే జీవితకాల పన్ను, రవాణా వాహనాలపైన త్రైమాసిక పన్ను, తదితర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకున్నట్లు ఆర్టీఏ రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.858.62 కోట్ల టార్గెట్ నిర్దేశించగా, ఈ నెలాఖరు నాటికి రూ.761 కోట్ల ఆదాయం లభించింది. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలో రూ.676.69 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.574.22 కోట్ల ఆదాయాన్ని సముపార్జించారు. ద్విచక్రవాహనాలు, కార్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో రవాణాశాఖ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది సుమారు 46 లక్షల వాహనాలు నమోదు కాగా, వాటిలో 30 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, మరో 8 లక్షల కార్లు ఉన్నాయి. జీవితకాల పన్ను రూపంలోనే పెద్దమొత్తంలో ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. జలమండలికి రికార్డు ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి తాగునీటి కటకట లేకుండా చేస్తున్న బోర్డు 2015-16 సంవత్సరానికి రూ.1129.42 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా...దాన్ని మించి ఏకంగా 1237.88 కోట్ల ఆదాయం పొందింది. గతేడాది 1213.40 కోట్లు రాగా, ఈసారి దాన్ని మించి ఆదాయం సమకూరడం పట్ల జలమండలి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2013-14లో 858.09 కోట్లు, 2012-13లో 756.33 కోట్లు ఆదాయం వచ్చింది. వాణిజ్య రాబడి కీలకం.. సాక్షి, సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ మహా నగర రాబడి అత్యంత కీలకం. వాణిజ్య పన్నుల శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, మహానగరంలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి ద్వారానే అత్యథికంగా ఆదాయం సమకూరుతోంది. మాహ నగరంలోని ఏడు డివిజన్ల ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.21 వేల కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ.17 వేల కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను), సీఎస్టీ తదితర పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత వరకు రాబడి లభిస్తుంది. మొత్తం రాబడిలో ఒక వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతంపైగా, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది.. రిజిస్ట్రేషన్ శాఖ రాబడి అంతంతే.. ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నుంచి అదాయం రాబడి అధికంగా నే ఉంటుంది రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు(డీఆర్)లు ఉండగా అందులో మహానగరం పరిధిలోనే నాలుగు డీఆర్లు ఉన్నాయి. మొత్తం మీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాట 68.89 శాతం వరకు ఉంటుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 2360 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా మార్చి చివరి నాటికి రూ. 1896.58 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. -
లక్ష్యం చేరేనా...!
► ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ వెనుకబాటు ► గడువు రెండు రోజులే.. లక్ష్యం రూ.200 కోట్లు ► పన్ను మాఫీతో రూ.90 కోట్లకు గండి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ వెనకబడి పోయింది. ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ ప్రకటించినా ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది వసూళ్లను పోలిస్తే దాదాపు రూ. 200 కోట్ల పైగా వెనుకబడినట్లు తెలుస్తోంది. గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో వసూళ్లలోలో వేగం పేంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో సుమారు 1,063 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా, 2015-16 గాను ఇప్పటి వరకు వసూళ్లు రూ.865 కోట్లను మించలేదు. వాస్తవంగా ఈసారి గతేడాది వసూళ్ల మొత్తాన్ని లక్ష్యంగా నిర్థేశించినప్పటికి ప్రగతి సాధించలేక పోయారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రూ.1200లోపు ఆస్తి పన్నును మాఫీ చేయాలన్న నిర్ణయించడంతో సుమారు రూ.90 కోట్ల ఆదాయానికి గండి పడింది. బడా సంస్థలపై దృష్టి.. వసూళ్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో పన్ను చెల్లించని బడా సంస్థలు,వ్యాపార,వాణిజ్య సంస్థలకు వారంట్లు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మొండి బకాయిదారుల కార్యాలయాలను సీజ్ చేస్తున్నారు. నగరంలోని ప్రతి సర్కిల్లో అధిక మొత్తంలో అస్తిపన్ను చెల్లించాల్సిన పది టాప్ డిఫాల్టర్లను గుర్తించి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా వారిని సంప్రదించి పన్నులు చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు బుధ, గురు వారాల్లో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నందున సర్కిల్ కార్యాలయాల్లో, సిటీజన్ సర్వీస్ కేంద్రాల్లో అదనపు కౌంటర్ల ఏర్పాటు చేయడమేగాక పని వేళలను పెంచేం దుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసినా స్పందిచకపోవడంతో చార్మినార్ 4వ సర్కిల్లోని ఐజా కళాశాలను సీజ్ చేశారు. నల్లకుంటలోని రెస్టారెంట్, రాజేంద్రనగర్ బండ్లగూడలోని పలు ఫంక్ష న్ హాళ్లను మూసి వేశారు. -
హోటళ్లపై జీహెచ్ఎంసీ దాడులు
హైదరాబాద్ : ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా నడుపుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లపై జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. మలక్పేట్లోని సిగ్నేచర్ బార్ యాజమాన్యం రూ.6 లక్షల ప్రాపర్లీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో బార్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలోని స్వాగత్ హోటల్ యాజమాన్యం రూ.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో హోటల్ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. -
పట్టణ ప్రజలపై వడ్డీ భారం
కట్టకపోతే తాళం వేస్తున్న మున్సిపల్ సిబ్బంది ♦ జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల బాదుడు ♦ ఒంగోలు కార్పొరేషన్లోనే రూ.17 కోట్లు ♦ మినహాయింపు ఊసెత్తని ప్రభుత్వం ♦ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు, అర్బన్: పట్టణ ప్రజలపై వడ్డీ భారం పెరిగిపోతోంది. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించలేదన్న పేరుతో అపరాధ రుసుం పేరుతో నూటికి నెలకు రెండు రూపాయల వడ్డీని వేస్తున్నారు. దీంతో ఆస్తిపన్ను బకాయిలు పెరిగిపోతున్నాయి. దీనిపై పలువురు కోర్టులను ఆశ్రయించగా మిగిలిన వారు ప్రభుత్వం మినహాయింపు ఇస్తే కడతామని కరాఖండిగా చెబుతున్నారు. జిల్లాలో సుమారు 20 కోట్లు రూపాయలపైనే వడ్డీ రూపంలో భారం పడుతున్నట్లు సమాచారం. ఇందులో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లోనే వడ్డీ భారం రూ. 17 కోట్లు ఉంది. ఇది తలకుమించిన భారంగా మారుతోందని టాక్స్పేయర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్నులు కూడా అడ్డదిడ్డంగా ఒక శాస్త్రీయ పద్దతి లేకుండా వేయడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసి చెల్లించకుండా ఆపారు. కనీస వసతులు పట్టించుకోకుండా పన్ను చెల్లించని తేదీ నుంచి నెలకు వందకు రెండు రూపాయల వడ్డీ చొప్పున వేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల అసలుకన్నా వడ్డీ ఎక్కువయ్యే పరిస్థితులున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది పన్నులు వసూలు చేయడంలో నగరపాలక సిబ్బంది నిర్లక్ష్యం వహించి డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వని సందర్భాలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఒంగోలులో నగరపాలక సిబ్బంది బృందాలుగా ఏర్పడి పన్నులు చెల్లించని వారి ఆస్తులకి తాళాలు వేస్తున్నారు. పన్నులపై వడ్డీ రాయితీ ఇస్తే పన్నులు కడతామని నగరవాసులు అంటున్నా ఉన్నతాధికారులు మాత్రం అటువంటి అవకాశం లేదని స్పష్టం చేయడంతో అయోమయ పరిస్థితులు నెలకున్నారుు. ♦ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ అస్తులకి సంబంధించిన పన్నులు రూ.6 కోట్లు పైబడి ఉన్నాయి. ప్రజలకి సంబంధించి రూ.21 కోట్లున్నాయి. మొత్తం రూ.27 కోట్లు పన్నుల రూపంలో ఉంటే మరో రూ.17 కోట్లు వడ్డీ రూపంలో ప్రజలపై భారంగా భయపెడుతోంది. ♦ మార్కాపురంలో మొత్తం అసెస్మెంట్లు 13,744 ఉండ గా డిమాండ్ రూ.3.61 కోట్లుంది. ఇప్పటికి రెండున్నర కోట్ల రూపాయల వరకూ వసూలు కాగా కోటీ 15 లక్షలు వసూలు కావల్సి ఉంది. సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో ఉన్నట్లు అంచనా. ♦ గిద్దలూరు నగరపంచాయతీలో బకాయిలు కోటీ 23 లక్షలుండగా 67 లక్షలు వసూళ్లయ్యాయి. సుమారు నాలుగు లక్షల రూపాయలు వడ్డీల రూపంలో నగర ప్రజలు చెల్లించాల్సి ఉంది. ♦ అద్దంకి మున్సిపాలిటీలో కోటీ 72 లక్షల రూపాయలు ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా, 67.5 లక్షలు వసూలైంది. మూడు లక్షల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ♦ కందుకూరు మున్సిపాలిటీలో ఐదు కోట్ల 30 లక్షల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 2.15 కోట్లు వసూలు చేశారు. వడ్డీ రూపాయలో చెల్లించాల్సింది2.46 కోట్లు. మిగిలిన మున్సిపాలిటీలలో కూడా వడ్డీలు భారీగానే ఉన్నాయి. ♦ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ రాయితీ ఇస్తే ప్రజలకు మేలు జరగడంతోపాటు మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను త్వరగా వసూలయ్యే అవకాశం ఉంది. -
చెక్కు...చిక్కు!
చెల్లని చెక్కులతో అధికారులకు ఇక్కట్లు ఆస్తిపన్ను వసూళ్లలో కొత్త తలనొప్పులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులకు ‘చెక్కు’లు చుక్కలు చూపిస్తున్నాయి. పన్నుల చెల్లింపునకు కొంతమంది ఇస్తున్న చెక్కులు చెల్లడం లేదు. వాటిని అందుకునేటపుడు సంతోషిస్తున్న అధికారులు... తీరా అవి బౌన్స్ అవుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి అందిన చెక్కుల్లో దాదాపు రూ.150 కోట్ల మేర చెల్లనివి ఉన్నట్లు తెలిసింది. చెక్కుల రూపంలో పన్ను చెల్లించిన వారిలో సుమారు 27,600 మంది ఇచ్చినవి బౌన్సయ్యాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ లాయర్ నోటీసులు పంపించగా... రూ.137 కోట్లు తిరిగి వసూలయ్యాయి. ఇంకా రూ.13 కోట్లు రావాల్సి ఉంది. మరో 3,650 మంది నుంచి పన్నులు వసూలు కావాల్సి ఉంది. లాయర్ నోటీసులిప్పించేందుకు జీహెచ్ఎంసీ ఒక్కో కేసుకు దాదాపు రూ.135 ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని సంబంధిత వ్యక్తులనుంచే వసూలు చేయనున్నారు. ఆస్తిపన్ను చెల్లించామని చెప్పి కొంతకాలం తప్పించుకునేందుకు సదరు వ్యక్తులు ఇలా జీహెచ్ఎంసీకి టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. లాయర్ నోటీసులతో బెంబేలెత్తి తిరిగి చెల్లింపులు ప్రారంభించారు. ఇలాంటి చెల్లని చెక్కులు ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ నెల దాటితే కానీ తెలియదు. చెక్బౌన్స్ కేసుల్లో ఎక్కువ మొత్తం రావాల్సిన సర్కిళ్లలో ఖైరతాబాద్, అబిడ్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1100 కోట్లు. ఇప్పటి వరకు దాదాపు రూ.790 కోట్లు వసూలయ్యాయి. మిగతా టార్గెట్ పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు శ్రమిస్తున్నారు. మిగిలిన పది రోజుల్లో ఎంతమేరకు లక్ష్యం సాధిస్తారనేది వేచి చూడాలి. -
అసెంబ్లీలో ఆస్తిపన్ను అంశం లేవనెత్తుతాం
సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావు పార్టీ ఆధ్వర్యంలో మానుకోటలో ఒక రోజు ఆందోళన మహబూబాబాద్ : మున్సిపాలిటీలో పెంచిన ఆస్తిపన్నును తగ్గించాలనే అంశాన్ని అసెంబ్లీ లో లేవనెత్తుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావు అన్నారు. ఆస్తిపన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మానుకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం 24 గంటల నిరవధిక ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్నాయక్ భూ కబ్జాలు, సెటిల్మెంట్లకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఆస్తిపన్ను తగ్గిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో పన్ను తగ్గింపుపై అక్కడి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని, మానుకోట ఎమ్మెల్యేకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే అక్కడ పన్ను తగ్గించారని తెలిపారు. మానుకోటలో ఎక్సైజ్ సుంకం, ఇతర ట్యాక్స్ల పేర వ్యాపారులపై భారం మోపడం కూడా సరికాదన్నారు. సీపీఐ మున్సిపల్ ఫ్లోర్లీడర్ బి.అజయ్ ఎమ్మెల్యే హామీ మేరకే పన్ను తగ్గింపుపై కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మాణం చేశారని తెలిపా రు. కౌన్సిలర్లు దాస్యం రామ్మూర్తి, మహ్మద్ ఫాతిమా, నాయకులు పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, నర్ర శ్రావణ్, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, వీరవెల్లి రవి, జటంగి శ్రీశైలం, బోళ్ల కిష్టయ్య, కిషోర్ పాల్గొన్నారు. -
రూ.110కోట్ల పన్నుల వసూలు లక్ష్యం
♦ మార్చి నెలాఖరు వరకు స్పెషల్డ్రైవ్ ♦ జిల్లా పంచాయతీ అధికారి అరుణ శంషాబాద్ రూరల్ : జిల్లాలో రూ.110 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అరుణ తెలిపారు. మండలంలో పన్ను వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లతో ఆమె గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్ష్యం మేరకు వసూళ్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు రూ.166కోట్ల ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా.. రూ.110కోట్ల వసూళ్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ.87కోట్లు ఆస్తిపన్ను వసూలు అయిందని, గత ఏడాది 104కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. పంచాయతీల్లో కంప్యూటరీకరణకు చర్యలు తీసుకుంటామని, దీంతో పారదర్శకంగా పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు. విద్యా సంస్థల నుంచి రావాల్సిన పన్ను బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు రోజువారి పన్ను వసూళ్ల వివరాలను తన సెల్కు మెసేజ్ ద్వారా పంపించాలని ఆదేశిం చారు. అంతకుముందు ఆమె ముచ్చింతల్ పంచాయతీలోని ‘జీవా’ ప్రాంగణాన్ని సందర్శించారు. జీవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ నిర్మించిన కట్టడాలకు పన్ను నుంచి మినహాయించాలని వచ్చిన అభ్యర్థన మేరకు డీపీఓ అరుణ భవన నిర్మాణాలను పరిశీ లించినట్లు సమాచారం. -
నగరానికి నజరానా
⇒బడ్జెట్లో సింహభాగం కేటాయింపు ⇒అన్ని రంగాల బలోపేతానికీ పెద్దపీట స్వావలంబన దిశగా జీహెచ్ఎంసీ.. ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచి, వివిధ మార్గాల ద్వారా తగిన రాబడి ఉన్న జీహెచ్ఎంసీ.. తన ఆదాయాన్ని మరింతగా పెంచుకోగలదనే అంచనాతోనే బడ్జెట్లో దీనికి ప్రత్యేకంగా కేటాయింపులు చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సంవత్సరం బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ల ద్వారానే జీహెచ్ఎంసీకి దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆదాయం రానుంది. ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వాస్తవిక దృక్పథంతో వ్యవహరించిందనే పలువురు భావిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎస్సార్డీపీ పనులకు సంబంధించి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోనున్నందున వాటిని జీహెచ్ఎంసీ కేటాయింపుల్లో చూపలేదని భావిస్తున్నారు. అంతర్గత వనరుల సంపూర్ణ వినియోగంతో మరింత స్వావలంబన దిశగా పయనిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి అన్నారు. అవసరమైతే మాత్రం నిధుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తామన్నారు. మోడల్ వూర్కెట్లు, వుల్టీ పర్పస్ ఫంక్షన్హాళ్లు, తదితర పనులను జీహెచ్ఎంసీ నిధులతోనే చేపడుతుండడం తెలిసిందే. మెట్రోకు రూ.200 కోట్లు నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఈ ఏడాది జూన్లో ప్రారంభం కానున్న నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్.ఆర్.నగర్ రూట్లలో రహదారుల విస్తరణ, సుందరీకరణ, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాల కల్పన, పార్కింగ్ వసతుల కల్పనకు వెచ్చించనున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్ల మేర ప్రతిపాదనలను హెచ్ఎంఆర్ ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ సర్కారు రూ.200 కోట్లతో సరిపెట్టడం గమనార్హం. గతేడాది వార్షిక బడ్జెట్లో హెచ్ఎంఆర్కు రూ. 416 కోట్లు కేటాయించిన విషయం విదితమే. వైద్యరంగం బలోపేతం గ్రేటర్ వైద్యంపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న రోగుల అ వసరాలు తీర్చేందుకు నెదర్లాండ్స్ ఆర్థిక సహకారంతో నగరానికి నాలుగు వైపులా నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్టు ప్రకటించింది. కింగ్కోఠి జిల్లా ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయడంతో పాటు శివారులో ఎల్బీనగర్-నాగోల్, ఉప్పల్-మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్-కూకట్పల్లి, రాజేంద్రనగర్-మెహిదీపట్నం మధ్యలో కొత్తగా నాలుగు ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నుట్టు పేర్కొంది. రూ. 600 కోట్లు ఖర్చుతో బోధనాస్పత్రులకు అధునాతన వైద్య పరికరాలు సమకూర్చనున్నట్లు స్పష్టం చేసింది. 40 రో గ నిర్థారణ కేంద్రాలు, 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనుండగా, వీటిలో సింహభాగం గ్రేటర్కే దక్కనున్నాయి. ఇదిలా ఉంటే గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఏ ఒక్క ఆస్పత్రిలోనూ సగానికి మించి మంజూరు చేయక పోవడం గమనార్హం. నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులు సహా అనుబంధ ఆస్పత్రులకు ఈసారి బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఉస్మానియా వైద్య కళాశాలలో కొత్త భవనాల కోసం రూ.189 కోట్లు కేటాయించగా, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి రూ. 29.04 కోట్లు, బీబీనగర్ నిమ్స్ అభివృద్ధికి రూ. 40 కోట్లు కేటాయించారు. జలమండలికి రూ.వెయ్యి కోట్లు.. వార్షిక బడ్జెట్లో ప్రణాళికేతర పద్దు కింద జలమండలికి రూ.వెయ్యి కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది జలమండలి రూ.1750 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను సర్కారుకు సమర్పించింది. కానీ ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్లోనూ ప్రభుత్వం జలమండలికి వెయ్యి కోట్ల మేర నిధులను కేటాయించిన విషయం విదితమే. కాగా ఈ నిధుల్లో రూ.750 కోట్లు కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలకు తీసుకున్న రుణాలు, వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, మిగిలిపోయిన పనులు చేపట్టేందుకు వెచ్చించనున్నారు. మరో రూ.100 కోట్లతో ఔటర్ రింగురోడ్డుకు లోపలున్న గ్రామ పంచాయతీల పరిధిలో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మరో రూ.150 కోట్లతో ప్రధాన నగరం, శివార్లలో మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థల ఆధునికీకరణ, మరమ్మతులకు ఖర్చు చేయనున్నారు. ఔటర్ రింగ్రోడ్డు లోపలున్న 190 గ్రామ పంచాయతీల పరిధిలో మంచి నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు రూ.606 కోట్లు అవసరముండగా.. ప్రభుత్వం రూ.100 కోట్లతో సరిపెట్టింది. జీహెచ్ఎంసీ నుంచే ఆర్టీసీ నష్టాల భర్తీ ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఆర్టీసీ నష్టాలను ఇక నుంచి జీహెచ్ఎంసీయే భరించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా గతంలో రూ.120 కోట్ల మేర జీహెచ్ఎంసీ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది నమోదైన రూ.275 కోట్ల ఆర్టీసీ నష్టాలను సైతం జీహెచ్ఎంసీయే భరించనున్నట్టు తెలిపారు. సుమారు 3800 బస్సులతో ప్రతి రోజు 32 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని ఆర్టీసీ అందజేస్తోంది. భారీగా పెరిగిన కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయం, విడిభాగాల ఖర్చు, ఏసీ బస్సులపై వరుస నష్టాలతో రోజుకు సుమారు రూ.కోటి ఆర్థిక భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ముంబయిలోని ‘బెస్ట్’ తరహాలో ఆర్టీసీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. విద్యుత్తు, రవాణా రంగాలు ముంబయి నగర పరిపాలనలో భాగంగా నిర్వహిస్తున్నట్టుగానే హైదరాబాద్ ఆర్టీసీని కూడా జీహెచ్ఎంసీకి అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నష్టాలను భర్తీ చేయడమే కాకుండా ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, బస్బేలు, బస్ షెల్టర్లు తదితర మౌలిక సదుపాయాలను కూడా జీహెచ్ఎంసీయే అభివృద్ధి చేయనుంది. పెరిగిన సాంస్కృతిక బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్లో సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసుల శాఖలకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ విభాగాలకు గతంలో రూ. 154 కేటాయించింది. ముఖ్యమంత్రి సర్వేలో అభివృద్ధి దిశలో పయనించే శాఖల్లో నీటిపారుదల, ఐటీ శాఖల తర్వాత స్థానం సాంస్కృతిక శాఖకు దక్కింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ 2016-17లో రూ. 336 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదించగా ఈ వార్షిక బడ్జెట్లో రూ. 232 కోట్లు ఇచ్చింది. ఇందులో ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన కళాభారతికి రూ. 50 కోట్లు కేటాయించారు. దీని నిర్మాణ పనులు ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించారు. హ్యాపినింగ్ హైదరాబాద్కు, ఈవెంట్స్ నిర్వాహణ కోసం రూ. కోటి కేటాయించారు. పండుగలకు రూ. 50 కోట్లు ప్రకటించారు. రవీంద్రభారతికి గత బడ్జెట్లో రూ. 3 కోట్లు కేటాయించగా ఇప్పుడు రవీంద్రభారతితో పాటు పలు కళా సంస్థలకు రూ. 5 కోట్లు కేటాయించారు. -
ఆస్తి మీది.. బాధ్యత మాది!
♦ ఓనర్లకు వరంగా మారిన ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ♦ అద్దే కాదు.. ఆస్తి నిర్వహణ, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులు వంటివెన్నో.. ‘‘అమెరికాలో నివాసముండే ప్రవాస భారతీయుడు అఖిలేష్ ఇటీవలే హైదరాబాద్లో ఓ ఫ్లాట్ కొన్నాడు. ఖాళీగా ఉండే బదులు అద్దెకిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. కానీ, ఎవరికివ్వాలి? నెలా నెలా అద్దె తీసుకోవటం, ప్రాపర్టీ టాక్స్ చెల్లింపుల వంటివెలా చేయాలి? అద్దెకు తీసుకున్న వారు ప్రాపర్టీని సరిగ్గా నిర్వహణ చేస్తారా? వంటి సవాలక్ష సందేహాలున్నాయతనికి!’’ ‘‘ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉండే జస్విత్ది మరో కథ. భాగ్యనగరంలో తన పేరుమీదున్న విల్లాను ఎవరికైనా అద్దెకిద్దామనుకున్నాడు. కానీ, నగరంలో జరిగే ప్రాపర్టీ మోసాలు చూసి వెనుకడుగేస్తున్నాడతను. ఇంటి ఓనర్ లేనిది చూసి రాత్రికి రాత్రే నకిలీ పేపర్లు సృష్టించి ఇతరులకమ్మేస్తాడేమోనని!’ .. ఇలాంటి సమస్యలు వీరివే కాదు ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరివీనూ. మరెలా? స్థానికంగా ఉన్న ప్రాపర్టీ అద్దెకిచ్చో.. లీజుకిచ్చో డబ్బులు సంపాదించుకోవటమెలా? అదే సమయంలో ప్రాపర్టీని కంటికిరెప్పలా కాపాడుకోడమూ కావాలి కూడా. దీనికి పరిష్కారమే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)!! - సాక్షి, హైదరాబాద్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) సేవల ద్వారా కలిగే ప్రయోజం అంతా ఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి సంస్థ ప్రతినిధులే చూసుకుంటారు. నెల వచ్చేసరికి ఠంఛనుగా అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారునికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొం దించే బాధ్యత కూడా పీఎంఎస్లదే. అద్దెదారులు పాటించాల్సిన నియమ నిబంధల్ని మీ తరపున ఖారారు చేస్తారు. మరమ్మత్తులు కూడా: క్రమం తప్పకుండా విద్యుత్, ఆస్తి పన్ను చెల్లింపులు పీఎంఎస్లో సేవలో ప్రధానం. మీది ఫ్లాట్ అయితే అపార్టుమెంట్ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు. ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు. పండగలు, అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు. మీ తరుపున ప్రతినిధి: మీకు అద్దెదారునికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత కూడా వీరిదే. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేదీ వీరే. మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ప్రతిసేవకు ఎంతోకొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు. -
పన్ను ‘పోటు’ తప్పదు..!
గ్రేటర్లో ఆస్తి పన్ను మదింపునకు చర్యలు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటన సిటీబ్యూరో: గ్రేటర్లో ఆస్తి పన్ను పెరగనుంది. జీహెచ్ఎంసీ అధికారులు త్వరలో ఇందుకు సంబంధించిన కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం రూ.1200 లోపు ఆస్తిపన్ను ఉన్నవారికి ప్రభుత్వం మినహాయింపునివ్వడంతో రూ. 101 చెల్లిస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నవారికి.. వాణిజ్య భవనాలకు పన్ను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో 2002 తర్వాత ఆస్తిపన్ను సవరణ చేయలేదన్నారు. అలాగే వాణిజ్య భవనాలకు 2007 తర్వాత సవరించలేదని చెప్పారు. ఇకపై ఆస్తిపన్నును ప్రతియేటా లేదా ఐదేళ్లకోసారి పునర్ వ్యవస్థీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఆస్తిపన్ను మదింపులో అవకతవకలకు తావులేకుండా జీఐఎస్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా చేపట్టే అవకాశం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆస్తిపన్ను నిర్ధారణను కాన్పూర్లో విజయవంతంగా అమలు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. శాస్త్రీయంగా జరిగే ఆస్తిపన్ను మదింపుతో ప్రస్తుతం రూ. 1200 లోపు పన్ను ఉన్నవారికి సైతం పెరిగే అవకాశముంది. లేదా వీరి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇస్తుందో వేచి చూడాలి. సర్కిళ్ల సంఖ్య 30కి పెంపు.. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ 24 సర్కిళ్లను 30కి పెంచేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టు కమిషనర్ జనార్దన్రెడ్డి తెలిపారు. వంద రోజుల ప్రణాళికలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని ప్రకటించినందున గడువులోగా వీటి సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు వేగంగా జరగుతున్నాయని చెప్పారు. మోడల్ మార్కెట్ల నిర్మాణం పురోగతిలో ఉందని, రాజేంద్రనగర్ సర్కిల్లో ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మొత్తం రూ. 130 కోట్లతో 200 మార్కెట్లు నిర్మాణం లక్ష్యం కాగా, వీటిల్లో 70 మార్కెట్ల నిర్మాణం రెండు నెల ల్లో పూర్తవుతుందని కమిషనర్ తెలిపారు. ఎస్సార్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్ల పనులకు సంబంధించి భూసేకరణ సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. త్వరలో ఏఎంఓహెచ్ పోస్టుల భర్తీ.. జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న ఏఎంఓహెచ్ఓ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా వైద్య, ఆరోగ్యశాఖకు లేఖ రాశామని ఆయన తెలిపారు. నగరంలో ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీలో 15 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను దశలవారీగా తొలగిస్తామని, 30 ఏళ్లకు పైబడిన వాహనాలను స్క్రాప్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వేలం వేస్తామని చెప్పారు. నీటి పొదుపు పాటించండి.. గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరానికి తీవ్ర నీటికొరత ఏర్పడే ప్రమాదముందని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని కోరారు. కనీసం 30 నుంచి 40 శాతం నీటిని ఆదా చేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెయ్యి ఇంకుడు గుంతల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకొచ్చే కాలనీ, స్వచ్ఛంద సంఘాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు సి.రామకృష్ణారావు, జె. శంకరయ్య పాల్గొన్నారు. -
వెంకన్నకు పన్నుపోటు
ఆమదాలవలసలోని వెంకన్నకు కష్టమొచ్చిపడింది. ఉన్నఫలాన రూ.11లక్షల మేర ఆస్తిపన్ను చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు పట్టుబడుతున్నారు. నోటీసులు మీద నోటీసులు పంపుతున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులు ప్రకారం చెల్లించనవసరం లేదు మహాప్రభో అని దేవాదాయ అధికారులు వేడుకుంటున్నా‘ కుదరదు కట్టాల్సిందే ’నంటున్నారు. ఈ పన్నుపోటు వెంకన్న ఆలయాన్ని దశాబ్దంగా వెంటాడుతోంది. ఈమధ్య కాలంలో ఇది తీవ్రతరమైంది. మరోపక్క ఆలయ ఆస్తులపై వస్తున్న నామమాత్ర లీజు ఆదాయంతో దూపదీపాలకూ ఇబ్బంది ఎదురవుతోంది. ఆస్తులను వేలం వేద్దామంటే మున్సిపల్ శాఖ కన్నెర్ర చేస్తోంది. ఆమదాలవలస/ రూరల్: 1930లో ఆమదాలవలసలో బరంపురానికి చెందిన కాళ్ల సత్యవతి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కొందరు అప్పట్లో స్ధలాలను దానం చేశారు. మరికొంత మంది భవనాలను కూడా దేవుని పేరున రిజిస్ట్రేషన్ చేశారు. బరంపురంలో 16.62 ఎకరాలు, ఇచ్చాపురంలో 2.88 ఎకరాలు, ఆమదాలవలసలో 69 సెంట్లు, 7 దుకాణాలు, రెండు ఇళ్లు స్వామికి ఇలా సంక్రమించిన ఆస్తులే. 5 కిలోల బంగారం, 30.49 కిలోల వెండి కూడా ఉన్నాయి. దాతలే ట్రస్టుగా ఆలయ బాగోగులను చూసేవారు. 1993లో ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. రెండు దుకాణాలు, రెండు భవనాలు, కొంత ఖాళీస్ధలం, ఒక ఇల్లు మినహాయించి మిగిలిన ఆస్తులను ట్రస్టు ఎండోమెంట్కు అప్పగించింది. పన్ను ఎందుకు చెల్లించలేదంటే.. గతంలో ట్రస్టు ఆలయానికి సంబంధించి ఆస్తి పన్నులు చెల్లించేది. ఎండోమెంట్ అధీనంలోకి వెళ్లాక సమస్య మొదలైంది. ఒక ఆలయం విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పును అనుసరించి ఆదాయం ఆలయ అభివృద్ధికే వినియోగించుకోవాలని.. ఎటువంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపింది. దీంతో 2004 నుండి మున్సిపల్ శాఖకు ఆస్తి పన్నులను కట్టలేదు. మున్సిపల్ అధికారులు ఏటా నోటీసులు పంపుతూనే ఉన్నారు. దీనిపై ఎండోమెంట్ శాఖ కూడా లీగల్ నోటీసులు కూడా బదులిస్తూ వస్తోంది, దీంతో ఇది రెండు శాఖల మధ్యవివాదంగా తయారైంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల ఆలయం ఆస్తులను అమ్ముకోలేని పరిస్థితి ఎదురైంది. లీజుతో అతితక్కువ ఆదాయం ఏటా దుకాణాల నుంచి రూ. 2,88లక్షలు, కల్యాణ మండపాల ద్వారా రూ. 8,600, పూజల ద్వారా రూ.50 వేలు, హుండీ ద్వారా రూ.87 వేలు, ఖాళీస్ధలం, భవనాల, దుకాణాల ద్వారా స్వల్ప మొత్తంలో అద్దెలు వస్తున్నాయి. అప్పట్లో ట్రస్టు వేలంలో కొందరు దక్కించుకుని నామమాత్రంగా అద్దెలు చెల్లిస్తూ అనుభవిస్తున్నారు. ఈ ఆదాయంతోనే పూజలు, అర్చకుల జీతాలు వ్యయం చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. వాస్తవంగా అతి తక్కువ లీజు ఆదాయంతో స్వామివారికి సరైన అర్చనలూ జరగడంలేదని భక్తులు వాపోతున్నారు. బొటాబొటీ ఆదాయంతో నిర్వహణను అతికష్టం మీద నెట్టుకొస్తున్నారు. ఆలయ ఆస్తులను నామమాత్రపు అద్దెకు కట్టబెట్టిన సంగతిని దేవాదాయ శాఖ గమనించింది. వీటిని వేలం వేయాలని నిర్ణయించింది. వేలంలో ఈ ఆస్తులను అతి తక్కువ ధరకే దక్కించుకోవాలని పట్టణానికి చెందిన కొందరు సిండికేట్ అయ్యారు. అయితే తమకు ఆస్తిపన్ను బకాయి చెల్లించకుండా వేలం వేయడానికి వీల్లేదని మున్సిపల్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో వేలం పాటను ఆలయ ఈవో రద్దు చేశారు. అద్దె లీజుల్లో స్వాహా జరుగుతుంది వెంకటేశ్వరస్వామికి ఎన్నో రకాలుగా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారు. దేవుని పేరున ఉన్న దుకాణాలు, భూములు మార్కెట్ ధరకంటే తక్కువకే అద్దెకు ఇవ్వడంలో పెద్ద మతలబు ఉంది. వేలం పాట నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. ఈ ఆస్తులపై విచారణ జరపాలి. పేడాడ సన్యాసప్పారావు, రాష్ట్ర హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు -
ఆస్తి పన్ను బకాయితో నామినేషన్ తిరస్కరణ
♦ రిటర్నింగ్ అధికారిపై కోర్టుకెక్కిన అభ్యర్థి ♦ జోక్యానికి హైకోర్టు నిరాకరణ ♦ సివిల్ కోర్టుకెళ్లాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను రూ. 536 బకాయి ఉన్న కారణంగా ఓ అభ్యర్థి సమర్పించిన నామినేషన్ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సివిల్ కోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలే తప్ప, రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడం సరికాదని తేల్చి చెప్పింది. ఆ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్వాన్ నియోజకవర్గానికి చెందిన జె.రవీందర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్వాన్, వార్డ్ నెంబర్ 65 నుంచి పోటీ చేసేందుకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి రూ. 536 ఆస్తి పన్ను బకాయి ఉందని, అలాగే ఎన్నికల అఫిడవిట్లో 3, 5 కాలమ్లను పూరించలేదంటూ అభ్యంతరం లేవనెత్తారు. అంతేకాకుండా రవీందర్ నామినేషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రవీందర్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి లంచ్మోషన్ రూపంలో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.ప్రతాప్కుమార్ వాదనలు వినిపిస్తూ, రవీందర్ ఈ నెల 18నే ఆస్తి పన్ను చెల్లించేశారని, అందుకు సంబంధించిన రసీదును కూడా చూపినా కూడా రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందలేదని కోర్టుకు నివేదించారు. ఇక అఫిడవిట్లో 3, 5 కాలమ్లను పూరించాలన్న విషయం తెలియక ఖాళీగా వదిలేశారని తెలిపారు. వీటన్నింటినీ వివరిస్తూ రిటర్నింగ్ అధికారికి పిటిషనర్ వినతిపత్రం సమర్పించారని, దానిని పరిగణనలోకి తీసుకోకుండానే నామినేషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రతాప్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి రిటర్నింగ్ అధికారి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు. -
ఆస్తిపన్ను @ రూ.101
దిగువ, మధ్య తరగతి ఇళ్ల యజమానులకు ఆస్తిపన్ను తగ్గింపు 5.09 లక్షల మందికి ప్రయోజనం అమలుకు కమిషనర్కు అధికారం జీహెచ్ఎంసీ ఖజానాకు ఏటా రూ. 30 కోట్లు లోటు పాతబకాయిలు మరో రూ. 57.99 కోట్లు సిటీబ్యూరో: ఇళ్ల ఆస్తిపన్ను తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నిర్ణయంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను ద్వారా ఏటా వచ్చే ఆదాయంలో దాదాపు రూ. 30 కోట్లు తగ్గనుంది. ఇప్పటి వరకున్న బకాయిలు మరో రూ. 57.99 కోట్లకు గండిపడనుంది. ప్రస్తుతం ఇళ్ల ఆస్తిపన్ను రూ. 1200 లోపు ఉన్నవారికి కేవలం రూ. 101లు ఆస్తిపన్నుగా చెల్లిస్తే చాలని ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేస్తూ..దానిని అమలు చేసే అధికారాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్కు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. యజమానులే నివాసం ఉంటున్న నివాస గృహాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. తద్వారా జీహెచ్ఎంసీకి ఏర్పడే లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించదని కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. సాధారణంగా ప్రజలకు రాయితీలు కల్పించినప్పుడు సంబంధిత సంస్థలకు తగ్గే ఆదాయాన్ని పూడ్చేందుకు రాష్ట్రప్రభుత్వం పరిహారం రూపేణా అందజేయడం.. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయడం రివాజు. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు దాదాపు 13.50 లక్షల మంది ఉండగా, వారిలో 5.09 లక్షల మందికి ఈ సదుపాయం వర్తించనుంది. వీరంతా రూ. 1200 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారే కావడం గమనార్హం. నోట్: జీహెచ్ఎంసీ పాత (18)సర్కిళ్ల వారీగానే ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి. వీటినే 24 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. {పభుత్వ తాజా నిర్ణయంతో ఈమేరకు జీహెచ్ఎంసీ ఖజానాకు లోటు ఏర్పడనుంది. -
ఆస్తి పన్ను రూ.1200 కాదు..రూ.101 మాత్రమే
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నూతన సంవత్సరం కానుకగా వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలోని నివాస గృహాల యజమానులకు తీపి కబురు అందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.1,200, ఆలోపు వార్షిక ఆస్తి పన్ను చెల్లిస్తున్న పేద, మధ్య తరగతి నివాస గృహాల యజమానుల నుంచి ఇకపై రూ.101 మాత్రమే కడితే సరిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జీహెచ్ఎంసీలో చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు గ్రేటర్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ వాసులపై వరాల జల్లు కురిపిస్తోంది. అలాగే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. మరోవైపు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా 9వేల కానిస్టేబుళ్ల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. -
మోత మూడింతలు!
♦ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నుకు రెక్కలు ♦ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన సవరణ లెక్కలు ♦ గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు వార్షిక పన్నులు రూ.72.40 కోట్లు ♦ పురపాలికలుగా హోదా పెరిగిన తర్వాత రూ.201.33 కోట్లకు పెంపు ♦ 32 కొత్త పురపాలికలు, విలీన గ్రామాల ప్రజలపై రూ.129 కోట్ల భారం ♦ తలసరి ఆస్తి పన్ను సగటు రూ.858కు ఎగబాకిన వైనం సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికలపై ఆస్తి పన్నుల పిడుగు పడింది. డిమాండ్ నోటీసులు దడపుట్టిస్తున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ/మున్సిపాలిటీగా హోదా పెరిగిన తర్వాత ఆస్తి పన్నులూ అమాంతంగా పెరిగి దాదాపు మూడింతలయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 23 నగర పంచాయతీలు, 3 మున్సిపాలిటీలతోపాటు మరో 6 మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఆస్తి పన్నుల సవరణ కొలిక్కి వచ్చింది. 2015 మార్చి 31 నాటికి ఈ మున్సిపాలిటీల్లో ప్రైవేటు ఆస్తులపై రూ.72.40 కోట్ల మేర ఉన్న వార్షిక ఆస్తి పన్నులు.. తాజా సవరణ తర్వాత 2015 నవంబర్ 31 నాటికి రూ.201.33 కోట్లకు ఎగబాకాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రజలకు డిమాండ్ నోటీసులు జారీ చేయాల్సి ఉండగా.. సవరణ ప్రక్రియ వల్ల కొత్త పురపాలికల్లో ఈ నోటీసుల జారీ ఆలస్యమైంది. 2015-16 ఆర్థిక సంవత్సర రెండో అర్ధ భాగం ముగింపుకు చేరిపోవడంతో డిమాండ్ నోటీసుల జారీ ముమ్మరం చేశారు. ఒక్కసారిగా పన్నులు మూడు, నాలుగు రెట్లు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ కొత్త పురపాలికల తలసరి వార్షిక ఆస్తి పన్నుల సగటు రూ.858కు పెరిగిపోయింది. ప్రధానంగా నివాస భవనాలతోపాటు దుకాణాలు, ఆస్పత్రులు, పాఠశాలలు తదితర వాణిజ్య సముదాయాలపై భారీగా పన్నులు పెరిగాయి. వార్షిక అద్దెల విలువ ఆధారంగా లెక్కింపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 23 నగర పంచాయతీలు, 3 మున్సిపాలిటీలతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మిర్యాలగూడ, మహబూబ్నగర్, గద్వాల, నల్లగొండ మున్సిపాలిటీల్లో విలీనమైన వందలాది గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల సవరణ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఆస్తి పన్నులు నామమాత్రంగా వసూలు చేసేవారు. మున్సిపాలిటీలుగా హోదా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం ప్రకారం పన్నుల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో అనుమతిచ్చింది. వార్షిక అద్దె విలువల ఆధారంగా ఆ ప్రాంతంలోని ఆస్తులపై పన్నులను లెక్కించారు. ఇలా పెంచిన పన్నులపై రెండు దఫాలుగా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఎట్టకేలకు ఈ సవరణ ప్రక్రియ ముగిసిపోవడంతో పురపాలికలు పన్ను వసూళ్లపై దృష్టి సారించాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు అశాస్త్రీయ పద్ధతుల్లో పన్నులను విధించేవారని.. పురపాలికలుగా మారిన తర్వాత శాస్త్రీయంగా సవరణ చేయడంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో పన్నులు పెరిగిన భావన కలుగుతోందని పురపాలక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పురపాలికలుగా హోదా పెరిగిన తర్వాత 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, స్వచ్ఛ భారత్ తదితర పథకాల కింద వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విలీనంతో విమాన మోతే! వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మిర్యాలగూడ, మహబూబ్నగర్, గద్వాల, నల్లగొండ మున్సిపాలిటీల్లో విలీనమైన వందలాది శివారు గ్రామాలపై పన్నుల ప్రభావం తీవ్రంగా పడింది. సవరణకు ముందు రూ.56.14 కోట్లు ఉన్న వార్షిక పన్నులు తాజాగా రూ.129.94 కోట్లకు పెరిగిపోయాయి. అత్యధిక భారం విలీన గ్రామాలపైనే పడింది. సవరణ తర్వాత 32 కొత్త పురపాలికలపై రూ.129 కోట్ల పన్నుల భారం పడగా.. అందులో రూ.73.79 కోట్ల భారం విలీన గ్రామాలపైనే పడడం గమనార్హం. -
GHMC ఆస్తి పన్ను రాయితీ ప్రతిపాదన
-
కొత్త పురపాలికలపై ఆస్తి పన్ను మోత
-
కొత్త పురపాలికలపై ఆస్తి పన్ను మోత
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికల ప్రజల నడ్డి విరిగింది. ఆస్తి పన్నుల డిమాండు నోటీసులు గుండె దడ పుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా ఆస్తి పన్నులు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు చెల్లించిన పన్నుతో పోల్చితే 30 శాతం పెరిగిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 31 నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ గత ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు నామమాత్రంగా ఆస్తి పన్ను వసూలు చేసేవారు. మున్సిపల్ చట్టం మేరకు ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్ను సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు కొలిక్కి వచ్చాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు రూ. 162.04 కోట్లున్న ఆస్తి పన్ను డిమాండు .. నగర పంచాయతీలుగా మారిన తర్వాత రూ. 215 కోట్లకు పెరిగింది. ఈ పురపాలికల్లో ప్రజలపై రూ.50 కోట్లకు పైనే అదనపు భారం పడింది. 31 కొత్త మున్సిపాలిటీలతో పాటు వందలాది విలీన గ్రామాల పరిధిలోని 50 వేల నివాస, నివాసేతర సముదాయాలపైనా పన్నుల పెంపు పడనుంది. పన్నుల సవరణ ప్రక్రియ ముగియడంతో తాజాగా అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు డిమాండు నోటీసులు జారీ చేస్తున్నారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నును నిర్ణయించడంతో విలువైన ప్రాంతాల్లో ఉన్న నివాస, నివాసేతర భవనాల పన్నులు రెండు మూడు రెట్లు పెరిగాయి. దీంతో పన్నుల సవరణను పునఃసమీక్షించాలని కోరుతూ భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. విలీన గ్రామాలపై పిడుగు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వందల సంఖ్యలో శివారు గ్రామాలు విలీనమయ్యాయి. పురపాలికల పరిధిలోకి వచ్చిన ఈ గ్రామాల్లో సైతం ఆస్తి పన్నుల సవరణ అమలు చేస్తున్నారు. శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో రూ.1.76 కోట్లు, నిజామాబాద్ కార్పొరేషన్లో రూ.3.64 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో రూ.2.93 కోట్లు, రామగుండంలో రూ.2.93 కోట్లు ఆస్తి పన్నులు పెరిగాయి. పన్నులు సరే.. సదుపాయాలేవీ! గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఉన్నఫళంగా ఈ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి నగర పంచాయతీలు, మున్సిపాలిటీల హోదాను కల్పించింది. గతేడాది అక్టోబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం పేరుకే హోదా పెరిగినా.. నేటికీ ఈ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను ప్రభుత్వాలు చేపట్టలేదు. కనీసం తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్లు లేక చాలా నగర పంచాయతీల బాగోగులు పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస వసతులను కల్పించకుండానే ఆస్తి పన్నులను భారీగా పెంచడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
ఇదేం బాదుడు!
అడ్డగోలుగా పెరిగిన ఆస్తి పన్ను పలు జోన్లలో మూడు రెట్లకు పైగా.. ఇక నల్లాలు కూడా భారమే టాక్స్ పెంచినా.. అభివృద్ధి శూన్యం అధికారుల నిర్వాకంపై పట్టణ ప్రజల ఆగ్రహం మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలో 2015-16 సంవత్సరానికి ఆస్తి పన్నును విపరీతంగా పెంచారు. జోన్ల వారీగా విభజించి పన్నుమోత మోగించారు. చిన్న పెంకుటిళ్లకు కూడా అడ్డగోలుగా పన్ను విధించారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పన్నులు పెంచడంపై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నారుు. పన్నులు పెంచిన అధికారులు ఆ మేరకు అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. మేజర్ గ్రామ పంచాయతీ అరుున మానుకోట 2011 సెప్టెంబర్ 3న మునిసిపాలిటీగా అప్గ్రేడ్ అరుుంది. మున్సిపాలిటీ పరిధిలో 16 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం బిల్ కలెక్టర్లు, ఆర్ఐ, ఆర్ఓఆర్ కలిసి పట్టణంలోని పలు ఇళ్ల కొలతలు వేశారు. గత ఏడాది అక్టోబర్ 10న మున్సిపల్ పాలక మండలి సమావేశం నిర్వహించి పన్ను పెంపుపై చర్చించగా, పలు పార్టీలు ఈ నిర్ణయూన్ని వ్యతిరేకించారుు. సీపీఐ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేశారు. అరుునా పన్ను విధింపు మాత్రం ఆగలేదు. మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 4 జోన్లుగా విభజించి పన్నులు వేశారు. జోన్ల వారీగా పరిశీలిస్తే.. మొదటి జోన్లో నర్సంపేట రోడ్, మున్సిపల్ ఆఫీస్ రోడ్, గ్రెరుున్ మార్కెట్, మన్మోహన్రెడ్డి కాంప్లెక్స్ రోడ్, వెంకట్రామా టాకీస్ రోడ్, బస్టాండ్ రోడ్, వివేకానంద రోడ్, ఐఓబీ నుంచి మెయిన్ రోడ్, పోస్టాఫీస్ ఏరియా, బుక్క బజార్, బట్టల బజార్ మెయిన్ రోడ్, నెహ్రూ సెంటర్ రోడ్, ఏరియా ఆసుపత్రి, సారుుబాబా గుడి రోడ్, తహసీల్దార్ ఆఫీసు రోడ్, తొర్రూరు బస్టాండ్, నెహ్రూ సెంటర్, రామమందిరం రోడ్, శ్రీనివాస థియేటర్ రోడ్, కూరగాయల మార్కెట్, కోర్టు రోడ్, ఆఫీసర్ క్లబ్, ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నారుు. రెండో జోన్లో.. మందుల బజార్, మాలబజార్, శిఖార్ఖానగడ్డ, బైపాస్ రోడ్, రూరల్ పోలీస్స్టేషన్ ఏరియా, గౌడ సంఘం ఏరియా, బస్టాండ్ రోడ్, బెస్త బజార్, చేపల మార్కెట్, బుక్క బజార్, అండర్ బ్రిడ్జి రోడ్, పులిగోపాల్ రెడ్డి నగర్, హరికిషన్ మిల్, నెహ్రూ సెంటర్లోని కొన్ని ప్రాంతాలు, సిద్ధార్థ స్కూల్ రోడ్, కృష్ణకాలనీ, అడ్వకేట్స్ కాలనీ, సర్వేపల్లి రాధాకృష్ణ కాలనీ ఉన్నారుు. మూడో జోన్లో.. హరిజనవాడ, గుమ్ముడూరు, రామచంద్రాపురం కాలనీ, హస్తినాపురం, భవానీనగర్, స్నేహానగర్, ఆర్టీసీ రోడ్, బ్రాహ్మణ బజార్, వేణుగోపాలస్వామి గుడి, ముత్యాలమ్మ గుడి, మల్లం బజార్, మేదరి బజార్, బెస్త బజార్, కురవి రోడ్, ఇన్కేబుల్ బజార్, మార్వాడి సత్రం, సారుుబాబా గుడి ఎదురుగా, మాల బజార్, కంకరబోడ్, చిన్న మజీద్ వెనుక, వెంకటేశ్వర్ల బజార్, పత్తిపాక రోడ్, ఎల్ఐసీ ఆఫీస్ రోడ్, తొర్రూరు రోడ్ ఉన్నాయి. నాలుగవ జోన్లో.. రాజీవ్నగర్, రామన్నపేట కాలనీ, భవానీశంకర్ తండ, బాబు జగ్జీవన్రావు నగర్, జ్యోతిబసు నగర్, దాసరి బజార్, గుండ్లకుంట, నందినగర్, హన్మంతరావు నగర్, రాహుల్ నగర్, గిరిప్రసాద్ నగర్, కంకరమిల్లుతండ, ఏటిగడ్డ తండ, ఎల్బీజీ నగర్, ఆర్టీసీ కాలనీ, సుందరయ్య నగర్, బీటీఆర్ నగర్, రెడ్యానాయక్ కాలనీ, వేల్పుల సత్యం కాలనీ, ఈద్గా కమిటీ ఏరియా, గోపాలపురం కాలనీ, ఆకుల లక్ష్మయ్య కాలనీ, అంబేద్కర్ కాలనీ, కొండపల్లి గోపాల్రావునగర్ కాలనీ, ఫైర్ స్టేషన్, బీసీ కాలనీ, లెనిన్ నగర్ కాలనీ, పేపర్ మిల్ కాలనీ, యాదవనగర్ కాలనీ, వడ్డెర కాలనీ, ఇందిరాకాలనీ, జగన్ కాలనీ, భగత్సింగ్ నగర్, విక్రమ్ నగర్, తీగల సత్యనారాయణ నగర్, బ్యాంక్ కాలనీ, ధర్మన్న కాలనీ, మిల్ట్రి కాలనీ, భద్రన్న కాలనీ, పత్తిపాక, ఎర్రబోడు, నందమూరి నగర్, వినాయక తండ, మంగలి కాలనీ, సాంక్రియ తండ, సాలార్తండా ఉన్నారుు. పెంపు వివరాలను పరిశీలిస్తే.. మొదటి జోన్లోని ఎ.సత్యనారాయణ ఇంటికి గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.5733 పన్ను విధించగా.. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఆరు నెలలకే రూ.15, 908 పన్ను వేశారు. ఇదే జోన్లోని ఎస్.పద్మలత ఇంటికి గతంలో రూ. 4593 పన్ను రాగా, ఇప్పుడు ఆరు నెలలకే రూ.13,472 విధించారు. ఎస్.నాగరాజు ఇంటికి గతంలో సంవత్సరానికి రూ. 716 రాగా, ఇప్పుడు ఆరు నెలలకే రూ. 2,878 విధించారు. రెండవ జోన్లో చంద్రకళకు చెందిన పెంకుటిల్లుకు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు సంవత్సరానికి రూ. 200 బిల్లు వచ్చేది. ఇప్పుడు రూ.1500 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఇంటి పన్నుకు తోడు నల్లా బిల్లు.. గతంలో నల్లా పన్ను నెలకు రూ.33 ఉండగా, ఇప్పుడు రూ. 100కు పెంచారు. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయి మూడేళ్లు దాటినా అభివృద్ధిపై దృష్టి సారించని అధికారులు పన్నుల భారం మాత్రం వేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమై నిధులు మంజూరు చేయూలని పాలకమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అరుుతే గతంలో ఏడాదికి రూ.కోటి మేర ఆదాయం వచ్చేదని, పన్నుల పెంపుతో అది రూ.4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంటున్నారు. రూ.250 నుంచి 1500కు పెంచారు చిన్న పెంకుటిల్లుకు గ్రామపంచాయతీగా ఉన్నప్పు డు సంవత్సరానికి రూ. 250 పన్ను వేసేవారు. ఇప్పుడు మున్సిపల్ నిబంధన పేరుతో ఆరు నెల లకే రూ.750 చెల్లించాలంటున్నారు. అంటే ఏడాదికి రూ.1500 పన్ను వేస్తారట. దీనికి తోడు నల్లా పన్ను కూడా పెంచారు. పేదల గురించి అధికారులు ఆలోచించకపోవడం భావ్యం కాదు. - చంద్రకళ, కంకరబోడ్ వాసి అభ్యంతరాలు తెలియజేయూలి ఇంటి పన్ను పెంపుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయూలి. పన్ను విధింపులో తేడాలుంటే దరఖాస్తు చేస్తే సర్వే నిర్వహించి న్యాయం చేస్తాం. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని విధాలా ఆలోచించే పన్ను పెంపు నిర్ణయం తీసుకున్నారు. -భాస్కర్రావు, ఆర్డీఓ, ఇన్చార్జి కమిషనర్ -
ఆస్తి పన్ను రూ. 101 లోపే!
రూ. 1,200 లోపు పన్నుకు బదులు రూ. 101 లోపు నామమాత్రపు విధింపు సూత్రప్రాయంగా నిర్ణయించిన కేసీఆర్.. 5 లక్షల మందికి లబ్ధి నెల రోజుల్లో గ్రేటర్ రహదారుల మరమ్మతుకు ఆదేశాలు అక్రమ నిర్మాణాల అదుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచన జీహెచ్ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ప్రస్తుతం రూ.1,200, అంతకంటే తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారిపై రూ.101కు మించకుండా నామమాత్రపు పన్నులు విధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూత్రప్రాయంగా నిర్ణయిం చారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రూ.1,200, ఆ లోపు పన్నులు చెల్లిస్తున్న 5 లక్షలకు పైగా గృహాల యజమానులు లబ్ధిపొందనున్నారు. దీనిపై తుది నిర్ణయం కోసం సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రహదారుల మరమ్మతులు, ఆస్తి పన్నుల రాయితీ తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. వర్షాలతో నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయని, యుద్ధప్రాతిపదికన రహదారుల మరమ్మతులు జరపాలని, పది రోజుల్లో పనులు ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తక్కువ సమయంలో పనులు ప్రారంభించేందుకు వీలుగా తక్షణమే దెబ్బతిన్న రహదారులను గుర్తించి జాబితాను రూపొందించాలని సూచించారు. మెట్రో రైలు నిర్మాణ ప్రాంతాల్లో ధ్వంసమైన రహదారులకు సైతం మరమ్మతులు చేయాలని, మెట్రో పనులకు ఆటంకం కలగకుండా అవసరమైన ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులతో చర్చలు జరపాలని ఆదేశించారు. నగరం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు సైతం ఏకకాలంలో మరమ్మతులు జరపాలని జాతీయ రహదారుల సంస్థ చీఫ్ ఇంజనీర్కు సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్అండ్బీ నుంచి జీహెచ్ఎంసీకి బదలాయించిన రహదారులకు సైతం ఇదే తరహాలో మరమ్మతులు జరపాలని, జీహెచ్ఎంసీలోని అన్ని జోన్ల పరిధిలో ఏకకాలంలో రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. మరమ్మతుల సమయంలో బలోపేతం, నవీకరణ చేపట్టిన రహదారుల సంఖ్యను సేకరించాలని, అక్కడక్కడ ఉండే చిన్నచిన్న అతుకు(ప్యాచ్)లపై సైతం దృష్టిసారించాలన్నారు. ఎక్కువ కాలం పాటు రహదారులు మన్నికగా ఉండేందుకు మరమ్మతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. నగరంలో కాంక్రీట్తో నిర్మించదగ్గ రహదారుల విస్తీర్ణంపైనా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. రహదారుల ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నగరంలో రూ.500 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి లేన్ కిలోమీటర్ల రహదారులను తారుతో, 400 లేన్ కిలోమీటర్ల రహదారులను కాంక్రీట్తో నవీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫ్లయింగ్ స్క్వాడ్.. గతంలో బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలను అమలు చేసినా నగరంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల అదుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఇందు కోసం జీహెచ్ఎంసీ కమిషనర్ స్వీయ నియంత్రణలో ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేసుకోవాలని, కట్టుదిట్టమైన ప్రణాళికతో దీనిని నడపాలని సూచించారు. -
ఊరటా? పన్నుపోటా?
గజ్వేల్ : గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీని ఆస్తిపన్ను హడలెత్తిస్తోంది. వివాదస్పదంగా మారిన పన్నుపెంపు వ్యవహారంపై మరో పది రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పెంపును వ్యతిరేకిస్తూ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి.. తీర్మానం ప్రతిని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్కు పంపింది. దీనిపై ముఖ్యమంత్రి తీసుకోనున్న తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరీ ఇంత దారుణంగానా? 2012 జనవరిలో గజ్వేల్.. మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయింది. నగర పంచాయతీలో ప్రజ్ఞాపూర్తో పాటు ముట్రాజ్పల్లి, క్యాసారం గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఫలితంగా పరిధి పెరిగింది. జనాభా 40 వేలకుపైగా చేరుకుంది. నగర పంచాయతీ పరిధిలో ఇళ్ల సంఖ్య 9 వేలకు పెరిగింది. నగర పంచాయతీగా మారాక పన్నుల భారం పెరుగుతుందని అందరూ ఊహించారు కానీ.. మరీ ఇంతలా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందనుకోలేదు. పన్ను పెంపు సరాసరిన 200 నుంచి వెయ్యి శాతం వరకు ఉంది. దీంతో పట్టణ ప్రజలు పన్ను బాధను తలుచుకుని బెంబేలెత్తుతున్నారు. ఆస్తిపన్ను పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఎందుకిలా.. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో నెల క్రితం వరకు మేజర్ పంచాయతీగా ఉన్న కాలం నాటి ‘క్యాపిటల్ వాల్యూ మెథడ్’ పన్నుల విధానమే అమలైంది. దీని ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విలువపై 5 నుంచి 10 శాతం పన్నులు వసూలు చేసేవారు. దీంతో భారం తక్కువుండేది. తాజాగా ‘మంత్లీ రెంటల్’ విధానంలో పన్నుల వసూలు జరగనున్నది. దీని ప్రకారం ఓ భవనంలో గదుల సంఖ్య, వాటి వైశాల్యం, ఆ గదికి వచ్చే నెలసరి అద్దె ఆధారంగా పన్ను వడ్డిస్తారు. ఇక, వాణిజ్య సముదాయాలపై పన్ను పెంపు గతంతో పోలిస్తే వెయ్యి శాతానికిపైగా ఉండబోతున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 25 నగర పంచాయతీలు మేజర్ నుంచి నగర పంచాయతీలుగా అప్గ్రేడైన కారణంగా.. వాటిల్లో కొత్త పన్నుల విధానం ఉండాలనే ఆలోచనతో ఈ పెంపు నిర్ణయం అమల్లోకి రానున్నది. అయితే, రాష్ట్రంలోని 43 మున్సిపాలిటీల్లో మాత్రం 2002 నాటి పన్నుల విధానమే అమల్లో ఉంది. కొత్త విధానంలో వడ్డింపులిలా.. కొత్త పన్ను విధానంలో నగర పంచాయతీని 4 జోన్లుగా విభజించి.. ఆస్తుల విలువను బట్టి పన్నులు నిర్ధారించారు. ఉదాహరణకు మొదటి జోన్లో ఇంటికి సెల్లార్, జీ ప్లస్-1, రెండు, మూడు ఫ్లోర్లకు ఒక చదరపు మీటర్కు గతంలో రూ.2-రూ.4 చొప్పున పన్ను వసూలు చేస్తే ప్రస్తుతం అది రూ.10కి చేరుకుంది. అంటే పెరుగుదల 200 శాతం పైమాటే. దుకాణాలు, ఆఫీసులు, బ్యాంకులు, హోటళ్లు, నర్సింగ్హోంలు, గోదాములు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, లాడ్జిలు, రెస్టారెంట్లు, కమ్యునిటీ హాల్లు, ఆడిటోరియం, పెట్రోల్బంక్, సెల్టవర్స్ వంటి వ్యాపార, వాణిజ్య భవనాలపై వెయ్యి శాతానికిపైగా పెంపు ఉండనుంది. కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి మున్సిపల్ పరిపాలన కమిషనరేట్కు పంపింది. ఈ ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లనుంది. దీనిపై సీఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పెంపా? తగ్గింపా? అనేది తేలనుంది. -
ఆస్తి పన్ను పెంపుకు రంగం సిద్ధం
-
గజ్వేల్లో ఇక పన్నుల మోత!
- ఆస్తి పన్ను 100 నుంచి 200 శాతం వరకు పెంపు! - ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన - పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పాలకవర్గం - తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే.. గజ్వేల్: గజ్వేల్ నగరపంచాయతీలో ఆస్తి పన్ను ఇక భారం కానున్నది. ప్రస్తుతమున్న విధానానికి 100 నుంచి 200 శాతం వరకు పెరగనున్నది. గృహాలతో పోలిస్తే దుకాణ, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు భారీగా పన్నుల వడ్డన జరగబోతున్నది. కొద్ది రోజుల్లోనే నూతన విధానం అమల్లోకి రాబోతుండగా ఈ వ్యవహారంపై వివాదం మొదలైంది. పాలకవర్గం సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది. 2012 జనవరిలో గజ్వేల్ మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీగా అప్గ్రేడ్ అయింది. దీంతో నగరపంచాయతీలో ప్రజ్ఞాపూర్తోపాటు ముట్రాజ్పల్లి, క్యాసారం గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. ఫలితంగా పరిధి పెరిగింది. జనాభా 40వేలకుపైగా చేరుకోగా నగరపంచాయతీ పరిధిలో ఇళ్ల సంఖ్య సైతం 9వేలకు పెరిగింది. నగరపంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత తమకు మెరుగైన వసతులు సమకూరుతాయని భావించిన ప్రజలకు సౌకర్యాల మాటేమోగానీ పన్నుల భారం మాత్రం మొదలైంది. ఇప్పటివరకు నగరపంచాయతీలో సాధారణ పన్నుల విధానం అమలులో ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 25 నగరపంచాయతీలకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ పన్నుల భారం విపరీతంగా పెరుగుతున్నది. కొత్త విధానంలో నగరపంచాయతీని 4 జోన్లుగా విభజించారు. ఆ జోన్లలో ఆస్తుల విలువను బట్టి పన్నులను నిర్దారించారు. ఉదాహరణకు మొదటి జోన్లో గతంలో నివాస గృహానికి సెల్లార్, జి ప్లస్-1, రెండు, మూడు ఫ్లోర్లకు ఒక చదరపు మీటర్కు గతంలో రూ. 5చొప్పున పన్ను వసూలు చేస్తే ప్రస్తుతం అది రూ. 10కి చేరుకుంది. అంటే పెరుగుదల 100శాతం అన్నమాట. దుకాణాలు, ఆఫీసులు, బ్యాంకులు, హోటళ్లు, నర్సింగ్హోంలు, గోదాములు, సినిమాథియేటర్లు, విద్యాసంస్థలు, లాడ్జింగ్లు, రెస్టారెంట్లు, కమ్యునిటీహాల్లు, ఆడిటోరియం, పెట్రోల్బంక్, సెల్టవర్స్ లాంటి వ్యాపార, వాణిజ్య భవనాలపై 200శాతానికిపైగా పెరుగుదల ఉండబోతున్నది. ఈ పెరుగుదల గ్రేడ్-1 మున్సిపాలిటీల్లో సైతం లేదని తెలుస్తున్నది. నాలుగుజోన్లలో ఇప్పటికే నగరపంచాయతీ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి పన్నుల పెంపునకు సంబంధించి విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు సైతం అందించారు. ఇదే క్రమంలో గురువారం జరిగిన నగరపంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఈ వ్యవహారం వివాదస్పదమైంది. కౌన్సిలర్లు ముక్తకంఠంతో పన్నుల విధానాన్ని వ్యతిరేకించారు. తుది నిర్ణయం ప్రభుత్వానిదే... గజ్వేల్ నగరపంచాయతీలో కొత్త పన్నుల విధానంపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని అధికారులు వెల్లడిస్తున్నారు. అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం... కొత్త ఆస్తి పన్ను అమలుకు సంబంధించి మాకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. దీనిపై అభ్యంతరాలు వస్తే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నడుచుకుంటాం. -నగరపంచాయతీ కమిషనర్ ఎన్. శంకర్ -
రన్వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందే..
* శంషాబాద్ విమానాశ్రయానికి తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం * ఢిల్లీ, బేగంపేట ఎయిర్పోర్ట్లు పన్ను కడుతున్నట్లు స్పష్టీకరణ * ఆస్తి పన్ను పరిధిలోకి రావన్న జీఎంఆర్ అభ్యర్థనల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: రన్వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందేనని శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ యాజమాన్యం ‘జీఎంఆర్’కు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అవసరాలకు వినియోగించే ‘రన్ వే’తో పాటు ఎయిర్పోర్ట్లో వాహనాల పార్కింగ్కు వినియోగించే ‘ట్యాక్సీ వే’లు సైతం ఆస్తి పన్ను పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇందుకోసం దేశంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు స్థానిక విమానాశ్రయాలపై విధిస్తున్న రన్వే, ట్యాక్సీ వేకు సంబంధించిన ఆస్తి పన్నుల సమాచారాన్ని ప్రభుత్వం తెప్పించుకుంది. ఆ వివరాలను శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యానికి తెలియజేస్తూ.. పన్నులు చెల్లించాల్సిందేనని కోరింది. వాస్తవానికి మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆస్తుల జాబితాలో విమానాశ్రయాల రన్వేలు, ట్యాక్సీవేలు లేవు. అయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వసూలు చేస్తుండడంపై గతంలో కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రెండేళ్ల నుంచి విమానాశ్రయ యాజమాన్యం వీటిపై ఆస్తి పన్ను చెల్లించడం ఆపేసింది. పన్ను విధింపుపై పునఃపరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అధ్యయనానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రన్వేలు, ట్యాక్సీవేలపై దేశవ్యాప్తంగా ఆస్తి పన్ను విధిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఈ కమిటీ కీలక ఆధారాలను సేకరించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నగరంలోని బేగంపేట విమానాశ్రయాలకు లేఖలు రాసి రన్వేలు, ట్యాక్సీవేలపై ఆస్తి పన్ను విధిస్తున్నట్లు సమాచారాన్ని రాబట్టింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యం సైతం ఆస్తి పన్ను కట్టాల్సిందేనని కమిటీ తేల్చిచెపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. త్వరలో ప్రత్యేక రేటు ఖరారు శంషాబాద్ విమానాశ్రయ పరిధిని ప్రభుత్వం ‘నోటిఫైడ్ ఏరియా కమిటీ’గా ప్రకటించడంతో పాటు ఓ మున్సిపల్ కమిషనర్ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ కమిటీ విమానాశ్రయ యాజమాన్యం నుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తుంది. రన్వే, ట్యాక్సీవే మినహా ఇతర ఆస్తులపై జీఎంఆర్ పన్నులు చెల్లిస్తోంది. తాజాగా రన్వే, ట్యాక్సీవేపై సైతం పన్నులు వసూలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ప్రత్యేక రేటును త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనుంది. -
జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన బకాయిల మొత్తం ఎంత..?
సాక్షి, హైదరాబాద్ : ‘గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వసూలు చేసే ఆస్తిపన్నులో మీకు రావాల్సిన వాటా ఎంత..? మీరు చేపట్టే అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ నుంచి వచ్చే వాటానే ఆధారామా..? అది రాకపోవడం వల్ల ఎక్కడెక్కడ.. ఎంత విలువ చేసే పనులు నిలిచిపోయాయో చెప్పండి.’ అని హైకోర్టు సోమవారం జలమండలిని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్ను దాఖలు చేయాలని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ వసూలు చేస్తున్న ఆస్తి పన్ను నుంచి జలమండలికి 30 శాతం వాటా రావాల్సి ఉందని, 2009 నుంచి జీహెచ్ఎంసీ ఈ వాటాను చెల్లించడం లేదని, వీటినే జలమండలి బకాయిలను చెల్లించేలా జీహెచ్ఎంసీని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన జె.ఆర్.కరుణాకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. -
ఆస్తి పన్ను మోత
30 శాతం వరకు బాదుడుకు రంగం సిద్ధం ⇒మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో సర్కారు నిర్ణయం ⇒ఏడు నెలల కిందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ⇒ఇన్నాళ్లుగా పెండింగ్లో.. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తెరపైకి ⇒ వేతనాలు పెంచే యోచన.. భారాన్ని తట్టుకునేందుకు ఆస్తి పన్ను సవరణ ⇒ కొత్తగా ఏర్పడ్డ నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే పెంపు ⇒ జీహెచ్ఎంసీ, 5 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనవరి నుంచి పెంపు! హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలోనే ఆస్తిపన్ను మోత మోగనుంది. పురపాలక సంస్థల్లో దాదాపు 30 శాతం పన్ను బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. పదమూడేళ్ల తర్వాత నివాస గృహాలపై పన్ను పోటు పడనుంది. ఆస్తిపన్ను పెంపుపై కొద్దినెలల కిందే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినా.. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, వేతనాల పెంపు నేపథ్యంలో ఇప్పుడు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 23 కొత్త నగర పంచాయతీలు, 3 కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను సవరణ గత ఏడాదే అమల్లోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ సహా మిగతా 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నులను సవరించనున్నారు. ఏడు నెలల కిందే..: రాష్ట్రంలో ఆరు నగర పాలక సంస్థలు, 62 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 68 పురపాలక సంస్థలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన 31 నగర పంచాయతీల్లో మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా ఆస్తిపన్నుల పెంపును గతేడాది అక్టోబర్లోనే ప్రభుత్వం అనుమతించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మిగతా పురపాలక సంస్థల్లో ఆస్తిపన్నుల పెంపు కోసం గత జనవరిలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు అందాయి. అక్టోబర్ 1 నుంచే పన్నుల పెంపును అమల్లోకి తెచ్చేందుకు పురపాలక శాఖ ప్రభుత్వ అనుమతి కోరింది. అప్పటి నుంచి పెండింగ్లో ఉంచిన ఈ ప్రతిపాదనలపై పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఆస్తిపన్నుల సవరణకు ప్రభుత్వం అనుమతించినా.. శాస్త్రీయ పద్ధతిలో ప్రక్రియ పూర్తయి, అమల్లోకి వచ్చేందుకు దాదాపు ఆర్నెల్లు పడుతుంది. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులకు డిమాండ్ నోటీసుల జారీ, చెల్లింపులకు గడువు, వసూళ్ల తర్వాతే మున్సిపాలిటీల ఖాతాల్లో నిధులు చేరుతాయి. ఈ లెక్కన పన్నుల పెంపునకు అనుమతించాక ఏడాది తర్వాతగానీ మున్సిపాలిటీలకు లబ్ధి చేకూరదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 30 శాతం వరకు పన్నులు పెరగవచ్చని పేర్కొంటున్నారు. ఇక పెంచక తప్పదు.. మున్సిపల్ తాత్కాలిక కార్మికుల సమ్మె నేపథ్యంలో.. వారి వేతనాల పెంపుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. తాత్కాలిక కార్మికుల వేతనాలను పురపాలికలే చెల్లిస్తాయి. దీంతో వేతనాల పెంపుపై అన్ని పురపాలక పాలక మండళ్ల అభిప్రాయాన్ని ప్రభుత్వం సేకరించింది. ఆస్తిపన్నులు పెంచకుండా ఉన్నఫళంగా వేతనాలను పెంచితే.. భరించడం తమ వల్ల కాదని పురపాలికలు తేల్చిచెప్పాయి. దీంతో అన్ని పురపాలక సంస్థల ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం వాస్తవ నివేదికను తెప్పించుకోగా... విస్మయకర అంశాలు వెలుగు చూశాయి. అసలు మున్సిపాలిటీలకు ఆస్తిపన్నులే అతిపెద్ద ఆదాయ వనరు. ఏళ్ల తరబడి దీనిని సవరించకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే గ్రాంట్లు సైతం సకాలం అందుతుండక పోవడంతో.. వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు తగినట్లుగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేకపోతున్నాయి. 25 మున్సిపాలిటీలు ప్రస్తుత వేతనాలనే కార్మికులకు సరిగా చెల్లించడం లేదు. మిగతా మున్సిపాలిటీలు సైతం మూడు, నాలుగు నెలలకోసారి కష్టంగా చెల్లిస్తున్నాయి. మున్సిపాలిటీలు నీటి సరఫరా, వీధి దీపాలకు సంబంధించిన రూ.150 కోట్లకుపైగా విద్యుత్ బిల్లులను విద్యుత్ శాఖకు బకాయిపడ్డాయి. ఇంకా ఈఎస్ఐ, పీఎఫ్కు సంబంధించిన బకాయిలూ భారీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. వేతనాల పెంపుతో పాటు ఆస్తిపన్నులు పెంచుకునేందుకు మున్సిపాలిటీలకు అవకాశమివ్వాలని భావిస్తోంది. 13 ఏళ్ల తర్వాత.. శాస్త్రీయంగా ఆస్తిపన్నుల గణనను ప్రవేశపెడుతూ 1990లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దానిప్రకారం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి క్రమం తప్పకుండా ఆస్తిపన్నులను పెంచాలి. కానీ ఆస్తిపన్నుల తొలి సవరణ 1993 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాగా.. తర్వాత ఎనిమిదేళ్లకు 2002 ఏప్రిల్ 1 నుంచి రెండో సవరణను అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు నివాస గృహాలపై ఆస్తిపన్నును పెంచలేదు. అయితే 2007 అక్టోబర్ 1 నుంచి మాత్రం మూడో సవరణగా నివాసేతర కట్టడాలకు మాత్రం ఆస్తిపన్నును సవరించారు. ఆ తర్వాత ఓ సారి ఆస్తిపన్నుల పెంపునకు ప్రయత్నాలు జరిగినా మున్సిపల్, సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. గత ప్రభుత్వాలు వెనక్కితగ్గాయి. -
జీహెచ్ఎంసీ తీరు ఆదర్శనీయం
ప్రధాని మోదీ ప్రశంస సాక్షి,సిటీబ్యూరో: గత దశాబ్ద కాలంగా ఆస్తిపన్నును పెంచకుండానే... ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను దేశంలోని అన్ని పట్టణాలు ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో గురువారం జరిగిన స్మార్ట్సిటీ, అమృత్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. దేశంలోని దాదాపు 500 నగరాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ సాధించిన ప్రగతి, అందుకు అనుసరించిన విధానాలను కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ 2004-05 ఆర్థిక సంవత్సరంలో రూ.166 కోట్లుగా ఉన్న ఆస్తిపన్ను 2014-15లో రూ.1115 కోట్లకు పెరగడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని ప్రశంసించారు. జీహెచ్ఎంసీ సాధించిన ఈ ప్రగతి మిగతా నగరాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయన్నారు. అంతకుముందు వివిధ కార్పొరేషన్లు సాధించిన ప్రగతిని తెలియజేసే ప్రదర్శనను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తిలకించారు. మెరుగైన ప్రజా సదుపాయాలతో పాటు జీహెచ్ఎంసీ సాధించిన ఆర్థిక ప్రగతిని తెలియజేసే పోస్టర్ను కమిషనర్ సోమేశ్కుమార్ ప్రదర్శించి ప్రధానికి, వెంకయ్య నాయుడికి వివరించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు రూ.5కే భోజనం, డ్రైవర్ కమ్ ఓనర్, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీపీ), తదితరమైన వాటి గురించి సోమేశ్ కుమర్ తన పవర్పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. -
15 పూరిళ్లు దగ్థం, రూ.10 లక్షల ఆస్తినష్టం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం గదపువలసలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 15 పూరిళ్లు దగ్థమైయ్యాయి. అంతేకాక 10 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొత్త మునిసిపాలిటీల్లో 1 నుంచి ఆస్తిపన్ను మోత
కొత్త మునిసిపాలిటీల్లో తొలిసారిగా సవరణ గణనలో భారీగా లోపాలుండే అవకాశం అభ్యంతరాలకు నెల రోజుల గడువు ఆ తర్వాత నిర్దేశించిన పన్నులు చెల్లించాల్సిందే హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి కొత్త నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను మోత మోగనుంది. నివాస భవనాలపై సగటున రెండింతలు, వాణిజ్య భవనాలపై మూడింతలకు పైగా పన్నులు పెరగనున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు పెరిగిన పన్నుల వివరాలను సంబంధిత చెల్లింపుదారులకు తెలుపుతూ పురపాలికలు వచ్చే నెల 1 నుంచి ప్రత్యేక డిమాండు నోటీసులు జారీ చేయనున్నాయి. ఈ నోటీసుల్లో ప్రకటించిన ఆస్తి పన్నులపై అభ్యంతరాలు ఉంటే నెల రోజుల వ్యవధిలో అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలి. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని, నిర్దేశించిన మేరకు పన్నులు చెల్లించక తప్పదని రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 27 నగర పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నుల పెంపు 2015-16 నుంచి అమలులోకి రానుంది. వచ్చే నెల 1 నుంచి పెంపు అమలులోకి రానున్న నేపథ్యంలో .. తక్షణమే డిమాండు నోటీసులు జారీ చేసేందుకు ఆయా మునిసిపాలిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఆస్తి పన్నుల గణనలో భవనాల వినియోగం(నివాస/వాణిజ్య), ప్రాంతం(ప్రధాన/సాధారణ), భవన కొలతలు కీలకం. పన్నుల గణన సందర్భంగా ఏ ఒక్క అంశంలో పొరపాటు జరిగినా చెల్లించాల్సిన పన్నుల్లో భారీ తేడా రావచ్చు. ప్రతి మునిసిపాలిటీలో వేల సంఖ్యలో భవనాల కొలతలు స్వీకరించాల్సి ఉండడం, సరిపడా సిబ్బంది లేకపోవడం, ఉన్న సిబ్బందికి అవగాహన లేకపోవడం, కొత్త మునిసిపాలిటీల్లో తొలిసారిగా గణన చేస్తుండడం .. తదితర కారణాలతో ఆస్తి పన్నుల సవరణ ప్రక్రియలో లోపాలు జరిగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. అసాధారణ రీతిలో పన్నులు పెరిగినట్లు అనుమానం కలిగినా, అభ్యంతరాలు ఉన్నా, సంబంధిత చెల్లింపుదారులు పునః పరిశీలన కోరుతూ స్థానిక మునిసిపల్ కమిషనర్కు నెల రోజుల్లో అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అర్జీని మునిసిపల్ కమిషనర్ 15 రోజుల్లో పరిష్కరిస్తారు. అయినా.. న్యాయం జరగలేదని భావిస్తే పన్ను చెల్లింపుదారులు రాష్ట్ర పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకుల(హైదరాబాద్/వరంగల్)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకున్న నిర్ణయంపై కూడా సంతృప్తి కలగకపోతే పునః సమీక్ష కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్/ఆస్తి పన్నుల బోర్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు అన్ని స్థాయిల్లోని అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుదకు నిర్దేశించిన మొత్తంలో పన్ను వసూలు చేస్తారు. ఎస్సారెస్పీ నీటి కోసం ఆందోళన ఎమ్మెల్యేను అడ్డుకుని నడిపించిన అన్నదాతలు బాల్కొండ: నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయూలని డిమాండ్ చేస్తూ బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి, బాల్కొండ, మోర్తాడ్ మండలాల రైతులు శనివారం ఆందోళనకు దిగారు. నీరు విడుదల చేయకపోవడంతో చేతికందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నవమి ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రాజెక్టు వద్ద ఉన్న రామాలయూనికి వస్తున్నట్లు తెలుసుకున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకంటానని చెప్పినా వినలేదు. ఒక దశలో ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెడ్ రెగ్యూలేటర్ వరకు కాలి నడకన వెళ్దామని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే మండుటెండలో ప్రాజెక్టు కార్యాలయం వరకు నడిచి వచ్చారు. అధికారులతో మాట్లాడి వెంటనే 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేరుుంచారు. -
లక్ష్యం రూ.1587 కోట్లు
పన్నుల వసూలుకు జీహెచ్ఎంసీ భారీ కసరత్తు ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం నెలాఖరులోగా లక్ష్యం సాధించే యత్నం వివిధ విభాగాల భాగస్వామ్యం చలించని మొండి బకాయిదారులు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను లక్ష్యం రూ.1587 కోట్లు. ఇప్పటి వరకూ వసూలైన మొత్తం రూ.804 కోట్లు. బకాయిలనేవి లేకుండా చేయాలనేది కమిషనర్ ధ్యేయం. ఈ నేపథ్యంలో లక్ష్య సాధనకు జీహెచ్ఎంసీ యంత్రాంగం రెండు నెలలుగా ముమ్మర కసరత్తు చేస్తోంది. వందల మందిని రంగంలోకి దింపింది. సర్కిళ్ల వారీగా నోడల్ ఆఫీసర్లను, వారిపైన సూపర్వైజర్లను ఉన్నతాధికారులు నియమించారు. ఆస్తి పన్ను వసూలు చేసే రెవెన్యూతో పాటు ఇతర విభాగాల సిబ్బందిని భాగస్వాములను చేశారు. ఈసారి పన్నులతో పాటు బకాయిల వసూలుకు అధికారులు కొంత దూకుడు చూపించారు.ఇళ్ల ముందు చెత్త డబ్బాలు ఉంచడం... విద్యుత్ కనెక్షన్లు తొలగించడం... వ్యాపారాల సంస్థలను మూసివేయడం వంటివి చేశారు. దీనికి న్యాయస్థానాల నుంచి అక్షింతలూ వేయించుకున్నారు. అయినప్పటికీ మహా మొండి బకాయిసురులు దిగి రావడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు గడువు 18 రోజులు (మార్చి 31 వరకు) ఉంది. వసూలు కావాల్సిన ఆస్తిపన్ను మొత్తం ఇంకా రూ.783 కోట్లు. మరి గడువులోగా అంత మొత్తం సాధించడం ఎంతవరకూ సాధ్యమవుతుందో చూడాలి. వసూళ్లలో నిమగ్నమైన అధికారులు... పర్యవేక్షక అధికారులు : 24 మంది నోడల్ అధికారులు : 33 మంది ఔట్రీచ్ సిబ్బంది : 1500 మంది వీరంతా కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. నిత్యం కమిషనర్కుసమాచారం ఇవ్వడం... సమీక్షలు... బకాయిల వసూలుకు కొత్త దారులు ఎన్నుకోవడం...ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొండొకచో బడాబాబుల వైపు పోకుండా చిరుజీవులపై ప్రతాపం కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్కిళ్ల వారీగా టాప్ -1000 బకాయిదారులపైనే ప్రతాపం చూపమంటే.. ఎవరు పడితే వారిపై జులుం చెలాయిస్తున్నారనే చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గృహస్తుల పైనా ఆరోపణలూ ఉన్నాయి. దాంతోఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వారి ఉత్సాహాన్ని నీరుగార్చలేక మౌనంగా ఉంటున్నారు. మాఫీపై ఆశలు పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆశించిన ప్రగతి సాధించకపోవడానికి కారణాలనేకం. బకాయిలు చెల్లించకపోయినా తమనెవరూ ఏమీ చేయలేరనే బడాబాబుల ధీమా... దిగువ మధ్య తరగతి వరకూ ఆస్తిపన్ను మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన .... వసూళ్లపై కొంత ప్రభావం చూపుతోంది. సమస్యంతా మొండి బకాయిసురులతోనేనని అధికారులు సైతం అంటున్నారు. సకల సదుపాయాలు అనుభవించే వారే పన్ను చెల్లింపులకు దూరంగా ఉండడం విస్తుగొల్పుతోంది. మరోవైపు ఏది ఏమైనా గడువులోగా వసూలు చేయగలమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగుల వినూత్న ప్రదర్శన గచ్చిబౌలి: ఆస్తి పన్ను బకాయిల వసూలుకు జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్-11 అధికారులు వినూత్న రీతిలో వ్యవహరించారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ ఎదుట ప్ల కార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుతో హోటల్ యాజామాన్యం ఆగమేఘాల మీద రూ.50 లక్షల చెక్ను అందజేశారు. ఈ హోటల్ యాజమాన్యం 2014-15 సంవత్సరానికి రూ.1.47 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉంది. ఇప్పటికే రూ.40 లక్షలు చెల్లించారు. రూ.కోటి 7 లక్షలు బకాయి ఉన్నారు. దీనికోసం నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే రూ.50 లక్షల చెక్ను అందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్-11 అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ కుమార్, లెసైన్స్ ఆఫీసర్ రవికుమార్, ఉప వైద్యాధికారి రవి, వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ వకీల్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సురేందర్రెడ్డి, సంజయ్, ఉదయ్కుమార్ పాల్గొన్నారు. -
‘చెత్త’ ఆదేశాలు ఇవ్వలేదు: సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను చెల్లించనివారి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ముందు చెత్త డబ్బాలుంచాలని తాను ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేశ్కుమార్ హైకోర్టుకు బుధవారం నివేదించారు. ఇలా చెత్త డబ్బాలుంచుతున్నారని పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుని చట్ట ప్రకారం వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అందువల్ల ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యాన్ని మూసివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇటీవల ఈ అంశంపై న్యాయవాది బాలాజీ వదేరా హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కౌంటర్ దాఖలు చేశారు. -
మీది ‘చెత్త’ ఐడియానే..!
ఆస్తి పన్ను చెల్లించని వారి ఇంటి ముందు చెత్త డబ్బాలు పెడతారా..? జీహెచ్ఎంసీ నిర్ణయంపై హైకోర్టు మండిపాటు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ‘చెత్త ఐడియా’ పై హైకోర్టు మండిపడింది. ఆస్తి పన్ను చెల్లించని వారి ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాల ముందు జీహెచ్ఎంసీ అధికారులు చెత్త డబ్బాలను ఉంచడాన్ని తప్పు పట్టింది. ఈ చర్యను అనాగరికమైనదిగా పేర్కొంది. వెంటనే చెత్త డబ్బాలను తొలగించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఆస్తి పన్ను చెల్లించలేదంటూ తన దుకాణం ముందు జీహెచ్ఎంసీ అధికారులు చెత్త డబ్బాను ఉంచడాన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్కు చెందిన అనిల్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆస్తి పన్ను వసూలకు ప్రత్యామ్నాయాలు ఏమీ లేవా..? అంటూ జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన మీరే చెత్త డబ్బాలను దుకాణాల ముందు ఉంచుతారా అని నిలదీసింది. ఇలా చేయాలని ఏ చట్టం చెబుతోందంటూ అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్ దుకాణం ముందుంచిన డబ్బాను గంటలోపు తొలగించకపోతే కమిషనర్, ఇతర అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని స్పష్టం చేస్తూ విచారణను గంటకు వాయిదా వేసింది. గంట తరువాత కేసు విచారణకు రాగా, పిటిషనర్ దుకాణం ముందున్న డబ్బాను తొలగించేందుకు చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం కేసు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. -
'ఆస్తి పన్ను వసూళ్లపై వేధింపులు తగదు'
హైదరాబాద్ సిటీ(అబిడ్స్): ఆస్తి పన్ను చెల్లించడం లేదని ప్రజలను పలు విధాలుగా జీహెచ్ఎంసీ కమిషనర్ వేధిస్తున్నారని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సాజిద్ అలీ పేర్కొన్నారు. మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించడంలేదని వ్యాపారులను, స్థానిక ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు వేదించడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంగల్హట్లోని తన కార్యాలయంలో సాజిద్అలీ విలేకరులతో మాట్లాడుతూ... నాలుగేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించనప్పడు అలాంటి వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీ అధికారులను ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లుగా గ్రేటర్లో జీహెచ్ఎంసీ పనిచేయదంలేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా జీహెచ్ఎంసీ నిద్రపోయి ఈ రోజు కళ్లు తెరిస్తే ప్రజలు జీహెచ్ఎంసీపై తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. ఇలా ప్రజలను వేధిస్తే తాము ట్యాంక్బండ్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిచారు. -
'గంటలోగా చెత్తడబ్బాలను తొలగించండి'
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల ఇళ్ల ముందు జీహెచ్ఎంసీ చెత్తడబ్బాలు ఉంచటంపై న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నేరం చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీని హెచ్చరించింది. గంటలోగా చెత్తడబ్బాలను తొలగించాలని హైకోర్టు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఆస్తి పన్ను వసూలుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, అంతేకానీ చెత్తడబ్బాలను ఇళ్ల ముందు ఎలా పెడతారని ప్రశ్నించింది. చెత్త డబ్బాలు తొలగించకపోతే కమిషనర్, అధికారులపై చర్యలుకు ఆదేశిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. కాగా ఆస్తిపన్ను వసూలుకు జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. -
ట్యాక్స్ చెల్లించాలంటే హిజ్రాలు రావలసిందేనా ?
ఆస్తి, నీటి... పన్నులు సకాలంలో చెల్లిస్తే పౌర సేవలు సత్వరం అందించేందుకు నగరపాలక సంస్థలు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతూనే ఉంటారు. మధ్య తరగతి వారు పన్నులు చెల్లించకపోతే నయానో భయానో బెదిరిస్తే చాలు సదరు పన్నులు ఒక రోజు ఆలస్యంగా అయినా కడుతుంటారు. అదే కోట్లకు పడగలెత్తిన వారు మాత్రం పన్నులు కట్టేందుకు ముందుకు రావడం లేదు. భవనాలు సీజ్ చేస్తామని, నల్లా కనెక్షన్ కట్ చేస్తామని, భవనాలు స్వాధీనం చేసుకుంటామని... బెదిరించినా బడాబాబులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. దాంతో వారి నుంచి రావాల్సిన పన్ను బకాయిలు కోట్లాది రూపాయిలు కొండలా పేరుకుపోయాయి. కోట్లలో బకాయిలు పడ్డ పన్నులు వసూలు చేసేందుకు కార్పొరేషన్ ఓ ఐడియాను అమలు చేసింది. ఇందు కోసం 'చెత్త డబ్బా'నే వాడుకుంది. జీహెచ్ఎంసీకి భారీగా బకాయిలు చెల్లించాల్సిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ల గుమ్మం ముందు ఏకంగా పెద్దపెద్ద చెత్త డబ్బాలను పెట్టింది. దీంతో సిగ్గు పడి కొంతమంది ఈ 'చెత్త' గోల ఎందుకని పన్నులు చెల్లిస్తుంటే...మరికొందరు ఇది మామూలే అని దులిపేసుకుంటున్నారు. దాంతో పన్నుల కోసం వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులను చెత్తడబ్బా కూడా వర్క్ అవుట్ కాకపోవటంతో నీరసపడిపోతున్నారు. ఇదే విషయంలో పొరుగు రాష్ట్రం తమిళనాడులోని చెన్నై నగర పాలక సంస్థ ఓ అడుగు ముందుకేసింది. మొండి బకాయిల వసూలు కోసం వినూత్న పద్థతిని అమల్లో పెట్టింది. కార్పొరేషన్కు పన్ను ఎగవేసిన బడాబాబుల భారీ కాంప్లెక్స్లు, ఎస్టేట్ల ఎదుట హిజ్రాలతో గానా భజాన పెట్టింది. దీంతో హిజ్రాల దెబ్బకు దిమ్మదిరిగిన బడాబాబులు పన్ను చెల్లించేందుకు చెన్నై కార్పొరేషన్కు క్యూ కడుతున్నారు. పన్నులు కట్టండి అని నయానో భయానో చెప్పిన దారికి రాని బాబులు హిజ్రాల దెబ్బకు దిగిరావడంతో చెన్నై కార్పొరేషన్ అధికారులకు ఆనందం అవధులు లేకుండా పోయింది. దీంతో బడాబాబుల నుంచి పన్నులు వసూళ్ల కోసం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్.. హిజ్రాలను కాంట్రాక్ట్పై నియమించినట్లు సమాచారం. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెన్నైలో అమలు చేసిన టెక్నిక్ను మనం కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చెత్తడబ్బాతో కాని పని హిజ్రాల దెబ్బతో అయినా పన్నులు వసూలు అయితే చాలనుకుంటున్నారు సదరు అధికారులు. -
‘చెత్త’ యోచనకు స్వస్తి
బంజారాహిల్స్: ఆస్తి పన్ను బకాయిదారులను దారికి తెచ్చుకునేందుకు ఇళ్లు, షాపులు, బ్యాంక్ల ముందు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను (డంపర్ బిన్లు) శుక్రవారం ఉదయం సంబంధిత అధికారులు తొలగించారు. బకాయిదారుల నుంచి పన్నులు రాబట్టేందుకు సర్కిల్-10 అధికారులు గురువారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడలలో 12 చోట్ల చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ల ముందు, ఇళ్ల గేట్ల మధ్య వీటిని పెట్టడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు హుటాహుటిన వీటిని తొలగించారు. -
ఆస్తిపన్నుకూ ‘ఆధార్’మే
ఏలూరు : పట్టణాల్లోని ఇళ్లు, స్థలాలు, వాణిజ్య సముదాయూలు, ఇతర ఆస్తులకు సంబంధించిన యజమానులు తమ ఆస్తుల వివరాలతో ఆధార్ నంబర్ను విధిగా అనుసంధానించుకోవాలనే నిబంధన అటు మునిసిపాలిటీలను, ఇటు యజమానులను అవస్థల పాలుచేస్తోంది. ఆధార్ అనుసంధానం చేరుుంచిన వారినుంచే ఇంటి, ఆస్తి పన్నులను వసూలు చేస్తామని మునిసిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యజమానులు ఆధార్ అనుసంధానం చేరుుంచకపోతే, వాటిలో అద్దెకు ఉంటున్న వారి పేర్లతో గల ఆధార్ నంబర్లను సంబంధిత ఆస్తులతో నమోదు చేసుకుంటామని కూడా చెబుతున్నారు. ఆస్తుల యజమానుల్లో కొందరు విదేశాల్లో ఉండటం, ఇంకొందరు దూర ప్రాంతాల్లో నివసిస్తుండటంతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ముందుకు సాగటం లేదు. మరోవైపు మునిసిపల్ అధికారుల హెచ్చరికలు ఆస్తుల యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారుు. ఆధార్ అనుసంధానం ఎటు తిరిగి ఎటు వస్తుందోననే ఆందోళన వారిని వెన్నాడుతోంది. పన్నుల వసూళ్లపైనా ప్రభావం మరోవైపు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఆస్తి పన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏలూరు నగరపాలక సంస్థతోపాటు అన్ని పురపాలక సంఘాల్లో ఆశించిన మేర పన్నులు వసూలు కావడం లేదు. ఆస్తి వివరాలను సమర్పించి ఆధార్ నంబర్తో అనుసంధానం చేరుుంచుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన వాటి యజమానుల్లో నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం రూ.21.82 కోట్ల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ కేవలం రూ.13.87 కోట్లు మాత్రమే వసూలైంది. సగటున 62.94 శాతం మేర పన్నులు వసూలైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నారుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి సుమారు 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా ఆస్తి పన్నులను పూర్తిస్థారుులో వసూలు చేసే పరిస్థితి లేదని మునిసిపల్ వర్గాలు పేర్కొంటున్నారుు. అపరాధ రుసుం విధింపుతో బెంబేలు పురపాలక సంఘాల్లో పన్ను బకారుుల చెల్లింపులకు అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ నెలలో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గడువు త క్కువ ఇవ్వడంతోపాటు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంతో ఆస్తుల యజమానులు బకారుుల చెల్లింపు విషయంలో పెద్దగా స్పందించలేదు. దీంతో అప్పటినుంచి పన్నుల వసూళ్లు మందగించాయి. కాగా, సకాలంలో పన్నులు చెల్లించని వారినుంచి అపరాధ రుసుం వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు భోగట్టా. అపరాధ రుసుం నుంచి మినహారుుంపు ఇస్తే తప్ప పన్నుల వసూళ్లు ఊపందుకునే అవకాశం లేదని మునిసిపల్ వర్గాలు పేర్కొంటున్నారుు. దీనిపై ప్రభుత్వం ముందుగా ప్రకటన చేస్తే వసూళ్లలో పురోగతి ఉంటుందని మునిసిపల్ పాలకవర్గాలు భావిస్తున్నారుు. తణుకు ప్రథమం.. జంగారెడ్డిగూడెం అథమం తణుకు పురపాలక సంఘం 86.12 శాతం మేర పన్నులు వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలవగా, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ 32.82 శాతం వసూలు చేసి చివరి స్థానంలో ఉంది. ఏలూరు నగరపాలక సంస్థ 54.08 శాతం వసూళ్లతో కాస్త ఫరవాలేదన్న విధంగా ఉంది. భీమవరంలో 70.12 శాతం, తాడేపల్లిగూడెంలో 71.39 శాతం, పాలకొల్లులో 40.92 శాతం, నరసాపురంలో 72.20 శాతం, నిడదవోలులో 73.62 శాతం, కొవ్వూరులో 56.06 శాతం పన్నులు వసూలయ్యూయి. -
ఆస్తి పన్ను బకాయిలపై జరిమానా మాఫీ
మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తేనే మాఫీ అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే ప్రస్తుత సంవత్సర పన్నుతో పాటు పాత బకాయిలను కూడా కలిపి ఒకేసారి మొత్తం పన్ను చెల్లిస్తేనే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇది అమలవుతుందని తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వచ్చే మార్చి 31వ తేదీని తుది గడువుగా పేర్కొంది. పురపాలక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను ప్రోత్సహించేందుకు అపరాధ రుసుమును మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను సీఎం శుక్రవారం ఆమోదించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 68 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై అపరాధ రుసుమును మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అపరాధ రుసుముతో పాత బకాయిలను చెల్లించిన వారికీ ఈ మాఫీ వర్తించనుంది. అయితే ఈ మాఫీ అయ్యే అపరాధ రుసుమును నగదు రూపంలో తిరిగి చెల్లించకుండా.. వచ్చే ఏడాది పన్నుల్లో సర్దుబాటు చేస్తారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో గృహ, వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఆస్తి పన్నుల బకాయిలు 51.42 కోట్ల వరకు ఉన్నాయి. సాధారణంగా బకాయిలపై 2 శాతం అపరాధ రుసుము విధిస్తారు. ఈ లెక్కన రూ. 9 కోట్లకు పైగా అపరాధ రుసుము మాఫీ కానుంది. -
ఎంత? ఎలా?
ఆస్తిపన్ను... పెనాల్టీ రద్దుపై అధికారుల చర్చ సీఎం ప్రకటనతో కసరత్తు లబ్ధిదారులకు వర్తించే ప్రయోజనంపై లెక్కలు నివేదిక తయారీలో నిమగ్నం సిటీబ్యూరో: గ్రేటర్లోని ఆస్తి పన్ను బకాయిదారులకు పెనాల్టీలతో పాటు పేద ప్రజలకు ఆస్తిపన్ను సైతం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ... ఎంతమందికి? ఏమేరకు ప్రయోజనం కలుగనుందనే అంశంపై జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేదలుగా ఏ స్థాయి వారినిపరిగణనలోకి తీసుకోవాలనే అంశంలో స్పష్టత లేదు. దీంతో ఆస్తిపన్ను రూ.100 నుంచి రూ.5000 లోపు వారి వరకు వివిధ స్థాయిల్లో మినహాయిస్తే.. ఎంతమంది లబ్ధి పొందుతారు? జీహెచ్ఎంసీకి ఏమేరకు ఆదాయం తగ్గుతుందనే విషయమై నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రూ. 5 వేల లోపు ఆస్తిపన్ను ఉన్న వారందరికీ రద్దు చేస్తే దాదాపు పది లక్షల గృహ యజమానులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను రూపేణా రావాల్సిన మొత్తంలో దాదాపు రూ.200 కోట్లు లోటు వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలా రూ.4 వేల లోపు వారికైతే ఎంత? రూ.2వేల లోపు వారికైతే ఎంతమందికి మేలు కలుగనుందనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఆస్తిపన్ను మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని నగరంలో అన్ని ప్రాంతాల వారికి వర్తింపజేస్తారా? మురికివాడల్లోని భవనాలకే పరిమితం చేస్తారా అనే అంశంలోనూ స్పష్టత లేదు. ఇది సీఎం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. గతంలోనూ... ఇదిలా ఉండగా రూ.4 వేల లోపు ఆస్తి పన్ను రద్దు చేయాలని గత పాలక మండలి హయాంలో (నవంబర్లో) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని అమలుకు ప్రభుత్వ ఆమోదంతో పాటు జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేయాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎవరికి ప్రయోజనం? బస్తీలతో పాటు రూ.4 వేల లోపు ఉన్న వారందరికీ పన్ను మినహాయింపునిస్తే... సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వారికీ ప్రయోజనం కలుగుతుంది. సంపన్న కాలనీల్లో ప్లింత్ ఏరియా 700 ఎస్ఎఫ్టీ నుంచి సాధారణ కాలనీల్లోని 950 ఎస్ఎఫ్టీ వారికి, స్లమ్స్లోని 1100 ఎస్ఎఫ్టీ వరకు ఆస్తిపన్ను రద్దవుతుందని అంచనా. వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహ దారిలో ఒకవిధంగా... కాలనీలో మరో విధంగా ఆస్తి పన్ను ఉంది. బస్తీలో ఎస్ఎఫ్టీకి సగటున 90 పైసలు ... సంపన్న కాలనీల్లో రూ.1.25గా ఉంది. మినహాయింపు ఇలా... జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 202 -ఎ (1) ప్రకారం యాన్యువల్ రెంటల్ వాల్యూ రూ.600 వరకు నివాస గృహాలకు ఆస్తిపన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. సెక్షన్ 202 ఎ (2) ప్రకారం పట్టణ పేదల కోసం నిర్మించిన ఇళ్లకు అర్థ సంవత్సరానికి కేవలం రూ.2 వంతున పన్ను వసూలు చేయవచ్చు. రూ.4 వేల లోపు వారికి మినహాయింపు నివ్వాలనుకుంటే... యాన్యువల్ రెంటల్ వాల్యూ రూ.7500 వరకు ఉన్న నివాస భవనాలకు వర్తిస్తుంది. ప్రభుత్వం చెల్లించాల్సిందే.. ఇదిలా ఉండగా, ఆస్తిపన్ను మినహాయింపుతో జీహెచ్ఎంసీ ఖజానాకు తగ్గే ఆదాయాన్ని ప్రభుత్వం గ్రాంట్గా అందజేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు ఈ నిర్ణయం ఆస్తిపన్ను వసూళ్లపైనా ప్రభావం చూపనుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సీఎం ప్రకటనతో చాలామంది పన్ను చెల్లించకపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లకు జీహెచ్ఎంసీ భారీ ఎత్తున యత్నిస్తున్న తరుణంలో సీఎం ప్రకటన అధికారులను ఇరకాటంలో పడేసింది. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలు: 13.65 లక్షలు ఇందులో నివాస గృహాలు: 11.50 లక్షలు రూ. 5వేల లోపు ఉన్నవి: 10 లక్షలు(దాదాపు) రూ.5 వేల లోపు భవనాల ద్వారా వచ్చే ఆస్తిపన్ను: దాదాపు రూ. 200 కోట్లు