పెద్దకర్రతో కొట్టబోయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా? | Tollywood Director Rajamouli Video Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Rajamouli: దర్శకుడు రాజమౌళికి ఇంత కోపమా?.. వీడియో వైరల్!

Sep 11 2024 4:22 PM | Updated on Sep 11 2024 5:53 PM

Tollywood Director Rajamouli Video Goes Viral In Social Media

టాలీవుడ్ దర్శకధీరుడు స్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను విజయేంద్రప్రసాద్ అందించారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ‍అడ్వెంచర్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వారంలో టాలీవుడ్‌ మూవీ మత్తువదలరా 2 విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీసింహా హీరోగా నటించారు. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళిని కలిసి కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి వద్దకు వెళ్లిన మత్తువదలరా టీమ్‌ ఎస్ఎస్ఎంబీ29 గురించి అప్‌డేట్‌ అడిగారు. దీంతో కోపానికి గురైన రాజమౌళి పెద్ద కర్ర చేతపట్టుకుని.. అప్‌డేట్ కావాలా అంటూ వారిని కొట్టేందుకు యత్నించారు. అయితే ఇదంతా కేవలం సరదాగా చేశారు. మత్తువదలరా-2 ప్రమోషన్స్‌ కోసం ఇలా వెరైటీగా ట్రై చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: మత్తువదలరాని ఫ్రాంచైజీలా కొనసాగిస్తాం: శ్రీ సింహా)

కాగా.. శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా 2. ఈ మూవీని రీతేష్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కించారు. 2019లో వచ్చిన మత్తువదలరా-2 చిత్రానికి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ కాగా.. ప్రభాస్, రాజమౌళి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement