రిజర్వాయర్ నిర్మిస్తే మేలు
మాకు వడ్డేపల్లి మండలం 26 డిస్ట్రిబ్యూటరీ కింద భూమి ఉంది. అందులో ప్రస్తుతం 5 ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేశాను. కాగా ఆర్డీఎస్ కెనాల్ ద్వారా వచ్చే నీటిపై ఆధారపడే పంటలు సాగు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కెనాల్లో నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి.ప్రతి ఏటా రెండో పంట వేయాలంటే భయంగానే ఉంటుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్మించినప్పటికీ, రిజర్వాయర్ లేకపోవడంతో దాని వల్ల కలిగే ప్రయోజనం నామమాత్రంగానే ఉంటుంది. రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందాలంటే రిజర్వాయర్ నిర్మించాలి.
– రంగారావు, రైతు, శాంతినగర్
Comments
Please login to add a commentAdd a comment