గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు

Published Fri, Mar 7 2025 9:36 AM | Last Updated on Fri, Mar 7 2025 9:36 AM

-

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల/ కళాశాలల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

ఇన్‌స్పైర్‌ అవార్డులకు 9 ప్రాజెక్టులు ఎంపిక ...

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ఇన్‌స్పైర్‌ అవార్డులకు జిల్లాలోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యార్థులు రూపొందించిన 9 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని డీసీఓ డా.ఐ శ్రీదేవి తెలిపారు. అలాగే టీసీఎస్‌ నిర్వహించిన గ్లోబల్‌ ఇన్నోవేటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (జీఓఐటీ) కాంపిటీషన్స్‌లో 373 ప్రాజెక్టుల్లో ఫైనల్‌కు మూడు ఎంపిక అయ్యాయన్నారు. ఇందులో కర్నూలు జిల్లాలోని దిన్నెదేవరపాడు గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉండటం హర్షణీయమన్నారు. ఈ విద్యార్థులు ఈ నెల 25వ తేదీన వర్చువల్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement