24న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

24న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

Published Wed, May 22 2024 5:05 AM | Last Updated on Wed, May 22 2024 5:05 AM

-

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఈ నెల 24న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తునట్లు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 11 గంటలకు పరీక్ష జరుగుతుందని విద్యార్థులను 9.30 గంటలకు పరీక్ష కేంద్రంలోనికి వదులుతామన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్‌ బ్లాక్‌పెన్సిల్‌, ఎరేజర్‌, బ్లాక్‌పెన్నును వెంట తీసుకురావాలనాన్నారు. హాల్‌టికెట్లు ఆన్‌ఆలైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

సోనామసూరి ధర రూ.2,419

దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మంగళవారం జరిగిన ఈనామ్‌ టెండర్లలో సోనామసూరి ధాన్యం గరిష్టంగా రూ.2,419, కనిష్టంగా రూ.2,143 ధరలు నమోదయ్యాయి. ఆముదాలు క్వింటాల్‌కు సరాసరిగా రూ.5,479 ధర పలికింది. మార్కెట్‌కు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement