
చండీఘడ్: మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ను కల్పించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హెచ్చరించారు. శుక్రవారం చండీఘడ్లో జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పటికే ఎమ్ఎస్పీని కల్పించమని కేంద్రానికి లేఖ రాశారు. నేను డిప్యూటీ సీఎంగా ఉన్నంత కాలం రైతులకు ఎంఎస్పీ ఉండేలా కృషి చేస్తాను. ఒకవేళ అలా జరగకుంటే రాజీనామా చేస్తాను’’అని చెప్పారు. ఎంఎస్పీ, ఇతర డిమాండ్లపై రైతులకు లిఖితపూర్వక హామీలు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చినందున అన్నదాతలు తమ ఆందోళనను విరమించుకుంటారని దుష్యంత్ చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపే రైతులు కేంద్రం రాతపూర్వక హామీ ఇస్తున్నప్పుడు, అది “వారి పోరాటానికి విజయం” అని చౌతాలా అన్నారు. చదవండి: (నడ్డాపై దాడి: బెంగాల్ డీజీపీ, సీఎస్లకు సమన్లు)
అయితే, ఎంఎస్పి, మండి వ్యవస్థపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో నిరసనను కొనసాగించారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు, కొంతమంది హర్యానా రైతుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న దుష్యంత్ చౌతాలా, కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) వ్యవస్థకు ముప్పు ఉంటే తాను రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. ఏదేమైనా, రైతు సంఘాలు, ముఖ్యంగా పంజాబ్ మరియు హర్యానాలో, కొత్త చట్టాలు ఎంఎస్పీ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: (రైతన్నలూ.. చర్చలకు రండి)
Comments
Please login to add a commentAdd a comment