Central Cabinet Meeting : యూపీఐ లావాదేవీలపై కేంద్రం గుడ్‌ న్యూస్‌! | Key Decisions in Central Cabinet Meeting | Sakshi
Sakshi News home page

యూపీఐ లావాదేవీలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం!

Published Wed, Mar 19 2025 5:28 PM | Last Updated on Wed, Mar 19 2025 6:52 PM

Key Decisions in Central Cabinet Meeting

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో యూపీఐ లావాదేవీలు 210 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో భాగంగా భీమ్-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి రెండు వేల రూపాయల లోపు లావాదేవీలకు 0.15శాతం ఇన్సెంటివ్‌ అందించనుంది. దీంతో పాటు చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను  కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రూ. 2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేవు. అయితే ప్రస్తుత యూపీఐ విధానంలో కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ ద్వారా 4 అంచెల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోంది. రూ.1,500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో చిన్న లావాదేవీలకు ఛార్జీలు విధించడంలేదు’అని తెలిపారు.  దీంతో పాటు పలు కీలక నిర్ణయ తీసుకుంది. వాటిల్లో 

  • అసోంలో బ్రౌన్‌ఫీల్డ్‌ అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీకి ఆమోదం

  • రూ.10,601 కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్‌ ఏర్పాటు

  • రూ.2,790 కోట్లతో దేశంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి పచ్చజెండా

  • గోకుల్‌ మిషన్‌కు రూ.3,400 కోట్లు కేటాయింపు

  • రూ.4,500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు ఆమోదం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement