కిచిడీలో ఉప్పెక్కువైందని.. భార్య గొంతు నులిమాడు | Maharashtra Husband Arrested Killing Wife due to Excessive Salt in Food | Sakshi
Sakshi News home page

కిచిడీలో ఉప్పెక్కువైందని.. భార్య గొంతు నులిమాడు

Apr 17 2022 6:43 AM | Updated on Apr 17 2022 8:05 AM

Maharashtra Husband Arrested Killing Wife due to Excessive Salt in Food - Sakshi

థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం మరో ఘోరం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందని కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతు నులిమి చంపేశాడు. భయందర్‌లోని ఫాఠక్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలేశ్‌ ఘాఘ్‌ (46) తనకు వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందంటూ భార్య నిర్మల (40)తో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేశంతో గొంతు నులిమి చంపేశాడు. అతనిపై హత్య కేసు నమోదైంది. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్‌ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే.

చదవండి: (చాయ్‌తోపాటు టిఫిన్‌ ఇవ్వలేదని.. కోడలిపై మామ చేసిన పనికి అంతా షాక్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement