
ప్రయాగ్రాజ్:మహాకుంభమేళా ముగిసే సమయంలోనూ జనాలు పోటెత్తుతున్నారని, కుంభమేళాకు రావడం ఇక ఆపండని ప్రయాగ్రాజ్కు చెందిన స్థానికుడు ఒకరు కోరుతున్నాడు. ఈ మేరకు అతడు పోస్టు చేసిన వీడియోలో సోషల్మీడియాలో వైరల్గా మారింది.‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు.
ప్రయాగ్రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు ఎందుకో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్రాజ్కు ఎంత మాత్రం లేదు.
నగరంలోని చిన్న చిన్న సందులు కూడా ట్రాఫిక్తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు’ అని మండిపడ్డాడు. కాగా, ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున మహాకుంభమేళా ముగియనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment