![Sonia Gandhi to attend INDIA alliance meet in Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/29/sonia.jpg.webp?itok=pZ8EIf1S)
ముంబై: త్వరలో ముంబైలో జరిగే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతల మూడో సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సోమవారం ఈ విషయం వెల్లడించారు.
ఆగస్ట్ 31, సెప్టెంబర్ ఒకటో తేదీల్లో ముంబై శివారులోని ఓ లగ్జరీ హోటల్లో నేతలు భేటీ కానున్నారు. డజనుకుపైగా పార్టీల కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2024 లోక్సభ ఎన్నికల ఎజెండాపై చర్చించడంతోపాటు ఇండియా కూటమి అధికారిక లోగోను ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment