Uttarakhand: చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత | Uttarakhand Rains Chardham Yatra Suspended | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

Jul 7 2024 3:17 PM | Updated on Jul 7 2024 3:44 PM

Uttarakhand Rains Chardham Yatra Suspended

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు  ప్రకటించారు. 

వర్షాల కారణంగా చమోలీ జిల్లాలతోని బద్రీనాథ్‌ నేషనల్‌ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శనివారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.  

భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఉత్తరాఖండ్‌కు రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. రెడ్‌ అలర్ట్‌ నేపథ్యంలో సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement