అమెరికాలో మానుకోట వాసి మృతి  | Mahabubabad Manukota Man Dies With Heart Attack In USA Texas | Sakshi
Sakshi News home page

అమెరికాలో మానుకోట వాసి మృతి 

Published Tue, Dec 29 2020 9:07 AM | Last Updated on Tue, Dec 29 2020 2:16 PM

Mahabubabad Manukota Man Dies With Heart Attack In USA Texas - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన గొట్టం చంద్రపాల్‌రెడ్డి(26) అమెరికాలో మృతిచెందారు. ఈనెల 23న అమెరికాలోని టెక్సాస్‌లో గుండెపోటుతో మృతిచెందగా ఆయన తల్లిదండ్రులకు తాజాగా సమాచారం అందింది. దీంతో చంద్రపాల్‌రెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి–శోభ తమ కుమారుడి మృతదేహాన్ని కడచూపు కోసం స్వస్థలానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు విన్నవించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement