Texas
-
అమెరికాలో ఆంధ్రా యువకుడు ఆత్మహత్య
-
అథెనా కథ ముగిసింది
కేప్ కనవెరాల్: ఇంట్యూటివ్ మెషీన్స్ రెండో మిషన్ కూడా ఫెయిలయ్యింది. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్ అథెనా పనిచేయకుండా పోయింది. టెక్సాస్కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఫిబ్రవరి 26న అథెనాను పంపించింది. ఇందులో 11 పేలోడ్లు, సైంటిఫిక్ పరికరాలు ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత ప్రదేశంలో ఇది ల్యాండవ్వాల్సి ఉంది. కానీ, 250 మీటర్ల దూరంలో అతికష్టమ్మీద, అదీ ఇరుకైన గుంతలో దిగింది. తను దిగిన ప్రదేశాన్ని, పొజిషన్ను తెలపడంతోపాటు కొన్ని ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను సైతం యాక్టివేట్ చేసినట్లు ఫొటోలను పంపించింది. వీటిని బట్టి చూస్తే ఇది ఇరుకైన గుంతలో పక్కకు ఒరిగి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం తేల్చారు. ల్యాండర్కు ఉన్న సౌర ఫలకాలున్న తీరు, గుంతలోని అతి శీతల పరిస్థితులను బట్టి చూస్తే, అథెనా బ్యాటరీలను రీఛార్జి చేయడం అసంభవమని గుర్తించారు. దీంతో, అథెనా పనిచేసే అవకాశాలు లేవని ప్రకటించారు. మిషన్ పూర్తయినట్లు ప్రకటించిన అధికారులు అది పంపించిన చిత్రాలను విశ్లేషించి పనిలో పడ్డారని ఇంట్యూటివ్ మెషీన్స్ తెలిపింది. అథెనా ఇంట్యూటివ్ రెండో మిషన్ కాగా, ఈ సంస్థ ఏడాది క్రితం పంపిన ఒడిస్సియస్ కూడా విఫలమైంది. -
అమెరికాలో టెక్ మహీంద్రా విస్తరణ
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా టెక్సాస్లోని ప్లానోలో ఆఫీసు ఏర్పాటు చేసింది. ఇది 130 సీట్ల సామర్థ్యంతో 27,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైంది. అమెరికాలో ఇది తమకు పంతొమ్మిదో కార్యాలయమని సంస్థ తెలిపింది. కన్సలి్టంగ్, డెలివరీ, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు మొదలైన సరీ్వసులు దీని ద్వారా అందించనున్నట్లు వివరించింది. ఇదే ప్రాంగణంలో ఇన్నోవేషన్ ల్యాబ్ను కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 90 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ మహీంద్రాలో 1,50,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బాలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్కు చెందిన 13 ఏళ్ల బాలుడు, క్యాన్సర్ విజేత డీజే డేనియల్ను సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా నియమించారు. కాంగ్రెస్ తొలి సంయుక్త సమావేశంలో డీజే విజయగాథను ట్రంప్ పంచుకున్నారు. ‘2018లో డీజేకు అరుదైన కేన్సర్ నిర్ధారణ అయ్యింది. ఐదు నెలలే బతు కుతాడని డాక్టర్లు చెప్పారు. కానీ.. పోలీసు ఆఫీసర్ కావాలన్న లక్ష్యం ఆయనకు పోరాడే స్థైర్యాన్నిచ్చింది. కేన్స ర్ను ఓడించిన డీజే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. అతనికి పెద్ద గౌరవాన్ని ఇస్తున్నా. డీజేను యూఎస్ సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా చేయాలని డైరెక్టర్ సీన్ కరన్ను అడుగుతున్నా’ అని ప్రకటించారు. దీంతో సభంతా చప్పట్లతో హోరెత్తింది. సభ మొత్తం ‘డీజే... డీజే’ అని హోరెత్తగా గ్యాలరీలో అతని తండ్రి డీజేను గాల్లోకి ఎత్తాడు. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక బ్యాడ్జీని అందజేశారు. -
కెంటకీకి కేఎఫ్సీ గుడ్బై
కెంటకీ ఫ్రైడ్ చికెన్. క్లుప్తంగా కేఎఫ్సీ. పరిచయమే అక్కర్లేని ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్. ఈ ఫుడ్ జాయింట్ దిగ్గజానికి పిల్లల నుంచి పండు ముసలి దాకా లెక్కలేనంత మంది అభిమానులు! అమెరికాకు చెందిన ఈ బ్రాండ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇంతకాలం తన కేరాఫ్గా నిలిచిన కెంటకీలోని లూయిస్విల్లే నుంచి టెక్సాస్లోని ప్లానోకు ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తోంది. కొన్ని కార్యకలాపాలు మాత్రం కెంటకీ నుంచి ఇకముందూ కొనసాగుతాయని యాజమాన్యం ప్రకటించింది. కేఎఫ్సీ నిర్ణయంపై కెంటకీ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషెర్ విచారం వెలిబుచ్చారు. ఈ విషయం తెలిస్తే బహుశా ఆ సంస్థ వ్యవస్థాపకుడు కల్నల్ హార్లండ్ శాండర్స్ కూడా బాధపడి ఉండేవాడన్నారు. ‘‘ఆ కంపెనీ పేరే మా రాష్ట్రంతో మొదలవుతుంది. తన ఉత్పత్తుల విక్రయానికి మా రాష్ట్ర సంస్కృతిని, వారసత్వాన్ని ఉపయోగించుకుంది’’అని చెప్పు కొచ్చారు. పరిశ్రమలు, సంస్థలపై పన్నుల భారాన్ని టెక్సాస్ కొన్నే ళ్లుగా బాగా తగ్గించింది. దాంతో పాటు అక్కడి వ్యాపార అనుకూల వాతావరణానికి అమె రికన్ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్ర బాట పడుతున్నాయి. కేఎఫ్సీని 1930ల్లో కెంటకీలోని కోర్బిన్లో ఓ సరీ్వస్ స్టేషన్ దగ్గర ఫ్రైడ్ చికెన్ చిన్న దుకాణంగా శాండర్స్ మొదలు పెట్టారు. దాని రుచికి జనాలు ఫిదా కావడంతో చూస్తుండగానే యమా పాపులరైంది. ఇప్పుడు 145కు పైగా దేశాల్లో సంస్థకు ఏకంగా 24 వేల పై చిలుకు ఔట్లెట్లున్నాయి! ప్రతి కేఎఫ్సీ షాపు ముందూ కన్పించే గమ్మత్తైన ఫేసు దాని వ్యవస్థాపకుడు శాండర్స్దే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యం
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్మస్క్(Elon Musk) భారత్, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయనే సంకేతాలిచ్చారు. ఇటీవల టెక్సాస్లోని స్పేస్ఎక్స్(SpaceX) స్టార్బేస్ ఫెసిలిటీలో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తన మద్దతును వ్యక్తం చేశారు.ఆతిథ్యం(hosting)లో పాల్గొన్న ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) నేతృత్వంలోని ప్రతినిధుల బృందంలో ప్రశాంత్ రుయా (డైరెక్టర్ - ఎస్సార్ క్యాపిటల్), జయ్ కోటక్ (కోహెడ్ - కోటక్ 811), రితేష్ అగర్వాల్ (ఫౌండర్ & గ్రూప్ సీఈఓ-ఓయో), కళ్యాణ్ రామన్ (సీఈఓ - ఫ్లిప్కార్ట్), ఆర్యమన్ బిర్లా (డైరెక్టర్ - ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), నీలేష్ వేద్ (ఛైర్మన్ - అప్పారెల్ గ్రూప్), ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి ఉన్నారు.ఈ ఆతిథ్యంలో భాగంగా భారత పారిశ్రామికవేత్తలు స్పేస్ ఎక్స్ అత్యాధునిక సౌకర్యాలను సందర్శించారు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో అమెరికా, భారత్ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మస్క్ నొక్కి చెప్పారు. ‘పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అడ్డంకులను తగ్గించడానికి నేను అన్ని విధాలా అనుకూలం’ అని మస్క్ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ చిప్లపై అమెరికా ఆంక్షల ప్రభావంఐజీఎఫ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘స్థిరమైన, సాంకేతిక ఆధారిత భవిష్యత్తును రూపొందించడంలో భారత్కు, ప్రపంచ మార్గదర్శకుల మధ్య సహకారం పెరుగుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న తరుణంలో అర్థవంతమైన చర్చలు మరింత ప్రాధాన్యతను ఇస్తాయి’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీజీజీ) కో-ఛైర్మన్గా మస్క్ను ప్రతిపాదించారు. -
టాంటెక్స్లో ఘనంగా ''నెలనెల తెలుగువెన్నెల'' 208వ సాహిత్య సదస్సు
డాలస్లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 208 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ''తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు'' అనే అంశంపై సదస్సు రసవత్తరంగా జరిగింది. ముందుగా ఈ వేదిక లెనిన్ వేముల "హిమగిరి తనయే హేమలతే" ప్రార్ధనా గీతంతో ప్రారంభమయ్యింది. పాలక మండలి సభ్యులు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేసి,' మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పాండిత్య ప్రతిభావిశేషాలను సభకు పరిచయం చేశారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. లెనిన్ వేముల గుర్రం జాషువా ''గబ్బిలం'' పద్య గానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తరువాత ప్రముఖ రచయిత సత్యం మందపాటి మధురాంతకం రాజారాం, నరేంద్రలతో ఉన్న తన జ్ఞాపకాలను పంచుకొన్నారు.. మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు శ్రీ భాస్కర్ పులికల్ గారు మధురాంతకం రాజారామ్ గారితో తన అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు తన బావ మధురాంతకం నరేంద్రతో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించడం జరిగింది . ఈ వేదికకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ.. తన తండ్రి మధురాంతకం రాజారాం తెలుగు, ఆంగ్లభాషలలో రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని తాను విద్యార్థి దశలోనే కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. కథ చదివే ప్రతి వ్యక్తిలో తద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.తన తండ్రి పేరు మీదుగా ''కథాకోకిల'' అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడుఅనీ రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందనీ తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినపుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చు అని చెప్పారు. మన నుంచి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి, నాగర్ కోయిలు, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు, మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు, ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికముగా ఉందన్నారు. తెలుగు తమిళ భాషలు రెండూ వారి దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఉత్తమ విధానమని అన్నారు. తరువాత మధురాంతకం రాజారామ్ గారితో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి సాహితీ ప్రియులతో పంచుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, డాక్టర్ కోట సునీల్, గోవర్ధనరావు నిడిగంటి నరేంద్ర గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, తదుపరి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, పాలకమండలి ఉపాధిపతి శ్రీ హరి సింఘం మరియు సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి మధురాంతకం నరేంద్ర గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందన్నారు ఆచార్య మధురాంతకం నరేంద్ర . సభలో ప్రత్యక్షంగా, అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. చివరిగా దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు, తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ,ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనలు తెలిపారు అధ్యక్షులు సతీష్ బండారు. (చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం') -
రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!
నవజాత శిశువులకు తల్లిపాలు వివిధ వ్యాధుల బారిన పడకుండా రక్షించే అమృత ధారలు. కొందరూ తల్లులకు వివిధ కారణా వల్ల ఆ అమృతధారలు ఉత్పత్తి కావు. దీంతో అలాంటి తల్లులు పిల్లలకు స్వచ్ఛమైన అమ్మపాలు ఎలా అందించాలో తెలియక చాలా సతమతమవుతుంటారు. అలాంటి తల్లుల వెతలను తీర్చేలా కొంతమంది తల్లులు తమ బ్రెస్ట్ మిల్క్ని స్వచ్ఛందంగా దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలా ఓ తల్లి రెండు లీటర్లకు పైగా తన రొమ్ము పాలను అందించి ఎందరో బిడ్డల ఆకలిని తీర్చి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఎవరామె..?. ఆమెకి ఇదెలా సాధ్యమయ్యింది..?టెక్సాస్కి చెందిన అలిస్సా ఓగ్లేట్రీ ఈ రికార్డుని సృష్టించింది. గతంలో 2014లో 1,569.79 లీటర్ల పాల దానంతో తనపేరు మీదు ఉన్న రికార్డును ఓగ్లేట్రీనే బద్దలుగొట్టి తిరగరాసింది. ఈసారి ఏకంగా రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ని దానం చేసి ఆమె హృదయం చాలా విశాలం అని చాటిచెప్పింది. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ప్రకారం..ఒక లీటరు తల్లిపాలతో నెలలు నిండకుండా పుట్టిన దాదాపు 11 మంది చిన్నారులను పోషించొచ్చట. . దీని ఆధారంగా ఆమె ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మందికి పైగా శిశువుల ఆకలిని తీర్చిందని గిన్నిస్ రికార్డు అంచనా వేసింది. ఓగ్లెట్రీ 2010లో కొడుకు కైల్కి జన్మనిచ్చినప్పటి నుంచి తల్లి పాలను దానం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే తాను అరుదైన హైపర్లాక్టేషన్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. దీనికారణంగా ఆమె చనుబాల ఉత్పత్తి నిరంతరం కొనసాగుతుంటుంది. అలా రోజు రోజుకి రెండింతలుగా పాలు వస్తున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆ క్రమంలోనే ఆమె మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ టైంలోనూ పాలధారలు ఆగలేదు. అలా నేటివరకు రోజుకి ఆరులీటర్ల చొప్పున తల్లిపాలు ఉత్పత్తవ్వుతున్నాయి. ఈ చనుబాల ఉత్పత్తి ఆగిపోవాలంటే మందులు వాడడం లేదా డబుల్ మాస్టెక్టమీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ రెండింటిని వద్దని నెలనిండకుండా పుట్టిన పిల్లలకు అందించాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. అలా ఆమె తన పిల్లలు పాలు తాగడం మానేసిన తర్వాత కూడా పంపింగ్ కొనసాగించి లీటర్లకొద్ది పాలను మిల్క్ బ్యాంక్కి ఇచ్చేది. అందుకోసం తాను ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి మరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటానని అన్నారు. ఎందుకంటే తాను ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆమె పాలు నవజాత శిశువుకు పోషణకు ఉపయోగపడతాయని అంటోంది ఓగ్లేట్రీ. నేను ఇలా ఎంతమంది చిన్నారుకు సహాయం చేశానో.. అనేది తలచుకుంటే చాలా సంతృప్తినిస్తుందని చెబుతోంది. అంతేగాదు ఓగ్లేట్రీ తల్లిపాలను దానం చేయడంపై అవగాహన కల్పించాలనుకుంటోంది. తనలాగే ఇతర మహిళలు కూడా స్వచ్ఛందంగా పాలను దానం చేసేలా ముందుకురావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఓగ్లేట్రీ.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్స్ ప్లే గ్రౌండ్..!) -
తెలుగోడు.. టెక్సాస్ మేయర్ ఎన్నికల బరిలో!
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులూ.. అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం చూస్తున్నాం. చిన్న పదవుల మొదలుకుని జడ్జిలు, చట్ట సభలు, దేశ ప్రధానుల్లాంటి ఉన్నత పదవులనూ అధిరోహిస్తున్నారు. తాజాగా.. ఓ తెలుగోడు టెక్సాస్ స్టేట్లో మేయర్ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ట్రాన్స్పరెన్సీ(పారదర్శకత) ఈజ్ ద గేమ్.. కార్తీక్ ఈజ్ ది నేమ్ అంటూ.. 35 ఏళ్ల యువకుడు ట్రావిస్ కౌంటీలోని ది హిల్స్ మేయర్ ఎన్నికల ప్రచారంతో హాట్ టాపిక్గా మారాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు(ప్రస్తుతం బాపట్ల) చెందిన కార్తీక్ నరాలశెట్టి Karthik Naralasetty.. ది హిల్స్ మేయర్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కార్తీక్.. న్యూజెర్సీ రట్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్సైన్స్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఆపై చదువు ఆపేసి ఇండియాకు తిరిగొచ్చి సోషల్బ్లడ్ పేరుతో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసి.. క్రమక్రమంగా వ్యాపారవేత్తగా ఎదిగాడు. అదే టైంలో పెంపుడు జంతువులకు సంబంధించిన మరో కంపెనీ స్థాపించాడు.అమెరికాలో ఉన్న తొలినాళ్లలోనే అధితితో పరిచయం.. ఆపై వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ‘ది హిల్స్’ మేయర్ ఎన్నికలపై దృష్టి సారించాడు కార్తీక్. ఆగస్టు నుంచే ప్రచారం మొదలుపెట్టిన కార్తీక్.. ఎంటర్ప్రెన్యూర్గా తన అనుభవంతో ది హిల్స్ అభివృద్ధికి దోహదపడతానని ప్రచారం చేశాడు కూడా. ది హిల్స్లో 2,000 జనాభా ఉంది. కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే అక్కడ స్థిరపడ్డాయి. అయితే న్యూజెర్సీలో ఉన్న బంధువుల సహకారంతో ప్రచారం ఉధృతం చేశాడు కార్తీక్. నవంబర్ 5న ఇక్కడ మేయర్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ.. కార్తీక్ ఈ ఎన్నికల్లో గెలిస్తే గనుక.. ‘ది హిల్స్’ మేయర్ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ వ్యక్తిగా నిలుస్తాడు. -
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్కు మొదటి భార్య జస్టిన్ విల్సన్తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!
నేషనల్ క్రికెట్ టీ10 లీగ్-2024లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్రేటు 244.44గా నమోదైంది.చికాగో జట్టుకు కెప్టెన్గాఅమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్లో యాక్టివ్ క్రికెటర్లతో పాటు రిటైర్డ్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్లో రాబిన్ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్ గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.క్రిస్ లిన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్ లూయీస్ 10 బంతుల్లోనే 34 రన్స్తో నాటౌట్గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. 41 పరుగుల తేడాతో జయభేరిలక్ష్య ఛేదనలో టెక్సాస్ గ్లాడియేటర్కు డేవిడ్ మలన్ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్ ఫుల్లర్ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి టెక్సాస్ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.అమెరికా నేషనల్ క్రికెట్ టీ10లీగ్లో ఆరుజట్లున్యూయార్క్ లయన్స్, టెక్సాస్ గ్లాడియేటర్స్, చికాగో సీసీ, డల్లాస్ లోన్స్టార్స్, లాస్ ఏంజెలిస్ వేవ్స్, అట్లాంటా కింగ్స్. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్ రైనా న్యూయార్క్కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్కు షాహిద్ ఆఫ్రిది, డల్లాస్కు దినేశ్ కార్తిక్, లాస్ ఏంజెలిస్కు షకీబ్ అల్ హసన్, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్లుగా ఉన్నారు.చదవండి: జైశంకర్తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!Begin your morning with some sumptuous Robin Uthappa sixes! 🫶Uthappa and Lynn got Chicago off to a flying start by putting on 112 from just 38 balls.🔥#NCLonFanCode pic.twitter.com/gLVq6E5H4v— FanCode (@FanCode) October 8, 2024 -
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు
ఈ నెల (సెప్టెంబరు నెల) 21వ తేదీ శనివారం డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక 206 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ 53 వ టెక్సాస్ సాహిత్య సదస్సు కోపెల్, టెక్సాస్ నగరంలో నిర్వహించారు. 'న భూతో న భవిష్యత్' అన్నట్లుగా ఈ సదస్సు జరిగింది. ఈ ''సంగీత సాహిత్య సమలంకృత నెలనెలా తెలుగు వెన్నెల'' సదస్సు ప్రారంభ సూచికగా శ్రీరామ చంద్ర మూర్తి ని స్తుతిస్తూ పురందరదాసు విరచిత కన్నడ ''"రామ నామ ఉమ్మే....'' భక్తి గీతాన్ని చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతో రాగయుక్తంగానూ వీనుల విందుగాను పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది. టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహితీ వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా గారు స్వాగతోపన్యాసం చేశారు. ఇటీవలే దివంగతులయిన ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీ,శే.వడ్డేపల్లికృష్ణ సంస్మరణగా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణగారితో తమకు గల అనుబంధాన్ని అనుభవాలను పంచుకొన్నారు.తర్వాత మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీమతి అద్దేపల్లి సుగుణ గారు ''సాహిత్యంలో నారీభేరీ''అంశం గా ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులపై మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి ''రామాయణ కల్పవృక్షం ''కావ్య వైశిష్ట్యాన్ని వివరించారు. అలాగే కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథవారు తెలుగు పడికట్టును, పలుకుబడిని ఆమహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబింబింప చేసిన వైనాన్ని ఉదాహరణంగా వివరించటమేగాక వారి రచనలలోని తెలుగు భాషా మాధుర్యాన్ని వివరణాత్మక ఉపన్యాసించడాన్ని గుర్తుచేశారు. డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 77 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ''మన తెలుగు సిరి సంపదలు'' అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో శ్లేష అలంకార భూషిత పద ప్రయోగాలతో పాటు, అక్షరాల పద భ్రమకాలుకొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియుల నుంచిసమాధానాలను రాబట్టడంలో విజయవంతమయ్యారు.మహాకవి గురజాడ 162 వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ గారు గురజాడ రచనల్లోని ఆధునికత శాస్త్రీయ దృష్టి గురించీ , తన సమకాలీకులలో ఆయన ప్రత్యేకతలను గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకం రాయడంలో ఆనాటి సమాజంలో పేరుకొని పోయిన ద్వంద ప్రమాణాలను కపటత్వాన్ని గురజాడ మహాకవి ఎండగట్టిన తీరును సోమసుందర్ గారు అద్భుతంగా వివరించారు. ప్రాధమిక విద్యాస్థాయిలో తెలుగు బోధనా భాషగా ఉండాలని సోమసుందర్ అకాంక్షించారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు బి.లలితానంద ప్రసాద్, పుస్తక పరిచయంలో విశ్వ మానవుడు సంజీవ్ దేవ్ ఆలోచనా సరళిని అర్ధం చేసుకోవాలని అన్నారు. తర్వాత ''సాహిత్యంలో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహితీ వీక్షణంలో కృష్ణశాస్త్రి గారి రచన ప్రతిభా పాటవాల్ని" శ్రీ నరేందర్ చక్కగా విశ్లేషించడం జరిగింది. ''సాహిత్యము, దాని ప్రభావము-మానవజీవన పరివర్తన'' అనే అంశముపై విట్టల్ రామశర్మ గారి ప్రసంగము,,''శ్రీ రామ రక్ష'' అంశంపై డా వెంకట నక్త రాజు గారి ప్రసంగము, ''సమాజంపై గురువుల ప్రభావం''అంశంపై శ్రీరామకృష్ణ శర్మగారి ప్రసంగం, శ్రీనివాస్ ఇరువంటి చదివి వినిపించిన '''శ్రీమతి ప్రేమలేఖ ''కథ సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు .అనంతరం వేటూరి, దాశరథి,వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సినీ గీతాలను శ్రీ చంద్రహాస్ మద్దుకూరి ,శ్రీమతి ఆకునూరి శారద,డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం అద్భుతంగా ఆలపించారు. గురజాడ విరచిత ''దేశమును ప్రేమించుమన్నా''గేయాన్ని దయాకర్ మాడ, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల , చంద్రహాస్ మద్దుకూరి బృందం శ్రావ్యంగా ఆలపించడం జరిగింది. డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవల ప్రచురితమైన నాలుగు పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా, హార్దికంగా తోడ్పడుతున్న పోషక దాతలకూ, కార్యకర్తలకు, అలాగే మంచి విందు భోజనాన్ని అందించిన 'సింప్లి సౌత్' యాజమాన్యానికి అందుకు కృషి చేసిన శ్రీకాంత్ పోలవరపు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం కార్యవర్గ సభ్యులు రఘునాథ రెడ్డి కుమ్మెత, వీర లెనిన్ తుల్లూరి, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, చంద్ర కన్నెగంటి, చిన సత్యంల తోపాటు పుదూర్ జగదీశ్వరన్, రమణ జువ్వాడి, శ్రీధర్, సుమ, సాయి, కిరణ్మయి, గౌతమి, స్వర్ణ మరియు డాలస్,హ్యూస్టన్ ,ఆస్టిన్, టెంపుల్ నగరాల నుంచి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు , సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు .(చదవండి: డాలస్లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!) -
డల్లాస్ లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం
-
లోపలికి తొంగిచూడొచ్చు
1897లో వచ్చిన హెచ్జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... ఇలా సాధించారు... టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. రక్తనాళాలన్నీ కన్పించాయి ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లాభాలెన్నో... మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. → రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. → ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. → లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.కొన్నిపద్ధతులున్నాకణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్క్రీముల్లో వాడతారు.కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్కు చెందిన వారు. గత వారం జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుకనుంచి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. ప్రమాదం కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. -
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు. బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్లోని డెంటన్లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 -
అమెరికాలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుడు
అమెరికాలోని టెక్సాస్లోగల హనుమంతుని భక్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక్కడి హ్యూస్టన్లో తాజాగా 90 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ భారీ విగ్రహం అమెరికాలోని మూడవ ఎత్తయిన విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన వెనుక చినజీయర్ స్వామి సూచనలు, సలహాలు ఉన్నాయి.‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఈ విగ్రహం యునైటెడ్ స్టేట్స్లోని మూడవ అతి ఎత్తయిన విగ్రహం. అలాగే హనుమంతునికి సంబంధించిన 10 ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వామివారి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. This is the “Third Tallest Statue” in the United States 🇺🇸. A grand Pran Pratishtha ceremony was held in Houston, Texas, on Aug 18, where a 90 foot tall Hanuman statue was inaugurated.pic.twitter.com/Ng7W4CFewV— Gems of Engineering (@gemsofbabus_) August 20, 2024 -
ఆ ప్రయాణమే ఆఖరిదైంది!
కాలం కత్తిగట్టింది.. కాపుకాసి కాటేసింది.. సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కన్నీటి ముగింపు పలికింది. కుమార్తెను యూనివర్సిటీలో చేరుస్తున్నామన్న ఆనంద క్షణాల్లో ఘోరం జరిగి పోయింది.. రెప్పపాటులో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు ఘంటికలు మోగాయి. ఒకే కుటుంబంలోని సభ్యుల ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. నిండు మనసుతో ఆశీస్సులు.. సరదా కబుర్లు, సందళ్లతో ఇంటి నుంచి యూనివర్సిటీకి సాగిన కారు ప్రయాణం ఊహించని కుదుపుతో విషాదాంతమైంది.అమెరికా టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భారత సంతతికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులున్నారు. లియాండర్లో నివసించే అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీపా అరవింద్(40), వారి 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్, ఆదిర్యాన్ (14)నివసిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల హైస్కూల్ డిప్లామాను పూర్తి చేసుకున్న ఆండ్రిన్ అరవింద్కు కంప్యూటర్ సైన్స్ అంటే మహా ఇష్టం. డల్లాస్ యూనిర్సిటీలో చదవాలనేది ఆమె కోరిక. అందుకే కుమర్తె ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు.. ఆమెను యూనివర్సిటీలో చేర్పించేందుకు కారులో బయలు దేరారు. ఆ ప్రయాణమే ఆఖరిదైంది! ఉన్నతమైన లక్ష్యాలు..ఎన్నో కోరికలతో ఇంటి నుంచి యూనివర్సిటీకి కారులో బయలు దేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో అరవింద్ మణి కుటుంబాన్ని కబళించింది. లాంపాస్ కౌంటీ సమీపంలో గత బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అరవింద్ మణి దంపతులు వారి కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మృతి చెందారు.కారు ప్రమాదం ఎలా జరిగింది?కారు ప్రమాదంపై టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ (డీపీఎస్)అధికారి ట్రూపర్ బ్రయాన్ వాష్కో స్పందించారు. ‘కాపెరాస్ కోవ్కు చెందిన 31 ఏళ్ల జాసింటో గుడినో డ్యూరాన్, 23 ఏళ్ల యోసిలు గాస్మాన్ మార్టినెజ్లు హైపర్ కార్ ‘కాడిలాక్ సీటీఎస్’లో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ప్రమాదం జరిగిన ప్రాంతంలో అరవింద్ మణి ప్రయాణిస్తున్న 65 నుంచి 70 ఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న కియా ‘టెల్లూరైడ్’ను.. 100 ఎంపీహెచ్ స్పీడుతో వస్తున్న కాడిలాక్ సీటీఎస్ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత దాటికి కియా కారు సగానికి పైగా ధ్వంసమైంది.అరవింద్ ఫ్యామిలీ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. అరవింద్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో మరణించారు’అని తెలిపారు.బతికే అవకాశాలు లేవుఘోర రోడ్డు ప్రమాదంపై 26 ఏళ్లలో నేను చూసిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇది. అందుకు ప్రమాదం జరిగిన తీవ్రత, మరణాల సంఖ్యే కారణమని ట్రూపర్ బ్రయాన్ వాష్కో మీడియాకు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బతికే అవకాశాలు ఉండవు అని వెల్లడించారు. కుటుంబాన్ని ఢీకొట్టిన కారు 160 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.విషాద సమయం.. పరిమళించిన మానవత్వంఇంతటి విషాదం నింపిన ఈ రోడ్డు ప్రమాదం 14ఏళ్ల అరవింద్ మణి కుమారుడు ఆదిర్యాన్ ఒంటరయ్యాడు. ఇక, ప్రమాదం తర్వాత దాతలు స్పందించి తీరు మానవత్వానికి అద్దం పడుతోంది. దుఃఖంలో ఉన్న బాలుడికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫండ్ రైజర్ ఆర్గనైజర్ రాజారామన్ వెంకటాచలం గోఫండ్మీ ద్వారా ఫండ్ రైజ్ చేశారు. అందుకు 7లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో దాతలు విరాళం ఇచ్చినట్లు రాజారామన్ చెప్పారు. ఆదిర్యాన్ భవిష్యత్ కోసం తాము ఫండ్ రైజ్ ప్రారంభించామని, బాలుడిని ఆదుకునేందుకు దాతలు భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. సేకరించిన ఫండ్తో బాలుడి భవిష్యత్ను అందంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
'వాటర్ పాయిజనింగ్'తో ఆస్పత్రిపాలైన వ్యక్తి! ఎందువల్ల వస్తుందంటే..?
ఫుడ్ పాయిజనింగ్లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.టెక్సాస్కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్గా మారిపోవడం జరుగుతుంది.ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి. లక్షణాలు..కండరాల బలహీనత లేదా తిమ్మిరిరక్తపోటు పెరుగుదలద్వంద్వ దృష్టిగందరగోళంఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడంశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిమానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఎంత నీరు తాగితే మంచిదంటే..ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!) -
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం
ఆస్టిన్: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన తాడిబోయిన రవితేజ(28) స్విమ్మింగ్ ఫుల్లో జారిపడి తీవ్రగాయాలతో మరణించాడు. ఈ నెల 18వ తేదీన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఘటన చోటు చేసుకుంది. అయితే రవితేజ నేపథ్యం గురించి.. ఘటన గురించి అక్కడి అధికారుల నుంచి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
అమెరికాలో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగు యువతీ యువకుల అరెస్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్
అమెరికాలోని డల్లాస్లో భారతీయ యువకుడిని కాల్చి చంపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక దుకాంలో చోరీకి పాల్పడి, దాసరి గోపీకృష్ణను కాల్చి చంపిన కేసులో మాథిస్పై అభియోగాలు నమోదు చేశారు. ఇతనిపై ఇంతకుముందు కూడా హత్యా నేరం అభియోగాలున్నాయని పోలీసులు వెల్లడించారు.జూన్ 21న, గోపీకృష్ణ పనిచేస్తున్న స్థానిక కన్వీనియన్స్ స్టోర్లో దుకాణంలో చోరీకి తెగబడిన మాథిస్ కౌంటర్ వద్ద ఉన్న గోపీకృష్ణపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, స్నేహితులు కాన్సులేట్ సహకారంతో గోపీకృష్ణ మృతదేహాన్ని బాపట్లలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. -
ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!
వయసు శరీరానికే గానీ మనసుకు కాదు అని చేసి చూపిస్తున్నారు కొందరూ. చాలామంది వయసు రీత్యా పెద్దవారైనా.. యువకుల మాదిరిగా తమకు ఇష్టమైన రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్నారు. అలానే ఓ మహిళ ఏడు పదుల వయసులో తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. పైగా ఈ వయసులో ఇలాంటి పోటోల్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించింది. ఈ పోటీలో ఆమె గెలవకపోయినప్పటికీ అంత పెద్ద వయసులో కూడా తన కోరికను నెరవేర్చుకునేందుకు ముందుకు వచ్చి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు అందానికి వయసుతో సంబంధం లేదని చాటి చెప్పింది. ఎవరామె అంటే..ఏడు పదుల వయసులో మారిస్సా టీజో అనే మహిళ మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో పాల్గొనాలనే తన కలను సాధించింది. గత వారాంతంలో హ్యూస్టన్లో జరిగిన ఈ మిస్ టెక్సాస్ ఈవెంట్లో పాల్గొన్న 75 మంది మహిళలో టీజో కూడా ఉన్నారు. ఈ ఈవెంట్లో ఆరియోన్నా వేర్ విజేతగా నిలిచినప్పటికీ..71 ఏళ్ల టీజోనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పైగా ఈ ఏజ్లో పాల్గొన్న వృద్ధురాలిగా రికార్డు సృష్టించారు. ఇక టీజో తాను ఈ పోటీల్లో పాల్గొనడానికి గల కారణాలను ఇన్స్టాగ్రాం వేదికగా చెబుతూ..తాను ఈ మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో పోటీదారుగా పాల్గొనడం అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నాను. అందులో తాను భాగమైనందుకు సంతోషిస్తాన్నాను. ఇది కేవలం మహిళలు తమ శారీరక, మానసికంగా ధృఢంగా ఉండటమేగాక వారు ఏ వయసులోనైనా అందంగానే ఉంటారని విశ్వసించేలా ప్రేరేపించేందుకే ఇలా చేశానని పోస్ట్లో తెలిపారు. అంతేగాదు తాను ఈ పోటీలో పాల్గొనేల మద్దతు ఇచ్చిన స్పాన్సర్లందరికి ధన్యవాదలని కూడా చెప్పారు. కాగా, ఇటీవలే అందాల పోటీల్లో వయోపరిమితి నిబంధనను తొలగించాలనే మార్పుకు శ్రీకారం చుడటంతోనే టీజోకి ఈ మిస్ టెక్సాస్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అంతేగాదు ఈ సరికొత్త నిబంధన మార్పులో.. వివాహం చేసుకున్న లేదా వివాహితలు, గర్భణీ స్త్రీలు, పిల్లలు కలిగిన మహిళలు సైతం అందాల పోటీలో పాల్గొనడానికి అనుమతివ్వడం విశేషం. అయితే ఈ విధానం 2023 నుంచి అమలులోకి రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Marissa Teijo (@marissateijo) (చదవండి: పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ వేరేలెవెల్!..పూజకు అందరిలా..!) -
అమెరికాలో సుడిగాలుల బీభత్సం
వ్యాలీ వ్యూ (టెక్సాస్): అమెరికాలో టెక్సాస్, ఒక్లహామా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో భీకర సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. ట్రక్కుల పార్కింగ్ స్టేషన్, ఇళ్లను తుడిచిపెట్టేస్తూ సాగిన విధ్వంసకాండలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్లహామాలో టోర్నడోలు భీకర వినాశనానికి కారణమయ్యాయి. భీకర గాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ఇళ్లలో జనం అంధకారంలో మగ్గిపోయారు. -
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
టెక్సాస్లో భారీ వర్షం.. ఎటుచూసినా వరద నీరే..
టెక్సాస్: అమెరికాలోకి టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా టెక్సాస్ను వరదలు ముంచెత్తాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.కాగా, భారీ వర్షాల కారణంగా అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్కవారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇక, వర్షాల కారణంగా ఒక్క చిన్నారి మృతి చెందినట్టు సమాచారం.వరదల కారణంగా వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. వరదలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 28వ రాష్ట్రం టెక్సాస్. దీని రాజధాని ఆస్టిన్. జనాభారీత్యా చూసినప్పుడు ఆస్టిన్ 9.58 లక్షలు. దీని కన్నా ఇదే రాష్ట్రంలోని డల్లాస్ ( 13 లక్షలు ), సాన్అంటానియో ( 14.45 లక్షలు ), హుస్టన్( 23 లక్షలు ) నగరాల్లో ఎక్కువ జనాభా. అయినా చారిత్రక ప్రాధాన్యాన్నిబట్టి రాష్ట్రం మధ్యలో ఉండడం వల్ల ఆస్టినే రాజధాని అయింది. ఆస్టిన్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టేట్ లెజిస్లేచర్, గవర్నర్, మంత్రుల చాంబర్లు ఉన్నాయి. యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ ఉన్నది ఆస్టిన్లోనే. తప్పక చూడాల్సింది స్పేస్ సెంటర్..ఈ నగర జనాభాలో మూడింట ఒక వంతు హిస్పానిక్స్, ఆఫ్రికన్ / ఏసియన్ అమెరికన్లు. టెక్సాస్లోని అతి పెద్ద నగరమైన హుస్టన్ సిటీలో చూడదగ్గవి ఎన్నోఉన్నాయి. హుస్టన్ సిటీలో నేను మొదటగా చూసినవి అక్వేరియం, చిల్డ్రన్స్ మ్యూజియం లాంటివి. తప్పక చూడాల్సిన సందర్శనీయ స్థలాల్లో గాల్వెస్టన్ సముద్రతీరం, నాసా (NASA) వారి స్పేస్ సెంటర్ వంటివి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న విద్యార్థి అయినా.. శాస్త్ర సాంకేతికత మీద, అంతరిక్షం మీద ఆసక్తి ఉంటే.. నాసా సెంటర్ చూడాలనుకుంటారు. లిండన్ బి. జాన్సన్ స్పేస్ సెంటర్ పేరిట హ్యూస్టన్లో నిర్మించిన NASA కేంద్రాన్ని స్పేస్క్రాఫ్ట్ సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ అంతరిక్షయాన శిక్షణ, పరిశోధన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రానికి ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ పేరు పెట్టారు. తటస్థ ప్రయోగశాల అంటే..దీన్ని నవంబర్ 1961లో పూర్తి చేశారు. క్లియర్ లేక్ ఏరియాలో 1,620 ఎకరాల్లో 100 భవనాల్లో నిర్మించిన ఈ కేంద్రంలో దాదాపు 3,200 మంది పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్.. జెమిని 4 ( అపోలో , స్కైలాబ్ , అపోలో-సోయుజ్ మరియు స్పేస్ షటిల్తో సహా ) నుంచి ప్రతి అంతరిక్ష ప్రయాణాన్ని పరిశీలిస్తుంది. అంటే ఒక స్పేస్క్రాఫ్ట్ భూమి నుంచి దాని లాంచ్ టవర్ను క్లియర్ చేసిన క్షణం నుంచి తిరిగి భూమిపైకి తిరిగి వచ్చే వరకు దాని కంట్రోల్ను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రంలో ఆసక్తి ఉన్న వారికి అర్థమయ్యేలా ఎన్నో ఆకర్షణీయ ఏర్పాట్లు ఉన్నాయి. తటస్థ ప్రయోగశాల.. అంటే అంతరిక్షంలో ఉన్నట్టుగా గాలిలో తేలే వాతావరణాన్ని ఇక్కడ స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే సుమారు 6.2 మిలియన్ యూఎస్ గ్యాలన్ల నీళ్లు ఉన్న స్విమ్మింగ్పూల్లో వ్యోమగాములు జీరో గ్రావిటీని అనుకరిస్తూ శిక్షణ పొందుతారు. సందర్శకులను స్పేస్ సెంటర్ వరకు అనుమతిస్తారు. అక్కడ ఉంటే హైదరాబాద్లో ఉన్నట్లే..ఇక టెక్సాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. టెక్సాస్లో చాలా చోట్ల తెలుగు వాళ్లు కనబడతారు. డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ ఎక్కడయినా.. చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నామా అనిపిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఒక్క బిర్యానీనే కాదు, సీజన్లో హాలీం కూడా దొరుకుతుంది. ఇరానీ ఛాయ్, సమోసాలు, ఇడ్లీ-దోశ సెంటర్లు.. చూస్తూ ఉంటే సరదాగా అనిపిస్తుంది. ఒక్క భోజనమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఏ వస్తువు అయినా.. టెక్సాస్లో కొనుక్కోవచ్చు. జండూబామ్ నుంచి గోధుమ పిండి వరకు, బియ్యం, నుంచి బాదాంపప్పు వరకు ఏం కావాలన్నా సులువుగా దొరుకుతాయి. కిషోర్ పబరి ఇండియా బజార్, పటేల్ బ్రదర్స్ కిరాణ మార్కెట్, సరిగమప సూపర్మార్కెట్, సబ్జీ మండీలతో పాటు బంగారు, వజ్రాల దుకాణాలు బాగానే కనిపిస్తాయి. ఇండియన్ దుస్తులు పంజాబీ డ్రెస్ నుంచి లుంగీల దాకా అన్నీ దొరుకుతాయి. చాలా చోట్ల సంగీతం, భరత నాట్యం నేర్పే వాళ్లు, యోగా క్లాసులు, తెలుగు భాష, మ్యాథ్స్ క్లాసులు దర్శనమిస్తాయి. డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో మనవాళ్లే టాప్. అన్నట్టు ఇక్కడ మనవాళ్లు అప్పుడే రియల్ ఎస్టేట్ను పీక్లోకి తీసుకెళ్లారు. అలాగే ఇండియన్ ఈవెంట్స్ కూడా. డాలస్ నగరాన్ని జలవనరుల ఆధారితంగా నిర్మించారు. ట్రినిటీ నది తెల్లరాళ్ళను దాటుతున్న ప్రాంతంలో ఈ సిటీ కట్టారు. నదికి ఇరువైపులా మట్టి గోడలను కట్టి ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేశారు. పార్క్లు, రెస్టారెంట్లతో వినోద విహార కేంద్రంగా మారింది. డాలస్ మొత్తం నగరం నదీతీరం పక్కనే.. దాదాపు 20 మైళ్ళు సిటీని ఆనుకుని నదీ తీరం ఉంటుంది. ప్రశాంతంగా రాజధానిడల్లాస్ ఓ రకంగా హైదరాబాద్ వాతావరణంలా అనిపిస్తుంది. హ్యూస్టన్లా గాలిలో తేమ ఉండదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. హుస్టన్ కాలుష్య వాతావరణంతో పోల్చుకున్నప్పుడు ఆస్టిన్ నాకు ప్రశాంతంగా తోచింది. ఒక రాష్ట్ర రాజధాని ఇంత సింపుల్గా ఉండడం గొప్ప విషయమే అనిపించింది. మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా.? అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఓ సారి ఓ లుక్కేయండి. మీరే చెబుతారు.వేముల ప్రభాకర్(చదవండి: అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !) -
US: టెక్సాస్ హ్యుస్టన్లో మేమంతా సిద్ధం!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకి మద్దతుగా టెక్సాస్లోని హ్యుస్టన్ నగరంలో సంఘీభావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ హ్యుస్టన్ నాయకులు బ్రహ్మనంద రెడ్డి , మారుతి , పుల్లా రెడ్డి , శ్రీనివాస్ ఎర్రబోతుల ,యాదగిరి రెడ్డి కుడుముల, విశ్వ సానపరెడ్డి, నర్సి రెడ్డి మరియు దాదాపు 90 మంది వైఎస్సార్సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆన్లైన్ ద్వారా కిలారి రోశయ్య , ఎంపీ అయోధ్య రామి రెడ్డి మరియు పండుగాయల రత్నాకర్ గారు జాయిన్ అయ్యి ప్రసంగించారు. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగినందుకుగాను జగన్ గారి మేమంత సిద్ధం బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ తదితర ప్రభుత్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 వైస్సార్సీపీ ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక శ్రీనివాస్ ఎర్రబోతుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదింటి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, విద్యార్థులకు ట్యాబ్స్ వంటివి అద్భుతాలు అన్నారు. తాము ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో నాడు–నేడు ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల రూపు రేఖలే మారాయన్నారు. మారుతి మాట్లాడుతూ.. జగన్ అన్న ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు. పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా ఆయనే స్యయంగా జగన్ పాలన బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లే కదా అన్నారు. పుల్లా రెడ్డి మాట్లాడుతూ జగన్ గారు పేద ప్రజల కోసం అమ్మఒడి , జగన్ అన్న విద్యా కానుక, గోరు ముద్ద, సచివాలయ వ్యవస్థ, పోర్టులు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ప్రజలు వైస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగన్ గారి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు . (చదవండి: ఎన్నికల తర్వాత బాబు, లోకేష్ ఎన్ఆర్ఐలే అవుతారు: రత్నాకర్) -
నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా బైటపడటం నిజంగా చల్లటి కబురు. టెక్సాస్లోని తన ఇంటినుంచి సోమవారం రాత్రి అదృశ్యమైన 17 ఏళ్ల ఇషికా ఠాకోర్ను ఫ్రిస్కో పోలీసులు సురక్షితంగా గుర్తించారు. అయితే ఎపుడు, ఎక్కడ, ఎలా కనుగొన్నారు అనే వివరాలను మాత్రం ఫియాస్కో పోలీసులు వెల్లడించలేదు. టెక్సాస్లోని ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఏప్రిల్ 8, సోమవారం తప్పిపోయింది. ఫ్రిస్కోలోని బ్రౌన్వుడ్ డ్రైవ్లోని తన ఇంటి నుండి ఇషికా అదృశ్యమైందంటూ క్రిటికల్ మిస్సింగ్ హెచ్చరికను జారీ చేశారు. ఈమేరకు ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టారు. ఇటీవల తప్పి పోయిన పలువురు భారతీయ విద్యార్థులు ఆ తర్వాత శవమై కనిపించడంతో ఇషికా అదృశ్యం ఆందోళన రేపింది. అయితే ఆమె ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. CRITICAL MISSING-Frisco PD is seeking assistance in locating 17-year-old Ishika Thakore, last seen Monday, Apr 8 at 11:30p in the 11900-block of Brownwood Dr. in Frisco. She is approx 5’4” and 175 lbs, last seen wearing a black, long-sleeve t-shirt and red/green pajama pants. pic.twitter.com/L7fDV7HuEH — Frisco Police (@FriscoPD) April 9, 2024 కాగా గత కొన్ని నెలల్లో అమెరికాలో 11 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు చనిపోయారు. ముఖ్యంగా గత నెల నుంచి తప్పిపోయిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి మంగళవారం ఓహియోలోని క్లీవ్ల్యాండ్లో శవమై కనిపించాడు. అలాగే ఓహియోలోని క్లీవ్ల్యాండ్లో మరో భారతీయ సంతతి విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించచాడు. -
టెక్సాస్లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్ఫ్లూ ముప్పు!
ప్రపంచమంతటా కోవిడ్–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్లో బర్డ్ఫ్లూ వైరస్లో హెచ్5ఎన్1 అనే వేరియంట్ తొలుత ఆవులకు, తర్వాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ► అమెరికాలో మనుషులకు సోకిన తొలి బర్డ్ఫ్లూ కేసు 2022లో కొలరాడోలో బయటపడింది. ► బర్డ్ఫ్లూ వైరస్ గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారుల జాబితాలో తొలి స్థానంలో ఉందని పిట్స్బర్గ్కు చెందిన బర్డ్ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేశ్ కూచిపూడి చెప్పారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని, మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► కోవిడ్–19తో పోలిస్తే బర్డ్ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ జాన్ ఫల్టన్ వెల్లడించారు. ఇందులో మ్యుటేషన్లు(మార్పులు) జరిగితే బాధితుల్లో మరణాల రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు. ► నిజానికి ఇతర దేశాల్లోనూ మనుషులకు బర్డ్ఫ్లూ సోకిన సంఘటనలున్నాయి. 2003 జనవరి 1 నుంచి 2024 ఫిబ్రవరి 26 దాకా 23 దేశాల్లో 887 కేసులు బయటపడ్డాయి. వీరిలో 462 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అంటే 52 శాతం మంది మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ► మనుషులు బర్డ్ఫ్లూ బారినపడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీ వైరల్ ఔషధాలు ఇస్తుంటారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
'అరుంధతి' సినిమాని తలపించే కథ..!
సినిమాని తలపించే కథ ఈ సొరంగం స్టోరీ. వాస్తవమో కాదో తెలియదు కానీ. ప్రజలు మాత్రం అందులోకి అడుగుపెట్టాలంటే హడలిపోతారు. చూసేందుకు లోపలకి వెళ్తే బాగుండును అనేంత అందంగా ఉంటుంది. తీరా వెళ్తే మాత్రం అంతే సంగతులు. బయటి నుంచి చూడటానికి రంగురంగులుగా బాగానే కనిపిస్తుంది గాని, ఈ సొరంగంలోకి అడుగు పెట్టాలంటేనే జనాలు వణికిపోతారు. ఇందులో దయ్యాలు సంచరిస్తుంటాయని, ఇందులోకి వెళ్లే వారిని అవి ముప్పుతిప్పలు పెడతాయని స్థానికులు చెబుతారు. అమెరికాలోని టెనసీ రాష్ట్రం కింగ్స్పోర్ట్ సమీపంలో ఉంది. దాదాపు వందేళ్ల కిందట దీనిని సెన్సాబాగ్ అనే ఇంజినీర్ నిర్మించాడు. ఆయన పేరు మీదనే ఇది సెన్సాబాగ్ టన్నెల్గా పేరుపొందింది. ఒక దుండగుడు తనను వెంటాడుతున్న పోలీసుల నుంచి తప్పించుకుని సురక్షితంగా పారిపోవడానికి సెన్సాబాగ్ మనవరాలిని కిడ్నాప్ చేసి, ఈ సొరంగంలోనే దాక్కున్నాడు. పసిపిల్లకు అపకారం జరగకూడదని పోలీసులు అప్పటికి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ దుండగుడు ఇక పసిపిల్లతో తనకు పనిలేదని భావించి ఆమెను చంపేసి, అక్కడే పడేశాడు. ఇది జరిగిన కొంతకాలానికి సెన్సాబాగ్ కూడా మరణించాడు. అప్పటి నుంచి ఈ సొరంగంలో సెన్సాబాగ్, ఆయన మనవరాలి ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికుల కథనం. ఈ సొరంగంలోంచి ప్రయాణిస్తుంటే ఒక్కోసారి కారు ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోతుందని, సెన్సాబాగ్ ఆత్మ కనిపిస్తుందని, పసిపిల్ల ఏడుపు వినిపిస్తుందని కూడా చెబుతారు. (చదవండి: గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!) -
Texas: యూఎస్, మెక్సికో సరిహద్దులో హెలికాప్టర్ క్రాష్
టెక్సాస్: అమెరికా, మెక్సికో సరిహద్దులో యూఎస్ నేషనల్ గార్డ్కు చెందిన ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. టెక్సాస్లోని లా గ్రుల్లా పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కూలిన సమయంలో హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనపై స్టార్ కౌంటీ షరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లకోటా యూహెచ్-72 రకానికి చెందినదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి.. గాజాలో దారుణం.. తిండి కోసం ఎదరు చూస్తున్న వారిపై పడ్డ పారాచూట్ -
Texas: విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో కొద్ది రోజులుగా కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పానాండిల్, ఓక్లహామా ప్రాంతాల్లో దావానలంలా వ్యాపించిన అతిపెద్ద కార్చిచ్చు స్మోక్హౌజ్క్రీక్ఫైర్ కారణంగా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 4వేల 4 వందల కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని దహించి వేసిన ఈ కార్చిచ్చులో చాలా ఇళ్లు, నిర్మాణాలు లక్షల సంఖ్యలో చెట్లు కాలిపోయాయి. కార్చిచ్చు వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తేల్చలేకపోతున్నామని అధికారులు తెలిపారు. పానాండిల్ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, ఇప్పటివరకు 500 వరకు నిర్మాణాలు మంటల్లో కాలిపోయాయని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. కార్చిచ్చు వల్ల కాలిపోయిన నిర్మాణాలను పరిశీలిస్తే అక్కడ బూడిద తప్ప ఏమీ మిగలలేదని మీడియాతో అబాట్ వ్యాఖ్యానించారు. ఈ వారాంతంలో వాతావరణపరిస్థితులు కార్చిచ్చుకు మరింత అనుకూలంగా మారుతున్నాయని, టెక్సాస్ ఓక్లహామా, కాన్సాస్, న్యూ మెక్సికోలో అగ్ని కీలలు మరింత విజృంభిస్తాయని జాతీయ వాతావరణ సేవల కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి.. అమెరికాలో మరో భారతీయుడి హత్య -
చల్లటి నీరు గుండె వ్యాధికి దారితీస్తుందా?
చలచల్లటి నీరు అంటే అబగా తాగేస్తాం. గోరు వెచ్చని నీళ్లు మంచిదన్న కూడా తాగడానికే బాధపడిపోతారు కొందరూ. అనారోగ్యంగా ఉంటే తప్ప వేడినీళ్ల జోలికే పోరు. కానీ ఇలా చల్లటి వాటర్ తాగి ఓ బాడీ బిల్డర్ ఆస్పత్రుపాలై అరుదైన గుండె వ్యాధిని ఎదుర్కొన్నాడు. చివరికి చావు అంచులు దాక వెళ్లోచ్చాడు. తనలా మరోకరూ ఇలాంటి భయానక అనుభవాన్ని ఎదుర్కొనకూడదన్న ఉద్దేశ్యంతో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎదుర్కొన్న భయానక చేదు అనుభవం ఏంటంటే.. అమెరికాలో టెక్సాస్కి చెందిన 35 ఏళ్ల ఫ్రాంక్లిన్ అరిబీనా ఇంటర్నేషనల్ ఫిట్నెస్ అండ్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ సభ్యుడు. పైగా బాడీ బిల్డర్ కూడా. అతను 18 ఏళ్ల వయసున్నప్పుడూ ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అతనికి చల్లటి ఐస్ నీరు తాగడమంటే ఇష్టం. ఇలా చల్లటి నీరు తాగడంతో బాడీ ఒక విధమైన పరిస్థితికి గురవ్వుతుండేది. అయితే అతను కోల్డ్ వాటర్ అలా లోపలికి వెళ్తే ఉండే ఫీల్ అనుకుని అంతగా సీరియస్గా తీసుకోలేదు. ఒకరోజు ఎప్పటిలానే జిమ్ వర్కౌట్లు చేసి ఐస్ వాటర్ తాగుతుండగా అదే పరిస్థితి ఎదుయ్యి ఒకలా అయిపోయింది అతడి పరిస్థితి. ఆ తర్వాత కాసేపటికి స్ప్రుహ తప్పి పడిపోయాడు. అక్కడ అతని గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటోంది. వైద్య పరీక్షల్లో అతడు ఒక విధమైన జన్యు పరివర్తనతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంటే కర్ణిక దడతో బాధపడుతున్నాడని అర్థం. దీనిని అఫీబ్ అని పిలుస్తారు. దీని కారణంగా ఎలక్ట్రిక్ సిగ్నల్లో అంతరాయం ఏర్పడి గుండె కొట్టుకోవడం నియంత్రలో ఉండదు. ఇలా ఎందువల్ల వస్తుందంటే..? మెదడు నుంచి ఛాతీ వరకు విస్తరించి ఉన్న వాగస్నాడిని చల్లటి నీరు తాకడం వల్ల ఒక విధమైన దడలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మనిషి స్ప్రుహ కోల్పోవడం గుండె లయలో మార్పులు వేగవంతంగా జరిగిపోతాయి. ఈ స్థితిలో గుండె కొట్టుకోవడం ఛాతీ నుంచి బయటకు కనిపించేంతగా వేగంగా కొట్టుకుంటుంది. ఈ పరిస్థితి కారణంగా రోగికి శ్వాస ఆడక ఛాతిలో ఒక విధమైన నొప్పితో అల్లాడిపోతుంటాడు. వైద్యులు బాడీ బిల్డర్ ఎదర్కొంటున్న సమస్యను సకాలంలో గుర్తించి గుండెకి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తి స్థాయిలో కోలుకున్నాడు కానీ ఆఫీబ్ కోసం మందులు వాడుతున్నాడు. ఎందుకంటే ఈ చల్లటి నీరు గుండె, వాగస్ నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీయడంతో జీవితాంతం ఆ మందులు వాడాల్సిందే. లేదంటే గుండె అదుపులేకుండా వేగంగా కొట్టుకుంటుంది.అంటే.. ఒక విధమైన గుండె దడలా వచ్చి..మనిషి స్ప్రుహ కోల్పోయేలా చేసి ప్రాణాంతకంగా మారుతుంది. తనలా ఎవ్వరూ ఇలా చల్లటి నీరు తాగి గుండె సమస్యలు తెచ్చుకోకూడదని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్ చేస్తున్నాడు. పైగా చల్లటి నీరు తాగొద్దనే చెబుతున్నాడు. (చదవండి: క్రియెటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ 'అమ్మ' సక్సెస్ స్టోరీ) -
అమెరికాలో కార్చిచ్చు
కనాడియన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అడవికి నిప్పంటుకుని లక్షల ఎకరాల్లో పచ్చదనం మటుమాయమైంది. చెట్లు కాలిబూడిదయ్యాయి. సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 2,00,000 ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతాన్ని కాల్చేసిన కార్చిచ్చు మరింత పెద్దదవుతూ అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దీంతో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ దాదాపు 60 గ్రామాల్లో విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరంచేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అణ్వాయుధాల కేంద్రం బంద్ ఈ ప్రాంతంలో సంభవించే అతి పెద్ద కార్చిచ్చులకు ది స్మోక్హౌజ్ క్రీక్ఫైర్గా పిలుస్తుంటారు. భయంకరమైన ఎండ, వేడి, పొడి వాతావరణం కారణంగా ఉత్తర టెక్సాస్ అడవిలో కార్చిచ్చు అంటుకుంది. సోమవారం మొదలైన ఈ కార్చిచ్చు టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఘటనల్లో ఐదోది కావడం గమనార్హం. ఈ కార్చిచ్చు దెబ్బకు ఆమరిల్లో పట్టణంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న అమెరికా అణ్వాయుధాల కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్యాన్టెక్స్ సంస్థ వెల్లడించింది. జాతీయ రహదారుల వెంట చెట్లకు సైతం మంటలు అంటుకోవడంతో ఆయా హైవేలపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఓక్లహామా రాష్ట్ర సరిహద్దుల్లోని హెమ్ఫిల్, హచిన్సన్ కౌంటీల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. మియామీ, కనాడియన్ పట్టణాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సెనేటర్ కెవిన్ స్పార్క్స్ స్థానికులకు విజ్ఞప్తిచేశారు. కనాడియన్ పట్టణాన్ని కార్చిచ్చు దాదాపు చుట్టేసింది. స్కెలీటౌన్, వీలర్, అలీసన్, బ్రిస్కో పట్టణాల నుంచీ స్థానికులు వేరే చోట్లకు వెళ్లిపోయారు. కార్చిచ్చు ఘటనల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో మొత్తంగా కోటి 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా అమెరికాను కార్చిచ్చులు నిత్యం వణికిస్తున్నాయి. -
USA: టెక్సాస్లో కార్చిచ్చు బీభత్సం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కార్చిచ్చు రెండింతలవడానికి కారణమైందని వాతావరణ శాఖ తెలిపింది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని ఎఅండ్ఎమ్ ఫారెస్ట్ సర్వీస్ తెలిపింది. వీటిలో అతి పెద్ద కార్చిచ్చు స్మోక్ హౌస్ క్రీక్ ఫైర్ లక్ష ఎకరాలు, గ్రేప్ వైన్ క్రీక్ ఫైర్ 30 వేల ఎకరాలు, విండీ డ్యూసీ ఫైర్ 8 వేల ఎకరాలను దహించి వేసింది. కార్చిచ్చు బీభత్సం కారణంగా పలు కౌంటీల్లో ప్రజలను తరలిస్తున్నారు. తూర్పు టెక్సాస్, ద మిల్స్ క్రీక్, సాన్జాసిన్టోల్లో కార్చిచ్చు ఎగిసిపడుతోంది. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు పరిస్థితిని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ సమీక్షించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. I have a prayer request for y’all. The Texas Panhandle is on fire with zero containment. I don’t live in the panhandle but Texas is the home I live in currently and been in. Please pray for all in the path of this. Pray for Texas 🙏♥️ pic.twitter.com/U9R5Syb2kE — Rachel Wilson (@RachelWilson94) February 28, 2024 ఇదీ చదవండి.. మాలిలో ఘోర బస్సు ప్రమాదం -
Texas: భారత సంతతి కంప్యూటర్ ఇంజినీర్కు ప్రతిష్టాత్మక అవార్డు
టెక్సాస్: భారత సంతతికి చెందిన రీసెర్చర్ కంప్యూటర్ ఇంజినీర్ను అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్లో అత్యున్నత అకడమిక్ అవార్డుగా పేరొందిన ఎడిత్ అండ్ పీటర్ ఓ డన్నెల్ అవార్డును ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్కు అందజేశారు. ఈ అవార్డును ద టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ(టామ్సెట్)ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా అందిస్తుంది. అశోక్ వీర రాఘవన్ హూస్టన్లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకుగాను వీరరాఘవన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా వీరరాఘవన్ మాట్లాడుతూ ‘అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత ఇమేజింగ్ టెక్నాలజీలో చాలా సమస్యలున్నాయి. కాంతి ప్రసరించకుండా అడ్డంకులున్నచోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నాం. దీనిని అధిగమించేందుకు మేం చేసిన పరిశోధనలు చాలా వరకు పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఉదాహరణకు కారు నడుపుతుంటే పొగమంచు వల్ల కాంతి పడకపోవడంతో ఎక్కువ దూరం రోడ్డును చూడలేకపోతున్నాం. విజిబిలిటీకి సంబంధించి ఇలాంటి సమస్యలు ఇక ముందు ఉండకపోవచ్చు’అని తెలిపారు. అశోక్ వీరరాఘవన్ తన బాల్యాన్ని తమిళనాడులోని చెన్నైలో గడిపారు. ఇదీ చదవండి.. సౌర రేడియేషన్తో పెను ముప్పు -
వైభవంగా టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024
టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 అమెరికాలో వైభవంగా జరిగింది. అలెన్లోని రాధా కృష్ణ టెంపుల్లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు కలిసి త్యాగరాజ స్వామి రచించిన ఘన రాగ పంచరత్న కృతులను, గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసులను రంజింప చేశారు. పంతుల రమ త్యాగరాజ స్వామికి గళార్చన చేసి.. తన గ్రాతంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఎఎస్ఎన్ మూర్తి, పత్రి సతీష్ కుమార్, గురువులు, విద్యార్థులచే వయోలిన్, గాత్ర కచేరీ కార్యక్రమం వీనులవిందుగా కొనసాగింది. సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సంగీత అభిమానులు కొనియాడారు. త్యాగరాజ కీర్తనలు భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి అని తెలిపారు. టెక్సాస్లోని ఇండియన్ ఆక్టేవ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!) -
టెక్సాస్లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్!
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. లెవిస్విల్లేలోని Mac స్పోర్ట్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్డ్ కప్, నాట్స్ ఇంటర్మీడియట్ కప్ విభాగాల్లో వాలీబాల్ పోటీలు జరిగాయి. ప్లేయర్స్ పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యూత్ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఆద్యంత్యం ఆకసక్తిగా సాగింది. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ టోర్నమెంట్ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ తెలుగు వేడుకలు మార్చి 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. డల్లాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. (చదవండి: లండన్లో యాత్ర 2 సక్సెస్ మీట్) -
ఉత్తర టెక్సాస్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు!
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్.. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఫ్రిస్కోలోని రీడీ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను బావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది టాంటెక్స్. సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, దీప్తి తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి గొప్పతనం చాటిచెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండగ వాతారవరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు స్టాల్స్కు విశేష స్పందన వచ్చింది. ఇక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్చంద మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మార్చిలో నాట్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డల్లాస్లో జరిగే నాట్స్ తెలుగు వేడుకల్లో అందరికీ పాల్గొని విజయవంతం చేయాలని సంస్థ సభ్యులు కోరారు. ఇక సంక్రాంతి సంబరాలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ మద్దతుగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న దాతలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు) -
Tesla: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం!
టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. భారీ ప్యాకేజీ అందుకునేందుకు మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. డెలావర్ రాష్ట్రంలో ఎవరూ తమ సంస్థలను రిజిస్టర్ చేసుకోవద్దని పిలుపునిచ్చారు. The public vote is unequivocally in favor of Texas! Tesla will move immediately to hold a shareholder vote to transfer state of incorporation to Texas. https://t.co/ParwqQvS3d — Elon Musk (@elonmusk) February 1, 2024 అంతేకాదు.. టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్కు మార్చాలా? అని పోల్ కూడా పెట్టారు. ఆ పోల్లో 80 శాతం అవునని చెప్పడంతో.. మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు సైతం టెక్సాస్లోనే తమ కంపెనీలను రిజిస్టర్ చేసుకుంటాయి. పన్ను శాతం తక్కువగా ఉండడమే అందుకు కారణం. -
Texas: తీవ్రమవుతున్న సరిహద్దు భద్రత వివాదం
టెక్సాస్: సరిహద్దు భద్రతపై అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య వివాదం తీవ్రమవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారిన షెల్బీ పార్కులోకి ఎవరినీ అనుమతించేది లేదని టెక్సాస్ ప్రభుత్వం తేల్చి చెబుతుంటే సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనని ఫెడరల్ ప్రభుత్వం పట్టుబడుతోంది. జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్ స్టేట్ నేషనల్ గార్డ్, ఇతర బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. షెల్బీ పార్కును టెక్సాస్ ప్రభుత్వం ఇటీవలే తమ ఆధీనంలోకి తీసుకుంది. రియో గ్రాండేలో ఉన్న ఈ పార్కులోకి ఎవరినీ అనుమతించేంది లేదంటూ ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను కూడా టెక్సాస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ వివాదం కారణంగా స్టాండ్ విత్ టెక్సాస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఇదీచదవండి.. అమెరికాలో నైట్రోజన్ గ్యాస్తో మరణ శిక్ష -
టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఏపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం
కన్సాస్, సాక్షి: అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాసులుగా తెలుస్తోంది. అయితే.. జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయి. మృతి చెందిన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా తేలింది. టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య ,కుమార్తె మనవడు, మనమరాలు, మరో బంధువు అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
ఆస్టిన్(అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. గతంలో జైలుకు వెళ్లొచి్చన 34 ఏళ్ల షేన్ జేమ్స్ అనే వ్యక్తి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో నాలుగు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు అధికారులుసహా ముగ్గురు గాయపడ్డారు. నిందితుడిని కారులో వెంబడించి మరీ పోలీసులు అరెస్ట్చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడింటి దాకా ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. శాన్ ఆంటోనియో ప్రాంతంలో కాల్పులు జరిపాక 129 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరో చోటా ఇతను కాల్పులకు తెగబడ్డాడు. ఎందుకు కాల్పులు జరిపాడు? మృతులతో ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ ఏడాది ఇది 42వ కాల్పుల ఘటన. -
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం
అమెరికా, టెక్సాస్లో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ - ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ఘనంగా ప్రారంబమైంది. ఆంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరై.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ అధ్యక్షుడిగా సత్యేంద్ర వానపల్లిని ఎన్నుకున్నారు. అమెరికాలో వున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ నేషనల్ సంస్థ ఏఏఏ అని, ఆంధ్రప్రదేశ్ విశిష్టతను ఆబాల గోపాలానికి సుపరిచయం చేయడమే తమ ముఖ్యోద్దేశమని సంస్థ సభ్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక చక్కని అవగాహన కలిగించే ప్రదర్శనలను చేయడమే తమ ఆశయమన్నారు. సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలు వివరించారు. ఇంకా సంక్రాంతి సంబరాలతో బాటు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు హరి మోటుపల్లితో పాటు న్యూజెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యులు, ఏఏఏ నేషనల్ కోర్ టీమ్, ఆస్టిన్ చాప్టర్ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, పలువురు సంస్థ ప్రతినిధుల పాల్గొని, ప్రసంగించారు. రానున్న రోజుల్లో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి ఈ చాఫ్టర్ మీట్ ఎంతగానో దోహదపడుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. తెలుగు వారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వివరించారు. ఏఏఏసంస్థకు మద్ధతుగా నిలిచి, అండగా ఉంటున్న ప్రతిఒక్కరికి నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అగ్రరాజ్యంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!) -
వీడియో వైరల్: రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారును.. విమానం ఢీకొట్టింది. ఇదేంటి గాల్లో ఉండే విమానం ఎలా ఢీకొట్టింది అనుకుంటున్నారా?. అదే ఇక్కడ వెరైటీ. కాగా, ఈ వింత ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో ఓ విమానం రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం స్థానిక ఏరో కౌంటీ ఎయిర్పోర్టులో Iv-P ప్రాప్జెట్ విమానం రన్వే పై నుంచి టేకాఫ్ అయ్యింది. కానీ, వెంటనే దానిని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ విమానం రన్వేపై చివరి వరకు వచ్చినా ఆగలేదు. దీంతో అక్కడే ఉన్న కంచెను దాటుకొని రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొంది. That’s gonna leave a mark, ouch! 🫣 T31 airport in Mc Kinney, Texas today 🎥 IG jackschneider17 via @HamWa07 pic.twitter.com/CKbgCTHOse — Thenewarea51 (@thenewarea51) November 11, 2023 దీంతో, వెంటనే అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. పైలట్, ప్రయాణికుడు, కారు డ్రైవర్ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్పగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసివేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు! -
టెక్సాస్లో ఘనంగా దసరా అలయ్ బలయ్.. పాల్గొన్న ప్రవాసులు
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - 'మాట'(Mana America Telugu Association) డల్లాస్ చాప్టర్ దసరా అలయ్ బలయ్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. టెక్సాస్లోని డ్రీమ్ డెస్టినేషన్ రాంచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో 3000 మందికి పైగా ప్రవాసులు పాల్గొని సందడి చేశారు. 'మాట' టీమ్ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఈ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రావణ దహనం కార్యక్రమాన్నిఅట్టహాసంగా నిర్వహించారు. ప్రవాసుల కేరింతల నడుమ రావణ దిష్టిబొమ్మ దహనం చేశారు. మాట సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, బిజెపి నాయకులు ప్రదీప్ రవికాంత్ ముఖ్య అతిథిలుగా విచ్చేసి, ప్రసంగించారు. 'మాట' డల్లాస్ చాప్టర్ రాజ్ సారథ్యంలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, సన్మానించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలతో.. అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. మహిళలు ఆటా పాటలు, కోలాటాలతో సందడి చేశారు. మగవారు డప్పులతో డాన్సులు చేస్తూ.. ఆకట్టుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, స్పూర్తి తమ గాత్రంతో పాటలు పాడి ఆడియన్స్లో జోష్ నింపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైనా ప్రతిఒక్కరికీ పసందైనా విందు భోజనం అందించారు. ఇక ఈ వేడుకలు విజయవంతం అవడం పట్ల 'మాట' డల్లాస్ చాప్టర్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సేవా, సంస్కృతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని సంస్థ సభ్యులు వివరించారు. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాట సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రవాసుల ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. -
టెక్సాస్లో గ్రాండ్గా 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్
అమెరికా, టెక్సాక్లో జరిగిన యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ DFW 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమానికి అనుహ్య స్పందన వచ్చింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ కర్యాక్రమానికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, హ్యూస్టన్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రసంగించారు. భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక వాణిజ్యాల గురించి వారు ప్రస్తావించారు. టెక్సాక్-భారత్ ఆర్థిక సంబంధాలు వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. టెక్సాస్ వృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ, అమెరికన్ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. 1999లో ఈ ఛాంబర్ని ప్రారంభించామని, ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా వార్షిక అవార్డ్స్ బాంకెట్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించినట్లు తెలిపారు. 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. -
తల్లి ఫోనులో మునక.. కొడుకు నీట మునక!
అమెరికాలోని టెక్సాస్లో గల ఒక వాటర్పార్క్లో మూడేళ్ల బాలుడు మునిగి మృతి చెందాడు. ఆ బాలుని తల్లి గంటల తరబడి ఫోన్లో మునిగిపోయి ఉండటమే ఈ ఘటనకు కారణమని టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్తో ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ లైఫ్గార్డులు శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని గతంలో ఆరోపించారు. ఎల్ పాసోలోని క్యాంప్ కోహెన్ వాటర్ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి జెస్సికా వీవర్ (35) నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. కాగా ఆమె తన ఏకైక సంతానం ఆంథోనీ లియో మాలావే మృతికి అక్కడి లైఫ్గార్డుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టును ఆశ్రయించారు. ఎల్ పాసో టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం గతమే నెలలో కోహెన్ వాటర్ పార్కులో బాలుడు మృతి చెందడానికి ఆ బాలుని తల్లే కారణమని పలువురు ప్రత్యక్ష సాక్షులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ఆమెను గత ఆగష్టు 30న ఇండియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో విచారణ అనంతరం ఆమె దోషిగా తేలడంతో సెప్టెంబరు 22న ఆమెను ఎల్ పాసో కౌంటీ జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత ఆమెను $100,000 ష్యూరిటీ బాండ్పై విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో పార్క్లో విధులు నిర్వహిస్తున్న 18 మంది లైఫ్గార్డ్లలో ఒకరు, కొలనులోని నాలుగు అడుగుల లోతులో మునిగిన మూడు సంవత్సరాల చిన్నారిని బయటకు తీశారు. స్విమ్మింగ్ సమయంలో ఉపయోగించే రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బాలుడు లైఫ్ వెస్ట్ ధరించలేదు. క్యాంప్ కోహెన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులలో ఆరేళ్లలోపు పిల్లలు ఈత కొట్టే సందర్భంలో వారి తల్లిదండ్రులు వారిని పర్యవేక్షించాలని రాసివుంది. కాగా ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ ఆ బాలుని తల్లి వీవర్ ఘటన జరిగిన సమయంలో గంటల తరబడి పోనులో మునిగిపోయి ఉందని తెలిపారు. పైగా పిల్లాడిని పట్టించుకోకుండా, అక్కడి దృశ్యాలకు ఫోటో తీయడంలో మునిగిపోయిందని తెలిపారు. పిల్లవాడిని నీటిలో నుండి బయటకు తీయడానికి ఏడు నిమిషాల ముందువరకూ ఆ మహిళ తన ఫోన్లో నిమగ్నమై, పాటను ప్లే చేస్తూ, హాయగా విశ్రాంతి తీసుకున్నదని మరో సాక్షి తెలిపారు. ఇది కూడా చదవండి: నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది? -
ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్ బాధ పడుతున్నాడు!
అమెరికాలో అక్రమ సరిహద్దు క్రాసింగ్కు సంబంధించిన సంక్షోభం మధ్య బిలియనీర్ ఎలాన్ మస్క్ టెక్సాస్-మెక్సికో సరిహద్దులను పరిశీలించారు. ‘ఈగిల్ పాస్ సరిహద్దు దగ్గర ఏమి జరుగుతున్నదో చూడటానికి వెళ్లాను’ అని ఎలాన్ మస్క్ తెలిపారు. అక్కడి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఎలాన్ మస్క్ ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. బ్లాక్ కౌబాయ్ టోపీ ధరించిన మస్క్ అక్కడి అధికారులతో మాట్లాడారు. సరిహద్దులను పరిశీలించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో మస్క్ ఇటువంటి అక్రమ సరిహద్దు క్రాసింగ్లకు సంబంధించిన సమస్యలపై తన అభిప్రాయాలను తరచూ షేర్ చేస్తుంటారు. దీనికి ముందు టెక్సాస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న యుఎస్ ప్రతినిధి టోనీ గొంజాలెస్తో మస్క్ మాట్లాడారు. అక్రమ వలసలు పెరిగిపోయాయని మస్క్ అనగా, కష్టపడి పనిచేసేవారు, నిజాయితీపరులు అమెరికాకు రావడానికి చట్టబద్ధంగా అనుమతి ఉందని టోనీ గొంజాలెస్ తెలిపారు. సరిహద్దు సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నదని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వెనిజులా మహిళ ఒకరు చిన్న పిల్లను తీసుకుని, అత్యంత జాగ్రత్తగా ముళ్లకంచెను దాటుకుని మెక్సికో సరిహద్దులను దాటి, అమెరికాలోకి ప్రవేశించడం కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Video shows a Venezuelan woman trying to pass with a small girl under the barbed fence on the border between Mexico and El Paso, Texas 🚨🚨🚨 pic.twitter.com/oYhShfp00h — Wall Street Silver (@WallStreetSilv) September 29, 2023 -
టెక్సస్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం
-
గడ్డి కోస్తుండగా ఆకాశం నుంచి పాము..దాన్ని అటాక్ చేస్తూ గద్ద..రెండూ..
ఇలాంటి సంకట స్థితి ఎవ్వరకి రాకూడదూ. తలచుకుంటేనే అమ్మ బాబోయే అనిపిస్తుంది. ఆ క్షణంలో ఎవ్వరున్నా.. గుండె ఆగిపోవడం ఖాయం. అలాటి దారుణమైన ఘటన టెక్సాస్లో చోట చేసుకుంది. వివరాల్లోకెళ్తే...టెక్సాస్లో ఓ మహిళ ఎంత దారుణమైన ఆపదలో చిక్కుకుందంటే.. పగవాడికి కూడా వద్దురా బాబు ఇలాంటి ఆపద అనిపిస్తుంది. టెక్సాస్లోని బ్యూమాంట్ సమీపంలో సిల్స్బీకి చెందిన పెగ్గీ జోన్స్ అనే మహిళ తోటపని చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఓ పాము ఆకాశం నుంచి పెగ్గీ జోన్స్పై పడింది. ఆ పాము ఒక్కసారిగా పెగ్గీ చేతిని గట్టిగా చుట్టుకుంది. ఆ తర్వాత దాన్ని తరుముకుంటూ ఓ గద్ద కూడా అదే టైంలో...భయంతో విలవిల్లాడుతున్న ఆ మహిళ వద్దకు వచ్చింది. దీంతో ఆ రెండు ఒకేసారి ఆమెపై దారుణంగా దాడి చేస్తున్నాయి. పాము కోసం గద్ద..గద్ద నుంచి తప్పించకునే క్రమంలో పాము..ఇలా రెండు ఒకేసారి పెగ్గి చేతిపై దాడి చేస్తున్నాయి. భయంతో ఒక్కసారిగా పెగ్గీ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో భర్త పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించాడు. పెగ్గీ చేతికి దారుణంగా గాయలవ్వడంతో వైద్యులు సత్వరమే చికిత్స అందించారు. దీంతో నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. పాము కాటేసిందనుకున్నా.. ఆ రెండింటి దాడిలో పెగ్గి చేతి గాయమవ్వడమే గాక పాము విషం ఆమె కంటి అద్దాలపై పడటంతో.. కొద్దిపాటులో సేఫ్గా బయటపడింది. అయితే పెగ్గీ మాత్రం పాము తనని కాటువేసిందనుకుంది గానీ నిజానికి ఆమె పాము కాటుకి గురికాలేదు. కాకపోతే గద్ద, పాము పొట్లాటలో ఆమెకు గాయాలయ్యాయి. సమయానికి ఆమె భర్త రావడంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఈ క్రమంలో పెగ్గీ మాట్లాడుతూ..ఇంతకుమునుపు కూడా పాము కాటుకి గురయ్యి.. బయటపడ్డ. మరోసారి ఈ భయానక ఆపద నుంచి సేఫ్గా బయటపడటంతో తాను చాలా లక్కీ అని మురిసిపోతోంది పెగ్గీ. (చదవండి: ఆ దేశం పీతలను నిర్మూలించడానికి ఏకంగా రూ. 26 కోట్లు..!) -
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
పబ్లిక్ లో రచ్చ చేసింది జైలు పాలయ్యింది
దుబాయ్: అమెరికా టిక్ టాకర్ ఎరక్కపోయి దుబాయ్ లో ఇరుక్కుపోయింది. తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. తర్వాత అనవసరంగా అద్దె కార్ షోరూం యజమానిపై నోరు జారి న్యూసెన్స్ చేసి జైలు పాలయ్యింది. అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్(29) యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు. టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు అద్దెకు కారు తీసుకున్నప్పుడు షోరూంలో ఇద్దరూ తమ గుర్తింపు కార్డులు అక్కడ వారికిచ్చారు. మరుసటి రోజున అమెరికా తిరిగి ప్రయాణమవ్వనున్న నేపథ్యంలో అలెన్ కారు షోరూంకి వెళ్లి తన ఐడెంటిటీ కార్డులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ ఆ కార్ షోరూం యజమాని కేసు తేలేంత వరకు అవి ఇవ్వడం కుదరదని చెప్పడంతో టిక్ టాకర్ రెచ్చిపోయింది. షోరూం యజమానిపై చిర్రుబుర్రులాడి గట్టి గట్టిగా అరుస్తూ గొడవ చేసింది. దీంతో దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Tierra Young Allen, Truck Driver TikTok Star, Is Detained in #Dubai! She is accused of ‘Screaming’ at a rental car agent. Will she get the #BrittneyGriner treatment and get her home sooner than later? 🤔 pic.twitter.com/GOIca0H58J — WOKEVIDEO (@wokevideo) July 16, 2023 ఇది కూడా చదవండి: ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.. -
మళ్లీ పేలిన తూటా.. అమెరికాలో 8 మంది మృతి
ఫిలడెల్ఫియా: అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే మరో రెండు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి బాల్టిమోర్లో బ్లాక్పార్టీపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 28 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి టెక్సాస్, ఫిలడెలి్ఫయాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరు బాలురు సహా మరో 10 మంది గాయపడ్డారు. ఫిలడెల్పియాలోని కింగ్సెస్సింగ్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సాయుధుడు వీధుల్లో తిరుగుతూ కనబడిన వారిపైకి కాల్పులు సాగించాడు. సమాచారం అందుకుని పోలీసులు చుట్టుముట్టడంతో అతడు లొంగిపోయాడు. ఆగంతకుడి వద్ద నుంచి ఏఆర్ రైఫిల్, హ్యాండ్గన్ స్వాధీనం చేసుకున్నారు. అతడి కాల్పుల్లో అయిదుగురు చనిపోయారు. మరో ఇద్దరు 2, 13 ఏళ్ల బాలురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మరో ఘటన..టెక్సాస్లోని ఫోర్ట్వర్త్లోస్థానిక ఉత్సవం కోమోఫెస్ట్లో పాల్గొన్న జనంపైకి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా 8 మంది గాయపడ్డారు. -
ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్ మాల్లో ఏం జరిగిందంటే..
అది 2023, మే 6.. అమెరికాలోని టెక్సాస్ స్టేట్లోని ఎలన్ పట్టణంలోగల ఒక షాపింగ్ మాల్లో ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఏడుగురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిందిదే.. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలోను, ఫొటోలలోను రక్తపుమడుగులో నేలపై పడి ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు, మృతులు దయనీయ స్థితిలో కనిపించారు. వారి మధ్య హంతకుడు కూడా ఉన్నాడు. అతని మృతదేహం వద్ద ఒక తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనను చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. అతను షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత వినిపించింది. వెంటనే అతను ఒక పక్కకు వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో పోలీసులు షాపింగ్ మాల్లోని వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో తాను కూడా బయటకు వెళ్లిపోయానన్నారు. అక్కడ తనకు చాలా మృతదేహాలు కనిపించాయన్నారు. తెలుగు యువతి దుర్మరణం ఈ ఘటనలో ఒక తెలుగు యువతి దుర్మరణం పాలయ్యింది. హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల ఐశ్వర్య టెక్సాస్ కాల్పులలో మృతి చెందింది. ఆమె రంగారెడ్డి జిల్లా జడ్జి తాతికొండ నర్సరెడ్డి కుమార్తె. ఐశ్వర్య అమెరికాలోని ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తోంది. అలెర్ట్ అయిన పోలీసులు ఈ కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. మారణాయుధంతో దాడులకు తెగబడిన నరరూపరాక్షసుడిని మట్టుబెట్టారు. అతనొక్కడే ఈ కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దుండగుడిని 33 ఏళ్ల మారిసియో గార్సియాగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమేమిటన్నదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 4 నెలల్లో 198 కాల్పుల ఘటనలు గన్ కల్చర్ ఆర్కైవ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 198 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగిన మాస్ షూటింగ్లో ఆగంతకుడు ఐదుగురిని తుపాకీ కాల్పులకు బలితీసుకున్నాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 33 కోట్ల జనాభాలో 40 కోట్ల తుపాకులు అమెరికా స్వాతంత్ర్యం సాధించి 231 ఏళ్ల దాటినా గన్ కల్చర్ అంతంకాలేదు. దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2019కి సంబంధించిన ఒక రిపోర్టు ప్రకారం అమెరికాలో 63 వేల మంది గన్కల్చర్ డీలర్లు ఉన్నారు. వీరు అదే ఏడాది ఆమెరికా పౌరులకు 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులను విక్రయించారు. ప్రపంచంలోని మొత్తం 85.7 కోట్ల సివిలియన్ గన్లలో ఒక్క అమెరికాలోనే 39.3 కోట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 5 శాతం. అయితే ప్రపంచం మొతంలో గల సివిలియన్ గన్లలో 46 శాతం కేవలం అమెరికాలోనే ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు -
స్టార్షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్డేట్
ఎలన్మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్షిప్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి దాటింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్ మస్క్ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని వెల్లడించారు. తాజాగా జరిగిన ఫ్లైట్-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలన్ మస్క్ వెల్లడించారు.దీనికి సంబంధించి తాజాగా టెక్సాస్లోని స్టార్బేస్లో షిప్ 25 సిక్స్ ఇంజిన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ పూర్తి చేసుకున్నదని ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ షేర్ చేశారు. గత ఏప్రిల్లో ఎలన్ మస్క్ సారధ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం విదితమే. అమెరికాలోని టెక్సాస్ సమీపంలోగల బోకా చీకా తీరం నుంచి నింగిలోకి ఎగిసిన కొద్దిసేపటికే రాకెట్ స్టార్షిప్ పేలిపోయింది.ఈ రాకెట్ ప్రయోగం విఫలమమైన నేపధ్యంలో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ పేలిపోయినట్లు స్పేస్ ఎక్స్ సంస్థ వివరించింది. గత ప్రయోగ ఫలితాలను విశ్లేషించి.. అయితే నాడు ఎలన్ మస్క్ ఒక ట్వీట్లో ఈ ప్రయోగ ఫలితాలను తమ సైంటిస్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఈ వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. అంతరిక్షంలో వ్యోమగాములు, సరుకు రవాణాకు ఉద్దేశించిన స్టార్షిప్ ప్రయోగాన్ని గత ఏప్రిల్ 17న చేపట్టారు. ఈ ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి, మెక్సికోలో పడేలా దానిని రూపొందించారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించినా, సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో ప్రయోగం వాయిదా పడింది. తరువాతి ప్రయోగంలో ఊహించని విధంగా స్టార్షిప్ ప్రయోగం విఫలమైంది. అయితే తాజాగా చేసిన ప్రయోగంలో మరోమైలు రాయి దాటినట్లు ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. Key milestone completed for flight 2 https://t.co/bGmWKOnKEH — Elon Musk (@elonmusk) June 27, 2023 ఇది కూడా చదవండి: ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. -
విమానం ఇంజిన్ లోపలికి లాగేసింది!
హూస్టన్: ఊహించని ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్కు చెందిన విమానం 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్టీఎస్బీ)తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం. కాగా, గత ఏడాది అలబామా ఎయిర్పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవలే సదరు విమాన సంస్థకు రూ.12.80 లక్షల జరిమానా విధించారు. -
అమెరికాలో టోర్నడో విధ్వంసం.. అయిదుగురి మృతి
అమెరికాలో టోర్నడో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రంలోని పాన్హ్యాండిల్ పట్టణం పెర్రిటన్లో టోర్నడో ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 100 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మృతుల్లో 11 బాలుడు, 60 ఏళ్ల వయస్సున ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత టోర్నడో తుపాను టెక్సాస్, ఫ్లోరిడా ప్రాంతాన్ని తాకినట్లు అమరిల్లోలోని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. సమాచారం అందుకున్న అత్యవసర సేవల అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ సేవలు ముమ్మరంగా సాగుతున్నాయని పెర్రిటన్ ఫైర్ చీఫ్ పాల్ డచర్ తెలిపారు. సుడిగాలి కారణంగా టెక్సాస్లో 200 ఇళ్లు ధ్వంసమవ్వగా.. మొబైల్ హోమ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వృక్షాలు నెలకొరిగాయి. వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టెక్సాస్, లూసియానా, మిస్సిస్సిప్పి, ఫ్లోరిడా, ఓక్లహోమాలో సుమారు 50 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. పెర్రిటన్లో ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సుడిగాలి తీవ్రతకు గురువారం ఫ్లోరిడా పాన్హ్యండిల్లో ఇంటిపై చెట్టు కూలడంతో ఒకరు మరణించారని తెలిపింది. చదవండి: ఐరాసలో యోగా వైట్హౌస్లో విందు -
Chat GPT చెప్పింది అని విద్యార్దులను ఫెయిల్ చేసాడు.. చివరికి ఏమైందంటే..
-
అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన లహరి పతివాడ(25) అనే భారతీయ-అమెరికన్ మహిళ శవమై కనిపించింది. సరిహద్దు రాష్ట్రమైన ఓక్లహోమాలో దాదాపు 322 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. నివేదికల ప్రకారం.. టెక్సాస్లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న లహరి పతివాడ చివరి సారిగా డల్లాస్ పరిసరాల్లోని ఎల్ డొరాడో పార్క్వే , హార్డిన్ బౌలెవార్డ్ బ్లాక్ ప్రాంతాల్లో టయోటా కారు నడుపుతూ కనిపించారు. వావ్ అనే స్థానిక టెక్సాస్ సంస్థ ద్వారా ఆమె అదృశ్యమైన వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. మే 12న ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె స్నేహితులు ఓక్లహోమాలో ఆమె ఫోన్ను ట్రాక్ చేశారు. ఆమె ఫేస్బుక్ పేజీ ప్రకారం.. లహరి ఓవర్ల్యాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో పనిచేసేవారు. బ్లూ వ్యాలీ వెస్ట్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. ఇదీ చదవండి: Viral Video: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం -
ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం
టెక్సాస్ అలెన్ ప్రీమియం ఔట్లెట్ మాల్లో దుండగుడి కాల్పుల్లో మృతిచెందిన తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య(26) మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ఆమె కుటుంబానికి సహకరిస్తున్నామని అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ తెలియజేసింది. శనివారం టెక్సాస్ మాల్ కాల్పుల్లో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐశ్వర్య మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడానికి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయడానికి తమ వంతు సాయం అందిస్తున్నామని హూస్టన్లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అసీమ్ మహాజన్ చెప్పారు. కాల్పుల్లో ఐశ్వర్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య పార్థివ దేహాన్ని భారత్కు తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతినిధి అశోక్ కోళ్ల కృషి చేస్తున్నారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
అమెరికా టెక్సాస్ లో కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి
-
టెక్సాస్ కాల్పుల ఘటనపై ఏపీ ప్రభుత్వం ఆందోళన: రత్నాకర్
అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువతి ఐశ్వర్య మరణించడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా దక్షిణాది రాష్ట్రమైన టెక్సాస్లో చాలా మంది భారతీయులు, అందులోనూ తెలుగు వారు నివసిస్తున్నారు. డల్లాస్ లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. డల్లాస్ అల్లెన్ ప్రీమియం మాల్ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్టుగా తెలిసిందని, ఐశ్వర్య ఇందులో ఉన్నారని, గాయపడ్డ వారిలో మరో ఇద్దరు కూడా తెలుగు వారున్నారని, వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రత్నాకర్ తెలిపారు. అమెరికాలో ఉంటోన్న ప్రవాసాంధ్రులు నిత్యం జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని కోరారు. ఈ జాగ్రత్తలు పాటించండి ఇటీవల చోటు చేసుకుంటోన్న కాల్పుల ఘటనలు, ఇతర దాడుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు తగినన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ► కాల్పుల తరహలో ఏవైనా ఘటనలు లాంటివి జరిగినపుడు వీలైనంత వరకు బయటకు రావొద్దు ► ఎదుటి వారికి కనిపించేలా పరుగులు తీయొద్దు, మన ఆచూకీ తెలియనివ్వకుండా నక్కి ఉండండి ► కాల్పుల శబ్దం విన్నప్పుడు, అది మరీ దగ్గరగా ఉంటే పూర్తిగా నేలపైనే పడుకుని ఉండండి. పైకి కనిపించొద్దు. ► ఆందోళనకు గురి కావొద్దు, హడావిడిగా అటు, ఇటు పరుగులు తీయొద్దు ► బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలి, మాతృభాషను తక్కువగా వాడాలి ► చుట్టుపక్కల అనుమానస్పద కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచండి ► ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అనుమానం వస్తే, ఎక్కడైనా ట్రాప్ అయ్యామని అనిపిస్తే వెంటనే అలర్ట్ కండి. 911కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి ► ఎవరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగొద్దు ► బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడొద్దు ► చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడండి, సున్నితంగా అక్కడి నుంచి తప్పుకోండి. ► మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు ► 911 నంబర్కు ఫోన్ చేసేందుకు అస్సలు సంకోచించవద్దు, పైగా పోలీసులతో పాటు వైద్యంతో పాటు ఏ రకమైన సాయమైనా క్షణాల్లో దొరుకుతుంది ► అమెరికాలో పరిస్థితులు చాలా వరకు సురక్షితమే. అయితే ఒకటో, రెండో నేర ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ► ఎవరికి వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి
నేరేడుచర్ల/హుడా కాంప్లెక్స్ (హైదరాబాద్): అమెరికాలోని టెక్సాస్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాటికొండ ఐశ్వర్య (27) మృతి చెందింది. హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ఆమె.. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. కొన్ని నెలల కిందే అక్కడ ఉద్యోగంలో చేరింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. షాపింగ్ కోసమని వెళ్లి..: ఐశ్వర్య కుటుంబం స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల. తాత రామనర్సింహారెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేశారు. తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఆర్థిక వివాదాల పరిష్కారాల కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే హైదరా బాద్కు వలస వచ్చారు. ప్రస్తుతం సరూర్నగర్ హుడాకాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. 2019 జనవరిలో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. టెక్సాస్ వర్సిటీలో ఎంఎస్ పూర్తిచేశాక.. అక్కడే పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా ఉద్యోగంలో చేరారు. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున) టెక్సాస్లోని డాలస్లో ఓ ఫ్రెండ్తో కలసి షాపింగ్కు వెళ్లింది. ఆ సమయంలో షాపింగ్ మాల్లోకి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. కాల్పుల్లో ఐశ్వర్య ముఖం ఛిద్రం కావడంతో తొలుత ఆమె ఎవరనేది తెలియలేదు. పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యను గుర్తించి సోమవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు మూడు రోజులు పట్టవచ్చని ఆమె సోదరుడు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. చదవండి: ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు.. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా? అల్లారుముద్దుగా చూసుకున్న ఐశ్వర్య ఇక లేదనే విషయం తెలిసి ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొన్ని నెలల కిందే హైదరాబాద్కు వచ్చి వెళ్లిన ఆమెను గుర్తు చేసుకుంటూ తండ్రి తాటికొండ నర్సిరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ‘‘నన్ను, అమ్మను వెంట తీసుకెళతానంది. తనతోపాటు నేను కూడా అక్కడే ఉండాలన్నది. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా?’’ అంటూ ఆయన తీవ్రంగా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. (చదవండి : అమెరికాలో ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?) రోజూ ఫోన్ చేసి మాట్లాడేదని, వేళకు మందులు వేసుకోవాలని చెప్పేదని, ఇంతలోనే తమకు శాశ్వతంగా దూరమైందంటూ ఐశ్వర్య తల్లి విలపించింది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన తన మనవరాలు దుండగుడి కాల్పుల్లో మృతిచెందడం దురదృష్టకరమని ఐశ్వర్య తాత తాటికొండ రామనర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి
టెక్సాస్లో దుండగుల జరిపిన కాల్పుల కలకలంతో ఒక్కసారిగా అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కొందరు దుండగలు శనివారం టెక్సాస్లోని ఓ మాల్లోసాముహిక కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మాటల్లో చెప్పలేని విషాదం.. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించే క్రమంలో కాల్పులు జరుపుతున్న అగంతకుడుని కాల్చి చంపేసినట్లు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో మరోక నిందితుడు కూడా కాల్పులు జరుపుతూ కనిపించాడని, అతడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు . ఈ ఘటనపై స్పందించిన టెక్సాస గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఘటనను మాటల్లో చెప్పలేని విషాదంగా అభివర్ణించారు. సదరు అగంతకుడి ఆచూకి కోసం టెక్సాస్ పోలీసులు మాల్లోని దుకాణాల వద్ద ఉన్న సీసీఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి జైనల్ పర్వేజ్ మాట్లాడుతూ..తన కూతురు కాల్పుల జరుగుతున్నట్లు చెప్పడంతో తాను మాల్ వద్దకు వచ్చానని, ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మమ్మల్నిలోపలకి వెళ్లమని సైగ చేశారని తెలిపాడు. ఆ తదనంతరం తాను తన కూతురుని రక్షించే యత్నంలో ఉండగా.. ఒక అంగతుడిని పోలీసులు చంపేశారని చెప్పాడు. ఇంతలో మరో అగంతకుడు కాల్పులు జరుపుతూ కనిపించినట్లు తెలిపాడు. (చదవండి: కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..) -
70 ప్లస్... తగ్గేదేల్యా!.. ఫొటో వైరల్
గోవాలో గ్రామీణ బామ్మలు సర్ఫ్బోర్డులతో సర్ఫింగ్కు వెళితే? అనే ఊహను ఏఐ సాంకేతికతతో నిజం చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆశిష్ జోస్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘నానీస్ ఎట్ ది బీచ్’ అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫోటోపై యూజర్స్ నుంచి రకరకాల కామెంట్స్ వచ్చాయి. ‘ఫొటో కాదు. బామ్మలు నిజంగానే సర్ఫింగ్ చేస్తే ఎంత బాగుండేదో’ అని ఒకరు కామెంట్ రాస్తే, మరొకరు ‘వెండి వొరెల్ వీడియో చూడండి చాలు’ అని సలహా ఇచ్చారు. టెక్సాస్కు చెందిన వెండి వొరెల్ వయసు 70 సంవత్సరాల పైమాటే. ఈ వయసులోనూ సర్ఫింగ్ చేస్తూ ‘ఉమెన్ ఆఫ్ ది వేవ్’గా పేరు తెచ్చుకొని ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
అమెరికాలో దారుణం.. ప్రోమ్ పార్టీపై కాల్పులు
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇంట్లో జరుగుతున్న హైస్కూల్ ప్రోమ్ పార్టీపై కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో 9 మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. అమెరికాలోకి టెక్సాస్లో జాస్పర్ కౌంటీలో ఉన్న ఓ ఇంట్లో హైస్కూల్ ప్రోమ్ పార్టీ జరుగుతోంది. ఈ సందర్భంగా పిల్లలందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఓ దుండగుడు ప్రోమ్ పార్టీపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది టీనేజర్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కాల్పుల్లో గాయపడిన వారంతా 15-19 ఏళ్ల మధ్య వారుగా తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక, కాల్పల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు జాస్పర్ కౌంటీ షరీష్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, కాల్పలకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
జుట్టుపైనా వివక్ష! క్రౌన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం, వారికి ఆనందానికి అవధుల్లేవ్
‘అది జుట్టా, కలుపు మొక్కా?’ అని ఒకరు, ‘గొర్రె బొచ్చుకు, వారి జుట్టుకు ఏమన్నా తేడా ఉందా?’ అని మరొకరు ‘నల్ల జుట్టుంటే ఉద్యోగానికేం పనికొస్తారు?’ జుట్టుపై అమెరికన్ల వివక్షాపూరిత వ్యాఖ్యలివి! జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష గురించి విన్నాం. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం తలపై జుట్టు దగ్గర్నుంచి కాలి గోళ్ల దాకా అక్కడ అన్నింటా వివక్ష రాజ్యమేలుతోంది. నల్ల జుట్టుపై వివక్షను నిషేధిస్తూ టెక్సాస్ హౌస్ తాజాగా బిల్లును ఆమోదించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయంగా మారింది... జుట్టు నల్లగా, పొడవుగా, రింగులు తిరిగి ఉంటే అమెరికన్లు సహించలేరు. కొప్పు బాగా కుదిరితే చక్కగా ఉంటుందంటాం. కానీ నల్లజాతి అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్తో కొప్పును గొప్పగా ప్రదర్శించడం కూడా అమెరికన్లకు కంటగింపు వ్యవహారమే. స్కూళ్లు, పని ప్రాంతాలు, నలుగురు కలిసే చోట... ఇలా అంతటా ఈ వివక్ష తీవ్ర రూపు దాల్చి కన్పిస్తుందక్కడ. ఆఫ్రో, బ్రయిడ్స్, డ్రెడ్లాక్స్, కార్న్రోస్ హెయిర్ స్టైల్స్ చేసుకునే వారిపై వివక్ష పెరిగిపోతుండటంతో టెక్సాస్లో ప్రతినిధుల సభ కల్పించుకోవాల్సి వచ్చింది. నల్లజుట్టుపై వివక్ష పనికిరాదంటూ క్రౌన్ యాక్ట్ బిల్లును ఆమోదించింది. జుట్టుపై వివక్ష తగదంటూ డెమొక్రాట్ సభ్యురాలు రెట్టా బోవర్స్ తొలుత గళమెత్తారు. ఎవరి జుట్టు ఎలా ఉంటే అలానే ఉండనివ్వాలి. మార్చుకొమ్మని శాసించే హక్కు ఎవరికీ ఉండదు’’అన్నారామె. బోవర్స్ తొలిసారి ఈ బిల్లును ప్రతిపాదించినప్పుడు ఇదంత అవసరమా అని అంతా కొట్టిపారేసారు. కానీ ఇప్పుడది 143–5 ఓట్లతో నెగ్గడంతో ఆమె ఆనందం అవధులు దాటింది. బిల్లు ఎలా వచ్చిందంటే.. హ్యూస్టన్లో బార్బర్స్ హిల్ హైస్కూలులో అధికారులు డెండ్రే ఆర్నాల్డ్ అనే విద్యార్థిపై చూపిన వివక్ష ఈ బిల్లుకు కారణమైంది. ఆర్నాల్డ్ ఏడో తరగతి నుంచి జుట్టు పెంచుకుంటున్నాడు. అది ట్రినిడాడియన్ల సంస్కృతిలో భాగం. కానీ జుట్టు కత్తిరించుకోకుంటే గ్రాడ్యుయేషన్ క్లాసులకు అనుమతించేది లేదని స్కూలు అధికారులు తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డా లాభం లేకపోయింది. ఇదంతా 2020లో జరిగింది. ఆర్నాల్డ్ కథ ఇంటర్నెట్లో వైరలైంది. అతనికి ప్రఖ్యాత టీవీ షో ది ఎలెన్ డిజెనరస్లో పాల్గొనే అవకాశం వచ్చింది. హెయిర్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు మాథ్యూ ఎ చెర్రీ ఆ అబ్బాయిని ఆస్కార్ అవార్డు ఫంక్షన్కు కూడా ఆహ్వానించాడు. మరెందరో విద్యార్థులను జుట్టు పొడవుగా ఉందంటూ స్కూలు నుంచి తీసేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ వివక్షను నిషేధిస్తూ చట్టం చేయాల్సి వచ్చింది. ఈ వివక్ష ఇప్పటిది కాదు! అమెరికాలో నల్ల జుట్టుపై వివక్ష 18వ శతాబ్దం నుంచీ ఉంది. ఆఫ్రికన్ల జుట్టు గొర్రె బొచ్చులా ఉంటుందని అప్పట్లోనే హేళన చేసేవారు. తర్వాత రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకునే నల్లజాతి మహిళలు ఉద్యోగాలకు పనికి రారన్న అభిప్రాయం అమెరికన్లలో పెరిగింది. జుట్టు ఎక్కువున్న వారికి వృత్తిపరమైన లక్షణాలేవీ ఉండవని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సామర్థ్యముండదని అడ్డమైన వాదనలు తెరపైకి తెచ్చారు. తెల్ల జుట్టు వాళ్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిచ్చేవారు. ఇంటర్వ్యూ ఉంటే హెయిర్స్టైల్ మారాల్సిందే! డోవ్, లింక్డిన్ సంస్థలు ఇటీవల జుట్టు వివక్షపై సంయుక్త అధ్యయనం చేశాయి. నల్లజాతి యువతుల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్వ్యూలకి వెళ్లినప్పడు హెయిర్ స్టైల్స్ మార్చుకుంటున్నట్టు తేలింది. నల్లటి కురులున్న 25–34 మధ్య వయసు వారిలో 20 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. టీవీ షోలు, సోషల్ మీడియాలోనూ నల్ల జుట్టుపై విషం కక్కడం పరిపాటిగా మారింది. ఒబామా భార్యకూ తప్పలేదు! అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మహిళ మిషెల్కు కూడా జుట్టు వివక్ష తిప్పలు తప్పలేదు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఆమె తన రింగుల జుట్టును సాఫీగా ఉండేలా చేయించుకున్నారట. ఈ విషయం గతేడాది ఓ కార్యక్రమంలో ఆమే స్వయంగా చెప్పారు. ‘‘వైట్హౌస్లో ఉండగా ఒబామా పాలనపై కాకుండా నా జుట్టుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని హెయిర్స్టైల్ మార్చుకున్నా. ఒక నల్లజాతి కుటుంబం శ్వేతసౌధంలో ఉండటాన్ని సగటు అమెరికన్లు అంతగా జీర్ణించుకోలేరు. దానికి తోడు నా జుట్టుపైనా వివాదం రేగడం ఎందుకని భావించా’’అన్నారు. అమెరికా సమాజంలో జుట్టు వివక్ష ఎంతలా వేళ్లూనుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా తుపాకీ సంస్కృతికి నాలుగేళ్ల చిన్నారి బలి
హూస్టన్: ఇంటికో తుపాకీ పథకం అమల్లో ఉందా అన్నట్లు కనిపించే అమెరికాలో గన్ కల్చర్.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను తోడేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర సమీపంలోని హ్యారిస్ కౌంటీలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. కౌంటీ పోలీసు అధికారి ఎడ్ గోంజాల్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ‘బామెల్ నార్త్ హూస్టన్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లోని ఇంట్లో ఐదుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో నాలుగు, మూడేళ్ల అక్కాచెల్లెళ్లు ఇంటి పడకగదిలోకెళ్లి అక్కడే ఉన్న సెమీ ఆటోమేటిక్ పిస్టల్ను చూశారు. పిస్టల్ను చేతిలోకి తీసుకున్న చెల్లెలు వెంటనే అక్కకు గురిపెట్టి కాల్చింది. తుపాకీ శబ్దంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అక్కడికొచ్చి చూసేసరికి నాలుగేళ్ల అమ్మాయి రక్తమోడుతూ కనిపించింది. 911కు ఫోన్చేసి అత్యవసర సిబ్బంది వచ్చి వైద్యంచేసేలోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. లోడ్ చేసిన తుపాకులను జాగ్రత్త చేయాలని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా తుపాకీ యజమానుల నిర్లక్ష్యం ఇలా ఎందరో అమా యకుల ప్రాణాలను బలికోరుతోంది’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు. -
ఇంట్లో విగతజీవిలా మారిన యంగ్ హీరో
హాలీవుడ్ యంగ్ హీరో కాడి లాంగో (34) మృతి చెందారు. అమెరికాలోని టెక్సాస్ నగరం ఆస్టిన్లోని ఆయన ఇంట్లో శవమై కనిపించారు. ఈ విషయాన్ని మేనేజర్ అలెక్స్ గిట్టెల్సన్ తన ట్విట్టర్లో వెల్లడించారు. లాంగో కుటుంబానికి ఆయన సానుభూతి తెలియజేశారు. అలెక్స్ గిట్టెల్సన్ ట్వీట్ చేస్తూ.. 'నా ప్రియమైన స్నేహితుడు, నా క్లయింట్ కాడి లాంగో ఇక లేరన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మిస్ యూ బ్రదర్.' అంటూ ట్వీట్ చేశారు. అయితే లాంగో చాలా సంవత్సరాలుగా మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. 2022లో రిహాలిబిటేషన్ కేంద్రానికి కూడా వెళ్లివచ్చినట్లు సమాచారం. తన భర్త పిల్లల కోసం చాలా కష్టపడేవారని దివంగత నటుడి భార్య స్టెఫానీ లాంగో తెలిపింది. లాంగోకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్, వైల్డ్ఫ్లవర్, నాట్ టుడే, హాలీవుడ్ హైట్స్లో లాంగో తన పాత్రలకు బాగా పేరు సంపాదించారు. Devastated beyond words at the tragic loss of my dear friend and client, Cody Longo. My heart breaks for his beautiful family. You will be missed, brother. https://t.co/D0lKsUnBmK — Alex Gittelson (@alexgittelson) February 10, 2023 -
డల్లాస్లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారత 74వ గణతంత్ర దినోత్సవాలు అమెరికాలోని డల్లాస్లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్లోని ఇర్వింగ్లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్లోని ప్రసాద్ తోటకూర, ఛైర్మన్, రావు కల్వల సెక్రటరీ & బోర్డు సభ్యుడు, దినేష్ హుడా బోర్డు సభ్యుడు & కో-చైర్, ఐఏఎన్టీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. -
Texas: హిందూ ఆలయంలో హుండీ దొంగతనం
ఆస్టిన్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్లోని ఓ హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని ఆగంతకులు నేరుగా గుడిలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులు దాచుకునే లాకర్ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన భారత కమ్యూనిటీని షాక్కు గురి చేసింది. బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం శ్రీ ఓంకారనాథ్ ఆలయం. ఈ ఆలయంలోనే దొంగతనం ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డ్ మెంబర్ శ్రీనివాస సుంకరి వెల్లడించిన వివరాల ప్రకారం.. కిటికీ తొలగించి లోనికి చొరబడ్డ ఆంగతకులు.. హుండీతో పాటు కొన్ని విలువైన వస్తువులున్న లాకర్ను చోరీ చేసినట్లు తెలిపారు. అయితే ఆలయ అర్చుకుడి కుటుంబం సమీపంలోనే నివసిస్తోందని, వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు సుంకరి వెల్లడించారు. ఇక.. సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో నమోదు అయ్యింది. ఆదివారం హిందూ కమ్యూనిటీతో సమావేశమై.. ఈ ఘటన గురించి చర్చించినట్లు వెల్లడించారు. అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ఇక ఈ దొంగతనంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు
అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి. సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల. అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!. ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు. ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు. నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు) -
రెస్టారెంట్కు నకిలీ తుపాకీతో వెళ్లి దోపిడీ.. చివరకు..
వాషింగ్టన్: అమెరికా టెక్సాస్లోని సౌత్ హ్యూస్టన్లో నకిలీ తుపాకీతో దోపిడీకి ప్రయత్నించాడు ఓ దొంగ. రెస్టారెంట్లో వెళ్లి కస్టమర్లను బెదిరించి వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అతని దగ్గరున్న గన్ నకిలీదని తెలియక కస్టమర్లు భయపడ్డారు. అయితే రెస్టారెంట్లోని ఓ కస్టమర్ దొంగను చావుదెబ్బతీశాడు. అదును చూసి తన దగ్గరున్న తుపాకీ తీసి దొంగను షూట్ చేశాడు. దీంతో అతనికి తూటాలు తగిలి కిందపడిపోయాడు. అయినా అంతటితో ఆగకుండా దొంగ దగ్గరకు వెళ్లి పలు మార్లు కాల్పులు జరిపాడు కస్టమర్. దీంతో దొంగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 🚨#WATCH: Self-defense shooting of armed robber at a restaurant 📌#Houston | #Texas Watch as a brave customer at a taqueria shot restaurant shot and killed an armed criminal who was robbing from other customers. Houston police are now looking for that person for questioning pic.twitter.com/g7EYjms5PZ — R A W S A L E R T S (@rawsalerts) January 7, 2023 గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే దొంగను కాల్చిచంపిన కస్టమర్ను పోలీసులు విచారించాల్సి ఉంది. దొంగ నుంచి తనను తాను కాపాడుకునేందుకే షూట్ చేసినందున అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు. ఇంతకీ దొంగను కాల్చి చంపిన కస్టమర్ ఎవరనే విషయం తెలియలేదు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు
తిరువనంతపురం: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు ఆపేశారు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టారు. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం అమెరికాలో జడ్జీగా నియమితులై తీర్పులు చెబుతోంది. ఆయనే కేరళలోని కాసరగోడ్ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్. ఇటీవలే అమెరికాలోని టెక్సాస్లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్. ‘పైచదువులు చదివించే స్తోమత నా కుటుంబానికి లేకపోవడంతో 10వ తరగతి తర్వాత చదువు మానేశాను. రోజువారీ కూలీగా ఏడాది పాటు బీడీలు చుట్టాను. అదే జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది.’అని పేర్కొన్నారు సురేంద్రన్ కే పటేల్. తన జీవితాన్ని మార్చుకునేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నాని, అందుకోసం గ్రామంలోని తన స్నేహితులను సాయం చేయాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. లా డిగ్రీ వరకు తనకు స్నేహితులు ఎంతగానో సాయపడినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లో ఓ హోటల్లో హౌస్కీపింగ్ జాబ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత చేసిన ప్రాక్టీస్ అమెరికాలో నిలదొక్కుకునేందుకు సాయపడిందన్నారు. అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్. ‘టెక్సాస్లో ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నంలో నా మాటతీరుపై కామెంట్లు చేశారు. నాకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. నేను డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీ చేసినప్పుడు నేను గెలవగలనని నా సొంత పార్టీ అనుకోలేదు. ఈ స్థాయికి వస్తానని ఎవరూ నమ్మలేదు. కానీ, నేను ఇక్కడ ఉన్నాను. అందరికి ఒకే ఒక్క సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఎవరికీ ఇవ్వకు. ఆ నిర్ణయం నీ ఒక్కడిదే. ’ అని తెలిపారు సురేంద్రన్ -
అమెరికాలో అంతర్యుద్ధం..అధ్యక్షుడిగా ఎలన్ మస్క్!
కొత్త ఏడాది అనంగానే పలువురు రాబోయే ఏడాదిలో ఏమి జరుగుతుందో తమదైన శైలిలో భవిష్యత్తు గురించి చెప్పేస్తుంటారు జ్యోతిష్యులు. అందరూ కూడా తమకు ఈ కొత్త ఏడాదిలో మంచి జరగాలని రకరకాలుగా సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు, రష్యా భద్రతామండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వేదేవ్ ఏకంగా 2023లో అమెరికా ఎలా ఉంటుందో జోస్యం చెప్పారు. ఈ మేరకు మెద్వెదేవ్ ట్విట్టర్లో.. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతోందని, ఫలితంగా కాలిఫోరియా, టెక్సాస్ రాష్టాలు స్వతంత్ర రాష్టాలుగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుందంటూ..సంచలన విషయాలు చెప్పారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారని ట్విట్టర్ వేదికగా జోస్యం చెప్పారు. అంతేగాదు ఆంగ్లో సాక్సన్ స్నేహితులకు వారి పిల్లలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఒక రష్యా అత్యున్నతాధికారి ఇలా వింతగా జోస్యం చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ట్విట్టర్ పోస్ట్ నెట్టింట దావానలంలా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ ఎలన్ మస్క్ దృష్టికి రావడమే కాదు ఆయన ఈ విషయంపై వెంటనే స్పందించారు కూడా. ఈ మేరకు మస్క్ రష్యా అధికారి మెద్వెదేవ్ ఒక పురాణకథను వల్లించారంటూ సెటైర్ వేశారు. తెలివితేటల పరంగానూ, రాజీకయపరంగానూ చూసినా.. ఇది అత్యంత అవాస్తవమైనా, అసంబద్ధమైన అంచనా. ఇది అతని అవగాహన లేమికి నిదర్శనం అంటూ ఎలన్ మస్క్ రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్కి గట్టి కౌంటరిచ్చారు. 8. Civil war will break out in the US, California. and Texas becoming independent states as a result. Texas and Mexico will form an allied state. Elon Musk’ll win the presidential election in a number of states which, after the new Civil War’s end, will have been given to the GOP — Dmitry Medvedev (@MedvedevRussiaE) December 26, 2022 (చదవండి: బయల్దేరే సమయానికి మంచు తుపాను...ఏకంగా 18 గంటల పాటు కారులో) -
పసిప్రాయంలో కిడ్నాప్.. 51 ఏళ్ల తర్వాత..
వాషింగ్టన్: ఊహ కూడా తెలియని పసిప్రాయంలోనే ఆ బాలిక కిడ్నాపైంది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుకుండా పరాయి ఇంట్లోనే పెరిగింది. అయితే విధి ఆమెను మళ్లీ కుటుంబంతో కలిసేలా చేసింది. 51 ఏళ్ల తర్వాత ఆ మహిళ తన ఇంటికి చేరుకుంది. అమెరికా టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్టా అపంటెంకో అనే మహిళకు ఓ పాప ఉండేది. ఉద్యోగం వల్ల తీరక లేకపోవడంతో చిన్నారి ఆలనా పాలనా చూసుకునేందుకు ఓ ఆయాను నియమించాలనుకుంది. ఆమె రూమ్ మేట్ ఓ మహిళ ఉందని చెప్పడంతో వివరాలేవి తెలుసుకోకుండానే పనిలో పెట్టుకుంది. అయితే వచ్చిన ఆయా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పాపను కిడ్నాప్ చేసింది. 1971 ఆగస్టు 23న ఈ ఘటన జరిగింది. చిన్నారి కన్పించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎంత వెతికినా పాప ఆచూకీ లభించలేదు. తల్లిమాత్రం తన బిడ్డ కోసం అప్పటినుంచి వెతుకుతూనే ఉంది. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్లో తమ బిడ్డ ఫోర్ట్ వర్త్కు 1100 మైళ్ల దూరంలో ఉందనే విషయం బంధువుల ద్వారా అల్టాకు తెలిసింది. వెంటనే వాళ్లు అధికారులను సంప్రదించి డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని చెప్పారు. పాప పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, డీఎన్ఏ ఫలితాల ఆధారంగా 51 ఏళ్ల క్రితం కిడ్నాపైంది ఈమే అని అధికారులు నిర్ధరించారు. దీంతో బాల్యంలో తప్పిపోయిన మెలిస్సా హై స్మిత్ ఐదు దశాబ్దాల తర్వాత కుటుంబం చెంతకు చేరింది. తన వాళ్లతో కలిసి చర్చిలో నిర్వహించిన వేడుకలో పాల్గొంది. ఇన్నేళ్ల తర్వాత తమబిడ్డను చూసి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆనంద పరవశంలో మునిగిపోయారు. బిడ్డను చంపిందనే అపవాదు.. అయితే దర్యాప్తు అధికారులు ఈ కేసును చాలా సార్ల తప్పుదోవ పట్టించారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గైనకాలజిస్ట్ సాయంతోనే తమబిడ్డ దక్కినట్లు పేర్కొంది. పాప కిడ్నాపై చాలా సంవత్సరాలు కన్పించకపోవడంతో తల్లే ఆమెను హత్య చేసి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు ఆ దుష్ప్రచారానికి తెరపడింది. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! -
చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. మరో దిగ్గజ నటుడు మృతి
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో దిగ్గజ హాలీవుడ్ నటుడు కన్నుమూశారు. పవర్ రేంజర్స్ సిరీస్లో నటించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ మరణించారు. ఆయన ప్రస్తుతం ఆమెరికాలోని టెక్సాస్లో నివసిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో ప్రముఖంగా గ్రీన్ రేంజర్ పాత్ర పోషించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ 49 ఏళ్ల వయసులో కన్నుమూయడంతో సహచరులు షాక్కు గురయ్యారు. పవర్ రేంజర్స్ స్టార్ దాదాపు 14 ఎపిసోడ్లలో నటించారు. ఆయన మరణవార్త విన్న అతని స్నేహితులు, సహచరులు నివాళులర్పించారు. పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో టామీ ఆలివర్ పాత్రతో జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ప్రాముఖ్యం సంపాదించారు. ఫ్రాంక్ మృతితో అతని కుటుబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ నటుడికి నలుగురు పిల్లలు ఉన్నారు. 1993 నుంచి 1996 వరకు మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ ఫ్రాంచైజీలో ఎక్కువగా నటించారు. ఆ తర్వాత పవర్ రేంజర్స్ జియో, టర్బో, డినో థండర్తో సహా స్వీట్ వ్యాలీ హై, ఫ్యామిలీ మ్యాటర్స్, వి బేర్ బేర్స్ ఎపిసోడ్స్లో కూడా జాసన్ కనిపించారు. అతని మరణ వార్త విన్న సహనటుడు వాల్టర్, జోన్స్ నివాళులర్పించారు. ఫ్రాంక్తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. 'ఫ్రాంక్ లేడంటే నమ్మలేకపోతున్నాను. మా కుటుంబంలోని మరొక సభ్యుడిని కోల్పోయినందుకు బాధగా ఉంది. అతను మా అందరికీ స్ఫూర్తి. అతని ఉనికిని చాలా మిస్ అవుతున్నాం. మా రేంజర్ కుటుంబంలోని సభ్యుడిని కోల్పోవడం చాలా బాధాకరం.' అంటూ పోస్ట్ చేశారు. Rest in peace Jason David Frank Just talking to you a few weeks back... This is heartbreaking My condolences to the family.... — BossLogic (@Bosslogic) November 20, 2022 -
వైరల్ వీడియో.. ట్రక్కుపై డాన్స్ చేస్తూ చనిపోయిన యువకుడు
వాషింగ్టన్: అమెరికా టెక్సాస్లోని హ్యూస్టన్లో 25 ఏళ్ల యువకుడు అతిచేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కదులుతున్న ట్రక్కు ఎక్కి డాన్స్ చేస్తూ చనిపోయాడు. నవంబర్ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో యువకుడు 18 చక్రాల ట్రక్కు ఎక్కి కాసేపు డాన్స్ చేశాడు. అయితే వెనకాల చూసుకోకపోవడంతో ఓ బ్రిడ్జి తాకి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశాడు. యువకుడు కిందపడిపోయినప్పుడు అతని మెడ విరిగిందని, ఆ ప్రాంతమంతా రక్తం ఉందని వెనకాల కారులో వెళ్లిన ఓ మహిళ చెప్పింది. ఆ దృశ్యాలు చూసి వెన్నులో వణుకుపుట్టిందని భయాందోళన వ్యక్తం చేసింది. తన రోజును ఇలా ప్రారంభించాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పింది. చదవండి: వైరల్ వీడియో.. రష్యా క్షిపణులను పేల్చేసిన ఉక్రెయిన్ -
రెండో ర్యాంకర్ జబర్పై సబలెంకా పైచేయి
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. టెక్సాస్లో జరుగుతున్న ఈ టోర్నీలో ‘ట్రేసీ ఆస్టిన్’ గ్రూప్ తొలి లీగ్ మ్యాచ్లో సబలెంకా 3–6, 7–6 (7/5), 7–5తో రెండో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)పై సంచలన విజయం సాధించింది. మరో లీగ్ మ్యాచ్లో ఐదో ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) 7–6 (8/6), 7–6 (7/4)తో జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. ఈ టోర్నీలో టాప్–8 ర్యాంకర్లు పాల్గొంటున్నారు. చదవండి: FIFA World Cup: పాల్ పోగ్బా దూరం.. ఫ్రాన్స్ ఆశలు ఆవిరేనా! -
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ హింట్..
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈసారి చారిత్రక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి టెక్సాస్లో జరిగిన ఓ సమావేశంలో వేల మంది రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికీ 2020లో ఓటమిని మాత్రం ట్రంప్ అంగీకరించలేదు. 2016తో పాటు 2020లోనూ తానే విజయం సాధించానని, గతంలో కంటే మిలియన్ ఓట్లు ఎక్కువ సాధించి రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్లంతా మరింత పట్టుదలతో ఉండాలని సూచించారు. 2022 జనవరి 6న క్యాపిటల్ హిల్ హింసాత్మక ఘటనకు సంబంధించి హౌస్ సెలక్ట్ కమిటీ ట్రంప్కు సమన్లు పంపిన మరునాడే ఆయన ఎన్నికల్లో పోటీపై మాట్లాడటం గమనార్హం. బైడెన్ విజయాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు ఆరోజు క్యాపిటల్ భవనంతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ట్రంప్ మాత్రం తానే గెలిచానని చెప్పుకుంటున్నారు. బెడైన్ మోసానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ఫలితాలు వచ్చి మూడేళ్లు గడిచినా ఇంకా తన వాదననే సమర్థించుకుంటున్నారు. చదవండి: బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్.. -
టెక్సాస్లో ముగ్గురు కృష్ణా జిల్లా వాసుల మృతి
పామర్రు : అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన తానా బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. దీంతో కురుమద్దాలిలో విషాదఛాయలు నెలకొన్నాయి. కురుమద్దాలి గ్రామానికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల నిమిత్తం 1995లో అమెరికా వెళ్లారు. చదువు అనంతరం అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. పీడియాట్రిక్ కార్డియో వాసు్క్యలర్ సర్జన్, అనస్తీషియాలజిస్ట్గా మంచి పేరుపొందారు. ఆయన భార్య వాణిశ్రీ ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్య, రెండో కుమార్తె 11వ తరగతి చదువుతున్నారు. కుమార్తెలు ఆదివారం కళాశాల వద్దకు వెళ్లగా, వాణిశ్రీ కారులో వారిని ఇంటికి తీసుకుని వస్తుండగా టెక్సాస్లోని వాలర్ కౌంటీ వద్ద వారి కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాణిశ్రీ, ఆమె ఇద్దరు కుమార్తెలు మరణించారు. భార్యాపిల్లలను కోల్పోవడంతో డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం షాక్లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన కురుమద్దాలి గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. డాక్టర్ శ్రీనివాస్ తండ్రి కొడాలి రామ్మోహన్రావు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. -
అమెరికాలో భారత మహిళలపై దాడి.. ఇండియాకు వెళ్లిపోండి అంటూ..
-
ఇండియన్స్ గో బ్యాక్
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. టెక్సాస్లో ఉన్న డల్లాస్లో భారతీయ మహిళలజాతివివక్ష దాడి జరిగింది. మెక్సికన్కు చెందిన మహిళ ఓ పార్కింగ్ లాట్లో భారతీయ మహిళలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, ఈ ఘటనను తన సెల్ఫోన్లో వీడియో తీస్తూనే సదరు మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్ కనిపిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే భారత మహిళలను.. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ బెదిరించింది. ఇండియాలో బెటర్ లైఫ్ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ, మీరు ఇండియాలో పుట్టి ఇక్కడికి వస్తున్నారు. ఒకవేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్కడకి ఎందుకు వచ్చినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలో వైరల్గా మారింది. దీంతో, పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. కాగా, మెక్సికన్ మహిళను ఎస్మరాల్డో ఉప్టన్గా గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. జెలెన్స్కీకి సపోర్ట్పై భారత్ ‘టెక్నికల్’ వివరణ -
ట్విటర్ ఫ్రెండ్ను సర్ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: బిలియనీర్ వ్యాపారవేత్త, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్తన ట్విటర్ ఫాలోవర్, భారతదేశానికి చెందిన తన చిరకాల మిత్రుడిని సర్ప్రైజ్ చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్నసాఫ్ట్వేర్ డెవలపర్ ప్రణయ్ పాథోల్ను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాథోల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (Radhakishan Damani: ఝున్ఝున్వాలా ట్రస్ట్ బాధ్యతలు ‘గురువు’ గారికే!) టెక్సాస్లో గిగాఫ్యాక్టరీలో మస్క్ను కలుసుకున్న ఒక పిక్ను ట్వీట్ చేశారు. “గిగాఫాక్టరీ టెక్సాస్లో మస్క్ను కలవడం చాలా గొప్ప విషయం. లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మీరు. ఇంతనిరాడంబరమైన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు’’ అంటూ తన అనుభవాన్ని షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది . 'డౌన్ టు ఎర్త్' అంటూ కామెంట్ చేసిన పలువురు నెటిజన్లు పాథోల్ను అభినందించారు. (Galaxy z flip 4 & Fold 4: డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..) ఇది ఇలా ఉంటే..బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ అనే డ్రైవర్-హెల్ప్ఫీచర్స్ ధరను 15వేల డాలర్లు పెంచేసింది. వివాదాస్పద ఉత్పత్తి ధరను పెంచడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఉత్తర అమెరికాలోని కస్టమర్లకు పెంపుదల సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తుందని ఎలాన్ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రస్తుత దీని ధర 12వేల డాలర్లుమాత్రమే. It was so great meeting you @elonmusk at the Gigafactory Texas. Never seen such a humble and down-to-earth person. You're an inspiration to the millions 💕 pic.twitter.com/TDthgWlOEV — Pranay Pathole (@PPathole) August 22, 2022 -
'ఇలా అయితే కష్టం'..మనకంటూ ఓ సొంత ఎయిర్ పోర్ట్ ఉండాల్సిందే!
ప్రపంచ అపర కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకొక సొంత ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే వందల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ను నిర్మించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎలాన్ మస్క్కు చెందిన పలు సంస్థల కార్యకలాపాలన్నీ టెక్సాస్లోనే జరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీతో పాటు గతేడాది డిసెంబర్ నెలలో టెస్లా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మస్క్ సిలికాన్ వ్యాలీకి తరలించారు. ఈ తరుణంలో తన బిజినెస్ కార్యకలాపాల్ని వేగవంతం చేసుకునేందుకు టెక్సాస్లోని బాస్ట్రాపో సమీపంలో ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం పనులు వేగం వంతం చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. మస్క్కు వేల ఎకరాలు ఎలాన్ మస్క్కు సెంట్రల్ టెక్సాస్లో వందల ఎకరాల భూములున్నాయి. అవి కాకుండా గిగా టెక్సాస్ కోసం 2,100 ఎకరాలున్నాయి. గతంలో స్పేస్ఎక్స్, బోరింగ్ కంపెనీ నిర్మాణల కోసం మరికొన్ని వందల ఎకరాల భూమిని సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆస్టిన్ సమీపంలో ఉన్న తన సొంత ల్యాండ్లో మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ నిర్మించనున్నారని, ఆ ఎయిర్ పోర్ట్ను ఎన్ని వందల ఎకరాల్లో నిర్మిస్తున్నారనే అంశంపై స్పష్టత లేదు. కానీ ఇప్పటికే ఆస్టిన్లో ఉన్న ఎగ్జిటీవ్ ఎయిర్పోర్ట్ 585 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. అదే తరహాలో నిర్మిస్తారా లేదంటే తక్కువ విస్తీర్ణయంలో నిర్మిస్తారా' అనేది తెలియాల్సి ఉంది. -
అమెరికాలో విషాదం.. 42 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న దాదాపు 42 మంది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు. వివరాల ప్రకారం.. శాన్ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్ను తెరిచిచూడగా.. అందులో దాదాపు 42 మంది చనిపోయి ఉన్నారు. 16 మంది ప్రాణాలతో బయట పడ్డారని.. వారిలో నలుగురు చిన్నారుల ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. At least 42 people were found dead Monday in a big-rig truck in San Antonio, Texas Gov. Greg Abbott said. More people have been transported to area hospitals. Updates: https://t.co/lfTU70A9B7 pic.twitter.com/L6oULaE7sB — NBC DFW (@NBCDFW) June 28, 2022 అయితే, మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు. More than 40 bodies have been found in a truck in San Antonio, Texas. The number of casualties is yet to be officially confirmed, but up to 16 occupants required medical treatment. The people found inside the truck are reportedly undocumented migrants. pic.twitter.com/IfEKth86qT — 10 News First (@10NewsFirst) June 28, 2022 ఇది కూడా చదవండి: అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్ కేంద్రం! -
వింత జీవి సంచారం.. టెన్షన్లో స్థానికులు!
ప్రపంచంలో మానవ కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూమి మీద చోటుచేసుకునే వింతలను చూసి నిజమేనా అని షాక్ అవుతుంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. టెక్సాస్లోని అమారిలో పట్టణంలో ఓ వింత జీవి ఫొటో అక్కడున్న వారిని కలవారపాటుకు గురిచేస్తోంది. టెక్సాస్లోని ఒక ‘జూ’లో మే 21వ తేదీన అర్ధరాత్రి 1:25 సమయంలో రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్లో వచ్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. What is it? Strange image caught on camera at Texas zoo. DETAILS >>> https://t.co/W3Xxgycw5Y pic.twitter.com/o9gGAk61kY — WFTV Channel 9 (@WFTV) June 9, 2022 ఇది కూడా చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్! -
ఇద్దరూ కవలలే.. కానీ బర్త్డే ఎవరిది వారిదే.. అదేంటి!
మామూలుగా కవలలు అంటే తల్లి కడుపులో కలిసి పెరిగి, కలిసి పుట్టేవారే. అలాంటివారు కొద్ది నిమిషాల తేడాలో జన్మిస్తుంటారు. అరుదుగా గంటా రెండు గంటలు కూడా తేడా ఉంటుంది. ఒకే పోలికలతో పుట్టేవారి (ఏకరూప కవలల) మధ్య అయితే మాత్రం తేడా నిమిషాల్లో మాత్రమే ఉంటుంది. కానీ అమెరికాలోని అబిలీన్లో కార్మెన్ మార్టినెక్స్ అనే మహిళకు తొలి పాప పుట్టిన తర్వాత మూడు రోజులకు రెండో పాప జన్మించింది. నిజానికి మార్చి తొలివారంలో ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళితే మార్చి 7న ఒక పాపకు జన్మనిచ్చింది. రెండో పాప గర్భంలో అలాగే ఉండిపోయింది. ఆ శిశువు ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. మూడు రోజుల తర్వాత మార్చి 10న మార్టినెక్స్ రెండో పాపకు జన్మనిచ్చింది. మొదటి పాపకు గాబ్రియేలా గ్రేస్ అని, రెండో పాపకు ఇసబెల్లా రోస్ అని పేరుపెట్టారు. ‘‘ఇద్దరికీ ఒకే రోజు ఏంటి? నా స్పెషల్డే పార్టీ నాకు ఉండాల్సిందే అనుకుంటూ ఇసబెల్లా లేటుగా పుట్టేసింది. ఏమైనా నా పిల్లలు సమ్థింగ్ స్పెషల్’’ అంటూ మార్టినెక్స్ మురిసిపోతోంది. అత్యంత అరుదుగా.. ఇద్దరూ పూర్తిగా ఎదగకముందే కేవలం 24–25 వారాల్లోనే, కేవలం 700 గ్రాముల బరువుతోనే పుట్టడంతో.. మూడు నెలలుగా పిల్లల ఐసీయూ (ఎన్ఐసీ యూ)లో ఉంచారు. అసలు బతుకుతారో లేదో అనే పరిస్థితి నుంచి ఇక ప్రమాదం లేనట్టేననే దశకు చేరాక.. వైద్యులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇలా కవలలు మూడు రోజుల తేడాతో జన్మించడం అత్యంత అరుదైన విషయమని ప్రకటించారు. చదవండి: బార్లో బాయ్ఫ్రెండ్ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు -
రెండుసార్లు గర్భస్రావం.. తర్వాత ప్రెగ్నెంట్.. నెలలోపే మళ్లీ గర్భం.. కవలలు!
మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలని కోరుకోని మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తుంది తల్లి. అందుకోసం ఎంతటి బాధనైనా పంటిబిగువన భరిస్తుంది. పొత్తిళ్లలో చిన్నారిని చూసుకోగానే తాను పడిన ప్రసవ వేదనను మరిచిపోతుంది. అమెరికాలోని టెక్సాస్కు చెందిన కారా విన్హోల్డ్ కూడా అలాంటి కోవకు చెందిన వారే! అయితే, ఇప్పటికే ఒక కుమారుడికి జన్మనిచ్చిన ఆమె.. తనకు తెలియకుండానే కవలలకు ప్రాణం పోశారు. వారిని ఈ లోకంలోకి తీసుకువచ్చారు. ఎన్నో అబార్షన్ల తర్వాత దక్కిన ఈ రెట్టింపు సంతోషంతో విన్హోల్డ్ దంపతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలేం జరిగింది? వాషింగ్టన్ పోస్ట్, మెట్రో కథనాల ప్రకారం.. విన్హోల్డ్, ఆమె భర్త 2018లో ఓ బాబుకి జన్మనిచ్చారు. తమ కుటుంబాన్ని మరింతగా విస్తరించుకోవాలని భావించిన ఆ జంట.. మరో సంతానం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 2019లో విన్హోల్డ్ గర్భం దాల్చడంతో ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆమెకు గర్భవిచ్చిత్తి అయింది. 2020లోనూ ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆరోగ్యంపై కూడా ఈ అబార్షన్లు తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ మరో బిడ్డను కనాలన్న ఆ తల్లి మనసు నిరాశ చెందలేదు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో విన్హోల్డ్ మరోసారి గర్భవతి అయింది. అన్నీ సజావుగా సాగడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూడసాగింది. అయితే, ఊహించని విధంగా ఏడు వారాల తర్వాత తన కడుపులో మరో శిశువు ఎదుగుతున్నట్లు డాక్టర్లు ఆమెకు చెప్పారు. గర్భం దాల్చిన నెల రోజుల తర్వాతే మరో ప్రెగ్నెన్సీ రావడంతో ఇది సాధ్యమైందని వైద్యులు చెప్పడంతో విన్హోల్డ్ దంపతులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె కవలలకు జన్మనిచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. (PC: Kennedy News and Media Via Metro) కారణం ఏమిటి? కారా విన్హెల్డ్కు తెలియకుండానే కవలలు జన్మించడానికి కారణం సూపర్ఫెటేషన్. హెల్త్లైన్ జర్నల్ ప్రకారం.. ఒకేసారి విడుదలైన రెండు అండాలు వేర్వేరు సమయాల్లో(వారాల వ్యవధి) ఫలదీకరణం చెందితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. దీనినే వైద్య పరిభాషలో సూపర్ఫెటేషన్ అంటారు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.. అయితే ఇలా! ‘చాలా మంది పిల్లల్ని కనాలని.. వారితో అమ్మా అని పిలిపించుకోవాలని నాకు ఆశగా ఉండేది. గర్భస్రావాలు అయినప్పటికీ నేను పూర్తి ఆశావాద దృక్పథంతోనే ఉన్నాను. కచ్చితంగా ఇది జరిగి తీరుందని నమ్మాను. అమ్మగా నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు. అయినా ఏనాడు నిరాశ చెందలేదు. ఇప్పుడు నా కల నెరవేరింది’’ అని విన్హోల్డ్ వాషింగ్టన్ పోస్ట్తో వ్యాఖ్యానించారు. తన జీవితంలో అద్భుతం జరిగిందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా విన్హోల్డ్కు కవలలుగా ఇద్దరు కుమారులు జన్మించారు. ఆరు నిమిషాల తేడాతో ఈ భూమ్మీదకు వచ్చిన ఆ బుజ్జాయిలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ముగ్గురు కుమారుల అల్లరితో ఈ దంపతుల ఇల్లు ఇప్పుడు ఎంతో సందడిగా ఉంది. ఇక గర్భవతికి మరో ప్రెగ్నెన్సీ అంటూ విన్హోల్డ్ జీవితంలోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. -
టెక్సాస్ నరమేధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
A good guy with a gun: టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రంప్ హ్యూస్టన్లోని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ...తుపాకితో కాల్పులకు పాల్పడుతున్న చెడ్డ వ్యక్తిని నియంత్రించాలంటే మంచి వ్యక్తి కూడా తుపాకిని చేతబట్టాల్సిందేనని అన్నారు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సామెత మాదిరి అలాంటి నరమేధాన్ని ఆపాలంటే మంచివాళ్లకు కూడా తుపాకీని చేత పట్టకు తప్పదని చెప్పారు. అలాగే తుపాకీ రహిత పాఠశాలలను మూసేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైన ఒక సాయుధవ్యక్తి ఇలానే దాడులకు దిగితే ఆయుధాలు(తుపాకీలు) లేని పాఠశాలలు తమను తాము రక్షించుకోలేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పాఠశాలలకు సింగిల్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ, స్ట్రాంగ్ ఫెన్సింగ్, మెటల్ డిటెక్టర్లు తప్పనిసరిగా ఉండాలని ట్రంప్ సూచించారు. అయినా ఉక్రెయిన్కి సాయం అందిస్తున్న అమెరికాకు స్కూళ్లల్లో ఈ సౌకర్యాలను కల్పించడం ఏమంతా పెద్ద విషయం కాదని అన్నారు. (చదవండి: నేపాల్లో విమానం మిస్సింగ్.. అందులో నలుగురు భారతీయులు) -
టెక్సాస్లోని ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు
-
ఇండియన్ స్టూడెంట్కి వేధింపులు
-
అమెరికాలో భారతీయ విద్యార్థికి వేధింపులు
Indian Student Bullied Texas: భారతీయ మూలాలున్న విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని అమెరికన్ స్టూడెంట్ రెచ్చిపోయాడు. మాటలతో వేధిస్తూ భౌతికదాడులకు దిగుతూ హింసించాడు. స్కూల్ క్యాంటీన్లోనే దురాగతం జరుగుతున్నా ఎవ్వరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా కొందరు విద్యార్థులు విపరీత చేష్టలకు పాల్పడుతున్న అమెరికన్ విద్యార్థిని రెచ్చగొట్టారు. ఈ దారుణమైన ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో కాపెల్ ప్రాంతంలో ఉన్న కాపెల్ మిడిల్ స్కూల్లో చదువుతున్న భారతీయ మూలాలున్న విద్యార్థికి ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యాంటీన్లో తింటున్న సమయంలో.. ఓ అమెరికన్ విద్యార్థి అక్కడకు వచ్చి ఇండియన్ స్టూడెంట్ని అతను కూర్చున్న చోటు నుంచి లేచి వేరే దగ్గరికి వెళ్లి పోవాలంటూ దబాయించాడు. ఎవరూ లేని సమయంలో తాను అక్కడ కూర్చున్నానని,.. తాను అక్కడి నుంచి లేచి వెళ్లనంటూ ఆ ఇండియన్ స్టూడెంట్ తెలిపాడు. పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చోవాలంటూ సూచించాడు. మాటలతో మొదలెట్టి.. ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్ చేసిన సూచనలు పట్టించుకోకుండా.. కచ్చితంగా నువ్వా కుర్చీలో నుంచి లేచిపోవాల్సిందే అంటూ అమెరికన్ విద్యార్థి ఇండియన్ స్టూడెంట్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. స్కూల్బ్యాగు తీసి పక్కన పడేశాడు. తన వేలితో మెడపై పొడుస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. ఐనప్పటికీ ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా భావించిన భారతీయమూలాలు ఉన్న విద్యార్థి అక్కడి నుంచి లేచేందుకు అంగీకరించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ అమెరికన్ స్టూడెంట్.. ఇండియన్ స్టూడెంట్ మెడ చుట్టూ చేయి వేసి తలను మెలిపెట్టి కుర్చీ నుంచి లాగి నేలపై పడేశాడు. రెచ్చగొడుతూ వందల మంది విద్యార్థుల సమక్షంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్నా అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ భారతీయ మూలాలున్న విద్యార్థికి మద్దతుగా రాలేదు సరికదా కొందరైతే దురాగతానికి పాల్పడుతున్న అమెరికన్ స్టూడెంట్ను రెచ్చగొట్టారు. మరికొందరు జరుగుతున్న ఘటన వీడియో తీస్తూ గడిపారు. బాధితుడికే శిక్ష ఈ నెల 11న ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే విషయం స్కూల్ ప్రిన్సిపల్ వరకు వెళ్లింది. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులను స్కూల్కి పిలిపించాడు. వీడియోలో కనిపిస్తున్న దురాగతానికి విరుద్దంగా భారతీయ విద్యార్థే అకారణంగా మరో విద్యార్థితో గొడవ పెట్టుకున్నాడని నిర్థారిస్తూ.. బాధిత విద్యార్థిని మూడు రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేయగా దాడికి పాల్పడిన అమెరికన్ స్టూడెంట్కి కేవలం ఒక రోజు నుంచి నుంచి సస్పెండ్ చేశారు. వరుస ఘటనలు సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తామని పదే పదే చెప్పుకునే అమెరికాలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇండియన్లను నివ్వెరపరుస్తోంది. ఇదే వారంలో నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని షికాగోలని బఫెలో మార్కెట్లో కాల్పులు జరిపిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. చదవండి: బుసకొట్టిన జాతి విద్వేషం -
Photo Feature: ప్రపంచంలోనే ఎత్తైన కుక్క.. దీని ఎత్తు ఎంతో తెలుసా?
World's Tallest Dog: అమెరికాలోని టెక్సాస్కు చెందిన జ్యూస్ అనే అమెరికన్ గ్రేట్ డేన్ కుక్క ప్రపంచంలోనే ఎత్తయిన కుక్కగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని ఎత్తు 3 అడుగుల 5.18 అంగుళాలు. దీని వయసు రెండేళ్లు. ఇంత ఎత్తు ఉన్నప్పటికీ మిగతా చిన్నగా ఉన్న కుక్కలతో త్వరగా కలిసిపోయి ఆడుకుంటుందని దాని యాజమాని తెలిపారు. తాము జ్యూస్ను చిన్న పిల్ల వయసు నుంచే పెంచుకుంటున్నామని, అప్పుడే అది భారీ సైజులో ఉండేదని దాని యజమాని బ్రిటనీ డేవిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు తెలిపారు. జ్యూస్ చాలా పొడువైన కాళ్లను కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. చదవండి: రష్యా ‘విక్టరీ డే’.. పుతిన్ కీలక ప్రకటన? -
ఎలన్ మస్క్కు రైతు అదిరిపోయే ఆఫర్! ట్విటర్ ఆఫీస్ను షిఫ్ట్ చేస్తాడా!
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ను కొనుగోలు తరువాత రోజుకో అంశం తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే మస్క్ టెస్లా షేర్లు అమ్మి, రుణాలు తీసుకొని మరి ట్విటర్ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ట్విటర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ను తొలగించేలా ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ నిర్ణయం తీసుకుంటున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో అంశం ట్విటర్ సంస్థలో ఆసక్తికరంగా మారింది. అదే ట్విటర్ ఆఫీస్ను షిప్ట్ చేయడం? ట్విటర్ కొత్త బాస్ ఎలన్ మస్క్కు ఓ రైతు బంపరాఫర్ ప్రకటించారు. ట్విటర్ కొనుగోలు తరువాత టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరానికి చెందిన రైతు జిమ్ స్క్వెర్ట్నర్..మస్క్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కాలిఫోర్నియాలో ఉన్న ట్విటర్ ఆఫీస్ను టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరానికి మారిస్తే విలియమ్సన్ కౌంటీలో ఉన్న తన 100 ఎకరాల ల్యాండ్ను ఉచితంగా ఇస్తానని తెలిపాడు. జిమ్ ష్వెర్ట్నర్ 1946 నుండి టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లో పశువుల్ని పెంపకంతో పాటు కాపిటల్ ల్యాండ్ అండ్ లైవ్స్టాక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రైతుకు 20వేల ఎకరాల భూమి ఉంది. అయితే టెక్సాస్లో ఉన్న ఈ ప్రాంతంలో పత్తి, మొక్కజొన్న, జొన్న, వరి, గోధుమల్ని పండిస్తారు. ట్విటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం. తాను ఇస్తానన్న 100 ఎకరాల ల్యాండ్ ఆస్టిన్ నుంచి గంట జర్నీ చేస్తే విలియన్సన్ కౌంటీకి చేరుకోవచ్చని రైతు ట్విట్లో పేర్కొన్నాడు. మరోవైపు రైతు ష్వెర్ట్నర్ ఇచ్చిన ఆఫర్కు ఎలన్ మస్క్కు నచ్చితే ట్విటర్ ఆఫీస్ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు మార్చడం పెద్ద కష్టమేమీ కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుంటే మస్క్కు చెందిన మూడు కంపెనీలు టెక్సాస్ రాష్ట్రంలోనే ఉన్నాయి. టెస్లా ప్రధాన కార్యాలయం ఆస్టిన్లో ఉంది. స్పేస్ ఎక్స్ బోకా చికా, దిబోరింగ్ కంపెనీ ప్లుగర్విల్లే నగరంలో ఉంది. ఈ మూడు ప్రాంతాలు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ట్విటర్ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు మారిస్తే కార్యకాలపాలకు ఈజీగా ఉంటుందనేది మరికొందరి వాదన. వారి వాదనలు ఎలా ఉన్నా.. రైతు ఆఫర్పై మస్క్ ఇంతవరకు స్పందించలేదు. ష్వెర్టనర్ ఆఫర్పై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ స్పందించారు. టెక్సాస్లో నివాసం ఉండే ష్వెర్ట్నర్ ట్విటర్ను తరలించేందుకు మస్క్కు 100 ఎకరాల ల్యాండ్ను ఉచితంగా అందిస్తారు. నేను ఫ్రీ స్పీచ్ జోన్గా ప్రకటిస్తా. ట్విటర్ కార్యాలయం షిప్ట్ అయితే ట్విటర్ను టెక్సాస్గా మార్చుకోవచ్చు. దీని గురించి ఆలోచించు ఎలన్ మస్క్ అంటే మస్క్ ట్విటర్కు ట్యాగ్ చేశారు. చదవండి👉సంచలనం! ట్విటర్ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్! -
సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు
షిరిడి సాయిబాబా దేవస్థానం ఆస్టిన్, వెంకటేశ్వర దేవస్థానం ఆస్టిన్ (టెక్సాస్) ఆధ్వర్యములో అంగరంగ వైభవముగా శ్రీ సీతారామ కళ్యాణం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సుమారుగా 6000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగం సాయిబాబాకి చందన, చావడి ఉత్సవం నిర్వహించగా సీతారాములుకి మంగళ స్నానం చేయించారు. సీతారామ కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. వచ్చిన ప్రతీ భక్తునికి బంతి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కల్పన నూకవరపు, రవి బురుజులు, మల్లిక్ ఆవుల, కేథార్నాధ్ ముండ్లురూ, పూర్ణేశ్ సవితాల, విజయ్ దొడ్ల, సౌజన్య , బాలాజీ ఆత్యంలు ఈ వేడుకులు నిర్వహించడంలో పాలు పంచుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, వలంటీర్స్కు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు. -
ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం..!
ఎలన్ మస్క్ ది రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్...! ఎలక్ట్రిక్ కార్లు, శాటిలైట్ ఇంటర్నెట్, రియూజబుల్ రాకెట్ బూస్టర్లతో సంచలన విజయాలను నమోదు చేశాడు ఎలన్ మస్క్. తాజాగా టెక్సాస్లో జరిగిన సైబర్ రోడియో గిగా ఫ్యాక్టరీ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రానున్న రోజుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ క్యాబ్స్ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. రోబోటాక్సీలతో సులువుగా సులభంగా..! సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ క్యాబ్ ‘రోబోటాక్సీ’ సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. రోబోటాక్సీలతో ప్రయాణాలు సులభంగా, సులువుగా అవుతాయని మస్క్ అభిప్రాయపడ్డారు. కాగా రోబో టాక్సీలు వచ్చే సమయాన్ని మాత్రం ప్రకటించలేదు. టెక్సాస్లోని సైబర్ రోడియో గిగా ఫ్యాకరీ ప్రారంభోత్సవం సందర్భంగా రోబోటాక్సీలపై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. “నేను చెప్పగలిగేది ఒక్కటే, మనం భవిష్యత్తులో ఎవరు ఊహించని స్థాయికి వెళ్లపోతున్నాం. మానవజాతి చరిత్రలో ఏ కంపెనీ కూడా సాధించని స్థాయి చేరుకుంటాం. త్వరలోనే సెల్ఫ్ ఆటోనామస్ డ్రైవింగ్ రోబోటాక్సీలు అందుబాటులోకి వస్తాయి. వాటితో ప్రపంచంలో సమూల మార్పులు రావడం ఖాయమ’’ని మస్క్ అన్నారు. కాగా రోబోటాక్సీలను 2019లో ప్రకటించగా ఇప్పుడు అవి ఆచరణలోకి వస్తాయని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. కౌబాయ్ టోపీతో కారులో ఎంట్రీ..! టెక్సాస్లో సైబర్ రోడియో గిగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ఎలన్ మస్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కౌబాయ్ టోపీ, సన్ గ్లాసెస్ ధరించి కారులో ఎంట్రీ ఇచ్చాడు. టెక్సాస్ గిగా ఫ్యాక్టరీను లాంచ్ చేశాడు. ఈ ఈవెంట్లో ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబో గురించి కూడా ప్రస్తావించారు. కాగా కొద్ది రోజుల క్రితమే ట్విటర్లో 9 శాతం వాటాలను కొనుగోలు చేసి ట్విటర్ బోర్డులో కూడా ఎలన్ మస్క్ నియమితుడయ్యాడు. ట్విటర్లో సమూల మార్పులను తెచ్చేందుకు ఎలన్ మస్క్ పునుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఎలన్ మస్క్ మాయ.. అడుగుపెట్టాడో లేదో ట్విటర్పై కాసులవర్షం..! -
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
-
టెక్సాస్ హ్యూస్టన్ పిక్నిక్ సంబరాలు
టెక్సాస్లోని హ్యూస్టన్లో తెలుగు వాళ్లంతా కలిసి పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. సుమారుగా 200 ఫ్యామిలీస్ దీనిలో పాల్గొని ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బిర్యానీపాట్ రెస్టారెంట్లో భోజన సదుపాయాలు కల్పించారు. ఈ పిక్నిక్ విజయవంతం కావడానికి దీనికి సహకరించిన దాతలందరికి బిర్యానీపాట్ రెస్టురెంట్ ఓనర్ శ్రీధర్ కంచనకుంట్ల ధన్యవాదాలు తెలిపారు. -
టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు
డల్లాస్ (టెక్సాస్): శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ తేదీని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర పత్రికా ప్రకటన విడుదల చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివశిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అన్నారు. తెలుగు వారికున్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తిపట్ల నిభద్దత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం అన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆ అధికారిక ప్రకటనలో పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలం గా నివశిస్తున్న తెలుగు వారి పట్ల టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. ఉగాది పండుగ వేడుకల్లో గవర్నర్ సతీమని సిసీలియా కూడా మమేకమయ్యారని తెలిపారు. అంతేకాకుండా ఉగాది రోజుని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. -
ఆమె.. ఒక మిస్టరీ! జిహాదీలకు ఆమె రోల్ మోడలా?
ఆమెను లేడీ అల్ఖాయిదా అని పిలిచేవారు మోస్ట్ వాంటెడ్ వుమెన్ జాబితాలో కూడా ఆమె పేరు చేరింది అభిమానులు ఆమెను ఇస్లాం మతాన్ని కాపాడే రాడికల్గా భావిస్తే అమెరికా ఆమెపై అల్ ఖాయిదా తొలి మహిళా ఉగ్రవాది అన్న ముద్ర వేసింది అమెరికాలోని టెక్సాస్ జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీ విడుదల కోసం ఇప్పటి వరకు 57 మంది ప్రాణాలు బలయ్యాయి. ఇంతకీ ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆమె విడుదల కోసం పాక్కి ఎందుకీ ఆరాటం? అమెరికాలోని టెక్సాస్లో జనవరి 15న ఒక యూదు ప్రార్థనాలయంలో నలుగురిని బందీలుగా చేపట్టిన ఓ బ్రిటీష్ పాకిస్తానీ యువకుడు వారిని వదిలేయాలంటే, అక్కడికి సమీపంలో జైల్లో మగ్గుతున్న ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. 10 గంటల ఉత్కంఠ తర్వాత అమెరికా పోలీసుల చేతుల్లో హతమయ్యాడు. ► 2011లో అల్ ఖాయిదాలో నెంబర్ 2 ఉగ్రవాది అల్ జవహరి.. ఆఫియాను విడుదల చేస్తే, తమ దగ్గర బందీగా ఉన్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉద్యోగి వారెన్ వీన్స్టెన్ను విడుదల చేస్తామని బేరం పెట్టాడు. ► 2014లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ తమ బందీగా ఉన్న అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేని విడుదల చేస్తామని, బదులుగా ఆఫియాను విముక్తురాలిని చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అంగీకరించకపోవడంతో ఆ జర్నలిస్టు తలనరికి చంపేసింది. ► 2017లో పాకిస్తాన్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్ఖాన్ తాను అధికారంలోకి వస్తే ఆఫియాను విడుదలకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. వీరే కాదు జీహాది సంస్థలు, సామాన్య జనం, యావత్ ముస్లిం సమాజం ఆఫియా విడుదల కోసం ఎన్నో ప్రదర్శనలు చేశారు. అమెరికాలో ఎవరిని బందీగా తీసుకున్నా ఆఫియా విడుదల కోసమేనా అన్నట్టుగా పరిస్థితులు మారాయి. ఆఫియా చుట్టూ ఆరోపణలు ఆఫియా జీవితమే ఒక మిస్టరీగా మారింది. అమెరికాలో ఉండగా ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. 10 వేల డాలర్లతో నైట్ విజన్ గాగుల్స్ కొన్నదని , రక్షణ కోసం కవచాలు, ఒక సైనికురాలిగా స్వీయ శిక్షణ తీసుకోవడానికి అవసరమయ్యే పుస్తకాలు కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 11 దాడుల మాస్టర్మైండ్ ఖలీద్ షేక్ మహమ్మద్ మేనల్లుడు అమ్మర్ అల్ బలూచిని ఆమె రహస్య వివాహం చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఖలీద్ అరెస్ట్ అయిన నెలరోజులకే ఆఫియా కొన్నాళ్లు అదృశ్యమైపోవడం ఆ ఆరోపణలకి ఊతమిచ్చింది. డర్టీ బాంబ్స్ తయారు చేసి అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించడానికి అఫియా కుట్ర పన్నిందన్న ఆరోపణలు వచ్చాయి. జైల్లో ఉన్నప్పటి చిత్రం 2008లో అఫ్గానిస్తాన్లో అమెరికా అధికారిపై కాల్పులకు తెగబడిందన్న ఆరోపణలతో ఆమెను అరెస్ట్ చేశారు. 2010లో అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 86 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అంటే ఆఫియాకి శిక్షా కాలం పూర్తయ్యేటప్పటికీ ఆమె ప్రాణాలతో ఉంటే వయసు 124 ఏళ్లు వస్తాయి. అయితే ఆఫియా సిద్ధిఖీ అమాయకురాలని, ఆమెకు ఆ నేరంతో ఎలాంటి సంబంధం లేదని, అమెరికా మిలటరీయే ఆఫియాని కిడ్నాప్ చేసి నేరాన్ని మోపిందంటూ వాదించేవారూ ఉన్నారు. 2001, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమాయకులపై కూడా టెర్రరిస్టు ముద్ర వేస్తోందని ముస్లిం సమాజం గళమెత్తింది. ఇప్పుడు ఎలా ఉంది ? టెక్సాస్లోని ఫోర్ట్వర్త్ జైల్లో ఉన్న ఆఫియా సిద్ధిఖీ ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఇటీవల ఆమెపై తోటి ఖైదీలు దాడులకు దిగారని జైలు రికార్డులు చెబుతున్నాయి. పొగలు కక్కే కాఫీని ఆమె ముఖంపై పోయడంతో కాలిన గాయాలయ్యాయి. కళ్లు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను మరో మహిళా ఖైదీ చితకబాదింది.. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పాకిస్తాన్లో హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆఫియాను విడుదల చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న పాకిస్తానీయుల విడుదలకు తాను పాటుపడతానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెక్సాస్ యూదు ప్రార్థనాలయంలో ఆఫియా విడుదల కోసం ఘటన జరగడంతో మరోసారి ఈ అల్ ఖాయిదా లేడీ ఉగ్రవాదిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విశ్వవిఖ్యాత మసాచుసెట్స్ వర్సిటీలో చదివి.. అపై పీహెచ్డీ చేసి జీవితంపై ఎంతో విశాల అవగాహన ఉన్న ఆఫియా చట్ట వ్యతిరేక ఉగ్రమార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ విస్మయపరిచే అంశమే. పెద్దయ్యాక పాశ్చాత్యదేశాల్లో పెరిగింది. ఆ దశలో ఆమెకు ఉగ్రభావాలున్న పరిచయం అయ్యే అవకాశం ఉండదు. అంటే పాక్లో సెకండరీ విద్యను అభ్యసించే లోపలే... లేదా సేవా కార్యక్రమాల కోసం ప్రపంచదేశాలు తిరుగుతున్న తరుణంలో ఎవరో ఆమెకు బ్రెయిన్ వాష్ చేసి ఉంటారని అనుకోవచ్చు!. ఎవరీ ఆఫియా సిద్ధిఖీ? ఆఫియా సిద్ధిఖీ పాకిస్తాన్లోని కరాచీకి చెందిన న్యూరో సైంటిస్ట్. 1990లో టీనేజ్లో ఉండగానే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంది. బ్రాండీస్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసింది. 1995లో కరాచీకి చెందిన అంజాద్ఖాన్తో నిఖా జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2002లో భర్తతో విడిపోయింది. అమెరికాలో విద్యార్థిగా ఉండగానే ఆమె మసీదులకి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేది. ఇస్లాం మతం సంరక్షణ కోసం ప్రచారం చేసేది. అఫ్గానిస్తాన్, బోస్నియా, చెచన్యాలో సంక్షోభ పరిస్థితులపై ఉద్యమాలు చేసింది. భారీగా విరాళాలు సేకరించి ఆయా దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె తండ్రి మహమ్మద్ సిద్ధిఖీ వైద్యుడు, సామాజిక కార్యకర్త. పాకిస్తాన్ జనరల్ జియా ఉల్ హక్ హయాంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. దీంతో సిద్ధికీ ఏం చేసినా బాగా ప్రచారం వచ్చేది. ఆమెకి ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. పైగా అకర్షణీయమైన రూపం, అత్యంత ప్రతిభావంతురాలు, ఉన్నత విద్యను అభ్యసించి ఉండటంతో... పాక్ సమాజంతో పాటు ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఉండేది. –నేషనల్ డెస్క్, సాక్షి -
డిక్కీలో కుక్కి పడుకోబెట్టిన బాలుడు క్షేమం
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యారిస్ కౌంటీలో సారా బీమ్ (41) అనే టీచర్ కోవిడ్ సోకిందనే భయంతో 13 ఏళ్ల కుమారుడిని కారు డిక్కీలో పడుకోబెట్టి టెస్టింగ్ కేంద్రానికి తీసుకెళ్లిన ఘటనలో మరికొన్ని వివరాలు వెలుగు చూశాయి. కోవిడ్ పరీక్ష కేంద్రం వద్ద అధికారులు కారు డిక్కీలో ఉన్న కుమారుడిని బయటకు తీయాలని కోరగా నిరాకరించిన సారా అక్కడి నుంచి కారుతో సహా పరారైన విషయం తెలిసిందే. చదవండి: కోవిడ్ భయంతో కుమారుడిని డిక్కీలో కుక్కింది అయితే, కారు డిక్కీలో కుక్కి పడుకోబెట్టినప్పటికీ బాలుడికి ఎటువంటి హాని జరగలేదని, అతడు క్షేమంగానే ఉన్నాడని సైఫెయిర్ డిస్ట్రిక్ట్ పోలీస్ విభాగం తెలిపింది. సారా బీమ్పై ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా, సారాను బలవంతపు సెలవుపై పంపిస్తున్నట్లు ఆమె పనిచేసే సైప్రెస్ ఫాల్స్ హైస్కూల్ యాజమాన్యం తెలిపింది. -
అరుదైన ‘మిడత’
కోస్గి: నారాయణపేట జిల్లా కోస్గి మండలం బొల్వోన్పల్లి శివారులోని ఓ పొలంలో గులాబీరంగులో గొల్లభామ (మిడత) కనిపించింది. ఆదివారం ముశ్రీఫా జెడ్పీహెచ్ఎస్ సైన్స్ క్లబ్ విద్యార్థి మహేష్ ఈ కీటకాన్ని గుర్తించి ఉపాధ్యాయుడు మల్లేశానికి చెప్పారు. కాగా, అర్థో పోడా వర్గానికి చెందిన ఆర్చిలిమమ్ వల్గెర్ అనే శాస్త్రీయ నామంతో పిలిచే గడ్డి మైదానాల మిడతల్లో జన్యు ఉత్పరివర్తనాల ప్రభావంతో చాలా అరుదుగా ఇలా గులాబీరంగు సంతరించుకుంటాయని ఉపాధ్యాయుడు తెలిపారు. ఇలాంటి గులాబీ రంగు మిడతలు మొదటిసారి అమెరికాలోని టెక్సాస్, ఆస్టిన్లోని ఓక్హిల్ ప్రాంతంలో గుర్తించారన్నారు. -
అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్!
Dangerous Stunt Of Guinness Records: రికార్డులను బద్దలు కొట్టాలని ఈ జిందగీలో ఎవరికి ఉండదు! ఐతే.. ఇతను చేసిన విన్యాసం ముందు అవన్నీ దిగదుడుపేనని అంటున్నారు నెటిజన్లు.. పాపం! అంతటి ప్రమాదకరమైన స్టంట్ చేసినా ‘మేము గిన్నిస్ రికార్డులో నీ పేరు నమోదు చేయం’ తేల్చిచెప్పారా అధికారులు! ఏం చేశాడో మీరే చూడండి.. అమెరికాలోని టెక్సాస్కు చెందిన జాకీ బిబ్బీ ఏకంగా 11 అత్యంత విషపూరితమైన పాములను నోట్లో కుక్కుకుని ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2010లో కూడా ఇటువంటి ఫీటే చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. ఐతే ఇప్పుడు తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసి మరొకమారు రికార్డును తిరగరాయాలని అనుకున్నాడు. కానీ అందుకు గిన్నిస్ బుక్ అధికారులు ససేమిరా అన్నారు. దీనిని సంబంధించిన ఫొటోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ఫేస్బుక్లో చూడొచ్చు. ఒక నివేదిక ప్రకారం.. జాకీ ఈ పాములన్నీంటినీ నోట్లో కుక్కుకోవడానికి చేతులను ఉపయోగించలేదట. నోటితోనే వాటిని నేరుగా పట్టుకున్నాడట. అర్థమైందా.. ఇదెంతటి ప్రమాదకరమైన స్టంటో! వాటిల్లో ఏ ఒక్కపాము కరచినా అతని ప్రాణాలు పోగొట్టుకునేవాడు. తెలిసి.. తెలిసి ఈ విన్యాసం చేశాడితడు. ఐతే గిన్నిస్ అధికారులు అందుకు భిన్నంగా ఆలోచించారు. ‘ఇకపై ఈ రికార్డును అస్సలు పర్యవేక్షించడం లేదు. ఎందుకంటే.. చాలా మంది ప్రజలు అలాంటి రికార్డు కోసం తమ జీవితాలతో ఆటలాడుకునే ప్రమాదం ఉంది. మరొకరు ఈ స్టంట్ చేయాలని కోరుకోవడంలేదని’ తేల్చిచెప్పారు. నిజమే కదా! సరదా ప్రాణాలను తీసేంతగా ఉండకూడదు.. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! -
చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్
Samsung Texas Chip Factory: కరోనా వైరస్-లాక్డౌన్ ప్రభావాల వల్ల స్మార్ట్ డివైజ్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్ డివైజ్లు.. చిప్ కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరతను అధిగమించేందుకు ఏకంగా సొంతంగా చిప్ తయారీకి పూనుకుంటున్నాయి ఫోన్ కంపెనీలు. ఈ క్రమంలో శాంసంగ్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. చిప్ ఫ్యాక్టరీల నిర్మాణానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, యాపిల్ కంపెనీలు రంగంలోకి దిగగా.. ఇప్పుడు శాంసంగ్ వాటి ప్రాజెక్టులను తలదన్నేలా భారీ ప్రణాళికకు ముందడుగు వేసింది. ఏకంగా 17 బిలియన్ డాలర్ల(17 X ఏడువేల కోట్ల రూపాయలు) భారీ ఖర్చుతో సెమీకండక్టర్ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు టెక్సాస్ ఆస్టిన్ నగరం శివారులో జెయింట్ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్లు ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం అధికారికంగా ప్రకటించింది కూడా. గత కొన్నేళ్లుగా టెక్ కంపెనీలకు అడ్డాగా మారుతున్న టెక్సాస్లో ఈ రేంజ్లో ఓ విదేశీ కంపెనీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతుండడం విశేషం. వచ్చే ఏడాది నుంచి బిల్డింగ్ నిర్మాణం.. 2024 నుంచి చిప్ తయారీ పనులు ప్రారంభించాలని శాంసంగ్ ప్రణాళిక వేసుకుంది. చదవండి: గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా? లాక్డౌన్ ప్రభావంతో చిప్ ఫ్యాక్టరీలు మూతపడగా.. ప్రస్తుతం చిప్ షార్టేజ్ సమస్య ప్రపంచం మొత్తం కొనసాగుతోంది. అమెరికా లాంటి అగ్రదేశాలు.. చైనా, తైవాన్ లాంటి ఆసియా దేశాల మీద చిప్ కోసం ఆధారపడి ఉన్నాయి. కానీ, ముందు ఆసియా దేశాల కొరత తీర్చాకే బయటి దేశాలకు ఉత్పత్తి చేసే ఉద్దేశంలో ఉన్నాయి చిప్ తయారీ కంపెనీలు. చదవండి: చిప్ల తయారీలోకి ఆపిల్, గూగుల్.. ఏమిటీ వివాదం? -
సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!
టెక్సాస్: రెస్టారెంట్లలో సర్వ్ చేసేవాళ్లతో కొంతమంది కస్టమర్లు ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుంటారో చూసే ఉంటాం. అంతేకాదు మరికొంతమంది కస్టమర్లు ఆర్డర్ లేటుగా తీసుకువచ్చాడంటూ సర్వ్ చేసేవాళ్లను చేయి చేసుకుడమే కాక అక్కడ ఉన్న ఫర్నేచర్ను పాడు చేసిన వార్తలు కూడా విన్నాం. కానీ ఇక్కడొక రెస్టారెంట్లోని మహిళా ఆ కస్టమర్లందరీ కంటే ఒక అడుగు ముందుకేసి ఇంకా దారుణంగా ప్రవర్తించింది. (చదవండి: విమానాలకు రన్వేగా....) అసలేం జరిగిందంటే.. టెక్సాస్లోని రెస్టరెంట్లో ఒక కస్టమర్ స్పైసీ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేసింది. అయిత ఆమెకు సర్వ్ చేసిన సూప్ కంటైనర్లో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. అంతే ఆమె కోపంతో రెస్టారెంట్ మేనేజర్ జన్నెల్లే బ్రోలాండ్ వద్దకు వచ్చి జరిగిన విషయం వివరిస్తుంది. అంతేకాదు ఏవిధంగా ఆ సూప్ కంటైనర్ మూత కరిగిపోయిందో చూపిస్తూ మేనేజర్పై కోపంగా అరుస్తూంది. కాసేపటికి ఉన్నటుండి ఆ వేడివేడి సూప్ను మేనేజర్ బ్రోలాండ్ ముఖంపైన విసిరేసి హడావిడిగా పరుగెత్తుతూ వెళ్లిపోతుంది. ఈ ఘటనకు బ్రోలాండ్ షాక్కి గురవుతోంది. ఈ మేరకు బ్రోలాండ్ వెంటనే ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అక్కడ ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆమె వెళ్లిపోతున్న కారుని ఫోటోలు తీసి టెక్సాస్లో పోలీసులకు కంప్లెయింట్ చేస్తుంది. ప్రస్తుతం సదరు కస్టమర్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు కస్టమర్ తీరుని విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) -
దీపావళి వేడుకల్లో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ దంపతులు
డల్లాస్, టెక్సాస్: ప్రవాస భారతీయులతో కలిసి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన సతీమణి సిస్లియాతో కలసి టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని తన నివాస గృహంలో త్సాహంగా పండుగ జరుపుకున్నారు. దీపావళి సంకేతంగా పలు దీపాలను గవర్నర్ దంపతులు వెలిగించార. అందరికీ విందుభోజనం తో పాటు మిటాయిలు పంచారు. మరిచిపోలేని అనుభూతి ఈ సందర్భంగా గవర్నర్ అబ్బాట్ మాట్లాడుతూ.. అమెరికా దేశ ప్రగతిలో ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్ర పురోభివృద్ధికి వివిధ రంగాలలో ప్రవాస భారతీయులు చూపుతున్న ప్రతిభ అనన్య సామాన్యం అన్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవడం తనకొక ఒక ప్రత్యేక అనుభూతి పంచిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. భారత దేశం టెక్సాస్ రాష్ట్రాల మధ్య ఇప్పటికే గణనీయమైన వాణిజ్య సంభందాలున్నాయని, భవిష్యత్తులో అవి ఇంకా పెరుగుతాయనే నమ్మకం ఉందన్నారు. కృతజ్ఞతలు భారత్, టెక్సాస్ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక, వాణిజ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు గవర్నర్ చేస్తున్న కృషి అమోఘమని ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ అగర్వాల్ అన్నారు. అధికారిక నివాస గృహంలో ప్రవాస భారతీయల మధ్య దీపావళి పండుగ జరుపుకున్న గవర్నర్ అబ్బాట్ దంపతులకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మురళి వెన్నం, సుధాకర్ పేరం, వినోద్ ఉప్పు, సంజయ్ సింఘానియా, డాక్టర్ గూడూరు రమణా రెడ్డి, గొట్టిపాటి వెంకట్, సునీల్ రెడ్డి, వెంకట్ మేడిచెర్ల, బంగారు రెడ్డి, సునీల్ మైని, ఏకే మాగో, పియూష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు
వాషింగ్టన్: టెక్సాస్లో ఓ తల్లి తన నలుగురి పిల్లల్ని హ్యస్టన్ అపార్ట్మెంట్లో వదిలేసి తన భాగస్వామితో కలిసి ఉంటోంది. పైగా ఆమె తన భాగస్వామితో కలిసి ఒక కొడుకుని హత్య చేసి చంపేసిందనే అనుమానంతో ఆమెను అరెస్టు చేసినట్లు టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కొడుకులు ముగ్గురు హ్యుస్టన్ అపార్ట్మెంట్లో చనిపోయిన తమ సోదరుడి అస్థిపంజర అవశేషాలతో కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) ఈ క్రమంలో ఆ పిల్లలు తల్లి 35 ఏళ్ల గ్లోరియా విలియమ్స్ సాక్ష్యాలను తారుమారు చేసే నిమిత్తం ఆ పిల్లలను గాయపరిచినట్లు తెలిపారు. అంతేకాదు ఆ పిల్లలు ముగ్గురే ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారని, చాలా కాలంగా తలితండ్రులిద్దరూ అక్కడ నివశించటం లేదని పేర్కొన్నారు. అయితే ఆ పిల్లలు చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నారు. అంతేకాదు ఆ ముగ్గురి పిల్లల్లో ఇరుగు పొరుగు వారి నుంచి ఆహారం తెచ్చుకుని జీవించేవారిని చెబుతున్నారని పోలీసులు అన్నారు. (చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ) -
అమెరికాలో ‘ఉల్లి’ హడల్!
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
------------
అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం. హుషారుగా రెస్టారెంట్కు వెళ్లిన ఓ దంపతులు.. తినేసి ఇంటికి వచ్చారు. కాసేపటికే ఇద్దరికీ జ్వరం, వాంతులు, విరేచనాలు.. వెంటనే వెళ్లి ఆస్పత్రిలో చేరారు. అక్కడే మరో పట్టణం.. ఇంట్లో భోజనం చేసి పడుకున్న కుటుంబ సభ్యులంతా తెల్లారే సరికి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇలా కొద్దిరోజుల్లోనే వందల మంది అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఒకే సమస్య ‘సాల్మోనెల్లోసిస్’. సాల్మోనెల్లాగా పిలిచే ఓ రకం బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి. అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు లోతుగా ఆరా తీసి.. ఇదెలా వ్యాపిస్తోందన్నది తేల్చారు. ఆ కారణం ఏమిటో తెలుసా.. జస్ట్ ఉల్లిపాయలు. దీంతో అమెరికావ్యాప్తంగా ఒక్కసారిగా ఉల్లి అంటే హడల్ మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు.. అక్కడి 37 రాష్ట్రాల్లో సాల్మోనెల్లోసిస్ బారినపడ్డ పేషెంట్ల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. వారు కొద్దిరోజులుగా ఏమేం తిన్నారు, ఎక్కడెక్కడికి వెళ్లారనేది ఆరా తీశారు. అన్నిచోట్లా కామన్గా వచ్చిన సమాధానం ఉల్లిపాయలే. ఇందులో చాలావరకు అమెరికాకు చెందిన ప్రోసోర్స్ అనే సంస్థ.. పొరుగుదేశమైన మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్నవే. దీంతో అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెంటనే హైఅలర్ట్ జారీ చేసింది. ప్రోసోర్స్ సంస్థ ద్వారా సరఫరా అయిన ఉల్లిపాయలన్నింటినీ.. వెంటనే పారబోయాలని ఆదేశించింది. ఆ ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర సామగ్రిని కూడా పడేయాలని.. ఆయా ప్రాంతాలను శానిటైజ్ చేయాలని సూచించింది. ► అమెరికాలో సిట్టెరో బ్రాండ్ పేరిట విక్రయిస్తున్న ‘సలామీ స్టిక్స్ (మాంసాహార వంటకం)’తోనూ సాల్మోనెల్లా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లు, ఇతర దుకాణాల్లో ఉన్న స్టాక్ను పడేయాలని ఆదేశించారు. వృద్ధులు, పిల్లలకు డేంజర్! సాల్మోనెల్లా మరీ ప్రమాదకరం కాకున్నా.. వృద్ధులు, చిన్నపిల్లలకు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి మాత్రం డేంజరేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారిలో తీవ్ర జ్వరం, రక్త విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని.. శరీరంలో డీహైడ్రేషన్, ఇతర ఇన్ఫెక్షన్లు ఏర్పడి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతే పరిష్కారం అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివాటి ద్వారా సాల్మోనెల్లాతోపాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ► పరిసరాల పరిశుభ్రత, కలుషిత ఆహారానికి దూరంగా ఉండటం, మాంసం, పండ్లు, కూరగాయలు వంటివాటిని శుభ్రంగా కడిగి ఉపయోగించడం, ఆహారాన్ని సరిగా ఉడికించడం, పాలను బాగా మరగబెట్టడం వంటివాటి ద్వారా సాల్మొనెల్లా, ఈకొలికి దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఏమిటీ ‘సాల్మోనెల్లా’? సాల్మోనెల్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్యాక్టీరియా. కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా మాంసాహారం, గుడ్లలో ఈ బ్యాక్టీరియా ఎదుగుతుంది. సరిగా కడగని పండ్లు, కూరగాయల మీద కూడా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులు, ఈగలు వంటివి ఈ బ్యాక్టీరియా పెరగడానికి, వ్యాపించడానికి కారణం. ► ప్రస్తుతం అమెరికాలో సాల్మోనెల్లా బారినపడ్డ వారిలో చాలా మంది.. సరిగా కడగని, పచ్చి ఉల్లిపాయలు తిన్నట్టు గుర్తించారు. ► శరీరంలో ప్రవేశించిన నాలుగైదు గంటల్లో ప్రభావం చూపించడం మొదలవుతుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వస్తాయి. తీవ్ర నీరసం ఆవహిస్తుంది. సాధారణంగా వారం రోజుల్లోపే ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మందులు వాడితే వేగంగా కోలుకోవచ్చు. -
ఎలోన్ మస్క్ ఎంట్రీతో మెరుపు వేగంతో పెరిగిన ఇళ్ల ధరలు
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ టెస్లా కొద్ది రోజుల క్రితం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ హెడ్ క్వార్టర్స్ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్కు భారీ షాక్ ఇచ్చింది. అక్టోబర్ 7న జరిగిన షేర్హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఊహించని ఈ ప్రకటన చేశాడు. ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా టెస్లా నిర్మించబోయే గిగాఫ్యాక్టరీ చుట్టూ గృహా ధరలు భారీగా పెరిగాయి. గిగా ఫ్యాక్టరీ నిర్మించే టెక్సాస్ లోని ట్రావిస్ కౌంటీలో ఇంటి ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 53.7% పెరిగాయి. మొత్తం టెక్సాస్ లోని ఆస్టిన్తో పోలిస్తే ఇది 26% కంటే ఎక్కువ. టెస్లా సైబర్ ట్రక్, సెమీ ట్రక్, మోడల్ 3 & వై కోసం 5 మిలియన్ చదరపు అడుగుల కర్మాగారం అవసరం. అందుకే ఇక్కడ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇన్ సైడర్ ప్రకారం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు గంటకు $15 ప్రారంభ వేతనంతో 5,000 మంది నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టెస్లా తెలిపింది. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చేసిన ప్రకటనతో ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకానికి ఉన్న గృహాలు ధరలు రాకెట్ వేగంతో పెరగడం ప్రారంభించాయి. (చదవండి: అంతరిక్ష రంగంలో పోటీ పడుతున్న దేశీయ ప్రైవేట్ కంపెనీలు) -
Tesla: అనూహ్య నిర్ణయంతో షాకిచ్చిన టెస్లా
ఈవీ దిగ్గజ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంపెనీ హెడ్ క్వార్టర్స్ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్కు భారీ షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన షేర్హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో ఊహించని ఈ ప్రకటన చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న టెస్లా.. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ నుంచే ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. అయితే ఉన్నపళంగా ఎందుకు తరలిస్తున్నారనే విషయం కాసేపు హైడ్రామా నడిపించిన మస్క్.. విస్తరణలో భాగంగానే ఈ తరలింపు చేపట్టినట్లు చెప్పారు. టెక్సాస్లోని ఆస్టిన్కు టెస్లా హెడ్ క్వార్టర్స్ను తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత కాలపరిమితిలో చేస్తామనే విషయంపై మాత్రం మస్క్ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం చిప్, ఇతరత్ర కంపోనెంట్ల కొరత సమస్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. పాలో ఆల్టోలో ఉన్న హెడ్ క్వార్టర్స్ కేంద్రం టెస్లా సేల్స్ ఆశాజనకంగానే సాగుతున్నట్లు సమావేశంలో మస్క్ వెల్లడించాడు. అయితే ఫ్రెమోంట్ ప్లాంట్ నుంచి వాహనాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పరిమితుల కారణంగా అది జరగలేకపోతుందని ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక హెడ్క్వార్టర్స్ తరలింపు గురించి రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న చట్టాల వల్ల మస్క్ ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే తరలింపునకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్లు, తక్కువ రెగ్యులేషన్స్ ఉన్న ప్రాంతాలకు తరలిపోయే అంశం గురించి మస్క్ సహా పలువురు టెక్ దిగ్గజాలు చాలాకాలంగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలో ఆల్టోకు 2400 కిలోమీటర్ల దూరంలోని ఆస్టిన్కు హెడ్ క్వార్టర్స్ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో ఎలాంటి కుదేలుకు లోనవుతుందో చూడాలి మరి!. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు.. మూల్యం -
ఫ్రిస్కో సిటీ పార్క్స్ బోర్డు మెంబర్గా వేణు భాగ్యనగర్
ఫ్రిస్కో (టెక్సాస్) : ఫ్రిస్కో సిటీకి సంబంధించిన పార్క్స్ రిక్రియేషన్ బోర్డు సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్ ఎన్నికయ్యారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన పార్క్స్ రిక్రియేషన్ బోర్డు నగర పరిధిలో ఉన్న పార్కుల సంరక్షణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్కి అనుబంధంగా ఈ బోర్డు పని చేస్తుంది. వేణు భాగ్యనగర్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా చేగుర్తి. ఆ జిల్లాలోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నారు. చదవండి: టెక్సాస్లో శ్రీశ్రీకి ఘన నివాళి -
Abortion Rights: టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టానికి మహిళల నిరసన సెగ..!!
అబార్షన్ (గర్భస్రావం) పై ఆంక్షలను విధించడాన్ని నిరసిస్తూ అమెరికా దేశవ్యాప్తంగా వేలాది మహిళలు రోడ్డెక్కారు. చట్టప్రకారం తమకు దక్కవలసిన హక్కులను కొనసాగించాలని టెక్సాస్ నగర వీధుల్లో ప్లకార్డులతో నినదిస్తున్నారు. దీంతో 50 రాష్ట్రల్లో మహిళల నిరసనల సెగలు మిన్నంటాయి. గత నెలలో టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో గవర్నర్ గ్రెగ్ అబాట్ సంతకం చేసిన ‘హార్ట్ బీట్’ చట్టాన్ని వందలాది మంది వ్యతిరేకిస్తున్నారు. అమల్లోకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏమిటీ చట్టం? టెక్సస్ కొత్త చట్టం ప్రకారం.. గర్భస్థ పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభమైతే అబార్షన్ చేయించుకోవడం నిషేదం. సాధారణంగా గర్భంలో 6 వారాలకు పిండం గుండె కొట్టుకోవడం మొదలౌతుంది (చాలా మంది మహిళలు తాము గర్భవతులని తెలియక ముందే 85 నుంచి 95 శాతం ముందుగానే అబార్షన్లు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు). అత్యచార బాధితులు, అక్రమ సంబంధం ద్వారా గర్భవతులైన వారికి కూడా ఈ చట్టం నుంచి ఎటువంటి మినహాయింపు లేదు. అంతేకాకుండా ఈ నిషేధాన్ని అతిక్రమించి అబార్షన్కు పాల్పడినట్లు రుజువుచేసిన వారికి అక్కడి ప్రభుత్వం పది వేల డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. ఇది అత్యంత నిర్భందమైనదని, ఈ చట్లాన్ని రద్దు చేయాలంటూ అక్కడి మహిళలు ఆందోళనలు చేపట్టారు. మిసిసిసీలో ఈ చట్టముంది ఐతే వాషింగ్టన్ నిరసనకారులు రెండు రోజులు ముందుగానే యూఎస్ సుప్రీంకోర్టులో ఈ చట్టం రూపొందకుండా పిటిషన్ వేశారు. 1973లో రో వర్సెస్ వేడ్ మిసిసిసీ కేసులో ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఈ చట్టం రూపొందకుండా అడ్గుకునేందుకు ప్రయత్నించారు. ఈ మిసిసిసీ కేసులో 15 వారాల తరువాత మహిళలు అబార్షన్ చేయించుకోకూడదనే నిబంధన ఉంది. సెప్టెంబర్ 1 నుంచి.. ఒక వేళ న్యాయస్థానం ముందుగానే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలుచేయడానికి రాజ్యంగ బద్ధంగా రాష్ట్రాలకు సర్వహక్కులు ఇవ్వబడతాయి. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకొచ్చింది. ఐతే అనతి కాలంలోనే ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. రెండోసారి.. కాగా 2017 మార్చిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మొదటి సారి ర్యాలీ చేపట్టారు. అదే స్థాయిలో ఇప్పుడు రెండో సారి నిరసనల గళం వినబడుతోందని ఉమెన్ మార్చ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రాచెల్ ఓ లియరీ కార్మొనా అన్నారు. చదవండి: కాలిఫోర్నియా బీచ్లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం! -
టెక్సాస్లో శ్రీశ్రీకి ఘన నివాళి
ఫ్రిస్కో (టెక్సాస్) : ప్రవాస భారతీయులు టెక్సాస్లోని ఫ్రిస్కో నగరంలో మహాకవి శ్రీశ్రీకి నివాళులు అర్పించారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. మహాప్రస్థానంలోని 40 కవితలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా డాక్టర తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ... శ్రీశ్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, ఆయన కలంనుండి వెలువడ్డ వివిధ రచనలలోని ముఖ్య అంశాలను వివరించారు. ఈ ప్రత్యేక సాహిత్య సమావేశంలో అనంత్ మల్లవరపు, ఎంవీఎల్ ప్రసాద్, అరుణజ్యోతి కోల, రాజశేఖర్ సూరిభొట్ల, రావు కల్వల, విశ్వనాధం పులిగండ్ల, డాక్టర్ నక్త రాజు, రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కిరణ్మయి గుంట, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, భాస్కర్ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్ వేముల, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, జగదీశ్వరన్ పుదూర్, దయాకర్ మాడ తదితరులు పాల్గొన్నారు. -
వైరల్: కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. బిల్లు చూసి షాకయ్యాడు..
వాషింగ్టన్: దాదాపు గత రెండేళ్ల నుంచి సాధారణ జ్వరం, జలుబు వచ్చిన కరోనానేమో అని కంగారు పడిపోతున్నాం. పక్కన ఎవరైన దగ్గుతూ, తుమ్ముతూ కనిపిస్తే ఇంకేమైనా ఉందా మెల్లగా పక్కకు జారుకుంటాం. ఒకవేళ ఇవే లక్షణాలన్నీ మనకే ఉంటే ఉన్నపళంగా టెస్టులు, మందులు అంటూ హైరానా పడిపోతాం. కోవిడ్కు అనేక చోట్ల టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కొంత డబ్బులు తీసుకొని పరీక్షలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి తనకు కరోనా ఉందేమో అనుకొని టెస్టుకు వెళ్లాడు. తరువాత అతను షాక్కు గురయ్యాడు. అయితే ఆ వ్యక్తి అంతలా కంగుతినడానికి కారణం..వచ్చిన రిజల్ట్స్ను బట్టి కాదు.. ఆసుపత్రి వారు వేసిన బిల్ను చూసి.. అసలేం జరిగిందంటే.. చదవండి: మాంచెస్టర్లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే? టెక్సాక్కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి కరోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు చేయించుకున్న వార్నర్కు ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా 54 వేల డాలర్లు బిల్లు వేసింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.40 లక్షలు. దీంతో వార్నర్ షాక్ అయ్యాడు. ఇందులో పీసీఆర్ టెస్టులు, యాంటిజెన్ టెస్ట్ ఫెసిలిటీ ఫీజు కోసం కలిసి భారీగా వసూలు చేశారు. ఇంత మొత్తం బిల్లు వేయడం చూసి వార్నర్ ఖంగుతిన్నాడు. అయితే, అతనికి మోలీనా హెల్త్కేర్ నుంచి ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ బిల్లును సదరు కంపెనీకి పంపాడు. ఆ బిల్లుచూసి ఇన్సూరెస్ కంపెనీ సైతం షాక్ అయి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బిల్లును 54 వేల డాలర్ల నుంచి 16,915 డాలర్లకు తగ్గించి చెల్లించింది. చదవండి: Ankita Konwar: వృక్షాసనం నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే? ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది. కాగా అమెరికాలో ఇలా ఇష్టారీతిన డబ్బులు గుంజడం ఇదేం తొలిసారి కాదు. కోవిడ్ అవతరించినప్పటి నుంచి టెస్టుల కోసం అధిక ధరలు వసూలు చేసిన సందర్భాలు చాల ఉన్నాయి. సాధారణంగా పీసీఆర్ టెస్టు కోసం అమెరికాలో 8 నుంచి 15 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. What is wrong w the US? This guys bill for a few tests came to $54,000!!! His wife’s insurance negotiated her cost down to $1000!! PCR tests themselves can cost -
‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు
నిజంగానే ఇదో క్రేజీ కేసు మరి!. అతనో పచ్చి తాగుబోతు. అలవాటు ప్రకారం ఫుల్గా మందేసి.. ఆ మత్తులో బయట మరో తాగుబోతుతో కొట్లాడి గాయపడ్డాడు. మత్తు దిగాక కోర్టులో తనకు మందు పోసిన బార్పైనే కేసు వేసి మరీ దాదాపు 40 కోట్ల భారీ నష్టపరిహారం రాబట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టెక్సాస్కు చెందిన డానియల్ రాల్స్.. 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్లోని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుల్గా తాగాడు. ఆపై కార్క్ పార్కింగ్ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో రాల్స్ తలకు గాయం అయ్యింది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సరాసరి కోర్టులో బార్ మీద కేసు వేశాడు డానియల్ రాల్స్. ఆ రెస్టారెంట్ వల్లే తాను టూమచ్గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. ఆ బార్ పరిసరాల్లో జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతో తనకు ఫుల్గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్గా సర్వ్ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్ను కూడా పిలవలేదని.. లాంటి ఆరోపణలు చేశాడు. బార్ ఓనర్తో పాటు తనకు సర్వ్ చేసిన బార్టెండర్ను నిందితులుగా పేర్కొన్నాడు. అయితే రాల్స్ పచ్చి తాగుబోతు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్గా తాగి.. న్యూసెన్స్ క్రియేట్ చేసి జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాల్ని బార్ ఓనర్ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించినప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆ తాగుబోతుకు సపోర్ట్గా తీర్పు ఇస్తూ.. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్ డాలర్లను కలిపి రాల్స్కు చెల్లించాలని లా ఫగోటా మెక్సికన్ గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్ను ఆదేశించింది ఆండ్రూస్ కౌంటీ 109వ న్యాయస్థానం. ఇది చదవండి: కంపించిన నేల.. 1300 మరణాలు -
నుజ్జు నుజ్జు అయిన కారు
-
వైరల్: ఇదేందయ్యా ఇది! ఇలా కూడా కొట్లాడొచ్చా...
వాషింగ్టన్ : రెండు ఆడ జింకల విచిత్రమైన కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమెరికా, టెక్సాస్లోని సోమర్ విల్లే లేక్లో చోటుచేసుకున్న ఈ ఫైట్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై జింకల యజమాని గే ఇస్బర్ మాట్లాడుతూ.. ‘‘ఆడ జింకలు కొట్లాడుకోవటం మొదటి సారి చూస్తున్నా.. అవి అచ్చం ఏలియన్స్లాగా కనిపించాయి. జింకలు మామూలుగా స్థలం కోసం గొడవపడుతూ ఉంటాయి’’ అని తెలిపింది. కొద్దిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో.. ఓ ఆడ జింక తన మానాన గడ్డి మేస్తోంది. ఇంతలో మరో ఆడ జింక అక్కడికి వచ్చింది. జింక బాషలో ఆ వచ్చిన ఆడ జింక ఏమందో ఏమో కానీ, దాన్ని చూడగానే గడ్డి మేస్తున్న జింక ఠక్కున రెండు కాళ్లపై? పైకి లేచింది. ఆ వెంటనే ఆ వచ్చిన జింక కూడా రెండు కాళ్లపై పైకి లేచింది. ముందు కాళ్లను ఊపుతూ ఒకటి వెనక్కు పోతుంటే.. రెండోది కూడా ముందు కాళ్లను గాల్లో ఊపుతూ దాని వెంట పడింది. కొన్ని అడుగుల దూరం పోయిన తర్వాత ముందు కాళ్లతో రెండూ కొన్ని సెకన్లు కొట్టుకున్నాయి. ఓ జింక కాళ్లకు బుద్ది చెప్పి అక్కడినుంచి పరుగులు తీసింది. రెండో జింక దాని వెంటపడింది. -
కిటికీల్లేవు.. గదుల్లేవ్.. దీనికి రూ. 7 కోట్లా
టెక్సాస్/వాషింగ్టన్: అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని చిత్ర విచిత్రమైన ఇళ్లు కనిపిస్తుంటాయి. అందులో ప్రవేశిస్తే తిరిగి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే.. ఆ ఇంటిలోపల అంతా గందరగోళంగా.. అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. మొత్తంగా చెప్పాలంటే మహాభారతంలోని మయ సభను పోలి ఉంటుంది. ఇలాంటి ఇంట్లో నివాసం ఉంటే ఖచ్చితంగా పిచ్చి పడుతుంది. మరి ఇలాంటి వింత ఇల్లు ఉంటుందా అంటే.. ఉంది.. అది కూడా ఇప్పుడు అమ్మకానికి వచ్చిది. ఖరీదు ఏకంగా 7 కోట్ల రూపాయల పైమాటే. ఇంతకు ఆ ఇల్లు ఎక్కడ ఉంది.. దాని విశేషాలు తెలియాలంటే ఇది చదవండి అమెరికా టెక్సాస్ డల్లాస్ పట్టణంలోని ఓ ఇల్లు అమ్మకానికి వచ్చింది. దాని ఖరీదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. 7,43,79,300 రూపాయలు. ఇంత ఖరీదు ఉందంటే.. తప్పకుండా సకల హంగులతో ఇంద్ర భవనంలా ఉంటుందని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇంటి లోపలికి వెళ్తే బుర్ర తిరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో బెడ్రూంలుండవు.. కిటికీల స్థానంలో నకిలీవి ఉంటాయి. బయట నుంచి చూస్తే.. పెద్ద పెద్ద గాజు కిటికీలున్నట్లు కనిపిస్తుంది కానీ అలా లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అవేం కనిపించవు. ఇక ఈ ఇంటి మొత్తం మీద ఓ గ్లాస్ సెక్యూరిటీ విండో ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే పోలీస్ స్టేషన్, నిర్బంధ కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద ఉండే కిటికీని పోలి ఉంటుంది. ప్రతి గది బూడిద రంగు కార్పెట్తో కవర్ చేసి ఉంటుంది. ఇల్లు ఓ గోడౌన్లాగా కనిపిస్తుంది. దాదాపు 21 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ ఇంటిని ఈ ఏడాది జిల్లోలో అమ్మకానికి పెట్టారు. ఇక ‘‘ఈ ఇల్లు పెద్ద మొత్తంలో వైన్ దాచుకోవడానికి.. ఎక్కువ సంఖ్యలో కార్లను, ఆర్ట్ కలెక్షన్ను దాచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది’’ అని రాసుకొచ్చారు. ఈ ఇంటిని అనుసంధానిస్తూ రెండు విద్యుత్ గ్రిడ్లు, రెండు డీజిల్ ఇంధన ట్యాంకుల ద్వారా నడిచే సహజ వాయువు జనరేటర్ కూడా ఉన్నాయి. ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది ఇల్లా.. లేక దెయ్యాల కొంపా’’.. ‘‘నాలుగు గోడలు.. పైన కప్పు.. అంతకు మించి ఈ ఇంటిలో ఎలాంటి ఆకర్షణ లేదు’’... ‘‘ఇలాంటి ఇళ్లల్లో ఉంటే లేనిపోని మానసకి సమస్యలు తలెత్తుతాయి’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
నిద్ర లేస్తూనే గతం మర్చిపోయాడు.. భార్యను చూసి భయంతో
వాషింగ్టన్: మనిషికి మరుపు సహజం. మనిషి జీవితంలో మరుపు అనేది లేకపోతే.. జీవనం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే జీవితం సుఖదుఖాల సమాహారం. మధుర స్మృతులను గుర్తు పెట్టుకోవాలి.. మనసును బాధ పెట్టేవాటిని మరిచి పోవాలి. అవసరం లేనివాటిని మర్చిపోతే ఏం కాదు.. అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతే.. జీవితం ఎలా ఉంటుందో నాని భలే భలే మగాడివోయ్ సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ మతి మరుపు ముచ్చట ఎందుకంటే.. నిద్ర లేస్తూనే ఓ వ్యక్తి తన గతం మర్చిపోయాడు. భార్యాబిడ్డలతో సహా తనను కూడా మర్చిపోయాడు. అద్దంలో తనను చూసుకుని ఆశ్చర్యపోయాడు. కాలచక్రం అతడిని తన 16వ ఏట నిలిపింది. దాంతో స్కూల్కు వెళ్లేందుకు రెడీ అవ్వసాగాడు. అతడి వింత ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ అరుదైన సంఘటన వివరాలు.. అమెరికా టెక్సాస్కు చెందిన డానియల్ పోర్టర్(37) హియరింగ్ స్పెషలిస్ట్గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో పోర్టర్ ఓ రోజు నిద్ర నుంచి లేస్తూనే తన గతం మర్చిపోయాడు. తనని తాను 16 ఏళ్ల యువకుడిలా భావించాడు. తన భార్య రుత్, పదేళ్ల కూతురిని కూడా మరిచిపోయాడు. అద్దంలో తనని తాను చూసుకుని ‘‘నేను ఎందుకు ఇంత లావుగా, పెద్దవాడిలాగా ఉన్నాను’’ అని ఆలోచించసాగాడు. ఇంతలో వారి గదిలోకి వచ్చిన భార్యను చూసి బిత్తరపోయాడు.. ఎవరని ప్రశ్నించాడు. పోర్టర్ ప్రవర్తనతో భయపడిన ఆమె.. తాను అతడి భార్యనని.. వారికి కొన్నేళ్ల క్రితమే పెళ్లయ్యిందని గుర్తు చేసింది. కానీ పోర్టర్ ఒప్పుకోలేదు. తాను ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లాడినేనని వాదించాడు. ఈ సందర్భంగా పోర్టర్ భార్య రుత్ మాట్లాడుతూ.. ‘‘ఉదయాన్నే అతడు నిద్రలేచాడు. నేను ఎవరో తెలియనట్లు చూశాడు. చాలా గందరగోళానికి గురయ్యాడు. మేము ఉన్న గదిని కూడా అతడు గుర్తుపట్టలేదు. బాగా తాగేసి ఆ ఇంటికి వచ్చేడా.. లేక తనను ఎవరో కిడ్నాప్ చేసి మా రూమ్లో బంధించారా అని భావించాడు. నా భర్త మా గది నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించడం నేను చూశాను’’ అని ఆమె ఓ వార్త సంస్థకు తెలిపింది. ఈ సందర్భంగా రూత్ మాట్లాడుతూ.. ‘‘ఆ తర్వాత పోర్టర్కి.. నేను తన భార్యను అనే చెప్పే ప్రయత్నం చేశాను. అయితే, అతడు ఇంకా 90వ దశకంలో ఉన్నట్లు భావించాడు. అద్దంలో చూసుకుని ఆగ్రహానికి గురయ్యాడు. నేను ఎందుకు ఇంత లావుగా, పెద్దవాడిలాగా ఉన్నానని అరిచాడు. అతడు హియరింగ్ స్పెషలిస్ట్. అయితే, ఆ రోజు తన ఉద్యోగం, చదివిన చదువు.. అన్నీ మరిచిపోయాడు. దీంతో అతడిని హాస్పిటల్కు తీసుకెళ్లాం’’ అని తెలిపింది. పోర్టర్ని పరీక్షించిన వైద్యులు.. అతడు ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీన్నే ‘షార్ట్ టెర్మ్ మెమరీలాస్’ అని కూడా అంటారన్నారు. 24 గంటల్లో సర్దుకుంటుందని తెలిపారు. అయితే, ఈ సమస్య వల్ల డానియల్ సుమారు 20 ఏళ్ల గతాన్ని మరిచిపోయాడు. దాంతో భార్య అతడు బాల్యంలో నివసించిన ఊరికి తీసుకెళ్లింది. అతడిని పాత స్నేహితులతో కలిపింది. చిత్రం ఏమిటంటే మెమరీ లాస్ తర్వాత అతడి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఇదంతా జరిగి ఆరు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే అతడికి అన్నీ నెమ్మదిగా గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం పోర్టర్ థెరపీకి వెళ్తున్నాడు. -
మూర్ఖుడి వెంట మూగజీవి పరుగులు
ప్రేమ, ద్వేషం, స్వార్థం, మోసం.. ఇవన్నీ భూమ్మీద తెలివైన ప్రాణిగా పేరున్న మనిషికి మాత్రమే సొంతం. కానీ, మూగ జీవాలు అలా కాదు. ఇంత తిండి పెడితే చచ్చేదాకా విశ్వాసం చూపెడుతుంటాయి. అలాంటిది ఓ ఫ్రెండ్లీ యానిమల్ను వదిలించుకునే ప్రయత్నం చేశాడు ఒక మూర్ఖుడు. మరి జంతు ప్రేమికులు ఊరుకుంటారా?.. ఆస్టీన్: టెక్సాస్లోని ఎల్ పాసో సిటీకి చెందిన లూయిస్ అంటోనియో కాంపోస్(68) కుటుంబం కొన్నేళ్లుగా ఓ హస్కీని పెంచుకుంటున్నాడు. అయితే దానిని అనవసరంగా మేపుతున్నాననే ఉద్దేశానికి ఈమధ్య వచ్చాడతను. తన డ్రైవర్ సాయంతో దానిని దూరంగా తీసుకెళ్లాడు. ఆ పెంపుడు హస్కీ మెడకు ఉన్న బెల్ట్ను తొలగించగా.. వెంటనే కారులోకి వచ్చేయ్మని లూయిస్ తన డ్రైవర్కి సైగ చేశాడు. పాపం.. యజమాని అలా వదిలి వెళ్తుండడంతో ఆ మూగ జీవి భయపడిపోయింది. ఆ కారు వెంట చాలా దూరం పరుగులు తీసింది. అయితే అక్కడే ఉన్న ఓ అజ్ఞాత వ్యక్తి ఆ మొత్తాన్ని వీడియో తీశాడు. యానిమల్ షెల్టర్ వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి ఆ శునకాన్ని రక్షించడం.. 24 గంటలు గడవక ముందే ఓ మంచి కుటుంబం దానిని దత్తత తీసుకోవడం జరిగిపోయాయి. Husky seen running after car when he’s abandoned and is saved, Texas man is arrested and charged with animal cruelty. (Via IG: ms.mojorising_) pic.twitter.com/JmwbdZnS3w — Dallas Texas TV (@DallasTexasTV) July 24, 2021 ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అయ్యింది. అది చూసి లూయిస్ను, అతని డ్రైవర్ను తిట్టని వాళ్లంటూ లేరు. అతన్ని శిక్షించాలని పోలీసులను ట్యాగ్ చేశారు. దీంతో వీడియో ఆధారంగా కారు నెంబర్ ట్రేస్ చేశారు ఎల్ పాసో పోలీసులు. లూయిస్ను మూగజీవాల్ని హింసించిన నేరం కింద అరెస్ట్ చేశారు. ఐదు వేల డాలర్ల ఫైన్తో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష కూడా విధించింది కోర్టు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు ఎల్ పాసో పోలీసులు. -
మరో అరుదైన వైరస్, 20 ఏళ్ల తరువాత మళ్లీ ప్రత్యక్షం
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో ఇప్పటికీ ప్రపంచం అల్లాడుతోంటే అమెరికాలో తాజాగా అరుదైన మంకీ పాక్స్ వైరస్ కేసును గుర్తించారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలిసారి అమెరికాలోని టెక్సాస్లో మంకీ పాక్స్ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం తెలిపింది. అమెరికా నివాసి అయిన బాధితుడు కొన్ని రోజుల క్రితం నైజీరియా వెళ్లి తిరిగి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం డల్లాస్లో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ రోగితో సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో లాగోస్, నైజీరియా, అట్లాంటా, డల్లాస్ మధ్య రెండు విమానాల ప్రయాణికులను, ఇతరులపై దృష్టిపెట్టింది మరోవైపు స్మాల్ పాక్స్ వైరస్కి చెందినదిగా భావిస్తున్న ఈ మంకీపాక్స్ వల్ల ఆందోళన అవసరం లేదని, సాధారణ ప్రజలకు పెద్దగా ముప్పు ఉండదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. తుంపర్ల వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నప్పటికీ కరోనా కారణంగా మాస్కులు ధరిస్తున్న నేపథ్యంలో పెద్దగా వ్యాపించకపోవచ్చని సీడీసీ వెల్లడించింది. అమెరికాలో తొలిసారిగా 2003లో 47 మందికి ఈ వైరస్ సోకింది. మిడ్వెస్ట్లోని పెంపుడు జంతువుల ప్రేరీ కుక్కలు, దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ ఎలుకల ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం మంకీపాక్స్ వైరస్ మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన వైరల్ వ్యాధి. ఫ్లూతో మొదలై, లింఫ్ నోడ్స్లో వాపు, శరీరంపై భారీగా దద్దుర్లు రావడం జరుగుతుంది. రెండు నుండి నాలుగు వారాల వరకు లక్షణాలు ఉంటాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం మంకీపాక్స్ కేవలం ఒకశాతం మందిలో ప్రాణాంతకమని తేలింది. -
ప్రజల హృదయాల్లో వైఎస్సార్కు శాశ్వత స్థానం
హ్యూస్టన్ (టెక్సాస్) : ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవించాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ టెక్సాస్కి చెందిన ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. మహానేత ప్రియతమ నాయకుడు డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలను వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎంతో వైభవంగా హ్యూస్టన్ మహా నగరం లో జరిపారు. ఈ కార్య క్రమానికి వైఎస్సార్ అభిమానులు , డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ మెంబెర్స్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మహానేత రాజన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన గొప్ప సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ , ఫీజు రేయింబర్సుమెంట్ , 108 , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఉచిత విద్యుత్, పేదలకు ఇల్లు వంటి అనేక కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరీష్ రామిరెడ్డి, డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి, బ్రహ్మ రెడ్డి, మారుతీ రెడ్డి, వేణు దాసరి, రామ్ చెరువు, పుల్లా రెడ్డి, వీరా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్, సుధీర్ , సురేష్ పగడాల, రామ్ మోహన్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, రాఘవ రెడ్డి కే, సన్నప్పరెడ్డి విశ్వ, అరవింద్ రెడ్డి ,వంశీ అరిమండ, సుధీర్ సూరా, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెక్కిళ్లు ఆగడం లేదా.. ఈ ‘స్ట్రా’తో చెక్ పెట్టేయొచ్చు!
వెక్కిళ్లు వస్తే ఏం చేస్తారు..? ఏముంది కాసేపు ఊపిరి బిగపట్టడం లేదా నీరు తాగుతాం అంతేకదా..! కొన్నిసార్లు ఎంతసేపు ఊపిరి బిగపట్టినా లేదా నీరు తాగినా కొందరికి వెక్కిళ్లు అస్సలు ఆగవు. చాలాసేపు వెక్కిళ్లు రావడం మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే. అలాంటి వారికి వెంటనే వెక్కిళ్లు ఆగిపోవాలంటే ఏం చేయాలి? అలాంటి వారికోసమే ‘హిక్ అవే’అనే పరికరాన్ని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ హెల్త్ సైన్స్ సెంటర్కు చెందిన డాక్టర్ అలీ సీఫీ అభివృద్ధి పరిచారు. ‘ఎల్’ఆకారంలో ఉండే ఈ స్ట్రా పరికరం దాదాపు 92 శాతం మందిలో సమర్థంగా పనిచేసిందని చెబుతున్నారు. గ్లాసులోని నీటిని ఈ స్ట్రా ద్వారా పీల్చుకుంటే చాలు క్షణాల్లో వెక్కిళ్లను తగ్గించేస్తుందని పేర్కొంటున్నారు. ఒకవైపు సన్నగా ఉండి నీటిని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. మరోవైపు అడ్జస్ట్ చేసుకునే వీలుండి, చిన్న రంధ్రం మాదిరిగా ప్రెషర్ వాల్వ్ ఉంటుంది. ఈ చిన్న వాల్వ్ ద్వారా నీటిని గట్టిగా పీల్చుకోవడం ద్వారా ఫ్రెనిక్ నాడీకణం క్రియాశీలమై మనకు వెక్కిళ్లు రావడానికి కారణమైన మన శరీరంలోని విభాజపటలం (డయాఫ్రమ్) ముడుచుకుపోతుంది. పీల్చుకున్న నీటిని మింగాలంటే వేగస్ నాడీ కణం క్రియాశీలం కావాలి. ఈ రెండు నాడీ కణాలే మనకు వెక్కిళ్లు రావడానికి కారణం. ‘హిక్ అవే స్ట్రా’ద్వారా నీటిని తాగితే ఈ రెండు నాడీ కణాలను నీటిని గట్టిగా పీల్చడం, నీటిని మింగడం వంటి వేరే పనుల్లో బిజీ చేయడం ద్వారా వెక్కిళ్లు రాకుండా చేయొచ్చని డాక్టర్ అలీ సీఫీ వివరించారు. -
డాల్లస్లో ఘనంగా వనభోజన కార్యక్రమం
టెక్సాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాల్లస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని డాల్లస్లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్వర్యంలో గడిచిన మూడు నెలల్లో వరుసగా మూడు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించిన తరువాత టీపీఏడీ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వనభోజన కార్యక్రమంతో డాల్లస్లోని తెలుగు వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉందని కార్యక్రమ నిర్వహకులు తెలిపారు. ఈ వనభోజన కార్యక్రమం డాల్లస్లోని హార్స్ రాంచీ, బిగ్ బ్యారెల్ రాంచీ, అరుబ్రే రాంచీ ప్రాంతాల్లో నిర్వహించారు. డాల్లస్లోని తెలుగువారు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సంస్కృతి కనులకు కన్పించేలా భారీ సెట్టింగ్లతో ఫార్మ్ హౌజ్ ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు. టెక్సాస్లో కోవిడ్-19 నిబంధనలను కాస్త సడలించడంతో తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం మొదట గణపతి పూజతో మొదలై.. నోరురించే తెలంగాణ పిండి వంటకాలను తయారుచేసి అరగించారు. అంతేకాకుంగా కార్యక్రమంలో నృత్య ప్రదర్శన, మ్యూజిక్, క్రికెట్, ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. రావు కాల్వల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన టీపీఏడీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీఏడీ అధ్యక్షుడు రవికాంత్ మామిడి, ఉపాధ్యక్షులు రూప కన్నయ్యగారి, శ్రీధర్ వేముల, మాధవి సుంకి రెడ్డి, ఇంద్రాణి పంచెరుపుల, మంజుల తోడుపునూరి, లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల, ఫణీవీర్ కోటి, సీనియర్ టీపీఎడీ టీం మెంబర్ రఘువీర్ బండారు, కో ఆర్డినేటర్ గోలి బుచ్చిరెడ్డి తదితర తెలుగు వారు పాల్గొన్నారు. చదవండి: ఘనంగా 4వ అన్నమయ్య శతగళార్చన -
ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని చాలా సేపటి వరకు వరద నీటిలో...
-
వరదలో చిక్కిన మహిళ.. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని..
టెక్సాస్ : వరదలో చిక్కుకుని అల్లాడిపోతున్న ఓ మహిళను సహాయక సిబ్బంది ఒకరు ప్రాణాలకు తెగించి రక్షించారు. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మే 24న టెక్సాస్లో భారీ వర్షం కురిసింది. ఫోర్ట్ వర్త్ ఏరియా మొత్తం జలమయమయ్యింది. ఆ సమయంలో కారులో వెళుతున్న ఓ మహిళ వరదలో చిక్కుకుపోయింది. అయినప్పటికి కారును నడపటానికి ప్రయత్నించటంతో కారు వరదలో కొట్టుకుపోయింది. కారులో చిక్కుకున్న ఆమె కొద్దిసేపటి తర్వాత బయట పడింది. అలా నీటిలో కొట్టుకుపోతూ ఓ చోట చెట్టు కొమ్మను పట్టుకుంది. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని చాలా సేపటి వరకు వరద నీటిలో ఉండిపోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సిబ్బందిలోని ఒకరు ప్రాణాలకు తెగించి ఆమె కోసం వరదలోకి దిగాడు. ఆమెకు లైఫ్ జాకెట్ తొడిగించి, బయటకు తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి : వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి -
USA: భార్యతో గొడవ.. భర్తకు షాకిచ్చిన అమెరికా కోర్టు
వాషింగ్టన్: టెక్సాస్కు చెందిన సునీల్ కే అకులా (32) అనే భారత సంతతి వ్యక్తికి 56 నెలల జైలు శిక్ష, మూడు సంవత్సరాల పర్యవేక్షణ విధించింది అక్కడి కోర్టు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం.. "సునీల్ టెక్సాస్లోని తన ఇంటి నుంచి మసాచుసెట్స్ లోని అగావామ్కు తన భార్యతో 2019, ఆగష్టు 6న ప్రయాణించాడు. ఆ సమయంలో అతడు ఆమెతో గొడవ పడ్డాడు. అతడు తన భార్యను అపార్ట్మెంట్ నుంచి తరిమివేసి, తన కారులో ఎక్కమని బలవంతం చేశాడు. ఆమెను తిరిగి టెక్సాస్కు తీసుకువెళుతున్నానని చెప్పాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేయమని బలవంతం చేశాడు. ఆమె ల్యాప్టాప్ను పగులగొట్టి హైవేపై విసిరాడు." అంటూ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. ప్రయత్నాలు విఫలం సునీల్ దౌర్జన్యంపై అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అరెస్టు చేశారు. అయితే, కేసు నుంచి బయటపడేందుకు సునీల్ ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. అతను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, భారతదేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులకు చాలాసార్లు ఫోన్ చేశాడు. భార్య తన కేసును ఉపసంహరించుకోవాలని ఆమె తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నించాడు. ఆమెను కూడా బతిమాలుకున్నాడు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతని భార్య తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు సునీల్కు జైలు శిక్ష ఖరారు చేసింది. (చదవండి: వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు) -
టెస్లా ఆటోపైలట్ మోడ్లో అనంతలోకాలకు..!
వాషింగ్టన్: ఆటోపైలట్ మోడ్లో ఉన్న టెస్లా కారు చెట్టును ఢీకొట్టిన సంఘటన అమెరికాలోని టెక్సాస్లో చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ సీటులో ఎవరూ లేరని తెలిపారు. డ్రైవర్ పక్క సీటులో, వెనుక సీటులో కూర్చొన్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. కారు ఆటోపైలట్ మోడ్లో వేగంగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారులో ఉన్న డ్రైవర్ సహాయక వ్యవస్థ సరిగ్గా పనిచేయక ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్లా కంపెనీ తన వెబ్ సెట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది. తమ వాహనాలు పూర్తిగా ఆటోపైలట్ కాదని, డ్రైవర్ పరవేక్షణ కచ్చితంగా ఉండాలని కంపెనీ తెలిపింది. కాగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తరుచుగా ప్రమాదానికి గురవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: రుజువైతే .. టెస్లా కంపెనీ మూసివేత..! -
వైరల్: ‘‘త్వరలో యుగాంతం.. ఇదే నిదర్శనం’’
వాషింగ్టన్: నాలుగు కంటే ఎక్కువ కాళ్లతో జన్మించిన జంతువులు, వేప చెట్టు నుంచి పాలు, కల్లు వంటి పదార్థాలు కారడం వంటి అసాధారణ దృశ్యాలు ఏవైనా మన చూట్టు కనిపిస్తే చాలు వెంటనే వినిపించే మాట యుగాంతం రాబోతుంది. ఇలాంటి వింతలు జరిగితే యుగాంతం తప్పదని.. దీని గురించి ఫలానా గ్రంథంలో చెప్పారని.. ఫలానా వ్యకి చెప్పారని ప్రచారం మొదలు పెడతారు. ఇప్పుడు యుగాంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే తాజాగా ఓ వింత జంతువు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీన్ని చూసిన వారంతా.. యుగాంతం రాబోతుంది అంటున్నారు. ఇంతకు ఆ జంతువు ఏంటి.. ఎక్కడ కనిపించింది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవండి. రెండు రోజుల క్రితం టెక్సాస్కు చెందని ఓ టిక్టాక్ యూజర్ ఎలుకను పోలిన ఓ వింత జంతువుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పటి నుంచి ఇది తెగ వైరలవుతుంది. ఇక వీడియోలో ఉన్న జీవి చూడ్డానికి ఎలుకలా ఉంది. దీనికి మూడు కళ్లు ఉన్నాయి. రెండు కళ్లు ఉండాల్సిన స్థానంలో ఉండగా.. వాటికి పైన మూడో కన్ను ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో ఈ జీవిని చూసిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ‘‘అమ్మో యుగాంతం రాబోతుంది.. అందుకే ఇలాంటి మూడు కళ్ల వింత జీవి కనిపించింది’’ అంటూ కామెంట్ చేశారు. కొందరు ధైర్యవంతులు మాత్రం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. ‘‘అది కన్ను కాదు.. అక్కడ వెంట్రుకలు రాలిపోవడం వల్ల చర్మం అలా మూడో కన్నుగా కనిపిస్తుంది’’ అని స్పష్టం చేశారు. మరి కొందరు ఇది హైబ్రీడ్ జాతికి చెందిన ఎలుక లేదా ఉడుత అయ్యి ఉంటుందని తెలిపారు. ఓ యూజర్ ఈ జంతువును మెలనిస్టిక్ బూడిద ఉడుత అని.. ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది అని తెలిపాడు. ఇక దాని మూడో కన్నుకు సంబంధించిన రహాస్యాన్ని కూడా వెల్లడించాడు సదరు యూజర్. సాధారణంగా పిల్లలకు జన్మనిచ్చే సమయంలో ఈ జీవి గూడు నిర్మించుకోవడం కోసం తన చర్మం నుంచి వెంట్రుకలని తీసుకుంటాయి. తర్వాత అది మళ్లీ తిరిగి పెరుగుతుంది అని తెలిపాడు. చదవండి: ఓ వైపు కాలిపోతున్నా.. మరోవైపు ఆపరేషన్ -
Tokyo Olympics: మేటి రెజ్లర్ జోర్డాన్ బరూస్కు షాక్
టెక్సాస్: వరుసగా మూడో ఒలింపిక్స్లో పాల్గొనాలని ఆశించిన అమెరికా మేటి రెజ్లర్ జోర్డాన్ బరూస్కు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అమెరికా రెజ్లింగ్ జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో 32 ఏళ్ల జోర్డాన్ ఓడిపోయాడు. కైల్ డేక్తో జరిగిన 74 కేజీల విభాగం రెండు ఫైనల్స్లో జోర్డాన్ ఓటమి చవిచూశాడు. తొలి ఫైనల్లో కైల్ 3–0తో... రెండో ఫైనల్లో 3–2తో జోర్డాన్ను ఓడించి 74 కేజీల విభాగంలో అమెరికా తరఫున టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో జోర్డాన్ 74 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 2011, 2013, 2015, 2017 ప్రపంచ చాంపియన్షిప్లలో పసిడి పతకాలు నెగ్గిన జోర్డాన్ 2014, 2018, 2019 ప్రపంచ చాంపియన్షిప్లలో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. ఓవరాల్గా తన కెరీర్లో 200 బౌట్లలో పోటీపడిన జోర్డాన్ 14సార్లు మాత్రమే పరాజయం పాలయ్యాడు. -
ఇండో అమెరికన్ మహిళకు అరుదైన గౌరవం..!
వాషింగ్టన్: టెక్సాస్ లోని ఓ స్కూలుకు భారత సంతతికి చెందిన మహిళ పేరును పెట్టనున్నారు. టెక్సాస్లో ఏర్పాటు చేయనున్న ఎలిమేంట్రీ స్కూల్ 53 కు ఇండో అమెరికన్, సామాజిక కార్యకర్త అయిన సోనాల్ భూచర్ పేరు పెట్టాలని ''ద ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్'' ( ఎఫ్బీఐఎస్డీ) బోర్డ్ ఏక గ్రీవంగా తీర్మానం చేసింది. కాగా ఈ స్కూలును జనవరి 2023లో రివర్ స్టోన్ కమ్యూనిటీలో ఏర్పాటు చేయనున్నారు. 2019లో సోనాల్ భూచర్(58) కాన్సర్తో మరణించింది. సోనాల్ భూచర్ ముంబై ప్రాంతానికి చెందినవారు. బొంబాయి యూనివర్శిటీలో ఫిజియో థెరపీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 1984లో స్వస్థలం వదిలి , ఆమె తన భర్తతో కలిసి హ్యూస్టన్ లో స్దిరపడ్డారు. సామాజిక కార్యకర్తగా మంచి పేరును గడించారు. అంతేకాకుండా విద్యార్ధుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.సోనాల్ భూచర్ ఎఫ్బీఐఎస్డీ బోర్డులో కొద్ది కాలం పనిచేశారు. ఆ సమయంలో సోనాల్ స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రాం, లెజిస్లేటివ్ అడ్వకేసీ ప్రోగ్రామ్, ఫోర్ట్ బెండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అన్యువల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, వాచ్ ఎ లైఫ్ స్టైల్ ప్రోగ్రాం, స్కాలర్షిప్ ప్రోగ్రాంతో సహా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అమెరికాకు వలస వచ్చిన వారికి ఈ విధంగా గౌరవం తెలపడం ఎంతో విశేషమని సోనాల్ మిత్రురాలు ఉష గంజు తెలిపింది. చదవండి: భారత సంతతి సాధికారతకు శుభరూపం -
మరుగున పడుతున్న లలిత గీతాలను 'తానా' పరిరక్షిస్తుంది
డల్లాస్, టెక్సాస్ - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో 'లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు' అనే అంశంపై ప్రముఖ గీత రచయితలు, గాయనీ గాయకులు వేదవతి ప్రభాకర్, డా. ఎంకే రాము, డా. ఓలేటి పార్వతీశం, డా. వడ్డేపల్లి కృష్ణ, కలగా క్రిష్ణమోహన్, వారణాసి నాగలక్ష్మి మొదలగువారు పాల్గొని వివిధ అంశాలను స్పృశించి అనేక మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు, గాయకులు, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు కొమండూరి రామాచారి లలిత గీతాలకు తాను ఇస్తున్న ప్రాముఖ్యాన్ని వివరిస్తూ తన శిక్షణలో తయారవుతున్న గాయనీ, గాయకులచే వేలకొద్దీ లలిత గీతాలను పాడిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయని వేదవతీ ప్రభాకర్ ‘లలిత గీతాల స్వర్ణయుగం’ అనే అంశంపై స్పందిస్తూ తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో కలసి పనిచేసిన సుప్రసిద్ధ రచయితలు, గాయనీ గాయకుల విశేష కృషిని వివరించారు. ప్రముఖ సంగీత దర్శకులు పాలగుమ్మి విశ్వనాథం రచించి, స్వరపరచిన 'అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ' అనే గీతాన్ని పాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ఎంకే రాము మాట్లాడుతూ.. తాను రచించిన అనేక వందల లలిత గీతాలను, ఎంతోమంది సినీ, సాహిత్య ప్రముఖులతో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. వివిధ ప్రసార మాధ్యమాలలో ముప్పైతొమ్మిది సంవత్సరాలకు పైగా విశేషానుభవం గడించిన సాహితీవేత్త, ప్రముఖ కవి డా. ఓలేటి పార్వతీశం దూరదర్శన్లో తొలినాళ్లలో లలిత గీతాలు ప్రసారం కావడం నుంచి, నేటివరకు సాగుతున్న పరిణామక్రమాన్ని ఆసక్తికరంగా వివరించారు. 'తెలుగులో లలిత గీతాలు' అనే అంశంపై ప్రామాణిక పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన సాహితీవేత్త లలితగీత, సినీగీత రచయిత, సినీదర్శకులు డా. వడ్డేపల్లి కృష్ణ దశాబ్దాల సినిమా చరిత్రలో లలిత గీతాలు సినీ గీతాలుగా రూపుదిద్దుకున్న వైనాన్ని సోదాహరణంగా వివరించారు. ఆకాశవాణితో ఐదు దశాబ్దాలకు పైగా అవినాభావ సంబంధం ఉన్న ఆకాశవాణి ఉత్తమ శ్రేణి కళాకారులు, ప్రముఖ గీతరచయిత, సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్ సంగీత ప్రపంచంలో దిగ్గజాల లాంటి మహానుభావులు ఎందరితోనో పని చేసిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ప్రముఖ చిత్రకారిణి, కథా, లలితగీత రచయిత్రి వారణాసి నాగలక్ష్మి లలితగీత సాహిత్య ప్రపంచంలో అలనాటి సుప్రసిద్ధ రచయితలతో పాటు వర్తమానంలో రాస్తున్న రచయితలు, వారి సాహిత్య కృషిని వివరించారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు కొమండూరి రామాచారి తన గాన ప్రస్థానం లలిత గీతాలతోనే ప్రారంభం అయిందని, అప్పటినుండి ఇప్పటి వరకు అనేక మంది సాహితీవేత్తల సృజనను స్వరపరచి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంతోమంది గాయనీ, గాయకుల గాత్రాల ద్వారా అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల మీద పాడించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామాచారి శిక్షణలో తమ గాత్రసౌరభానికి మెరుగులు దిద్దుకుంటున్న సరస్వతీ చైతన్య (వర్జీనియా), బేబీ శరణ్య వక్కలంక (వర్జీనియా), నాగ సాహితి (కాలిఫోర్నియా), శివాని సరస్వతుల (జర్మనీ), సౌజన్య గరిమెళ్ళ (నెదర్లాండ్స్), శరత్ చంద్ర ఏడిద (బహరేన్), స్వాతి ఎల్లూరి(బహరేన్), భారతదేశం నుంచి శ్రీ సౌమ్య వారణాసి, శరత్ సంతోష్, భరత్ రాజ్, జయరాం పైల, జీవీ ఆదిత్య, సాకేత్ కొమ్మాజోశ్యుల, శ్రియా మాధురి పోపూరి, మేఘనా నాయుడు,శ్రీపాద ఉప్పులూరి మొదలైనవారు తమ గాత్ర మాధుర్యంతో అందరినీ అలరించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 'సంగీత, సాహిత్య ప్రపంచంలో దిగ్గజాలైన బాలాంత్రపు రజనీకాంత రావు, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు,చిత్తరంజన్, మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వింజమూరి అనసూయ, వింజమూరి సీత, జగన్నాధాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, డా. సీ నారాయణ రెడ్డి, దాశరధి, బోయి భీమన్న, పాలగుమ్మి విశ్వనాధం, శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యులు, డా. గుంటూరు శేషంద్ర శర్మ, నేదునూరి కృష్ణమూర్తి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆచార్య తిరుమల, కోపెల్ల శివరాం, అఖ్మల్ హైదరాబాది లాంటి ప్రముఖల విశేష కృషిని, ఈ సభ ద్వారా స్మరించుకుని వారికి నివాళులర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లలిత గీతాల పునర్ వైభవానికి తానా సంస్థ కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, గాయనీ గాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ లలిత గీతాలు మరుగున పడుతున్న ఈ కాలంలో వాటి పరిరక్షణకు తానా చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. -
లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు!
టెక్సాస్: సాధారణంగా దొంగలు మెడలోని బంగారం.. చేతిలోని ఫోన్లు.. ఖరీదైన వస్తువులను చోరీ చేస్తుండంటాన్ని మనం చూసుంటాం. కానీ, మహిళలు దొంగతనం చేయటం చాలా అరుదు. అలాంటిది పట్టపగలు ఓ ఇంటి ముందు దొంగతనం చేయటం.. దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పని చేసుకుపోవటం సాధారణ విషయం కాదు. అమెరికాకు చెందిన ఓ మహిళ గుమ్మం ముందు పెట్టిన ఒక పార్శిల్ను చోరీ చేసి, దుస్తులు జారిపోతున్నా పట్టించుకోకుండా పరిగెత్తింది. వివరాలు.. కొద్దిరోజుల కిత్రం టెక్సాస్లో ఇంటి ముందు పార్శిల్ పెట్టి పెట్టి వెళ్లిపోయాడు పార్శిల్ సర్వీస్ అతను. ఆ పార్శిల్ను ఓ చోరీ చేయాలనుకొంది. పార్శిల్ను చూడగానే పరిగెత్తుకొంటూ వచ్చి రెప్పపాటులో దాన్ని తీసుకొని పారిపోయింది. ఈ క్రమంలో ఆమె వేసుకున్న టీషర్ట్ జారీపోయింది. అయితే, ఆ లేడీ దొంగ ఇదేమి పట్టించుకోలేదు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేశాడు. దీనిలో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తొంది. తొందరలోనే ఆ మహిళను పట్టుకుంటామని కౌంటీ ప్రెసింట్ కానిస్టేబుల్ అలన్ రాసెన్ తెలిపారు. దీనిపై పెద్దగా శిక్షలుండవని, కేవలం ఆ వస్తువు విలువను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఘరానా దొంగ’, ‘లేడి డాన్’, ‘దొంగతనం కూడా ఆర్ట్ ’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: సెక్స్డాల్తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు! -
ఈ అమ్మడుకు భయమే లేదు అసలు..!
వాషింగ్టన్ : మమూలుగా మనమందరం తేనె కావాలంటే కిరాణ షాపుకో, సూపర్ మార్కెటుకో పోయి తీసుకుంటాం. కానీ నేరుగా తేనెను తీయడానికి ప్రయత్నించమంటే అంతే సంగతులు..! సింపుల్గా మన షేప్ మారిపోయి ఆసుపత్రిలో తేలుతాం. నేరుగా తేనెను తీయడానికి ప్రయత్నిస్తే తేనెటీగలు ఎదురుదాడికి పాల్పడతాయి. అందుకే జనం తేనె తుట్టెల జోలికి పోవాలంటే చచ్చేంత భయపడుతుంటారు. మహిళలైతే మరీను.. టెక్సాస్కు చెందిన ఎరికా థాంప్సన్ అనే మహిళ మాత్రం అలా కాదు. తేనెటీగల పెంపకం దారి అయినా ఈమె తేనె తుట్టెను పద్ధతిగా ఏ భయం లేకుండా చేతులతో తీస్తుంది. కొద్దిరోజుల క్రితం టెక్సాస్లోని ఓ ఇంటిలో రెండు సంవత్సరాలుగా దాగి ఉన్న తేనె తుట్టెను చేత్తో తీసివేసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఎరికా ఎలాంటి సేఫ్టీ లేకుండా తేనెటీగలను తుట్టెనుంచి వేరు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 1.5 మిలియన్ల మంది వీక్షించారు. వీడియో చూసిన వారు ఔరా..! అంటున్నారు. అంతేకాకుండా మహిళను వండర్వుమన్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. -
టెక్సాస్పై మంచు దుప్పటి
డల్లాస్: అమెరికా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా టెక్సాస్ మంచు పంజా బారినపడి గజగజలాడుతోంది. తీవ్రంగా వీస్తున్న మంచు తుఫాను గాలుల ధాటికి టెక్సాస్లో పవర్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పలు విమానాలను రద్దు చేశారు. డల్లాస్, హూస్టన్ నగరాలల్లో ఉష్ణోగ్రతలు మైనస్ల్లోకి పడిపోయాయి. హిమపాతం సమయంలో ఇతర ప్రమాదాలు నివారించేందుకు టెక్సాస్ విద్యుత్ శాఖ(ఎర్కాట్) పలు ప్రాంతాల్లో కరెంటు కోతలను ఆరంభించింది. ప్రజలు సురక్షితంగా ఉండడమే ప్రధానమని, ఈ సమయంలో విద్యుత్ వాడకం తగ్గించేందుకే కోతలు విధిస్తున్నామని తెలిపింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా ఉండేందుకే ఈ కోతలని తెలిపింది. కోతల కారణంగా దాదాపు 23 లక్షల మంది ప్రభావితమయ్యారని వెబ్సైట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల్లో కరెంటు కోతలు, ట్రాఫిక్ కష్టాలపై అధికారులు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 254 కౌంటీలకు గవర్నర్ గ్రెగ్ అబాట్ డిజాస్టర్ డిక్లరేషన్ జారీ చేశారు. ఎక్కడికక్కడ నేషనల్ గార్డ్ యూనిట్లను సమాయత్తం చేశారు. టెక్సాస్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ ఆదివారం రాత్రి ప్రకటించారు. -
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
-
ఒకదానికొకటి వంద కార్లు ఢీ
టెక్సాస్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి కనీవినీ ఎరగని రీతిలో ఈ ప్రమాదానికి దారితీసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్ఎక్స్కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్ను ఢీకొని ఆగిపోయింది. వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
మరోసారి పేలిన స్పేస్ఎక్స్ స్టార్షిప్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ తన మార్స్ మిషన్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ "స్సేస్ ఎక్స్" హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్షిప్ నమూనా రూపొందించారు. ఈ నమూనాలో భాగంగా స్టార్షిప్ రాకెట్ లను పరీక్షిస్తున్నారు. తాజాగా టెక్సాస్లోని బోకా చికా నుంచి మంగళవారం ప్రయోగించిన స్పేస్ఎక్స్ స్టార్షిప్ ఎస్ఎన్9 రాకెట్ ల్యాండ్ అవుతుండగా పేలిపోయింది. ఇంతక ముందు కూడా డిసెంబర్ నెలలో ఎస్ఎన్8 స్టార్షిప్ రాకెట్ కూడా పేలిపోయింది. టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్షిప్ కక్ష్యలోకి అధిరోహించి కిందకు భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో 6 నిమిషాల 26 సెకన్ల వ్యవధి తర్వాత పేలిపోయింది.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) Live feed of Starship SN9 flight test → https://t.co/Hs5C53qBxb https://t.co/ioM0D5J91I — SpaceX (@SpaceX) February 2, 2021 స్సేస్ ఎక్స్ యొక్క స్టార్షిప్ రెండు రాకెట్ లు వరుసగా పేలిపోయాయి. ఎలాన్ మస్క్ స్థాపించిన ఈ స్పేస్ ఎక్స్ సంస్థ.. భవిష్యత్ రోజుల్లో మార్స్ మిషన్, అంతరిక్షంలోకి మానవులను, 100 టన్నుల సరుకులను తీసుకెళ్ళడానికి అభివృద్ధి చేస్తున్న హెవీ-లిఫ్ట్ రాకెట్ నమూనా ఇది. సెల్ఫ్ గైడెడ్, 16 అంతస్తుల ఎత్తైన రాకెట్.. ప్రారంభంలో స్టార్షిప్ రాకెట్ ఎలాంటి సమస్య లేకుండా లాంచ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లింది. 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఈ వ్యోమనౌక కొద్దిసేపు అది గాలిలోనే ఉండిపోయింది. ఈ సమయంలో దాని ఇంజిన్లను ఆపివేసి, ఏరోడైనమిక్ పద్దతిలో భూమిపైకి తిరిగి దించడానికి "బెల్లీ-ఫ్లాప్" ట్రిక్ ను అమలు చేశారు. తిరిగి కిందకు వచ్చేటప్పుడు నేరుగా దించడానికి ప్రయత్నించినప్పుడు సమస్యలు మొదలయ్యాయి. కుప్పకూలే సమయంలో రాకెట్లో వేగం పెరిగినట్లు ఫుటేజీ ద్వారా అర్ధమవుతున్నది. ఈ రాకెట్ను స్టెయిన్లెస్ స్టీల్తో తయారుచేశారు. -
మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్
అమెరికా: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మన అరచేతిలోకి వచ్చిందన్న మాట నిజం. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టెక్నాలజీ ఎంతగానో మేలు చేసింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ కారణంగానే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. అలాగే తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన మాత్రం టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపించింది. టెక్నాలజీలో స్మార్ట్వాచ్లు ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి. ఇక యాపిల్ వాచ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి) తాజాగా అమెరికాలోని టెక్సాస్లో కిడ్నాపర్ల చెర నుంచి మహిళను రక్షించడంలో యాపిల్ స్మార్ట్వాచ్ కీలక పాత్ర పోషించింది. టెక్సాస్లోని సెల్మాప్రాంతానికి చెందిన ఒక మహిళా తాను ఆపదలో ఉన్నానంటూ తన కూతురికి యాపిల్ వాచ్ ద్వారా SOS కాల్ చేసింది. అయితే ఆమె ఉన్న ప్రదేశం గురుంచి తెలుసుకునే లోపే వాచ్ నుంచి కనెక్షన్ కట్ అయ్యింది. కిడ్నాప్ చేసే సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఈ కాల్ కట్ అయ్యింది. కానీ, ఆ మహిళా చేతికి ఉన్న యాపిల్ స్మార్ట్వాచ్ పనిచేస్తుంది.(చదవండి: ఏసీలు, ఫ్రిజ్లు కొనేవారికి షాక్!) దింతో వెంటనే తన కూతురు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. యాపిల్ స్మార్ట్వాచ్ SOS కాల్ డిస్కనెక్ట్ అయినప్పటికీ పోలీసులు ఎమర్జెన్సీ సెల్యూలార్ పింగ్ టెక్నాలజీ సాయంతో కిడ్నాప్కు గురైన మహిళను ట్రాక్ చేశారు. హయత్ ప్లేస్ హోటల్లోని ఈస్ట్ సోంటెర్రా బ్లవ్డిలోని పార్కింగ్ స్థలంలో కిడ్నాప్ గురైన మహిళా ఒక వాహనంలో కనిపించింది. వెంటనే పోలీసులు బాధిత మహిళను రక్షించి కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆ మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఆపిల్ వాచ్ ఇలా భయంకరమైన పరిస్థితుల నుంచి వ్యక్తులను కాపాడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం 25 ఏళ్ల వ్యక్తిని గుండెపోటు నుంచి రక్షించింది. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో ప్రాణాపాయం నుంచి ఒక వృద్ధుడిని కాపాడింది. -
లేడీ డాక్టర్ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన వైద్యుడు ఓ మహిళా వైద్యురాలిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్సాస్లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నపిల్లల వైద్యుడు భరత్ కుమార్ నారుమంచి(43)కు క్యాన్సర్ సోకినట్లు కొద్దిరోజుల క్రితం నిర్థారణ అయింది. అతడు ఎక్కువ రోజులు బతకడని కూడా వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అప్పటినుంచి మానసికంగా కృంగిపోయాడు. (జంట హత్యల కలకం.. రూ. 500లు మాత్రమే..) మంగళవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గన్స్తో తను పనిచేసే ఆస్టిన్లోని ‘‘ చిల్డ్రన్స్ మెడికల్ గ్రూపు’’ ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. తనతో పాటు పనిచేసే ఓ వైద్యురాలు క్యాథరిన్ లిండ్లే డాట్సన్తో పాటు మరికొంతమందిని గన్స్తో బెదిరించి దిగ్బంధించాడు. దాదాపు 6 గంటల పాటు ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాథరిన్ను తప్ప మిగిలిన వారిని వదిలేసిన అతడు ఆమెను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్య చేయటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
స్టార్ షిప్ ఇంజిన్లను పరీక్షించిన స్పేస్ఎక్స్
టెక్సాస్: ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్ట్ స్పేస్ఎక్స్ స్టార్ షిప్ ప్రొటోటైప్ సీరియల్ నంబర్ 9(ఎస్ఎన్ 9) రాకెట్ యొక్క మూడు రాప్టర్ ఇంజిన్లను సంస్థ 2 సెకన్ల వరకు మండించింది. ఈ భారీ రాకెట్ ను నేడు(జనవరి 8) గగనతలంలోకి ప్రయోగించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. టెక్సాస్లోని స్పేస్ఎక్స్ యొక్క బోకా చికా టెస్టింగ్ ఫెసిలిటీ లాంచ్ ప్యాడ్లో ఎస్ఎన్ 9 యొక్క రాప్టర్ ఇంజిన్లను మండించింది. గగనతలం ప్రస్తుతం క్లియర్ గా లేదు అని సమాచారం. ఒకవేల నేడు ప్రయోగం సాధ్యం కాకపోతే శని లేదా ఆదివారాల్లో ప్రయోగించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా స్పేస్ఎక్స్ తన స్టార్షిప్ డిజైన్ను పరీక్షిస్తుంది. గత నెలలో ప్రయోగించిన స్టార్ షిప్ ఎస్ఎన్8 విఫలమైన సంగతి మనకు తెలిసిందే. సుమారు 12.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిన ఎస్ఎన్8 ల్యాండింగ్ సమయంలో పేలిపోయింది. ఈ ప్రయోగం పట్ల స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రయోగం విఫలమైన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు, కావాల్సిన సమాచారాన్ని సేకరించింది అని ఎలన్ మస్క్ పేర్కొన్నాడు.(చదవండి: ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్!) -
అమెరికాలో మానుకోట వాసి మృతి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గొట్టం చంద్రపాల్రెడ్డి(26) అమెరికాలో మృతిచెందారు. ఈనెల 23న అమెరికాలోని టెక్సాస్లో గుండెపోటుతో మృతిచెందగా ఆయన తల్లిదండ్రులకు తాజాగా సమాచారం అందింది. దీంతో చంద్రపాల్రెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్రెడ్డి–శోభ తమ కుమారుడి మృతదేహాన్ని కడచూపు కోసం స్వస్థలానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు విన్నవించేందుకు సోమవారం హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. -
లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ ఆధ్వరంలో ఫుడ్ డ్రైవ్
కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకొచ్చింది. కోవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చిన్నచిన్న వ్యాపారాలు మూతబడ్డాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుంటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అలాంటివారికి రోజుగడవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా హోమ్లెస్, జాబ్ లెస్ వారి కుటుంబాల కోసం లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ Food Drive - 2020ను నిర్వహించారు. ఆస్టిన్, టెక్సాస్, అమెరికాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాస భారతీయులు పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డిలు తమకు చేతనైనంత సహాయం చేస్తూ హ్యూమన్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. తమ సంస్థ సేవలు కేవలం అమెరికాకే పరిమితం అవ్వకుండా, ఇండియా, ఇతర దేశాలలో కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18, 2020న మూడు లక్షల రూపాయల(3,00,000) విలువ చేసే ఆహార పదార్థాలను "సెంట్రల్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు" వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్స్ పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డి మరియు అడ్వైసరి కౌన్సిల్ మెంబెర్స్, శ్రీకాంత్ రెడ్డి చేగిరెడ్డి, వినోద్ రెడ్డి దువ్వూరు, సతీష్ యెన్న, దుశ్యంత్ రెడ్డి వంగల, శివ దుర్భకుల తదితరులు హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించడానికి సహాయసహకారాలందించిన దాతలకి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు రానున్న సంవత్సరంలో ప్రణాళికతో అందరిని కలుపుకొంటూ సేవలందించడమే తమ ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ ఫౌండర్స్ తెలియజేశారు. -
భర్తపై ఎనలేని ప్రేమ.. 41 ఏళ్లుగా
టెక్సాస్ : నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ భార్య. తన భర్త అన్న చిన్న మాటను ఆలోచనగా మలిచి 41 ఏళ్లుగా ప్రేమను లంచ్ రూపంలో పంచిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్కు చెందిన ట్రేసీ హౌవెల్కు క్లిపొర్డ్ అనే వ్యక్తితో 41ఏళ్ల క్రితం వివాహం అయింది. మొదటి రోజు నుంచి ఆఫీసుకు వెళ్లే తన భర్తకు లంచ్ బాక్స్ తయారుచేసేది. ఓ రోజు భర్తతో పాటు ఆఫీసుకు వెళ్లిన ఆమె అతడితో కలిసి భోజనం చేసింది. ఆ తర్వాత ఆమె భర్త ‘మనం ప్రేమించే వారితో కలిసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది’ అని అన్నాడు. దీంతో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ( వైరల్: నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి..) ఆ తర్వాతినుంచి అతడి కోసం లంచ్ బాక్స్ తయారుచేసిన తర్వాత అందులోంచి ఓ కొంత ఆమె తినేది. ఎవరో తన ఆహారాన్ని తిన్నారని భర్త చెప్పగా.. ‘నీతో కలిసి భోజనం చేయలేకపోతున్నందుకు నేనే అందులోంచి కొంత తిన్నాను’ అని అంది. అతడికి విషయం అర్థమైంది. అలా 41 ఏళ్లుగా చేస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్ వేదికగా తన అనుభవాలను పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ( ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!)