కాటికాపరుల సమస్యలపై 11న మహాధర్నా | - | Sakshi
Sakshi News home page

కాటికాపరుల సమస్యలపై 11న మహాధర్నా

Published Sat, Mar 8 2025 2:25 AM | Last Updated on Sat, Mar 8 2025 2:21 AM

కాటికాపరుల సమస్యలపై 11న మహాధర్నా

కాటికాపరుల సమస్యలపై 11న మహాధర్నా

కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శ్మశానంలో గుంతలు తీసి, శవాలను పూడ్చి, కాల్చే కాటికాపరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 11న ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో ప్రదర్శన, మహాధర్నాను నిర్వహించనున్నామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి చెప్పారు. విజయవాడ నగరంలోని సున్నపుబట్టీల సెంటర్‌లో ఉన్న పూలే, అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాల్యాద్రి మాట్లాడుతూ 11న రైల్వేస్టేషన్‌ నుంచి అలంకార్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన, అనంతరం ధర్నా చౌక్‌లో ధర్నా జరుగుతుందని చెప్పారు. ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాన్ని సంఘం సభ్యులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె నటరాజ్‌, సహాయ కార్యదర్శి జి.క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement