‘అక్రమంగా గుగ్గిలం చెట్లు తరలింపు’ | - | Sakshi
Sakshi News home page

‘అక్రమంగా గుగ్గిలం చెట్లు తరలింపు’

Published Thu, Apr 10 2025 12:35 AM | Last Updated on Thu, Apr 10 2025 12:35 AM

‘అక్రమంగా గుగ్గిలం చెట్లు తరలింపు’

‘అక్రమంగా గుగ్గిలం చెట్లు తరలింపు’

జయపురం: సబ్‌ డివిజన్‌ పరిధి బొరిగుమ్మ సమితి బొడొనాయికగుడ అటవీ ప్రాంతంలో విలువైన గుగ్గిలం చెట్లను కొంతమంది ఇతర రాష్ట్రాలకు అమ్మేందుకు తరలిస్తున్నారని ఆ ప్రాంత అటవీ సురక్ష కమిటీ కార్యదర్శి గోపీనాథ్‌ గదబ ఆరోపించారు. ఈ మేరకు జయపురం అటవీ డివిజన్‌ అధికారి ప్రతాప్‌ బెహరాను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆరుగురు వ్యక్తులు 5 విలువైన గుగ్గిలం చెట్లను కొట్టి అమ్మేశారని ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫిర్యాదుదారుల్లో నకుల్‌ గదబ, మనోహర గదబ, లక్ష్మణ గదబ, సోను గదబ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement