అంతన్నాడు..ఇంతన్నాడు..! | Sakshi
Sakshi News home page

అంతన్నాడు..ఇంతన్నాడు..!

Published Thu, May 9 2024 5:05 AM

అంతన్

ప్రజల కష్టాలు తీరుస్తా..స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తా..రైతులు, డ్వాక్రా మహిళలకు అప్పు లేకుండా చేస్తా..బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చేలా చేస్తా..నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా..లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా..ఈ హామీలన్నీ వింటే ఠక్కున గుర్తొచ్చేది మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. సరికదా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేసేలా చేసి నానా ఇక్కట్లకు గురిచేసిన పాలనను ఇంకా మేం మర్చిపోలేదని, మరోసారి ఆ పాలన వద్దు బాబూ అంటూ రాష్ట్రప్రజలు ఉలిక్కిపడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన చంద్రబాబు ప్రభుత్వ పాలన ఇప్పటికీ పీడకలలా వస్తూనే ఉందని వాపోతున్నారు.

బాబుపై నమ్మకం లేదు..

చంద్రబాబు ఏమి చెప్పినా నమ్మడం సాధ్యం కాదు. అధికారంలోకి వస్తే పింఛ న్‌ రూ.4 వేలు అంటున్నా డు. దాని అమలు కోసం అనేక నిబంధనలు పెట్టి ఉన్న పెన్షన్లు ఎన్ని ఊడుస్తాడో తెలియదు. సీఎం జగన్‌ రూ.3 వేలు ఇస్తున్నా క్రమం తప్పకుండా ఠంచన్‌గా ఒకటో తేదీనే వలంటీర్‌ ఇంటి తలుపుతట్టి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరో రూ.500 పెంచుతానని చెప్పాడు. జగన్‌ చెప్పాడంటే..చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది.

–బి. రాము, పింఛన్‌ లబ్ధిదారు,

పార్వతీపురం పట్టణం

పార్వతీపురంటౌన్‌:

ష్టారాజ్యంగా హామీలిచ్చేసి, గద్దెనెక్కిన తర్వాత నమ్మి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను నిలువునా ముంచేయడం ఎలా అన్న విషయం ఆయన గత పాలన చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. పొరపాటున అధికారంలోకి వస్తే. ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచేసి, అన్నీ అమలు చేశానని బుకాయించడం చంద్రబాబుకు తప్ప మరెవరికీ తెలియదేమో! అందుకే బాబు నోటి నుంచి ఏది వస్తుందో అది చేయరు అన్న విషయం ప్రజల మదిలో నాటుకుపోయింది.

నిన్నెలా నమ్మాలి బాబూ..!

ఇప్పటికే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ పార్వతీపురం మన్యం జిల్లాలో పలు చోట్ల సభలు నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అంటూ ఊదరగొట్టారు. అయితే, వారి మాటలు ఎవరూ నమ్మడం లేదన్న విషయం తండ్రీకొడుకులకు బోధపడింది. ప్రస్తుతం ప్రభుత్వం పెన్షన్‌ రూ.3 వేలు ఇస్తోంది. తాను రూ.నాలుగు వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నా కనీసం దానిపై ప్రజల్లో చర్చ జరగడం లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలతో టీడీపీ అభ్యర్థులు జిల్లాల్లో ఇంటింటికీ తిరుగుతున్నా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. పోలింగ్‌కు మరో నాలుగు రోజులే గడువు ఉండడం, బాబు హామీలను ప్రజలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.

గుణపాఠం చెప్పినా అదే తీరు

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్క దాన్ని కూడా సరిగ్గా నెరవేర్చిన పాపాన లేదు, దీంతోనే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టి ‘నిన్ను నమ్మం బాబు’ అని స్పష్టం చేశారు. అయినా, గతం మరిచి నేడు మళ్లీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూసి జనం నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

జిల్లావ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత

పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలను భయాందోళనకు గురి చేసైనా ఎన్నికల్లో గట్టెక్కాలనే దురుద్దేశంతో, బాబు ఇచ్చిన ఆదేశాలతో పచ్చమూకలు దాడులకు దిగుతున్నాయి. మరికొన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే, టీడీపీ కుయుక్తులను గమనిస్తున్న ప్రజలు మాత్రం ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దిమ్మతిరిగే సమాధానం చెబుతారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

గతాన్ని మర్చిపోలేం

కొత్త హామీలు నమ్మలేం

చంద్రబాబు గత పరిపాలనను

గుర్తు చేసుకుంటున్న ప్రజలు

అధికారంలోకి వస్తే ఉన్న పథకాలను ఎత్తేస్తారని ఆందోళన

ఇప్పటికే కక్షగట్టి పింఛన్లు నిలిపేశారని అవ్వాతాతల ఆగ్రహం

బాబును నమ్మలేమంటున్న మహిళలు

ప్రజల్లో వ్యతిరేకత గమనించి ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ

ఉన్నవే రాకుండా చేసి..కొత్తగా ఏమిస్తారు?

జిల్లాలో 1.48 లక్షల మంది వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారు. ప్రతినెలా 1వ తేదీనే వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి డబ్బు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పెన్షన్లు ఇంటికి రానివ్వకుండా చేశారు. ఈ విషయంపై ఇప్పటికే వృద్ధులు, సామాన్య ప్రజానీకం తీవ్రంగా మండిపడుతున్నారు. పెన్షనర్లకు ఎంతో స్వాంతన చేకూరుస్తున్న వలంటీర్‌ వ్యవస్థనే ఆపేయించిన బాబు..కొత్తగా రూ.4 వేలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్‌ పెంచుతానన్న హామీతో కరపత్రాలు ఇస్తుంటే వాటిని వెంటనే చెత్తబుట్టలో విసిరేస్తున్నారు.

జన్మభూమి కమిటీల పాలన వద్దే వద్దు

టీడీపీకి పొరపాటున ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు కొని తెచ్చుకున్న ట్టే. అప్పట్లో ఏ పథకం కావాలన్నా ఆ కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చే ది. ఆ సమయంలో వారు ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే భయమేస్తోంది. చంద్రబాబు మానస పుత్రికగా ఏర్పాటైన ఈ కమిటీలు పేద ల రక్తాన్ని పీల్చాయి. ఆ పాలన మళ్లీ కావాలని కోరుకోవడం లేదు. –పి.రాముడమ్మ,

పింఛన్‌ లబ్ధిదారు, పార్వతీపురం పట్టణం

పీడకలలా జన్మభూమి కమిటీలు పెట్టిన కష్టాలు

2014–19 మధ్య కాలంలో జన్మభూమి కమిటీలను తెచ్చి పల్లెల్లో నిప్పులు పోశారని, ఏ ఒక్కరికీ లబ్ధి కలగకుండా చేశారని గ్రామీణులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాబు వచ్చి జన్మభూమి కమిటీలు ప్రవేశపెడితే తమ బతుకులు ఎంత దుర్భరంగా మారతాయోనని పేదప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేకుండా నేరుగా వలంటీర్లే ఇంటికొచ్చి పథకాల గురించి చెప్పి, అర్హులైన వారికి లబ్ధి చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉన్న ఊరిలోకే పాలన వచ్చింది. కానీ, బాబు వస్తే ఇవన్నీ అమలు చేయరేమోనన్న సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

బాబుకు బుద్ధి చెబుదాం

ప్రతినెలా వలంటీర్‌ ఇంటి కి వచ్చి నాకు రూ.3 వేలు పింఛన్‌ ఇచ్చేవాడు. చంద్రబాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించాడంట. దీంతో రెండు నెలలుగా పింఛన్‌ సరిగా అందలేదు. పేదలను ఇంత ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఆయన మాటలను నమ్మితే ప్రజలు మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లే.

–జె.ఎల్లయ్య, పింఛన్‌ లబ్ధిదారు, పార్వతీపురం పట్టణం

అంతన్నాడు..ఇంతన్నాడు..!
1/3

అంతన్నాడు..ఇంతన్నాడు..!

అంతన్నాడు..ఇంతన్నాడు..!
2/3

అంతన్నాడు..ఇంతన్నాడు..!

అంతన్నాడు..ఇంతన్నాడు..!
3/3

అంతన్నాడు..ఇంతన్నాడు..!

Advertisement
 
Advertisement