ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి | Bus yatra sabha should be successful on lines of siddam sabha: YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి

Published Tue, Mar 19 2024 2:16 AM | Last Updated on Thu, Mar 21 2024 4:10 PM

Bus yatra sabha should be successful on lines of siddam sabha: YS Jaganmohan Reddy - Sakshi

ఎన్నికల షెడ్యూల్‌తో అభ్యర్థులకు సరిపడా సమయం 

అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి

సిద్ధం సభల తరహాలో బస్సు యాత్ర సభలు విజయవంతం కావాలి

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు సద్విని­యోగం చేసుకోవాలని సూచించారు. సోమ­వారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వ­య­కర్తల­తో సీఎం జగన్‌ సమావేశ­మయ్యారు. మే 13న ఎన్ని­కల పోలింగ్‌ జరుగుతున్నందున అభ్యర్థులకు సరి­పడా సమయం ఉందన్నారు.

ఈ సమయాన్ని చక్కగా విని­యోగించుకోవాలన్నారు. తమ నియో­జ­­క­వర్గపరిధిలోని ప్రతి గ్రామ సచివాల­యాన్ని సందర్శించి.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేలా అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. దీనిపై అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయాలని ప్రాంతీయ సమన్వ­యకర్త­లను ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్ల­మెంటు నియో­జ­కవర్గాల్లో మార్పులు చేశామన్నారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగప­డుతుందన్నారు.

ఆయా నియోజక­వర్గా­ల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరి­చి, వారిని ఏకతాటి­పైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని లక్ష్య నిర్దేశం చేశారు. ఈ దిశగా కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని, ఘన విజయాలు నమో­దు చేయాలని పిలు­పు­నిచ్చారు. ప్రాంతీయ సమన్వ­యకర్తలు ఎప్పటి­కప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలు­సు­కుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిల­వాలని సూచించారు. బస్సు యాత్ర­ను విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. బస్సు యాత్రలో భాగంగా జరిగే సభలు.. సిద్ధం సభల తరహాలోనే చరిత్రాత్మకం కావాలని దిశా నిర్దేశం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement