ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి | Bus yatra sabha should be successful on lines of siddam sabha: YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి

Published Tue, Mar 19 2024 2:16 AM | Last Updated on Thu, Mar 21 2024 4:10 PM

Bus yatra sabha should be successful on lines of siddam sabha: YS Jaganmohan Reddy - Sakshi

ఎన్నికల షెడ్యూల్‌తో అభ్యర్థులకు సరిపడా సమయం 

అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి

సిద్ధం సభల తరహాలో బస్సు యాత్ర సభలు విజయవంతం కావాలి

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు సద్విని­యోగం చేసుకోవాలని సూచించారు. సోమ­వారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వ­య­కర్తల­తో సీఎం జగన్‌ సమావేశ­మయ్యారు. మే 13న ఎన్ని­కల పోలింగ్‌ జరుగుతున్నందున అభ్యర్థులకు సరి­పడా సమయం ఉందన్నారు.

ఈ సమయాన్ని చక్కగా విని­యోగించుకోవాలన్నారు. తమ నియో­జ­­క­వర్గపరిధిలోని ప్రతి గ్రామ సచివాల­యాన్ని సందర్శించి.. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేలా అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. దీనిపై అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయాలని ప్రాంతీయ సమన్వ­యకర్త­లను ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్ల­మెంటు నియో­జ­కవర్గాల్లో మార్పులు చేశామన్నారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగప­డుతుందన్నారు.

ఆయా నియోజక­వర్గా­ల్లోని పార్టీ శ్రేణులు, నాయకత్వాన్ని సంఘటిత పరి­చి, వారిని ఏకతాటి­పైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలని లక్ష్య నిర్దేశం చేశారు. ఈ దిశగా కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని, ఘన విజయాలు నమో­దు చేయాలని పిలు­పు­నిచ్చారు. ప్రాంతీయ సమన్వ­యకర్తలు ఎప్పటి­కప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలు­సు­కుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిల­వాలని సూచించారు. బస్సు యాత్ర­ను విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. బస్సు యాత్రలో భాగంగా జరిగే సభలు.. సిద్ధం సభల తరహాలోనే చరిత్రాత్మకం కావాలని దిశా నిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement