bus yatra
-
ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం ముగిసింది. గత నెల 24న ప్రారంభమైన బస్సు యాత్ర 16 రోజులపాటు 13 లోక్సభ సెగ్మెంట్ల మీదుగా సాగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల మినహా రాష్ట్రంలోని మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. మెదక్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టిపెట్టేలా ఆయన రోడ్ షోలు జరిగాయి. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చివరి రోజు శుక్రవారం కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్... సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన రోడ్ షోలలో పాల్గొని ప్రచారాన్ని ముగించారు. చివరి రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ అనంతరం ప్రచారాన్ని ముగించాలని భావించారు. అయితే వర్ష సూచన నేపథ్యంలో సిద్దిపేటలోనూ కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఓవైపు బస్సు యాత్ర ముగియడం, మరోవైపు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో కేసీఆర్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈసీ కొరడాతో 48 గంటలపాటు ప్రచారానికి దూరం..బస్సు యాత్ర ఎనిమిదో రోజు మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలోనే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5న సిరిసిల్లలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో మే ఒకటో తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3న రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రచార షెడ్యూల్లో కొద్దిపాటి సవరణలు చేసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ విధానాలపై వాక్బాణాలుపక్షం రోజులకుపైగా సాగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం రేవంత్ భాష, పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రధానిగా మోదీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలో కేసీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.ప్రచారంలో విశ్రమించని కేటీఆర్, హరీశ్బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్, నాగర్కర్నూలు తదితర లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. అలాగే హరీశ్రావు మెదక్, జహీరాబాద్, కరీంనగర్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా, బస్సు యాత్రకు భారీగా జనం తరలివచ్చారని, బీఆర్ఎస్ పట్ల ఓటరు సానుకూలతకు ఇది సంకేతమని పార్టీ భావిస్తోంది. కనీసం 8 నుంచి 12 సీట్లలో విజయం సాధిస్తామనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. -
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
-
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
-
ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్
-
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
-
ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చెయ్.. రాజీనామా ఇస్తా..!
సాక్షి,సిద్దిపేట/చండూరు/అక్కన్నపేట(హుస్నాబాద్): ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. హామీలను అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేస్తారా?’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ చేశారు. రేవంత్రెడ్డి రాజీనామా పత్రాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి పంపించాలని... పది నిమిషాల్లో నేనూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపిస్తానని..ఇందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో, నల్లగొండలో, అదే జిల్లా చండూరులో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చోగానే రైతులకు రుణమాఫీ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రుణమాఫీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయను. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు.వారిది ఢిల్లీకి గులాంగిరీ!రేవంత్రెడ్డి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. ఏం చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. తోడు పెళ్లికొడుకులా ఉప ముఖ్యమంత్రిని వెంట తీసుకుని ఇప్పటివరకు 20 ట్రిప్పులు పోయారు. అదే కేసీఆర్ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా సేవలు అందించారు. స్వార్థం కోసం కొందరు నాయకులు పార్టీ మారొచ్చు కానీ, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు కేసీఆర్తో ఉన్నారు. అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. హామీలు అమలు చేయని కాంగ్రెస్ను పాతాళానికి తొక్కాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి’’ అని హరీశ్రావు పిలుపునిచ్చారు.కేసీఆర్ యాత్రను చూసి వణుకుకేసీఆర్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. చీకటి ఒప్పందంతో చెరో 8 సీట్లు పంచుకున్నాయి. ఒకరేమో దేవుడిని చూపించి, మరొకరు దేవుడి మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ప్రధాని ఆరోపిస్తున్నారు. బీజేపీతో రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్రెడ్డి అంటున్నారు. అవేమీ జరగబోవు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. మేం వాళ్ల ఆటలు సాగనివ్వబోం. -
ఎన్టీఆర్ మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేసీఆర్
-
కేంద్రంలో సంకీర్ణం.. బీఆర్ఎస్ కీలకం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కేంద్రంలో బీజేపీ గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి 400, 370 సీట్లు ఏమీ వస్తలేవు. 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని యావత్ ప్రపంచం కోడై కూస్తోంది. రాష్ట్రంలో ఇవ్వాళ ఆరో రోజు యాత్ర చేశా. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 12 పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ గెలవబోతోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా మారనుంది. మీరు నామా నాగేశ్వరరావును ఎంపీగా గెలిపిస్తే సంకీర్ణంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. నరేంద్రమోదీ దాడి నుంచి, చేతకాని, చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరిని రక్షించుకోవాలన్నా.. కృష్ణాను రక్షించుకోవాలన్నా.. మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా.. హక్కులు సాధించుకోవాలన్నా. బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతుంది..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కేసీఆర్ బస్సుయాత్ర సోమవారం వరంగల్ నుంచి తిరుమలాయపాలెం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం నగరంలో కాల్వొడ్డు నుంచి మయూరి సెంటర్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. జెడ్పీ సెంటర్లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీజేపీ వాళ్లకి తెలంగాణ సమస్యలు పట్టవు ‘తెలంగాణలో పంటలు పంజాబ్ను తలదన్నే పరిస్థితికి తీసుకెళ్లాం. 3.50 కోట్ల టన్నుల వడ్లు పండించాం. కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం కొనమని మొండికేసింది. నామా నాగేశ్వరరావు నాయకత్వంలో నాడు ఎంపీలు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి ధాన్యం కొనమని అడిగారు. యాసంగిలో కొంచెం నూక అవుతుందని మంత్రికి చెప్పారు. అయితే ఆ మెదడు తక్కువ మంత్రి.. మీ తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అని చెప్పారు. దీనిని నిరసిస్తూ మొత్తం తెలంగాణ కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. అప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ కానీ, కాంగ్రెస్ ఎంపీ కానీ నోరు కూడా తెరవలేదు. తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ సమస్యలు వారికి పట్టవు..’అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? ‘గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లు ఇస్తామని మోదీ క్లియర్గా చెబుతుండు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉన్నడు. ముగ్గురు ఎంపీలున్నరు. బీజేపీ ఉంది. వీళ్లేం చేస్తున్నరు. ఒక్కరైనా మాట్లాడుతున్నరా? రాష్ట్రాన్ని ఎండగడతామని మోదీ మాట్లాడుతుంటే వీరికి ఉలుకు, పలుకు లేదు. ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్లో కూడా మోదీ ఇదే ప్రతిపాదన తెచ్చారు. కానీ మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాక ..మా వాటా మాకు అక్కడ పెట్టేదాక ఎట్టి పరిస్థితుల్లో, నా తల తెగినా ఒప్పుకోనని చెప్పినా.. అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ.. వీళ్లకు ఓట్లు కావాలి.. సీట్లు కావాలి.. కేంద్ర మంత్రులు కావాలి.. కానీ తెలంగాణ సమస్యలు, ప్రధానమైన సమస్యలు నీళ్లు, రైతులు, పంటలు వీళ్లకు పట్టదు..’అని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ నోటికి మొక్కాలి ‘మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆయన నోటికి మొక్కాలి.. వెనకట కూడా కాంగ్రెస్ వాళ్లు చెప్పేది.. దున్నేవాడికే భూమి.. తినేవాడికే విస్తరి.. గీసేవాడికే గుండు.. అమ్మను చూడు ఆవుదూడ బొమ్మను చూడు.. గుద్దో గుద్దు అని. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టెడు అన్నం దొరికింది ఆ పుణ్యాత్ముడు చేపట్టిన కిలో రూ.2 బియ్యం ద్వారానే. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది చరిత్ర..’అని బీఆర్ఎస్ అధినేత వివరించారు. తులం బంగారం తుస్సుమంది ‘తెలంగాణ రావడంతో ఎన్టీఆర్ చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, ధాన్యం కొనుగోలు ఇలా అన్నీ చేసుకున్నాం. కుంట భూమి ఉన్నా రైతు చనిపోతే వారం లోపు వారి ఇంటికి రూ.5 లక్షలు పంపాం. కల్యాణలక్ష్మి, పెట్టుకున్నాం. అయితే రూ.లక్ష మాత్రమే ఇస్తున్నారు..నేను తులం బంగారం ఇస్తానని రేవంత్రెడ్డి అన్నడు.. తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కస్సుమంటోంది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటోంది. తొమ్మిదేళ్లు రెప్పపాటు పోకుండా ఉన్న కరెంట్ నాలుగు నెలల్లో మాయమైపోతదా? నిన్న మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండుసార్లు కరెంట్ పోయింది. కరెంట్ పోయిందని నేను ట్విట్టర్లో పెట్టా. ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. వట్టి విక్రమార్క. కరెంట్ పోయిందంటే కేసీఆర్ అబద్ధాలకోరు అంటున్నడు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత ఉంది.. కరెంటు కోతలు ఉన్నాయి. హాస్టళ్లు మూసేస్తున్నామని చీఫ్ వార్డెన్ నోటీసు ఇచ్చింది వాస్తవం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి కోతలుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయి..’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి ‘రూ.2 లక్షల రుణమాఫీ అని రేవంత్రెడ్డి అన్నడు. డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తానన్నడు. అయ్యిందా? భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతి, యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు అంటావు.. ఇలా ప్రజలను మోసం చేయడానికి ఎన్ని ఒట్లు పెడతావు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి. ప్రతి మహిళకు రూ.2500 వచ్చిందా? వచ్చే ఆశ ఉందా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతోంది. ఈ మోసాలపై శాసనసభలో, బయట సభల్లో బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కేసీఆర్ నీ గుడ్లు పీకుతా, పండపెట్టి తొక్కుతా.. చర్లపల్లి జైల్లో వేస్తానని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నడు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషా ఇది?. పార్లమెంట్ ఎన్నికలైన తెల్లారే రేవంత్రెడ్డి బీజేపీలోకి జంప్ కొడతాడని బీజేపీ వాళ్లే చెబుతున్నరు. ఈ మాటలను ఆయన ఒక్కసారి కూడా ఖండించడం లేదు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత భయంకరమైన రాజకీయ అనిశ్చితి రానుంది..’అని బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. నాడు ఖమ్మం బ్రహ్మరథం పట్టింది ‘నేను ఒక్కడిని బయలుదేరిన నాడు ఎవరికీ నమ్మకం లేదు తెలంగాణ వస్తదని. నేను ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఆనాడు ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూడెమోక్రసీ, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు, తెలంగాణ వాదులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి మద్దతు పలికారు. అది నేను మర్చిపోలేదు. చివరికి తెలంగాణ వచ్చింది. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభివృద్ధిని చేసి చూపించిండు. నగరంలో నాడు రోజూ మంచినీళ్లు వస్తే.. ఇప్పుడు మూడురోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయి. తమ భూములకు నీళ్లు కావాలని పాలేరు రైతులు తూములు బద్ధలు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంటలు ఎండిపోతుంటే నీటి మంత్రి, వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నరు? అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఈ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఇదే సరైన సమయం. మీ కోరికలు నెరవేరాలంటే బీఆర్ఎస్కు శక్తి కావాలి. రాష్ట్రాన్ని, ఖమ్మంను ముందుకు తీసుకెళ్లే బలం ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరిగింది. మళ్లీ విజృంభిద్దాం.. అభివృద్ధి చేసుకుందాం..’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, బానోతు హరిప్రియ, బానోతు మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, దేశపతి శ్రీనివాస్, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ మీరే రావాలె సారు – కేసీఆర్తో రైతులు, వృద్ధులు, మహిళలు – ఖమ్మం మార్గంలో చాయ్ హోటల్ వద్ద బస్సు యాత్రకు బ్రేక్ మరిపెడ రూరల్: ‘మీరు లేకపోవుడుతోటి ఇన్ని కష్టాలు సారు. కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయినం.. ఇట్లైతదని అనుకోలే సారు .. మళ్లా మీరే రావాలె సారు..’అంటూ పలువురు రైతులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుతో తమ గోడు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని, తాను అండగా ఉంటానని చెబుతూ వారిని ఓదార్చారు. బస్సుయాత్రలో భాగంగా హనుమకొండ నుంచి ఖమ్మం బయలుదేరిన కేసీఆర్ మార్గం మధ్యలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా రోడ్డు పక్కన ఉన్న చిన్న చాయ్ హోటల్ వద్ద కాసేపు ఆగారు. కేసీఆర్ను చూసి హోటల్ యజమాని సొందు, కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. హోటల్లో ఉన్న మిర్చి బజ్జి, పకోడి, గారెలను ఆయనకు అందించారు. వాటిని తిన్న కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. సమాచారం అందుకున్న ఆనెపురం మాజీ సర్పంచ్ లాల్సింగ్ తదితరులు ఎల్లంపేట స్టేజీ వద్దకు చేరుకున్నారు. కొందరు రైతులు తమకు రైతుబంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, యాసంగికి సాగు నీళ్లు అందక పొలాలు ఎండిపోయాయని, కరెంట్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వికలాంగులు, మహిళలు, వృద్ధులు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో రైతుబంధు సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. కాగా పలువురు యువతీ యువకులు కేసీఆర్తో సెల్ఫీలు దిగారు. మరిపెడ మండల కేంద్రంలో బస్సుయాత్రకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
మండుటెండల్లోనూ జన సునామీ
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఎన్నికల మలి విడత ప్రచారానికి జనం పోటెత్తారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలపిస్తూ వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలకు మండుటెండల్లోనూ ప్రజలు ప్రభంజనంలా కదిలివచ్చారు. తీవ్ర ఎండను, ఉక్కపోతను ఖాతరు చేయకుండా సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తితో విన్నారు. గత 58 నెలల్లో చేసిన మంచిని సీఎం వివరించారు.ఈ పథకాలు మళ్లీ కొనసాగాలన్నా.. మరింత మేలు జరగాలన్నా.. పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన కావాలన్నా.. మన పిల్లల బడులు బాగుపడాలన్నా.. ఆస్పత్రులు, వ్యవసాయం మరింత మెరుగుపడాలన్నా మన ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ అడగ్గా మేమంతా సిద్ధమేనంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలు నినదించారు. లక్షలాది మంది పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేపడంతో తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు దద్దరిల్లిపోయాయి. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలూ పూర్తి స్థాయిలో ఆమోదించారనడానికి మూడు సభల్లో ఉవ్వెత్తున ఎగిసిన జనకెరటాలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచారాలకు జనస్పందన కనిపించడం లేదు. మొన్న సిద్ధం సభలు.. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు మలి విడత ప్రచారంలో తొలి రోజు నిర్వహించిన సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీదే అధికారమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు.తరలివచ్చిన తాడిపత్రి.. ఎన్నికల మలి విడత ప్రచారానికి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు గ్రామాలకు గ్రామాలు తరలివచ్చారు. హెలీప్యాడ్ నుంచి సభ జరిగే వైఎస్సార్ సర్కిల్కు చేరుకునే వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట వేలాది మంది పరుగులు తీశారు. సభా ప్రాంగణానికి ఉదయం 11.55 గంటలకు చేరుకునే సరికి ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అప్పటికే 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా తెచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ వివరించారు. 2014–19 మధ్య బీజేపీ, జనసేనతో కూటమి కట్టి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే కూటమి కట్టి అడ్డగోలు హామీలు ఇస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టడమేనని చాటిచెబుతూ సీఎం చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.వెల్లువెత్తిన వెంకటగిరి..తిరుపతి జిల్లా వెంకటగిరిలో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న వేలాది మంది ప్రజలు వెల్లువలా పోటెత్తారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రత, విపరీతమైన ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నా వెనుకడుగేయలేదు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి మధ్యాహ్నం 2.25 గంటలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా జనం నిల్చున్న ప్రాంతం నుంచి కదల్లేదు. సీఎం జగన్ను చూడగానే హర్షధ్వానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని.. మన తలరాతలు మారుస్తాయని.. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది.. ఎవరితో ఆ మంచి కొనసాగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దీంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదిస్తూ వేలాది మంది ఒక్కసారిగా జయజయధ్వానాలు చేశారు.కదిలివచ్చిన కందుకూరునెల్లూరు జిల్లా కందుకూరులో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ఉంటుందని తెలుసుకున్న ఆ నియోజకవర్గ ప్రజలు ఉదయం 10 గంటల నుంచే భారీ ఎత్తున కదిలివచ్చారు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకే కందుకూరు జనసంద్రంగా మారింది. కందుకూరులో హెలీప్యాడ్ నుంచి సభ జరిగే కేఎంసీ సర్కిల్ వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట జనం పరుగులు తీశారు. ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు పోటీపడ్డారు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలైంది. అప్పటికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అంతటి ఎండలోనూ గంటలకొద్దీ నిలబడ్డ జనం సీఎం జగన్ను చూడగానే ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రసంగాన్ని జనం శ్రద్ధగా విన్నారు. ‘సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చంద్రబాబులా బడాయి మాటలు నేను చెప్పడం లేదు. 58 నెలల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతున్నాడు’ అని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు సైతం శ్రుతి కలపడం విశేషం. మండుటెండల్లోనూ, తీవ్రమైన ఉక్కపోతల్లోనూ మూడు సభలకు పోటాపోటీగా జనం కదిలిరావడం.. ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో రాబోయేది ఫ్యాన్ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ప్రచారం సాగే కొద్దీ వైఎస్సార్సీపీ ప్రభంజనం అంతకంతకూ పెరగడం ఖాయమని.. ఇది చూసి పోలింగ్కు ముందే కూటమి నేతలు, శ్రేణులు కాడి పారేయడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. -
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్
-
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రం ఇప్పుడు భగ్గుమంటోంది. నా బస్సును కదలనివ్వనంత జనం.. వారి పూల స్వాగతమే చెప్తున్నాయి భవిష్యత్తు బీఆర్ఎస్దే నని.. కాంగ్రెస్ బలుపు దించాలి’’ అని వ్యాఖ్యా నించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఐదో రోజు శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఏప్రిల్ 27.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శంకుస్థాపన జరిగిన రోజు. 23 ఏళ్ల కింద తెలంగాణ సాధన కోసం పిడికెడు మందితో ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రోజు.. బీఆర్ఎస్ పుట్టిన రోజు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మీరు ఇచ్చిన మద్దతు.. అప్పటి ఘటనలు యాది చేసుకుంటే.. అదో ఉప్పెన, బ్రహ్మాండమైన సన్నివేశం. నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఈ గౌరవం చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి అడ్డగోలు హామీలిచ్చి, దు్రష్పచారం చేసి కేవలం 1.5 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కొనే దిక్కులేదు. మేం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల పాటు అందించాం. ఇప్పుడు కాంగెస్ పాలనలో మళ్లీ రాత్రిపూట కరెంటు కోసం తిప్పలు, బావుల వెంట పరుగులు, కరెంటు షాకులు, తేళ్లు, పాములు.. ఈ బాధలు మళ్లీ ఎందుకు వచ్చాయి? రోజు సీఎం, మంత్రులు మీటింగ్లు పెట్టి 24 గంటల కరెంటు ఇస్తున్నామని అంటున్నారు. మరి ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది. రోజుకు పది సార్లు ఇలానే పోతోందని చెప్తున్నారు. మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయో ఆలోచించండి. ప్రభుత్వ మెడలు వంచే బలం ఇవ్వండి గ్రామాల్లో పాలోళ్ల మధ్య పంచాయతీ జరిగితే పంచులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీలో ప్రజల తరపున యుద్ధం చేసే పంచు ఈ కేసీఆర్. ప్రాణం పోయినా తెలంగాణ తెస్తానని మాట ఇచ్చి.. తెచ్చి చూపించా. ఇప్పుడు మీ తరఫున వాదన వినిపించడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి మీరే బలం ఇవ్వాలి. కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీయే గెలుస్తుంది. అప్పుడేం లాభం ఉండదు. ఈ రోజు ఉదయమే రిపోర్టు వచ్చింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లలో బీఆర్ఎస్దే గెలుపు. రేవంత్రెడ్డివి సంస్కారం లేని మాటలు సీఎం రేవంత్రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు. నా గుడ్లు పీకి గోటీలు ఆడుతడట. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. పదిహేనేళ్లు పోరాటం చేసిన తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణను పదేళ్లలో తెల్లగ చేసిన, ప్రజల కష్టాలను చూసి తండ్లాడిన వ్యక్తిని అలా అనొచ్చా. ఇది «న్యాయమా ప్రజలే చెప్పాలి. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పంటలు కావాలా.. మోదీ గత్తర కావాలా? బీజేపీ అక్కరకు రాని చుట్టం. మోదీ ఇచ్చిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం అయిందా? మొన్న నాగర్ కర్నూల్కు గుజరాత్ సీఎం వచ్చారట. 1,500 మంది కూడా రాలే. మనకు గుజరాత్ నుంచి సీఎంలు రావాలా? మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా పెట్టబోనని చెప్పిన. నేను రైతును.. నాకు వారి బాధలు తెలుసు. ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా.. మోదీ వచ్చి మీటర్లు పెడతా అంటడు. పచ్చని పంటలు కావాలా? మోదీ గత్తర కావాలా? ఆలోచించండి. ఆర్ఎస్పీ లాంటి వాళ్లు మళ్లీ దొరకరు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అల్లాటప్పా వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్ అధికారి. అలంపూర్ బిడ్డ. నేను సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలకు ఎంత బడ్జెట్ కావాలో తీసుకోవాలని చెప్పిన. నేడు తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూళ్లతో సమానం. ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. ఎవరెస్ట్ ఎక్కిన బిడ్డలను గురుకులాల నుంచి పంపినది ప్రవీణ్కుమారే. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఇలాంటి వారు మళ్లీ దొరకరు. చదువుకున్నోళ్లు వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. -
ఇలాగైతే కష్టం... గ్యారంటీగా గెలవం హామీలతో ముంచేద్దాం
సాక్షి, అమరావతి: జనసేన, బీజేపీతో జట్టుకట్టినా ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలవికాని బోగస్ హామీలు గుప్పించేందుకు సన్నద్ధమయ్యారు. గతేడాది మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ ముసుగుతో మినీ మేనిఫెస్టో అంటూ ప్రకటించారు. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడం.. చంద్రబాబు అంటేనే మోసాలకు మరోపేరు అని ప్రజలు గుర్తించడంతో ‘సూపర్ సిక్స్’ను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు తరహాలో బోగస్ హామీలతో మేనిఫెస్టోను వదిలేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే జనం పొరపాటున కూడా నమ్మరని పసిగట్టిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో దాన్ని విడుదల చేయించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ముఖచిత్రాన్ని మార్చేసిన ‘సిద్ధం’ సభలు, బస్సు యాత్ర..సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు తాడేపల్లిగూడెంలో పవన్కళ్యాణ్తో కలిసి నిర్వహించిన జెండా సభ, ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవకాశవాద పొత్తును జనం ఛీకొట్టారనడానికి జెండా సభ, చిలకలూరిపేట సభ నిదర్శనంగా నిలిస్తే.. సీఎం జగన్పై ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ‘సిద్ధం’ సభలు నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ఏ ప్రాంతంలోనూ జన స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27 నుంచి ఈ నెల 24 వరకూ 23 జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తీవ్ర ఫ్రస్టేషన్తో ఊగిపోతున్న బాబు..సీఎం జగన్ బస్సు యాత్ర సృష్టించిన ప్రకంపనలతోపాటు ఏకంగా 20కిపైగా జాతీయ మీడియా సంస్థలు, పొలిటికల్ కన్సెల్టెన్సీలు నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని తేల్చిచెప్పడంతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో నైరాశ్యం నెలకొంది.నామినేషన్ల ఘట్టంలోనే కాడి పారేస్తున్నాయి. తీవ్ర ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ)తో సీఎం జగన్పై నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల విజయనగరంలో ప్రజాగళం సభలో సీఎం జగన్ను తూలనాడే క్రమంలో.. నెత్తిపై రూపాయి పెడితే పైసాకు కొనుక్కోవడానికి కూడా పవన్ కళ్యాణ్ పనికి రారంటూ చంద్రబాబు తన మనసులో మాట బయట పెట్టడమే అందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి తన వద్ద పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బూతుపురాణం వల్లించడం వారి ఫ్రస్టేషన్కు పరాకాష్ట. వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగాలంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుండటం చూస్తే వారిలో ఫ్రస్టేషన్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటిలాగే బోగస్ హామీలతో ఇప్పుడూ..విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీలతో జట్టుకట్టిన చంద్రబాబు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానంటూ నాడు 650కిపైగా అలవికాని హామీలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫోటోలను ముద్రించిన పత్రంతో ముఖ్యమైన హామీలంటూ తన సంతకం చేసి మరీ ఇంటింటికీ పంపి ప్రచారం చేయించారు. అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ఎన్నికల మేనిఫెస్టోను ఏకంగా టీడీపీ వెబ్సైట్ నుంచి చంద్రబాబు మాయం చేయించారు.ఇప్పుడూ అదే కూటమిగా జట్టు కట్టిన చంద్రబాబు 2014 తరహాలోనూ బోగస్ హామీలతో మరోసారి ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే ప్రజలు ఛీకొడతారని గుర్తించడంతో మే 3వ తేదీన రాష్ట్రంలో నిర్వహించే సభలో ప్రధాని మోదీతో విడుదల చేయించేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనం ఖాయంరాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సీఎం జగన్ బస్సు యాత్ర సమూలంగా మార్చేసిందని.. పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ, కూటమి అభ్యర్థులు తేలాక జాతీయ మీడియా సంస్థలు, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20 సర్వేల్లో ‘‘ఫ్యాన్’’ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేల్చాయి.సీ–ఓటర్ సర్వే ఒక్కటి మాత్రమే కూటమి విజయం సాధిస్తుందని పేర్కొంది. అయితే సీ–ఓటర్ నిర్వహించే సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత ఉండదు. 2004, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ పేర్కొనగా ఆ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ ఢంకా భజాయిస్తే వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. -
నేడు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్నగర్ వరకు భారీ రోడ్షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్కర్నూల్కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
వార్ వన్ సైడే
నిన్ను చూడటానికే వచ్చానన్నా..బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఏప్రిల్ 10న మధ్యాహ్నం 1.30 గంటలకు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో సీఎం జగన్ను చూసేందుకు వేల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలెంకు చెందిన వెంకాయమ్మ పరుగెత్తుకొస్తోంది. మధ్యలో చెప్పులు తెగిపోయినా లెక్క చేయకుండా తారు రోడ్డుపై ఉత్త కాళ్లతోనే పరుగులు తీస్తున్న ఆమెను చూసిన సీఎం జగన్.. బస్సు ఆపించారు. ఆమెను దగ్గరికి పిలిచారు. ‘ఏం తల్లీ బాగున్నావా? ఏమైనా సమస్య ఉందా..’ అంటూ ఆత్మియంగా పలకరించారు. ‘జగనన్నా.. నీ పాలనలో నాకు ఎలాంటి సమస్య లేదు. నిన్ను దగ్గరి నుంచి చూద్దామని, పలకరిద్దామనే వచ్చా’ అని చెబుతూ మురిసిపోయింది.► కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంటకు ఒక కిలోమీటరు దూరంలో ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మండుతున్న ఎండలో సీఎం జగన్ను చూసేందుకు పొలాల వెంట 20–25 మంది మహిళలు పరుగులు పెడుతూ వస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు నుంచి కిందకు దిగారు. మహిళలంతా సీఎం జగన్ చుట్టూ చేరారు. ‘విజయవాడలో మీపై రాయితో దాడి చేశారని తెలిసి తల్లడిల్లిపోయాం. మంచి చేసిన మిమ్మల్ని ప్రజలంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే అక్కసుతో టీడీపీ వాళ్లు మీపై దాడి చేయించారు.. జాగ్రత్తగా ఉండు జగనన్నా.. మీరు బాగుంటేనే మేం బాగుంటాం’ అంటూ తోడబుట్టిన అన్నగా భావిస్తూ పరామర్శించారు. ► కాకినాడ జిల్లా సామర్లకోట ముఖ ద్వారం వద్ద ఏప్రిల్ 19న మధ్యాహ్నం ఒంటి గంటకు మండే ఎండలో వేలాది మంది మహిళలు రోడ్డుపై నిలబడ్డారు. సీఎం జగన్ బస్సు అక్కడకు రాగానే మహిళలు హర్షధ్వానాలు చేశారు. బస్సు దిగిన సీఎం జగన్.. వారితో ముచ్చటించారు. ‘జగనన్నా.. మీరు మాకు మంచి చేశారు. మేం మళ్లీ మిమ్మల్ని గెలిపించుకుని సీఎంగా చేసుకుంటాం’ అంటూ భరోసా ఇచ్చారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసి.. హారతులు ఇచ్చి దీవించారు. ► వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఆత్మియత, అనుంబంధాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు అడుగడుగునా కన్పించాయి. ఇలాంటి దృశ్యాలు రాజకీయాల్లో అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాటపై నిలబడి.. నిబద్ధత, నిజాయితీతో పని చేసే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి సీఎం జగన్ బస్సు యాత్రే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.బస్సు యాత్ర సాగినంత దూరం.. మండుటెండైనా అర్ధరాత్రయినా లెక్క చేయకుండా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకు మానవ హారంగా ఏర్పడి సీఎం జగన్కు నీరాజనాలు పలకడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. ‘ఫలానా పనులు చేస్తాం.. మాకు ఓటేయండి’ అని రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు అడగడం సాధారణమని, కానీ.. ‘జగనన్నా.. మీరు మంచి చేశారు.. మిమ్మల్ని మళ్లీ గెలిపించి సీఎంగా చేసుకుంటాం’ అని ప్రజలు అడుగడుగునా భరోసా ఇస్తుండటం చరిత్రలో తామెన్నడూ చూడలేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. –మరిన్ని వివరాలు ఐఐఐలోసాక్షి, అమరావతి: రాష్ట్రంలో 22 రోజుల పాటు సాగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ను చూసేందుకు ఆద్యంతం జనం ప్రభంజనంలా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ఆరంభించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సమీపంలో అక్కవరం బహిరంగ సభతో పాదయాత్రను ముగించారు. 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీల దూరం బస్సు యాత్ర సాగింది.యాత్రలో 16 భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. వివిధ వర్గాల ప్రజలతో ఆరు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర తొమ్మిది ప్రాంతాల్లో భారీ రోడ్ షోలు నిర్వహించారు. బస్సు యాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి ఈనెల 13న విజయవాడలో జరిగిన రోడ్ షో వరకూ యాత్ర సాగినంత దూరం కెరటాల్లా జనం పోటెత్తారు. విజయవాడలో లక్షలాది మంది ప్రజలు రోడ్ షోలో సీఎం జగన్కు నీరాజనం పలుకుతుండడం చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని పదునైన రాయితో గురిపెట్టి కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ నుంచి సునామీలా పోటెత్తిన జనం విజయవాడలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత.. వైద్యుల సలహా మేరకు ఈనెల 14న విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్ ఈ నెల 15 నుంచి యాత్రను కొనసాగించారు. సీఎం జగన్పై టీడీపీ నేతలు హత్యాయత్నానికి తెగబడటంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈనెల 15 నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు సునామీలా జనం పోటెత్తి సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో దారి పొడవునా జనం బారులు తీరి సీఎం జగన్కు మద్దతు తెలిపారు.రాజమహేంద్రవరంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది ప్రజలు కదలిరావడం కూటమి వెన్నులో వణుకు పుట్టించింది. ఇక విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది జనం పోటెత్తడంతో కూటమి వణికిపోయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఘోర పరాజయం భయంతో వణికిపోతున్న టీడీపీ సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లక్షలాది మంది పోటెత్తడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. టీడీపీ–జనసేన జత కలిశాక తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక చిలకలూరిపేటకు ప్రధానిని రప్పించి నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమి ఆందోళన చెందింది.ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు.. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా జనం నీరాజనాలు పలికారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 సభలకు లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోలు అతి పెద్ద మానవ హారంగా నిలిచిపోతాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన సభలకు.. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి వారిద్దరూ నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి ఆ నేతలు వచ్చేశారు. తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఎం జగన్పై దూషణలకు దిగుతూ, వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడాలని ఆ పారీ్టల కార్యకర్తలను రెచ్చగొడుతుండటమే అందుకు తార్కాణం. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని, ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని తేల్చి రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారీ ఎత్తున వైఎస్సార్సీపీలో చేరడం.. వేలాది మంది క్రియాశీలక కార్యకర్తలు వారి బాటనే అనుసరించడంతో ఆ పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. ఘోర పరాభవం తప్పదనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేన అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్పై దూషణలకు దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
సిద్ధం అంటే అసలు అర్థం ఏంటో తెలుసా..!
-
సిక్కోలులో జన సంద్రం
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి సూర్యకిరణాలు తాకే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి సాక్షిగా జననేతను సిక్కోలు అక్కున చేర్చుకుంది. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లా అక్కివలసలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుకరించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పరిసర గ్రామాలకు చెందిన పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రియతమ నేతను కళ్లారా చూడాలని, వీలైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం చూపారు.బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు సుమారు 64 కి.మీ. మేర సాగి టెక్కలి నియోజకవర్గం అక్కవరం బహిరంగ సభతో ముగిసింది. రాత్రి బస శిబిరం వద్ద శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు ఆరా తీసి దిశానిర్దేశం చేశారు.అనంతరం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో అక్కివలస నుంచి ప్రారంభమైన యాత్ర ఆమదాలవలస కొత్తరోడ్డు, మడపాం, నిమ్మాడ, పొడుగుపాడు, కోటబొమ్మాళి జంక్షన్, కన్నెవలస, చమయ్యపేట వరకు సాగింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నేతలతో కలసి అక్కవరం బహిరంగ సభ ప్రాంగణం వద్దకు సీఎం చేరుకున్నారు. ‘సిద్ధం సిద్ధం.. సీఎం సీఎం’ అంటూ మిన్నంటిన నినాదాలతో సభా ప్రాంగణం సముద్ర హోరును తలపించింది. సీఎం మాట్లాడుతుండగా ఆకాశం మేఘావృతంఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన యాత్రకు అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. జగనన్న తెచ్చిన వలంటీర్లు, సచివాలయాలతో తమ పనులు సులభతరమైపోయాయని, కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి తప్పిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొద్దున్నే ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పింఛన్ ఇస్తున్నారని, ఇంత మేలు చేసిన జగన్ బాబును చూడాలని వచ్చామని తమ ఆనందాన్ని పంచుకున్నారు.మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. సీఎం జగన్ అక్కవరం సభలో ప్రసంగిస్తుండగా మేఘాలు కమ్ముకున్నాయి. సభా ప్రాంగణంలో చినుకులు రాలడం, సమీపంలో వర్షం కురవడంతో హర్షాతిరేకాలు మిన్నంటాయి. జగన్ రాకతో తమ ప్రాంతం చల్లబడిందని, ఆయన అడుగుపెట్టిన చోట మంచే జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మహిళలు నినాదాలు చేశారు.♦ పుట్టుకతో వినికిడి లోపం కలిగిన తన కుమారుడు త్రిషాన్ రెండు చెవులకు 2022లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేయడంతో చిన్నగా మాట్లాడగలుగుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ సీఎం జగన్ వద్ద ఆనందం వ్యక్తం చేశాడు. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన సీఎం జగన్కు కలిశారు. ♦ ‘మేమంతా సిద్ధం’ యాత్ర మడపాం టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ క్రేన్తో తెచ్చిన నవరత్నాల పథకాల మాలతో సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. అక్కడ తనను కలసిన ఓ దివ్యాంగుడికి మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేస్తామని సీఎం జగన్ భరోసా వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబం అంతా జగనన్న అభిమానులంమా కుటుంబం మొత్తం జగనన్న అభిమానులం. జగనన్న పాదయాత చేసినప్పుడు నేను చదువకుంటున్నా. మా జిల్లాకు వచ్చినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇప్పుడు మా పాప రెండో తరగతి చదువుతోంది. జగనన్నను చూడాలని రాత్రి నుంచి మారాం చేయడంతో ఉదయం 7 గంటలకే అక్కివలస తీసుకొచ్చాం. జగనన్న చేపట్టిన విద్య, వైద్య సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిని కళ్లారా చూస్తున్నాం. – పి.సంతోషిమణి, శ్రీకాకుళం మా తొలి ఓటు జగనన్నకే.. నాన్న అబ్దుల్ సలీమ్ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తుండగా అమ్మ నసీమాబేగం గృహిణి. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి కుటుంబాలకు జగనన్న దేవుడు. మా అక్క, నా చదువు పూర్తిగా జగనన్న విద్యా దీవెనతోనే పూర్తయింది. ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేయడంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా కుటుంబం ఆనందంగా ఉందంటే అది జగనన్న పుణ్యమే. మా అక్కకు, నాకు తొలిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. తొలి ఓటు ఫ్యానుకే వేస్తాం. జగనన్నను చూశాకే అక్కివలస నుంచి ఇంటికి వెళతా. – నజీమా, విజయనగరం -
కరెంట్ ఇవ్వడం కూడా కాంగ్రెస్కు చేతకావడం లేదు: కేసీఆర్
మిర్యాలగూడలో రోడ్ షో ముగించుకుని సూర్యాపేట బయలుదేరిన కేసీఆర్మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ: కేసీఆర్మిర్యాలగూడలో కేసీఆర్ ప్రసంగంఅడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీరైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి అంటాడురైతులు చెప్పులు కూడా గట్టిగానే ఉన్నాయని కాంగ్రెస్ నేతలకు చెప్పాతెలంగాణ వచ్చాక పంటలు ఎండాయంటే ఇదే తొలిసారి.కరెంట్ కోతలెందుకు వస్తున్నాయి? ఎక్కడికి పోయింది కరెంట్? ఎందుకు ప్రజలను బాధపెడుతున్నారు.కరెంట్ను ఇవ్వడం కూడా చేతకావడం లేదా?.మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు లేదు? అది మీ చేతకాని తనం కాదా?కేసీఆర్ను తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకుంది.ధాన్యం కొనడం లేదని రైతులు చెబుతున్నారు.తప్పకుండా తెలంగాణలో మన రాజ్యమే వస్తది.1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్సే.21 ఏళ్ల క్రితం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశా. నాలుగైదు నెలల క్రితం ధీమాతో ఉన్న రైతులు ఈరోజు బాధతో ఉన్నారు.ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ జిల్లాకు చెందినవారే. వీళ్లంతా కలిసి కృష్ణా నదిని కేఆర్ఎంబీకి పంపించారు.బీఆర్ఎస్ హయాంలో 18 పంటలకు నీళ్లిచ్చాం. రైతు బీమా ఉంటదో ఉండదో తెలవదు.కరెంట్ కనిపించకుండా పోయింది.రైతు బంధు ఐదెకరాలకే అంటున్నారు.ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనడం లేదని రైతులు నాతో అన్నారు. కేంద్రం గతంలో ధాన్యం కొననంటే మెడలు వంచి కొనిచ్చాంకల్యాణ లక్ష్మీ కింద తులం బంగారు ఇస్తామన్నారు. ఇంతవరకు లేదురెండు లక్షల రుణమాఫీ ఏమైంది?పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తే ప్రభుత్వం మెడలు వంచుతాం.కేసీఆర్ను చర్లపల్లి జైలుకు పంపిస్తా అంటున్నారు. వీటికి కేసీఆర్ బయపడతాడా?అంబేడ్కర్ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది.125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కడితే. జయంతి ఒక్కరు పోలేదు. మిర్యాలగూడ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రరోడ్ షోలో పాల్గొని రాజీవ్ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్న కేసీఆర్ కాసేపట్లో మిర్యాలగూడకు చేరుకోనున్న కేసీఆర్మిర్యాలగూడ బైపాస్ నుంచి రాజీవ్ గాంధీ కూడలి వరకు ర్యాలీరాజీవ్ గాంధీ కూడలిలో ప్రసంగిచనున్న కేసీఆర్నల్లగొండ జిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్తూ మార్గమధ్యలో నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద ఆగిన మాజీ సీఎం కేసీఆర్ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేసీఆర్తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్రకేసీఆర్ బస్సు వెంట భారీ కార్ల కాన్వాయ్ ర్యాలీమొదటిసారిగా తెలంగాణ భవన్ సౌత్ గేట్ నుంచి కేసీఆర్ బస్సు యాత్రసాక్షి, హైదరాబాద్/నల్గొండ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ ర్యాలీ నడుమ బయల్దేరారు. తెలంగాణ భవన్ సౌత్ గేట్ నుంచి ఆయన కాన్వాయ్ బయల్దేరడం విశేషం. సాయంత్రం 4గం. మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. రైతుల కోసం, రాష్ట్రం కోసం 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్షోలలో పాల్గొంటారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని, అక్కడ రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి, అక్కడ కూడా రోడ్షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు. -
సీఎం జగన్ బస్సు యాత్ర బ్రహ్మరథం పడుతున్న జనం
-
అడుగడుగునా జన నీరాజనం
-
ఇవాళ్టితో ముగియనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర
-
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్లోని చెన్నాస్ కన్వెన్షన్లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
నేటి నుంచి కేసీఆర్ ప్రగతి రథం యాత్ర
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మే 10 వరకు 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో భాగంగా 40కి పైగా పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొని లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. ఈ ప్రగతి రథానికి బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కాగా బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఈ సందర్భంగా కేసీఆర్కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత... భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఆయన వెంట ఉంటారు. సుమారు వందకు పైగా వాహనాలు ప్రగతి రథాన్ని అనుసరించే అవకాశముంది. సుమారు రెండు వందల మందితో కూడిన వలంటీర్ల బృందం కూడా యాత్రలో పాల్గొంటుంది. పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలతో పాటు సుదీర్ఘకాలంగా పారీ్టలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించనున్నారు. పంతంగి టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం తొలిరోజు బస్సు యాత్ర బేగంపేట, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా విజయవాడ రహదారిపైకి చేరుతుంది. వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత చౌటుప్పల్ పంతంగి టోల్ప్లాజా వద్ద అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారి పొడవునా కేసీఆర్కు ప్రజలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేలా మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. నకిరేకల్ క్రాస్ రోడ్, నల్లగొండ, మాడుగులపల్లి మీదుగా సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్దకు యాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 5:30కి రాజీవ్ చౌక్వద్ద రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి తిప్పర్తి మీదుగా రాత్రి 7 గంటలకు సూర్యాపేటకు చేరుకుని రోడ్ షోలో ప్రసంగిస్తారు. సూర్యాపేటలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ రాత్రి బస చేస్తారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచారం తీరుతెన్నులను సమీక్షించి దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి చిట్యాల, రామన్నపేట మీదుగా భువనగిరి చేరుకుని అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస కోసం ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకుంటారు. శుక్రవారం నుంచి మరో 15 రోజులు పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. కిలోమీటర్ మేర రోడ్ షో ప్రతిచోటా కిలోమీటర్ మేర రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తారు. రోజూ రోడ్ షో ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం కేసీఆర్ విలేకరులతో మాట్లాడతారు. దీంతో పాటు ఉదయం వేళల్లో వివిధ సామాజికవర్గాలతో భేటీలు, క్షేత్ర స్థాయి సందర్శనలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా కేసీఆర్ బస్సు యాత్ర వెంట వెళ్లే వలంటీర్లకు ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. -
చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం
-
నా తండ్రి లాంటి వారు ఎమోషనల్ అయిన బొత్స
-
అక్క చెల్లమ్మలకు జగనన్న విజ్ఞప్తి..!
-
వీళ్ళే మన అభ్యర్థులు .. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
నా ప్రతి ఇంటి ఆడపడుచు, నా తల్లి ఒక కల కంటుంది..!
-
చంద్రబాబు పాలన రక్తాన్ని పీల్చే పాలన.. బాబుపై సీఎం జగన్ సెటైర్లు
-
ఆ దేవుడు శాశిస్తాడు మీ జగన్ పాటిస్తాడు...!
-
అలాంటి మోసగాళ్లను ఏమంటాం.. 420లు అంటాం
-
ప్రజల అండతో సీఎం జగన్.. ఇతర పార్టీల అండతో చంద్రబాబు
-
Watch Live: మేమంతా సిద్ధం చెల్లూరు సభ (విజయనగరం జిల్లా)
-
విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర
-
మిమ్మల్ని తలవని రోజు లేదు అన్న.. మహిళ భావోద్వేగం
-
100 ఈనాడులు, 100 ఆంధ్ర జ్యోతిలు వచ్చినా మీ అన్నకు భయం లేదు..!
-
సంచలన నిజాలు బయటపెట్టిన అప్పటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
-
"దుర్మార్గులు ట్రోల్ చేసి చంపేశారు" సీఎం జగన్ ఎమోషనల్..!
-
విశాఖపట్నంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రోడ్ షో విజువల్స్
-
బస్సు యాత్రలో జగన్ జైత్రయాత్ర కనిపిస్తోంది..!
-
21వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర
-
పాదయాత్రకు మించి బస్సు యాత్రకు ప్రజాదరణ
-
సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్..!
-
విశాఖపట్నంలో మరో సముద్రం జననేతకు అడుగడుగునా జన నీరాజనం
-
Watch Live: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర డే 20
-
Anakapalle Memantha Siddham: ‘మేమంతా సిద్ధం’ అంటున్న అనకాపల్లి జన సంద్రం (ఫోటోలు)
-
వీళ్లే మన అభ్యర్థులు ఆశీర్వదించండి
-
నేను బచ్చా అయితే భయమెందుకు? బాబు, వదిన, దత్తపుత్రుడికి మాస్ కౌంటర్
-
గతంలో ఏ ప్రభుత్వంలో నైనా ఇలాంటి పథకాలు చూసారా
-
నేను బచ్చానును కాదు బాబు..చంద్రబాబు వ్యాఖ్యలకు సీఎం జగన్ మాస్ కౌంటర్
-
సభను ఉర్రుతలూగించిన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్
-
ప్రజల్లోకి సీఎం వైఎస్ జగన్ డైనమిక్ ఎంట్రీ
-
సీఎం వైఎస్ జగన్ గూస్బంప్స్ ఎంట్రీ
-
నరసింగపల్లి బహిరంగ సభకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు
-
Watch Live: ‘మేమంతా సిద్ధం’ నరసింగపల్లి సభ (అనకాపల్లి జిల్లా)
-
బాధిత కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చిన సీఎం జగన్
-
జగన్ కు అరచేతిలో హారతి.. వద్దు తల్లి..!
-
భగభగల్లోనూ బ్రహ్మరథం
సీఎం జగన్ తెచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతును తిరిగి బతికించాయి. గతంలో వ్యవసాయం చేసి పండించిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. వారు చెప్పిందే ధర. ఆరుగాలం కష్టపడితే లాభం రాకపోగా, నష్టమే కనిపించేది. ఎవరికీ చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు మా గ్రామంలోనే రైతుభరోసా కేంద్రం వచ్చింది. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఇక్కడే ఇస్తున్నారు. పంట నష్టపోతే బీమా అందిస్తున్నారు. నేను 18 ఎకరాలు సాగుచేస్తున్నాను. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.4 లక్షల వరకు లబ్ధిపొందాను. ఇన్నేళ్ల నా జీవితంలో రైతు ఆనందంగా ఉన్నది ఇప్పుడే చూస్తున్నాను. ఇలాంటి నాయకుడే మళ్లీ సీఎం కావాలి. – సత్యనారాయణ, రైతు, రంగంపేట గ్రామం, అనపర్తి నియోజకవర్గం (‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల కోలాహలం మధ్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 18వ రోజు శుక్రవారం కాకినాడ జిల్లాలో కోలాహలంగా సాగింది. అనపర్తి మండలం రంగంపేటకు సమీపంలోని ఎస్టీ రాజపురం వద్ద ఏర్పాటుచేసిన నైట్ స్టే పాయింట్ నుంచి ఉదయం రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్, ఉండూరు మీదుగా కాకినాడకు చేరుకుంది. మార్గమధ్యంలో మహిళలు హారతులు పట్టి సీఎం జగన్కు జేజేలు పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు వృద్ధులు.. రైతులు.. అక్కచెల్లెమ్మలు పల్లెల నుంచి పరుగుపరుగున రంగంపేటకు చేరుకున్నారు. సూరంపాలెం వరకు 8 కి.మీ. మేర తమ అభిమాన నేత వెంట నడిచారు. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ భారీ బ్యానర్తో స్వాగతం పలికారు. మీవల్లే మేం ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నాం. ‘అన్నా.. నువ్వు జాగ్రత్త, క్షేమంగా వెళ్లి.. సీఎంగా తిరిగి రా’ అంటూ ఒకరు.. ‘మొనగాడిలా ఒక్కడే వస్తాడు.. చరిత్ర సృష్టిస్తాడు’ అని ఇంకొకరు.. ‘పేదవాడి ఇంట్లో కష్టం లేకుండా ఉండాలంటే మళ్లీమళ్లీ నువ్వే సీఎంగా రావాలన్నా’ అంటూ మరో విద్యార్థి, ‘అన్నా నువ్వు జాగ్రత్త.. నీ ఆరోగ్యం జాగ్రత్త..’ ‘వైనాట్ 175.. వన్స్మోర్ సీఎం జగనన్న..’ వంటి ప్లకార్డులతో విద్యార్థులు తమ ఆనందాన్ని, అభిమానాన్ని చాటారు. జగన్నినాదాలతో హోరెత్తిన రంగంపేట.. ఉదయం ఎస్టీ రాజపురం వద్ద ప్రారంభమైన యాత్రకు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలతో రంగంపేట కిక్కిరిసిపోయింది. దారిపొడవునా జనం జగన్ నినాదాలతో హోరెత్తించారు. సామర్లకోట సెంటర్ వద్ద మహిళలు జగన్ కాన్వాయ్కి హారతులిచ్చారు. జానపద నృత్యాలు, తీన్మార్ నృత్యాలతో జననేతకు స్వాగతం పలికారు. అచ్చంపేట ఫ్లైఓవర్ వద్ద ఓ పాత ఫొటోతో ఎదురువస్తున్న వృద్ధురాలిని చూసిన జగన్ తన వాహనాన్ని ఆపి ఆమెను పలకరించగా.. తన పేరు మోర్త కుమారి అని, గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ మార్గంలో వచ్చినప్పుడు తాను జున్ను పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఆయన వచ్చారు, ఇన్నేళ్లకు మీరు వచ్చారంటూ ఆమె తెగ సంబరపడింది. అలాగే, కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే రోగిని తీసుకుని ఆమె బంధువులు జగన్ కోసం ఎదురుచూస్తూ రోడ్డుపై వేచివున్నారు. వీరిని చూసి జగన్ తన వాహనాన్ని ఆపి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఖర్చుచేసిన బిల్లులను జాగ్రత్తచేయాలని పేషెంట్ బంధువులకు సూచించారు. కృష్ణవేణికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మనసున్న మారాజు అని, ప్రజా సమస్యలపట్ల జగన్ స్పందిస్తున్న తీరును చూసి మళ్లీ సీఎంగా ఆయనే రావాలని అక్కడున్న వారంతా బలంగా కోరుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఉండూరు క్రాస్ నుంచి బయల్దేరి కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగసభకు చేరుకున్నారు. అభిమానం ముందు ఎండ ఎంత? ఓ పక్క భానుడు భగభగలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతుంటే.. కాకినాడలో మాత్రం జనం ఎండను సైతం లెక్కచేయకుండా అచ్చంపేట జంక్షన్కు తండోపతండాలుగా తరలివచ్చారు. తమకు మేలు చేసిన ప్రజా నాయకుడు సీఎం జగన్ తమ ప్రాంతానికి వచ్చాడని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మా అభిమానం ముందు ఈ ఎండ తీవ్రత ఎంత.. అంటూ జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సభా ప్రాంగణమైతే జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం యాత్ర పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి, బెండపూడి, అన్నవరం, తుని మీదుగా యాత్ర సాగింది. కత్తిపూడి కూడలి నుంచి ప్రజలు ప్లకార్డులు పట్టుకుని మానవహారం నిర్వహించారు. లోవ సెంటర్లో అమ్మవారి ఆశీర్వాదం పొందారు. తునిలో రోడ్ షో హైలెట్ తునిలో నిర్వహించిన రోడ్డు షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్ లైటింగ్, యువత డ్యాన్సులతో సీఎం జగన్కు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు నిలబడి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ సాయంత్రం తుని వస్తారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారి పైకి భారీగా తరలివచ్చారు. కానీ ఆయన రాత్రి 8.25కు తుని చేరుకున్నారు. మహిళలు గుమ్మడికాయలతో హారతి ఇచ్చి దిష్టితీశారు. జగన్ బస్సుపై నుంచి వారికి అభివాదం చేస్తూ రాత్రి పాయకరావుపేటకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ రాత్రి 9.15 గంటలకు వడిచర్ల వద్ద నైట్ స్టే క్యాంపునకు జగన్ చేరుకున్నారు. సామాన్యులకు ‘కార్పొరేట్’ చదువులు జగన్ సర్ వచ్చాకే సామాన్యుల పిల్లలకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి. మాది అనంతపురం జిల్లా గంగవరం గ్రామం. ఇంజినీరింగ్లో ర్యాంక్ రావడంతో కాకినాడ జిల్లాలో సీటు వచ్చింది. సీఎస్ఈ (డేటా సైన్స్)లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను. జగన్ రాకముందు.. వచ్చాక రాష్ట్రంలో చదువులెలా ఉన్నాయో చాలా దగ్గర నుంచి గమనించాను. మా స్కూల్లోనే జగన్ సీఎం కాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు వచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు జగనన్న విద్యాదీవెన పథకంతో ఇంజినీరింగ్ చేస్తున్నాను. మా అన్నయ్యకు కూడా విద్యాదీవెన అందుతోంది. మా నాన్నకు రైతుభరోసా వచ్చింది. ఇలాంటి సీఎంను నేను చూడలేదు. – చైతన్యరెడ్డి, విద్యార్థిని, అనంతపురం జిల్లా జగన్ సర్ రుణం తీర్చుకోలేనిది.. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువు అంటే భయమేసేది. టీచర్లు ఉండేవారు కాదు. టాయిలెట్లు ఉండేవి కావు. వర్షం వస్తే క్లాస్రూంలు కారిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. చదువులు బాగున్నాయి. గతంలో ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీలేదు. నా పాలిటెక్నిక్ చదువు పూర్తిగా ప్రభుత్వ సాయంతోనే పూర్తయింది. మా చెల్లి, తమ్ముడు (కజిన్స్)కి అమ్మఒడి వస్తోంది. నా డిప్లొమా అవుతుండగానే జాబ్ వచ్చింది, కానీ, జగనన్న విద్యాదీవెన ఇస్తుండడంతో ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాను. జగన్ సర్ గ్రేట్. హత్యాయత్నం జరిగినా లెక్కచేయలేదు, నవ్వుతూనే ప్రజల్లో ఉన్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – తనూజ, బీటెక్ (ఈసీఈ సెకండియర్), కాకినాడ జగనన్న వచ్చాకే మేలు జరిగింది.. నాకు ఇద్దరు పిల్లలు, నా భర్త పాల వ్యాపారం చేస్తాడు. గతంలో రేషన్ కార్డు కోసం జన్మభూమి కమిటీలో ఎన్నోసార్లు అప్లై చేసినా ఇవ్వలేదు. కారణం కూడా చెప్పలేదు. జగనన్న సీఎం అయ్యాక ఇంటికి వలంటీర్ వచ్చి మరీ కార్డు ఇచ్చారు. మా పాపకి రెండుసార్లు అమ్మఒడి ఇచ్చారు. ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంత మేలు చేసిన అన్న మా ఊరికి వస్తే చూడకుండా ఉండలేం కదా.. అందుకే నా బిడ్డను తీసుకుని వచ్చాను. – ఈ. శ్రీలత, గాంధీనగర్, కాకినాడ చేబ్రోలు పట్టు రైతులకు సీఎం హామీ ముఖ్యమంత్రి తీరుతో పట్టు రైతుల హర్షాతిరేకాలు పిఠాపురం: చేబ్రోలు పట్టు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేబ్రోలు పట్టు పరిశ్రమకు చెందిన పట్టు రైతులు తమ సమస్యలు సీఎంకు వినతిపత్రం ద్వారా తెలియజేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, బస్సుయాత్ర చేబ్రోలులో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే.. బస్సుయాత్ర ఆగకుండా వెళ్లిపోయిందని రైతులు నిరాశకు గురయ్యారు. ఇంతలో బస్సులో నుంచి రైతులు ప్రదర్శించిన ప్లకార్డులను చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో ఉన్న వారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన.. రైతుల వద్దకు వెళ్లి, వారి వినతిపత్రం తీసుకుని, వారి సమస్యను క్షుణ్ణంగా విని, తగిన పరిష్కారం చూపిస్తామని తన మాటగా చెప్పి రావాల్సిందిగా సీఎంఓ కార్యాలయ గ్రీవెన్స్ అధికారి ప్రదీప్ను ఆదేశించారు. దీంతో ఆ అధికారి రైతుల వద్దకు చేరుకుని, ముఖ్యమంత్రి తనను పంపించారని చెప్పారు. రైతులతో మాట్లాడి వారి సమస్యను ఆలకించి, వారి వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారని రైతులకు వివరించారు. దీంతో.. సమయాభావంవల్ల సీఎం ఆగకుండా వెళ్లిపోయినా, రైతులను గుర్తించి.. వెంటనే స్పందించి అధికారిని పంపించడంపై పట్టు రైతులు ఆనందం వ్యక్తంచేశారు. -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజైన శనివారం(ఏప్రిల్ 20) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన గోడిచర్ల ప్రాంతం నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. కాకినాడ జిల్లా సిద్ధమా? వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ‘కాకినాడ జిల్లా సిద్ధమా?’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజలు కూడా భారీ సంఖ్యలో బస్సు యాత్రలో పాల్గొని సీఎం జగన్కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. –సాక్షి, అమరావతి -
దద్దరిల్లిన కాకినాడ..!
-
ఏపీలో మత్స్యకారులకు శుభవార్త
-
చంద్రముఖి కి ఓటు వేస్తే పథకాలు అన్ని లకలకలక..!
-
బీజేపీ వదినమ్మ.. టీడీపీ మరిది కోసం పురందేశ్వరి పై సీఎం జగన్ సెటైర్లు
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
వదల బొమ్మాళీ... వదల..చంద్రబాబు పై సీఎం జగన్ సెటైర్లు
-
జ్వరమొస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ కు, పవన్ ను ఆటాడుకున్న సీఎం జగన్
-
నాకు ఈ రోజు కాకినాడలో ఉప్పొంగిన గోదావరి కనిపిస్తుంది
-
చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ..చంద్రబాబు పై నిప్పులు చెరిగిన కన్నబాబు
-
ప్రజల్లోకి సీఎం వైఎస్ జగన్ డైనమిక్ ఎంట్రీ
-
Watch Live: ‘మేమంతా సిద్ధం’ కాకినాడ సభ
-
సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర
-
అడుగడుగునా ఆప్యాయత కాకినాడ జనసంద్రం
-
మా జగనన్నకు అడ్డుకట్ట వేయలేరు
-
రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు
-
కాకినాడ బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న జనం
-
బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్
-
మేమంతా సిద్ధం బస్సుయాత్రకు విశేష స్పందన: చెల్లుబోయిన వేణు
-
ఎండను, వానను లెక్కచేయం.. మాకు జగనన్నే ముఖ్యం
-
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజైన శుక్రవారం(ఏప్రిల్ 19) షెడ్యూల్ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆయన ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా సిద్ధమా? వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ‘తూర్పుగోదావరి జిల్లా సిద్ధమా?’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజలు కూడా తామంతా సిద్ధమంటూ పెద్ద సంఖ్యలో సీఎం జగన్తో కలిసి బస్సు యాత్రలో పాల్గొన్నారు. –సాక్షి, అమరావతి -
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్
-
రాజమండ్రిలో సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే
-
పోటెత్తిన ‘పశ్చిమ’
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్త పండుగ శోభను సంతరించుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయనను చూడటానికి జనసంద్రం పోటెత్తింది. ఊరూవాడా వెల్లువలా ప్రజలు తరలివచ్చారు. అక్కచెల్లెమ్మలు దిష్టితీసి హారతులు పట్టారు. హత్యాయత్నం నుంచి బయటపడి తమ వద్దకు వచ్చిన సీఎం జగన్ను చూడటానికి అభిమాన సంద్రం ప్రవాహంలా పోటెత్తింది. తనను చూడటానికి వచ్చిన అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను, చిన్నారులను బస్సు దిగి సీఎం ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఓవైపు మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావంటూ అవ్వాతాతల ఆశీర్వచనాలు, మరోవైపు మా ఓట్లు మీకే అంటూ అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఇంకోవైపు మేమున్నామన్నా అంటూ యువకుల ఉత్సాహం మధ్య బస్సు యాత్ర ఆద్యంతం సంబరంలా సాగింది. జననేతకు జన నీరాజనం సోమవారం గుడివాడ బహిరంగ సభ ముగించుకుని ఏలూరు జిల్లా నారాయణపురం చేరుకుని రాత్రి బస చేసిన సీఎం వైఎస్ జగన్ను మంగళవారం ఉదయం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. వారి యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నారాయణపురం శివారు ప్రాంతానికి చెందిన ఉండ్రాజవరపు భుజంగరావు, గీతారాణి దంపతులు సీఎం బస్సు వద్దకు వచ్చారు. తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని సీఎం జగన్ను కోరగా ఆయన వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చి బాలుడితో అక్షరాలు దిద్దించారు. తమ అభిమాన నేతతో తమ బిడ్డకు అక్షరాభ్యాసం చేయించడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది ఎన్నటికీ మరువలేమని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తనపై అభిమానంతో ఓ చెల్లెమ్మ వేసిన పెన్సిల్ స్కెచ్పై సీఎం జగన్ సంతకం చేశారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సుయాత్ర నారాయణపురం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. రాచూరు చేరుకున్న సీఎం జగన్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అవ్వాతాతలు, అన్నా ఎలా ఉన్నావంటూ అక్కచెల్లెమ్మలు సీఎం వైఎస్ జగన్ను ఆప్యాయంగా పలకరించారు. ‘మీరంతా నాకు అండగా ఉండగా నాకేం కాదమ్మా’ అంటూ వారికి ధైర్యం చెప్పి ఆయన ముందుకు కదిలారు. తర్వాత సీతారామపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు భారీగా తరలివచ్చిన ప్రజలు జేజేలు పలికారు. అక్కచెల్లెమ్మలు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులు పట్టారు. దారిపొడవునా మేమంతా సిద్దమంటూ బారులు తీరి ప్రజలు స్వాగతం చెప్పారు. తర్వాత సీఎం జగన్ గాం«దీనగర్ మీదుగా నిడమర్రు చేరుకున్నారు. అక్కడ అడుగడుగునా అక్కచెల్లెమ్మలు నీరాజనాలు పలికారు. తన కోసం వేచి చూస్తున్నవారిని పలకరిస్తూ సీఎం ముందుకు సాగారు. భువనపల్లి మీదుగా సాగిన సీఎం జగన్ బస్సుయాత్రకు గణపవరంలో జనం పోటెత్తారు. స్థానికులు అఖండ స్వాగతం పలికారు. గణపవరం సెంటర్లో తన కోసం ఎదురుచూస్తున్న అశేష జనవాహినికి ముఖ్యమంత్రి జగన్ బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు. ఓవైపు ఎండ మండుతున్నా ప్రజలెవరూ లెక్క చేయలేదు. ప్రవాహంలా కదిలిన జనం బస్సుయాత్రను అనుసరించారు. పాములపర్రు, ఆరేడుల్లో సీఎంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడి నుంచి ఉండి చేరుకునేసరికి భారీ ఎత్తున ప్రజలు, పార్టీ నేతలు ఎదురొచ్చి జన నేతకు ఘనస్వాగతం పలికారు. చిమ్మచీకట్లోనూ అభిమాన వెలుగు చీకటి పడినప్పటికీ సీఎం జగన్పై ప్రజాభిమానం ఏమాత్రం సడలలేదు. భీమవరం నుంచి గొల్లలకోడేరు వచ్చే వరకూ ప్రజలు జగన్ రాక కోసం వేచి చూశారు. వారి వద్దకు చేరుకున్న జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి గరగపర్రు, యండగండి, సాగుపాడు, కేశవరం, అప్పన్నపేట మీదుగా పిప్పర చేరుకున్న జననేత బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. బాణసంచా వెలుగులు, డప్పు వాయిద్యాలతో పిప్పర గ్రామమంతా తరలివచ్చి జగన్కు జై కొట్టింది. అగ్రహారం, చిలకంపాడు, ముదునూరు, కాశిపాడు దాటి చింతపల్లి నుంచి రావిపాడు చేరుకుంది. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా తణుకు మండలంలోని దువ్వ గ్రామానికి చేరుకున్న జగన్కు అపూర్వ స్వాగతం లభించింది. పొద్దుపోయినా తమ అభిమాన నాయకుడి కోసం పల్లెలు ఎదురుచూశాయి. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ రాత్రి 10.09 గంటలకు తేతలి శివారులోని రాత్రి బస ప్రాంతానికి జగన్ చేరుకున్నారు. అక్కడికి సైతం వచ్చిన అభిమానులు జగన్ను చూసి జగనన్నా మళ్లీ నువ్వే సీఎం అంటూ నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ 16వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రను సీఎం జగన్ ముగించారు. భీమవరం జనసంద్రం ఉండి నుంచి భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద బహిరంగ సభకు సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ రోడ్ షో ద్వారా చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ జరగాల్సి ఉండగా జనాభిమానం వెల్లువెత్తడంతో గంటన్నర ఆలస్యమైంది. అప్పటికే భీమవరం జనసంద్రమైంది. రోడ్లన్నీ జనజాతరను తలపించాయి. డప్పులు, డీజేలు మోగిస్తూ అభిమానులు వీధుల్లో ఆనందతాండవం చేశారు. సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ర్యాంప్పై నడుస్తూ జనసంద్రానికి సీఎం జగన్ అభివాదం చేశారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ ‘ఈ మధ్య కోపం ఎక్కువై చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు.. నాకేదో అయిపోవాలని కోరుకుంటున్నారు’ అని మండిపడ్డారు. ‘అలాగే భార్యల్ని మార్చినట్టు నియోజకవర్గాలను మార్చేస్తున్న దత్తపుత్రుడికి బీపీ పెరిగిపోతోంది’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. దీంతో సభలో ఉన్నవారి నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సాయంత్రం 6.23 గంటలకు సభ ముగియగానే సీఎం వైఎస్ జగన్ భీమవరం మీదుగా తిరిగి రోడ్ షో కొనసాగించారు. చీకటి పడినప్పటికీ గొల్లలకోడేరులో ప్రజలు తమ అభిమాన నేత రాకకోసం వేచి చూశారు. వారి వద్దకు చేరుకున్న సీఎం జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జన ప్రవాహం భారీగా రావడం వల్ల యాత్ర ఆలస్యమవుతుండటంతో బస ప్రదేశాన్ని అప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. ముందుగా నిర్ణయించిన తూర్పుగోదావరి జిల్లా ఈతకోట నుంచి తణుకు వద్ద తేతలి గ్రామ శివారులో జాతీయ రహదారిని ఆనుకుని బసను ఏర్పాటు చేశారు. తరలివచ్చిన ఊళ్లకు ఊళ్లు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూడటానికి.. యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఊళ్లకు ఊళ్లే తరలివచ్చాయి. అన్నా..మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధమంటూ యువత నినదించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా స్థానిక నేతలు ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలు వేశారు. అలాగే అడుగడుగునా అన్నదానాలు, మజ్జిగ పంపిణీ చేపట్టారు. జనసంద్రం తరలిరావడంతో బస్సుయాత్ర నిదానంగా ముందుకు సాగింది. అందరినీ పలకరిస్తూ షెడ్యూల్ కంటే ఆలస్యంగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగింది. దీంతో ఉండి శివారులో మ.3.53 గంటలకు మధ్యాహ్న విరామ ప్రాంతానికి సీఎం జగన్ వెళ్లారు. ఉండి నియోజకవర్గం కోలమూరు గ్రామంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా నాలుగు నెలల బాలింత చంటి బిడ్డతో సీఎం జగన్ను చూడాలని వేచి చూసింది. గుర్తు పట్టి.. బస్సు ఎక్కించుకుని.. ద్వారకా తిరుమల: రహదారి పక్కన నిలబడి సీఎం వైఎస్ జగన్కు అభివాదం చేస్తున్న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. జనసంద్రంలో రాజబాబును చూసి గుర్తు పట్టిన సీఎం వైఎస్ జగన్ బస్సు ఆపించి మరీ అందులో ఆయనను ఎక్కించుకుని తన వెంట తీసుకెళ్లడం పార్టీ శ్రేణులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నారాయణపురం నుంచి భీమవరానికి వెళుతున్న సీఎం వైఎస్ జగన్కు నిడమర్రు వద్ద రాజబాబు అభివాదం చేశారు. ప్రజల్లో ఉన్న రాజబాబును గుర్తు పట్టిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించి, అందులో ఆయనను ఎక్కించుకున్నారు. ఉండి వరకు సీఎంతోపాటు బస్సులో వెళ్లానని.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను ఆయనకు వివరించానని రాజబాబు తెలిపారు. ఎంతో మంది నాయకుల మధ్యలో ఉన్నా తనను జగనన్న గుర్తుపట్టి, ఉన్నఫళంగా రోడ్డుపై బస్సు ఆపి, ఎక్కించుకుని తీసుకెళ్లడం ఒకింత తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడే ఏ ఒక్కరినీ జగనన్న మరచిపోరని చెప్పడానికి తనకు ఎదురైన అనుభవమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దుర్మార్గులకు మనసనేది ఉందా? సీఎం వైఎస్ జగన్ నుదుటన గాయాన్ని చూసి చలించిపోయిన ప్రజలు బస్సు యాత్రలో దారిపొడవునా ఆప్యాయతానురాగాలు సాక్షి, భీమవరం: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూడటానికి ఊరూవాడా తరలివచ్చింది. ఈ సందర్భంగా ఆయన నుదుటన గాయాన్ని చూసినవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు మంచి చేస్తున్న మనిషిని మట్టుబెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో ఆ దుర్మార్గులకంటూ మండిపడ్డారు. దెబ్బ తగిలినప్పుడు బాధతో ఎంత విలవిలలాడాడో బిడ్డ అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గాయం త్వరగా నయం కావాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం జాగ్రత్త బాబు అంటూ అవ్వాతాతలు సీఎం జగన్పై ఆప్యాయత చూపారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో దారిపొడవునా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఆయనకు ఏమన్నా అయితే మేమేమైపోవాలి.. సీఎం వైఎస్ జగన్ వల్ల మేం చాలా లబ్ధిపొందాం. ఆయన చేసిన సహాయానికి మేము రుణం తీర్చుకుంటాం. ఆయన మాలాంటి పేదలకు చేస్తున్న సేవల్ని అడ్డుకునేందుకు కుట్రపన్ని హత్యాయత్నం చేశారు. ఆయనకు ఏమైనా అయితే మేమేమైపోవాలి? – ఎం.పావని, గణపవరం ఎంత విలవిలలాడిపోయారో? జగన్ సర్ నుదుటన దెబ్బ చూడలేకపోయాం. ఆ దెబ్బ తగలినప్పుడు ఆయన ఎంత విలవిల్లాడిపోయారో. పేదలకు మంచి చేస్తున్న ఆయనపై హత్యాయత్నం చేయడానికి దుర్మార్గులకు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులు జగన్ సర్పై నిండా ఉన్నాయి. ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పేదలకు మంచి చేస్తున్న ఆయనకు అంతా మంచే జరుగుతుంది. – కొణిదెల అలంకారం, మందలపర్రు చాలా బాధనిపించింది.. పేదల కోసం పాటుపడుతున్న సీఎం జగన్పై హత్యాయత్నం చేయడం దారుణం. నాకు చాలా బాధనిపించింది. గాయంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఆయనను చూడాలన్న ఆశతో చుట్టుపక్కల వారి సాయంతో వచ్చాను. సొంత సోదరుడి మాదిరి ప్రజలకు మంచి చేస్తున్న జగన్పై దుర్మార్గులు దాడి చేయడం చాలా నీచమైన పని. – పత్తివాడ జయలక్ష్మి, నిడమర్రు ముఖంపై దెబ్బ చూసి తల్లడిల్లిపోయా.. జగన్ బాబు ముఖంపై దెబ్బ చూసి తల్లడిల్లిపోయాను. అంత దెబ్బ ఎలా తట్టుకున్నాడో. జగన్ బాబుకు మంచి జరగాలని దేవుడికి తైలాభిషేకం చేయించాను. ఆయనపై హత్యాయత్నం చేసినవారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. – కర్తాకి రాజ్యం, క్రొవ్విడి -
ఖాళీ డబ్బాలో రాళ్లు పెట్టి ఊపితే.. చంద్రబాబు పై సీఎం జగన్ మాస్ ర్యాగింగ్
-
ఒకసారి చేస్తే పొరపాటు, మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
నా ప్రశ్నకు బీపీ పెరిగి దత్తపుత్రుడు ఊగిపోతున్నాడు..!
-
మీ జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు: వైఎస్ జగన్
-
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు
-
శబరి,ఇంద్రావతి ఉప్పొంగినట్లుగా.. భీమవరంలో నాకు జనసముద్రం కనిపిస్తుంది
-
Watch Live: మేమంతా సిద్ధం భీమవరం సభ
-
ఏలూరు జిల్లా గణపవరం వద్ద సీఎం వైఎస్ జగన్ రోడ్ షో దృశ్యాలు
-
సీఎం జగన్ రాకతో జనసంద్రం అయిన గణపవరం
-
ఎన్ని కుట్రలు చేసిన సీఎం జగన్ గెలుపును ఆపలేరు
-
చంద్రబాబుకు ఎన్నికల్లోనే బుద్ధి చెబుతాం: వాలంటీర్లు
-
సీఎం జగన్ ను అడుగడుగునా అపూర్వ స్వాగతం పలుకుతున్న జనం
-
అక్షరాభ్యాసం చేయించిన సీఎం జగన్
-
మళ్లీ జగనే.. బాబు వెన్నులో వణుకు.
-
నారాయణపురంలో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో
-
ఆ బాబును తీసుకొని రండి
-
రెట్టించిన ఉత్సాహంతో...
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం.. ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ను అందించినందుకు వారు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కుట్ర అది.. ఇక జగన్పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం బస్సుయాత్ర కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. మొదటి ఓటు జగన్ మామకే.. ఫస్ట్టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా. ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి జగనే మళ్లీ సీఎంగా రావాలి.. జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి టీడీపీ హయాంలో నరకయాతన టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు సూరీడు నిప్పులు చెరుగుతున్నా.. ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు. మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్కు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు. -
వీళ్ళే మన అభ్యర్థులు..ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
దాడి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!
-
నేరుగా ఎదుర్కోలేక చవట దద్దమ్మ..రఫ్ఫాడించిన కొడాలి నాని
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
జగన్ కోసం పోటెత్తిన జనం రికార్డు సృష్టించిన గన్నవరం
-
కేసరపల్లి బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్ విజువల్స్
-
జగన్ మామకే మా తొలి ఓటు
-
గన్నవరం జంక్షన్ దగ్గర సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం
-
ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్
-
సీఎం వైఎస్ జగన్ గన్నవరం బస్సు యాత్ర డ్రోన్ విజువల్స్
-
ప్రజల కోసం ఎందాకైనా.. గాయంతో సిద్ధం..!
-
నేడు సీఎం జగన్ బస్సు యాత్ర యధాతథం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం(ఏప్రిల్ 15) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రతి రోజు ఓ జైత్రయాత్రలా కొనసాగుతోంది. అడుగడుగునా సీఎం వైఎస్ జగన్కు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది మేమంతా సిద్ధం 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 15) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ , పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. చదవండి: ఇది ఖచ్చితంగా క్లాస్ వార్.. పేదలపై పెత్తందారుల దాడి -
కృష్ణా తీరం.. పోటెత్తిన జనప్రవాహం
(మేమంతా సిద్ధం బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఆకాశం నిప్పులు చిమ్మినా.. మేఘాలకు చిల్లులు పడినా.. నీపై మా అభిమానం తగ్గదు అన్నా.. నింగి, నేల ఉన్నంతకాలం నీతోనే మేమంతా జగనన్నా.. అంటూ సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుంటూరు ప్రజల ఘాటైన ప్రేమాభిమానాలను గుండెల నిండా నింపుకుని.. ఎన్టీఆర్ జిల్లా వాసుల ఆప్యాయతలను పంచుకోవడానికి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ రెండు జిల్లాలనూ కలిపే కనకదుర్గ వారధి జన ప్రవాహంతో పోటెత్తింది. అడుగుతీసి అడుగువేయలేనంతగా ప్రజలతో నిండిపోయింది. గుండెల్లో నింపుకున్న గుంటూరు.. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్లో రాత్రి బస వద్ద మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు జగన్ను కలిశారు. పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ సీఎం జగన్ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఉ.10.13 గంటలకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. జననేత రాక కోసం అప్పటికే జాతీయ రహదారి అభిమానులతో నిండిపోయింది. రహదారికి రెండువైపులా జగన్ రాకకోసం ప్రజలు ఉత్సాహంతో ఎదురుచూశారు. అల్లంత దూరాన సీఎం జగన్ బస్సును చూడగానే ఒక్కసారిగా పరుగు పరుగున ఎదురెళ్లారు. జగనన్నా.. అంటూ బిగ్గరగా నినదిస్తూ.. చేతులు ఊపుతున్న అభిమానులను చూసి జగన్ ప్రతిగా అభివాదం చేశారు. దారిపొడవునా తనకు ఎదురొస్తున్న జన ప్రవాహానికి అభివాదం చేస్తూ.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ బస్సుయాత్ర ముందుకు సాగింది. కంతేరు అడ్డరోడ్డులో అక్కడి గ్రామస్తులు జగన్కు గజమాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత చినకాకాని వద్ద మహిళలు వైఎస్సార్సీపీ జెండాలతో ఎదురొచ్చారు. వారిని చిరునవ్వుతో పలకరించి కాజా టోల్ప్లాజా వద్దకు వచ్చేసరికి ఆ ప్రాంతమంతా అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. స్థానికులు భారీ గజమాలతో జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారిచ్చిన ఆప్యాయతను అందుకుని ఎన్ఆర్ఐ సర్కిల్ మీదుగా మంగళగిరి చేరుకున్నారు. హైవేపై బారులు తీరిన జనం జగన్కు జేజేలు పలికారు. వారికి అభివాదం చేస్తూ సీకే కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న సీఎం అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనకదుర్గ వారధిపై జనప్రవాహం.. ఇక గుంటూరు జిల్లా నుంచి జగన్ బస్సుయాత్ర వస్తోందని తెలిసి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, పార్టీ అభిమానులు జగన్కు స్వాగతం పలికేందుకు కనకదుర్గ వారధిపైకి భారీగా తరలివచ్చారు. వర్షంలోనే గుంటూరు జిల్లా ఘనంగా వీడ్కోలు పలుకగా, ఎన్టీఆర్ జిల్లా ఆత్మీయంగా స్వాగతం చెప్పింది. దుర్గమ్మ నీడలో.. కృష్ణమ్మ సాక్షిగా.. కనకదుర్గ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇదే వారధిపై పాదయాత్ర చేసిన రోజులను ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసుకున్నారు. విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు వెంటరాగా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సా.5.38 గంటలకు వారధి దాటింది. విజయవాడలో జనజాతర.. నగర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా అభిమాన నాయకుడి ఆగమనంతో విజయవాడ నగరం జన జాతరను తలపించింది. మహిళలు, చిన్నారుల కోలాటాలు, స్టిక్ వాకర్స్, డప్పులు, వాయిద్యాలు, బటర్ఫ్లై వేషధారణలు, శక్తి వేషాలు, కేరళ సంప్రదాయ నృత్యాలు, బాణాసంచా కాంతులు, డీజే సౌండ్లు, భారీ గజమాలలు, జగన్ నిలువెత్తు కటౌట్లు.. ఇలా ఒకటేమిటి.. దారిపొడవునా కోలాహలం కనిపించింది. వారధి దాటిన దగ్గర్నుంచీ అభిమానులు పోటెత్తడంతో బస్సుయాత్ర ముందుకు కదలడమే కష్టమైంది. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. భవనాలన్నీ జనంతో నిండిపోయాయి. కృష్ణలంక సాయిబాబా గుడి నుంచి ప్రతిదారీ ప్రజాభిమానంతో కిక్కిరిసిపోయింది. యాత్ర బందరు రోడ్డు రమేష్ ఆస్పత్రి సెంటర్ నుంచి శిఖామణి సెంటర్కు చేరుకోగానే అత్యంత భారీ గజమాలతో అభిమానులు జగన్కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మెట్రో సెంటర్, చుట్టుగుంట, రోకళ్లపాలెం, సత్యనారాయణపురం, సింగ్ నగర్ డాబాకోట్లు సెంటర్ వరకూ ఇసుకేస్తే రాలనంత జనం బస్సుయాత్ర వెంట నడిచారు. సింగ్నగర్ వంతెనపైకి చేరుకోగానే మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. ప్రజల మధ్య భారతమ్మ.. శనివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తాడేపల్లి జంక్షన్కు చేరుకున్న బస్సుయాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ బస్సుయాత్రగా వస్తున్న సీఎం జగన్కు రోడ్డుపై నిలబడి అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య తానూ ఓ సామాన్యురాలిగా చిరునవ్వుతో జగన్కు చేతులు ఊపారు. ప్రతిగా సీఎం జగన్ కూడా బస్సులో నుంచే భారతికి అభివాదం చేశారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులిచ్చారు. అనంతరం మణిపాల్ ఆసుపత్రి జంక్షన్కు భారీగా చేరుకున్న అభిమానులు మళ్లీ రా.. అన్నా అంటూ వీడ్కోలు పలికారు. -
నేతన్నకు నాయకత్వం
బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి ‘‘చేనేతలకు అన్ని విధాలా అండగా ఉంటూ వారు రాజకీయంగా కూడా ఎదిగేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో పెద్దపీట వేశాం. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన 54 వేల ఇళ్లను చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ కేసులు వేశారు. వాళ్లు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే.. 54 వేల మందికి జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే నువ్వెందుకు అడ్డుకున్నావ్..! బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. జగన్ చేయవచ్చు, ఇంకొకరు చేయవచ్చు! బాగుపడేది పేదవాడు అయినప్పుడు అడ్డు పడాలని చూసిన ఏ నాయకుడైనా రాజకీయాలకు అనర్హుడు’’ – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: నేతన్న నేస్తం అనే ఒక్క పథకం ద్వారానే చేనేతకారులకు రూ.970 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తూ ఏకంగా 1.06 లక్షల మందికి వర్తింపజేశామని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికీ ఏటా నేతన్న నేస్తం అందిస్తూ ఏ ఒక్కరూ మిస్ కాకుండా అర్హులందరికీ పారదర్శకంగా ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నామన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో చేనేతకారులతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. బతుకులు మార్చినవాడే నాయకుడు.. బస్సు యాత్రలో భాగంగా పలు వృత్తులు, వ్యాపకాల్లో నిమగ్నమైన వారిని కలుస్తూ వస్తున్నాం. ఆ వర్గాలకు జరిగిన మంచితోపాటు ఐదేళ్లలో వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయో నేరుగా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంకా మెరుగ్గా, సమర్థంగా చేయడంపై సూచనలు, సలహాలు ఈ కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్నాం. ప్రజలకు చేదు అనుభవాలను మిగిల్చిన చంద్రబాబు మాదిరిగా కాకుండా ప్రతి పేదవాడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేలా 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఆ నాయకత్వ స్థానంలో నిలబెట్టినందుకు మన బతుకులు మారాలి. అలాంటి నాయకుడు ఆ స్థానంలో ఉంటేనే మన బతుకులు మారతాయి. ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే ఐదేళ్లు మళ్లీ మనం చేయగలిగింది ఏమీ ఉండదు. మరోసారి మోసపోయి మన బతుకులు అంధకారంలోకి వెళ్లిపోతాయి. నేతన్నకు వెన్నుపోటు.. 98 శాతం ఇంటూ గుర్తులే ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు మేనిఫెస్టో 21, 22వ పేజీల్లో చేనేతలకు కాస్తంత స్థలం కేటాయించారు. ఇప్పటి మాదిరిగానే కూటమిగా ఏర్పడి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో హామీలిచ్చి 98 శాతం ఎగ్గొట్టారు. నూటికి 2 మార్కులు కూడా రాలేదు. అదీ చంద్రబాబు ట్రాక్ రికార్డు. ఆ హామీలు ఒక్కసారి గమనిస్తే చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది సున్నా. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు గతంలోనే ఇచ్చారు. జరీపై వ్యాట్ రద్దు చేయలేదు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష మేర సంస్థాగత రుణ సౌకర్యం కల్పించలేదు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ఏటా రూ.1,000 కోట్లు కేటాయించలేదు. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పిస్తామంటూ ఆప్కోకే బకాయిలు పెట్టాడు. జిల్లాకో చేనేత పార్కు ఏర్పాటు చేయలేదు. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆస్పత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు కాలేదు. సగం ధరకే జనతా వస్త్రాలు, జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ హామీ అమలు చేయలేదు. కేంద్రం ఇస్తోంది కాబట్టి చేనేత సొసైటీలకు 20 శాతం రాయితీపై ముడి సరుకుల సరఫరా కొద్దో గొప్పో జరిగింది. ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు ఒక్కరికన్నా ఇచ్చారా? ఇలా 98 శాతం ఇంటూ గుర్తులే ఉంటే రెండు శాతం మాత్రమే టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఈరోజు ఎన్నికలు రావడంతో మరోసార వంచనకు తయారయ్యాడు. 58 నెలల్లో రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా 58 నెలల వ్యవధిలో రూ.3,706 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నా. ఇవన్నీ పారదర్శకంగా కనిపిస్తున్నాయి. మీ బ్యాంకు ఖాతాలకు గత 58 నెలల్లో ఎన్ని డబ్బులు జమ అయ్యాయి? చంద్రబాబు హయాంలో ఎన్ని డబ్బులు పడ్డాయో ఒక్కసారి ఖాతాలను పరిశీలిస్తే తేడా మీకే తెలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం ద్వారానే రూ.970 కోట్లు 1.06 లక్షల మందికి అందచేశాం. 94,410 చేనేత కుటుంబాలు ఆత్మగౌరవంతో ఇంటివద్దే పెన్షన్ అందుకున్నాయి. నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్న పరిస్థితి వచ్చిందంటే దివంగత నేత వైఎస్సార్ చలువే. తొలిసారిగా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది మన ప్రభుత్వమే. అమెజాన్, మింత్ర, ఫ్లిప్కార్ట్, మీరా, పేటీయం లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారి ఫ్లాట్ఫామ్స్లో మన వస్త్రాలను చేర్చాం. మనం రాకముందు ఆప్కో బకాయిలే రూ.120 కోట్లు ఉంటే వాటిని క్లియర్ చేయడమే కాకుండా రూ.469 కోట్లు ఆప్కోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్నాం. విద్యాకానుక ద్వారా 44 లక్షల మంది స్కూలు పిల్లలకు యూనిఫాం అందిస్తుండగా తొలి ప్రాధాన్యతగా చేనేతకారులకే ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించాం. బీసీల కోటలో బాబు కుటుంబం తిష్ట చేనేతకారులు అధికంగా ఉండే మంగళగిరి ప్రాంతంలో వారికి రాజకీయంగా కూడా పెద్దపీట వేశాం. స్థానిక ఎమ్మెల్యే ఆర్కేను పిలిచి మాట్లాడి నా చేనేత చెల్లెమ్మకు సీటు ఇచ్చేందుకు సహకరించాలని కోరా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను సిద్ధంగా ఉన్నానంటూ ముందుకొచ్చాడు. లావణ్యమ్మకు మంగళగిరిలో, బుట్టమ్మకు ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. సునీతమ్మ, హనుమంతన్న ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ప్రొద్దుటూరు, రాయదుర్గం, వెంకటగిరి, ఎమ్మిగనూరు, జగ్గయ్యపేట, చీరాల, ధర్మవరం, పెడన లాంటి 8 చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నది నేతన్నలే. దీనికి కారణం మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టే. ఒకవైపు మీ బిడ్డ చేనేతకారులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తూ అడుగులు వేస్తుంటే మరోవైపు చంద్రబాబు ఆయన కుమారుడు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్నచోట్ల కూడా వారికి సీట్లు ఇవ్వకుండా ఆ స్థానాల్లో తిష్ట వేసి రూ.కోట్లు వెదచల్లుతున్నారు. కుప్పంలో బీసీలే ఎక్కువ. చంద్రబాబు బీసీల కోటలో పాగా వేసి డబ్బులతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు. మీ బిడ్డ మాత్రం కుప్పంలో బీసీనే నిలబెట్టాడు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకే కేటాయించి సామాజిక సాధికారతపై చిత్తశుద్ధి చాటుకున్నాం. మంగళగిరికి మంచి జరిగిందిలా.. మంగళగిరి నియోజకవర్గంలో 1,20,187 ఇళ్లు ఉండగా 1,08,408 ఇళ్లు అంటే 90.1 శాతం గృహాలకు లబ్ధి చేకూర్చాం. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.1,530 కోట్లు జమ చేశాం. మంగళగిరి నియోజకవర్గంలో నెలకొల్పిన 83 సచివాలయాల్లో ఈ వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాం. ఇక నాన్ డీబీటీతో మరో రూ.735 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. అంటే మొత్తం రూ.2,265 కోట్లు మేర మేలు చేశాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన అభ్యర్థి లావణ్యమ్మ దగ్గర చంద్రబాబు కుమారుడి వద్ద ఉన్నంత డబ్బులు లేవు. ఎన్నికలొచ్చేసరికే ఆయన ఓటుకు రూ.4 వేలు, రూ.5 వేలు, రూ.6 వేలు అంటాడు. ఇస్తే తీసుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మళ్లీ ప్రతి ఏడాది నేతన్న నేస్తం ఇచ్చే వారికే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు, బడులు, హాస్పిటళ్లు బాగుంటాయో వారికే ఓటేయండి. ఎవరు ఉంటే పేదవాడు అప్పులపాలు కాకుండా వైద్యం అందుతుందో, మన ఇంటికే పెన్షన్ డబ్బులు నడుచుకుంటూ వస్తాయో ఆలోచించి ఓటేయండి. ఎవరు ఉంటే అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తాయో వారికే ఓటు వేయాలని కోరుతున్నా. చేయగలిగిందే చెబుతాం.. మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెబుతాం. అబద్ధాలాడటం తప్పు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం నెరవేర్చి ఈరోజు మళ్లీ మీ ఆశీస్సులు కోరుతున్నాం. నేతన్నలకు ఏటా రూ.24 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు అందిస్తున్నాం. ఈ డబ్బులతో ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు. ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు. మీరు కోరుతున్నట్లుగా అద్దె మగ్గందారులకూ ప్రయోజనాలు అందించాలని నాకూ ఉంది. కానీ అలా చేయగలుగుతామా? ఎందుకంటే అద్దె మగ్గంలో ఎవరు ఉంటున్నారో, ఎవరు వాడుకుంటున్నారో ఎలా చెప్పగలం? ఈరోజు ఒకరు ఉంటారు.. రేపు మరొకరు ఉండవచ్చు. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలి. మన పాలసీ ఏమిటంటే.. ఏ పార్టీవారైనా సరే అర్హత ఉంటే పారదర్శకంగా లబ్ధి చేకూర్చాలి. ఆదుకుని ఆదరించారు... చేనేత వృత్తిని గత ప్రభుత్వాలు గుర్తించలేదు. దివంగత వైఎస్సార్ మాత్రమే చేనేతకారులకు 50 ఏళ్లకే పెన్షన్ సదుపాయం, ఆప్కోస్ ద్వారా సబ్సిడీలు కల్పించారు. సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు ఏటా రూ.24 వేలను సాయంగా అందిస్తున్నారు. నవరత్నాల సంక్షేమాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే. టీడీపీ హయాంలో చేనేతలను నట్టేట్లో ముంచితే ఆప్కోను ఆదుకుని రూ.180 కోట్లు అందించారు. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇచ్చారు. మనకు జగనన్న లాంటి నాయకుడు ఉండటం ఎంత అవసరమో అందరూ ఆలోచన చేయాలి. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. – జింకా విజయలక్ష్మి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ మంగళగిరిలో తయారయ్యే చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్యను, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ గురించి ఆరా తీశారు. రంగులు, రసాయనాల వల్ల త్వరగా వృద్ధాప్యం బారిన పడుతున్న చేనేతకారులకు 50 ఏళ్లకే పెన్షన్ అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మేం కోరిన మరో 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్ ఫండ్ను రెట్టింపు చేసి 16%కి పెంచారు. చంద్రబాబు ప్రభుత్వం రిబేట్ను తొలగిస్తే వైఎస్సార్ పునరుద్ధరించారు. డైస్, కెమికల్స్పై సబ్సిడీ ఇచ్చారు. రూ.100 కోట్లు ఆప్కోకి విడుదల చేయడంతో చేనేత పరిశ్రమ నిలబడింది. మంగళగిరిలో ఇళ్లులేని చేనేత కార్మికుల కోసం 25 ఎకరాలు ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక 150 మంది మగ్గాలకు షెడ్లు వేశాం. నవరత్నాల్లో భాగంగా చేనేతకారులకు ఏటా రూ.24 వేలు చొప్పున అందిస్తున్నారు. చేనేత కార్మికుల జీవితాలను బాగుచేసింది నాడు వైఎస్సార్ అయితే నేడు వైఎస్ జగన్ మాత్రమే. ఆప్కోకి రూ.100 కోట్లు రిలీజ్ చేశారు. మంగళగిరిలో మార్కెటింగ్ సౌకర్యం కోసం రూ.3 కోట్లతో 40 షాపులను నిర్మించారు. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ జగనన్న మా చేనేతలకు షెడ్లు వేశారు. నాకు చేయూత వస్తోంది. మావారికి పెన్షన్ ఇస్తున్నారు. నేతన్న నేస్తం ఇప్పిస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న చెప్పారు. – నందం దుర్గ, చేనేత మహిళ అధైర్యపడవద్దు.. అండగా ఉంటా అనారోగ్య సమస్యలు విన్నవించుకున్న బాధితులకు సీఎం భరోసా పెదకాకాని: మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘అధైర్యపడవద్దు.. అండగా ఉంటా’నంటూ వారి కన్నీళ్లు తుడిచారు. గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ పార్వతి తన కుమార్తె డింపుల్తో కలిసి సీఎం జగన్ను కలిశారు. తన కుమార్తె వినికిడి లోపంతో బాధపడుతోందని.. మాటలు కూడా రావని.. చికిత్సకు సాయమందించాలని పార్వతి కోరగా.. సీఎం జగన్ ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. పాపకు దివ్యాంగ పింఛన్ వస్తుందా అని ఆరా తీశారు. సర్జరీ చేయించడంతో పాటు వినికిడి మిషన్ ఉచితంగా అందజేస్తానని భరోసా ఇచ్చారు. రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ‘నా బిడ్డకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ఆదుకోండయ్యా’ అంటూ గుంటూరు జిల్లా కొప్పురావూరుకు చెందిన గోపాలం సుజాత తన కుమార్తె సౌజన్యతో కలిసి నంబూరు అడ్డరోడ్డు వద్ద సీఎం వైఎస్ జగన్ను కలిసింది. సీఎం జగన్ వారిని ఓదార్చి.. ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతుందా అని ఆరా తీశారు. సమస్య తెలిసి నాలుగు నెలలవుతుందని వారు బదులివ్వగా.. వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలిసిన వారు ఎవరైనా కిడ్నీ ఇస్తామంటే ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చారు. కిడ్నీ దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలి చేనేత కార్మికులకు 100 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. రత్నాల చెరువు ప్రాంతంలో చాలామంది అద్దె మగ్గాలతో నేత పనులు చేస్తున్నారు. వారికి కూడా సాయం చేయాలని కోరుతున్నా. మాకూ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. – కొండేటి కుమారి, చేనేత మహిళ, రత్నాలచెరువు, మంగళగిరి సీఎం వైఎస్ జగన్ దీనికి సమాధానం ఇస్తూ... ‘మంగళగిరి నియోజకవర్గంలో లే అవుట్లు రూపొందించి 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఆ అక్కచెల్లెమ్మలు జగన్ను ఎక్కడ గుండెల్లో పెట్టుకుంటారో అనే భయంతో చంద్రబాబు, లోకేష్ కోర్టుకు వెళ్లి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంటూ కేసులతో అడ్డుపడ్డారు. మీ బిడ్డ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ పోరాటం చేయడంతో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కూడా శాంక్షన్ చేయించాం. కట్టడం ప్రారంభించే సమయానికి చంద్రబాబు మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లి కేసు వేయడంతో మేటర్ హియరింగ్ కోసం పోస్ట్ పోన్ చేస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ చేసే ఆస్తిని పెడుతుంటే అడ్డుకున్నది చంద్రబాబు, లోకేషే’ అని పేర్కొన్నారు. చేనేతల కోసమే లావణ్యకు టికెట్ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: బీసీలు ఎక్కువ ఉన్న చోట్ల కూడా చంద్రబాబు, ఆయన కుమారుడే పోటీ చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ కనుక.. తాము మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చామని చెప్పారు. ఈ తేడాను గమనించాలని ప్రజలను కోరుతూ సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు. ‘మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు, ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి రూ.కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు ఎక్కువ. అయినా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించాలని కోరుతున్నాను’ అంటూ శనివారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. -
విజయవాడలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
-
సీఎం జగన్కు అభివాదం చేసిన సతీమణి వైఎస్ భారతీ
-
విజయవాడ సిటీలోకి జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
జోరు వానలో పోటెత్తిన అభిమానం
-
జనసంద్రమైన కనకదుర్గ వారధి
-
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు న్యాయవాదుల స్వాగతం
-
భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం
-
బస్సు యాత్రలో నేనున్నప్పుడు ఆ జనాన్ని చూసి ఆశ్చర్యం వేసింది
-
చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి
-
గుంటూరులో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో దృశ్యాలు
-
పులివెందులలో షర్మిల ప్లాప్ షో
-
బాలయ్య కోపం ఎవరి మీద?
ఇప్పటిదాకా ఒక లెక్క. ఈసారి మాత్రం ఓ లెక్క. హిందూపురం కంచుకోటను బద్ధలు కొట్టి టీడీపీని ఓడించేందుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా దీపికకు సీటు కేటాయించింది. తద్వారా గత ఐదేళ్లలో మొక్కుబడిగా నియోజకవర్గాన్ని సందర్శిస్తున్న నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. అయితే నామినేషన్ల పర్వం దగ్గర పడింది కదా!. బహుశా అందుకేనేమో షూటింగ్కు బాలయ్య పేకప్ చెప్పినట్లున్నారు. ప్చ్.. హిందూపురంలో ఈసారి బాలయ్య గెలుపు కష్టమే. టీడీపీ తమ కంచుకోటగా భావిస్తూ వస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.. అదీ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న బలంగా వినిపిస్తున్న టాక్ ఇదే. ఈ నేపథ్యంలో.. శనివారం నుంచి కదిరి నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారానికి బాలయ్య సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా.. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారట. విశేషం ఏంటంటే.. ‘బాలయ్య అన్స్టాపబుల్’ పేరుతో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు. ఆ బస్సు గురించి చివర్లో ఓ ముచ్చట చెప్పుకుందాం. అది ఎన్టీఆర్ క్రేజ్ వల్లే.. హిందూపురం.. ఈ సీటు నుంచే స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1998లో మరోసారి గెలిచారు. 1994లో మూడవసారి గెలిచి 1996లో మరణించేటంతవరకూ కొనసాగారు. అంటే.. పదకొండేళ్ల పాటు ఏకధాటిగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణించాక జరిగిన ఉప ఎన్నికలో అదే సీటు నుంచి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ గెలిచారు ఆయన 1999 దాకా దాదాపుగా మూడున్నరేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ అక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఆ సమయంలో హిందూపురం నుంచి పోటీ చేసి బాలయ్య ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. అయితే..ఆ సమయంలో బాలయ్య 16 వేల ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లోనూ 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండు ఎన్నికల్లోనూ పది శాతం ఓట్ల తేడాతో బాలయ్య నెగ్గారు. ఈ రెండుసార్లూ కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల కారణంగా ఓట్లు చీల్చాయి. అంటే.. ఏ లెక్కన చూసుకున్నా బాలయ్య ‘అఖండ’ మెజారిటీ ఏం గెలవలేదు. పైగా ఈసారి బాలయ్యపై వ్యతిరేకతకు అదనంగా.. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ, రాయలసీమ ఎన్నికల బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి తీసుకోవడంతో.. బాలయ్యకు హిందూపురంలో ఈసారి టీడీపీకి గడ్డు పరిస్థితే ఎదురుకావొచ్చనే చర్చా బాగా నడుస్తోంది. దూరం దూరం.. పీఏల యవ్వారం! అభివృద్ధి పనులా?.. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ సందర్శించింది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. షూటింగ్ల బిజీలతోనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు, దున్నపోతుల మీద బాలయ్య పేర్లు రాసి ధర్నాలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. మొదటి దఫాగా గెలిచిన సమయంలోనే కాదు.. ప్రతిపక్ష హోదాలో రెండోసారి కూడా అదే తీరును బాలయ్య కనబరుస్తూ వచ్చారు. అందుకే అక్కడి ప్రజల్లో ఆయన తీరుపై వ్యతిరేకత బలంగా ఉంది. అంతెందుకు.. ఇప్పుడు ఆయన చేపడుతున్న బస్సు యాత్ర హడావిడి కూడా.. ఎన్నికల నేపథ్యంలోనే అదీ సుదీర్ఘకాలం పది నెలల తర్వాత ఆయన మళ్లీ నియోజకవర్గం వైపు అడుగులేయిస్తోన్నదే. వీటన్నింటికి తోడు ఆయన పీఏలపై వచ్చిన ఆరోపణలు ఆయన ఇమేజ్ను మరింత పల్చన చేశాయి. గతంలో హిందూపురంలో బాలయ్య తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు అభిమానులు జర జాగ్రత్త! నెలల తరబడి నియోజకవర్గంలో బాలకృష్ణ కానరాక టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి జరుగుతున్న చమక్కులు చూస్తున్నదే. అభిమానులు, కార్యకర్తలతో బాలయ్య వ్యవహరించే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల్ని నెట్టేయడం, కుదిరితే కొట్టడం.. దానిని ‘ప్రేమ’ అంటూ ప్రచారం చేసే ఎల్లో సోషల్ మీడియా పేజీలు, అభిమాన సంఘాలు అబ్బో.. ఈసారి కూడా సోషల్ మీడియా ఆ స్టఫ్ను బాగానే పంచే అవకాశమూ లేకపోలేదు. బస్సుపై బాలయ్య గుస్సా అన్స్టాపబుల్ పేరుతో ఆయన ఓ ఓటీటీలో హోస్ట్ షో నిర్వహించుకున్నారు. ఫస్ట్ సిరీస్ ఏదో బాగానే ఆడింది. కానీ, రెండోది పాపం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రచార యాత్ర బస్సుకు కూడా అన్స్టాపబుల్ అని పేరు పెట్టారు. దాని మీద ఓ మూలకు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రాన్ని ఉంచారు. ఇంకోపక్కన కూటమి నేతల ఫొటోలతో పాటు బాలయ్య ఫొటోను ఉంచారు. ఇంతకీ బస్సు మీద(పోస్టర్లో) బాలయ్య గుర్రుగా చూస్తుంది ‘అలగ జాతి, సంకర జాతి’ అని అవమానించిన బ్రదర్నా?.. లేదంటే ‘మక్కీ చూస్’ అంటూ గతంలో తిట్టిపోసిన మోదీనా? ఈ రెండూ కాకుంటే.. తండ్రి నుంచి సీటు లాక్కుని, పవన్తో పొత్తుల విషయం తనతో మాట వరుసకు కూడా చర్చించకుండా, స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం టీడీపీ మెయిన్ సీట్లో కూర్చోనివ్వకుండా అడ్డుకున్న వియ్యంకుడు చంద్రబాబు నాయుడ్నా?.. -
విప్లవ సారథీ.. విజయీభవ
ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే పాలకులను ఎన్నుకోవడం. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి, నిబద్ధత, జవాబుదారీతనం పాలకుడికి ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే విప్లవాత్మక మార్పులతో రాష్ట్రం ప్రగతిపథంలో ఎలా దూసుకెళ్లగలదో గత 58 నెలల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. సుపరిపాలనతో ప్రతి నియోజకవర్గం.. ప్రతి గ్రామం.. ప్రతి ఇంటా.. విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు కొనసాగాలని బలంగా కోరుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్కు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా.. అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది. ఈ పరిణామంతో మరో చారిత్రక విజయం ఖాయమైందని రాజకీయ పరిశీలకులతో పాటు జాతీయ స్థాయి సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత 58 నెలలుగా విప్లవాత్మక మార్పులతో సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు ఆయన శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 99 శాతం అమలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాపన, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. కేవలం 58 నెలల్లోనే 2.32 లక్షల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరి వంతున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానం ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసి చరిత్ర సృష్టించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు. వివక్ష, లంచాలకు తావు లేకుండా అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు అందించారు. డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి.. దేశం మొత్తాన్ని మన వైపు చూసేలా చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగుపర్చుకున్నారు. రాష్ట్రంలో పేదరికం టీడీపీ సర్కార్ హయాంలో 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. ప్రగతి పథంలో ఏపీ పయనం ♦ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. ♦ అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యనందిస్తూ.. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారు. తద్వారా 2022–23లో 1.2 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు ఎడెక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మహర్దశ సర్కారు దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు అనువుగా నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. అందులో 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.13 వేల కోట్ల విలువైన చికిత్సలు చేయించారు. ♦ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కొత్తగా 17 కాలేజీలకు శ్రీకారం చుట్టి, ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 ప్రారంభం కానున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటా జల్లెడ పడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ప్రతి ఏటా రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. ♦ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే క్రమంలో.. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లు, మూడు ఇండ్రస్టియల్ కారిడార్లు, పది ఇండ్రస్టియల్ నోడ్స్ను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. ♦ టీడీపీ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే అందుకు నిదర్శనం. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం టీడీపీ సర్కార్ హయాంలో 2018–19లో 22వ స్థానంలో నిలిస్తే.. ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. సాగుకు సాయం ♦ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సీఎం జగన్ దన్నుగా నిలిచారు. ఫలితంగా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17 నుంచి 18 శాతం ఉంటే.. గత నాలుగేళ్లలో దేశ జీడీపీలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ వాటా 36 శాతంపైగా ఉండటం విశేషం. ♦ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో ఏపీ అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. సామాజిక న్యాయంలో టార్చ్ బేరర్ సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానమని సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్పష్టం చేశారు. కేబినెట్లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు వర్గాలకే ఇచ్చారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన మాయవతి, బీసీ వర్గానికి చెందిన అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ కూడా ఆ వర్గాలకు కేబినెట్లో ఇంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని సామాజిక వేత్తలు చెబుతున్నారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యులుగా అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పనుల్లో, పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు.. మహిళలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన దన్నుతో ఆ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాజిక న్యాయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలు వెరసి మొత్తం 200 స్థానాలకుగాను వంద స్థానాల్లో అంటే సగం స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులనే సీఎం జగన్ బరిలోకి దించారు. సామాజిక న్యాయం చేయడమంటే ఇదీ అని దేశానికే సీఎం జగన్ ఎప్పటికప్పుడు చాటిచెబుతూ వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఇదే పాలన కోరుకుంటున్న జనం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వైఎస్ జగన్ మార్కు పాలన కనిపిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతి పథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు.. ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో సీఎం జగన్కు జనం నీరాజనాలు పలకడం ద్వారా తమ తీర్పును ముందే వెల్లడిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయానికి బాటలు వేస్తుందని స్పష్టం చేస్తున్నారు. టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని వెల్లడైంది. -
అభిమాన జల్లు
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘సుర్రుమంటున్న ఎండలో బిడ్డను చంకనెత్తుకుని పరుగెడుతున్న ఓ తల్లి.. చిన్నారిని భుజాలపై ఎక్కించుకుని అదిగో జగన్ అంటున్న ఓ తండ్రి.. ఊతకర్ర సాయంతో ఉత్సాహంగా అడుగులేస్తున్న ఓ తాత.. మనస్సున్న మనవడిని కళ్లారా చూసేందుకు క్యారేజీ కట్టుకుని రోడ్డుపై నిరీక్షిస్తున్న ఓ అవ్వ.. మా భవిష్యత్తు నీతోనేనంటూ ఉరలేస్తున్న యువత.. అన్నొచ్చాడన్న ఆనందంలో డీజే స్టెప్పులేస్తున్న అక్కచెల్లెమ్మలు’.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉదయం పూట కనిపించిన దృశ్యాలివి. ఇక మధ్యాహ్నం వేళ ఆకాశమంత అభిమానాన్ని వరుణుడు తన జల్లులతో అభిషేకించడంతో ప్రతి హృదయం పులకించింది. ఎండైనా, వానైనా.. పగలైనా, రాత్రయినా.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోట్లాది ప్రజల హృదయాలను స్పృశిస్తూ జన జాతరను తలపిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది. వేకువజాము నుంచే జనజాతర మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 13వ రోజు పల్నాడు జిల్లా వాసుల అపూర్వ ఆదరాభిమానాల మధ్య గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి జైత్రయాత్రను తలపించింది. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ధూళిపాళ్లలోని రాత్రి బస శిబిరం నుంచి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ బస్సుయాత్ర ప్రారంభమైంది. జననేత కోసం వేకువ జామునుంచే తరలివచ్చిన జన సందోహంతో ధూళిపాళ్ల శిబిరం కోలాహలంగా మారింది. సాయం కోరుతూ తనను కలిసేందుకు వచ్చిన అనారోగ్య బాధితులను అక్కున చేర్చుకున్న సీఎం జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. భాగ్యనగర్ కాలనీ, జంగంగుంట్లపాలెం, కంకణాలపల్లిలో మహిళలు భారీ ఎత్తున సీఎం జగన్కు యాత్రకు స్వాగతం పలికారు. సత్తా చూపిన సత్తెనపల్లి సీఎం జగన్కు సత్తెనపల్లి జనతోరణాలతో ఘన స్వాగతం పలికింది. ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. భారీ గజమాలలు, పూల వర్షంతో బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్ను మనసారా ఆశీర్వదించింది. ప్రతి సెంటర్లో మహిళలు భారీగా తరలివచ్చి గుమ్మడి కాయలతో దిష్టి తీసి హారతులు పట్టారు. సీఎం జగన్ బస్సుపైకి చేరుకుని అందరికీ అభివాదం చేశారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు రోడ్షో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. లా నేస్తం, సంక్షేమ నిధికి సాయం అందించి తమకు అండగా నిచిలిన సీఎం జగన్కు యువ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. గర్జించిన గుంటూరు.. మేడికొండూరు మండలం కంటెపూడి అడ్డరోడ్డు వద్ద మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం లభించింది. విద్యార్థులు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో తాము పొందిన లబ్ధిని వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎక్కడ చూసినా బస్సుయాత్ర వెంట భారీ జనసందోహం ఉరకలెత్తింది. కొర్రపాడులో గజమాలలు, బంతిపూలతో బస్సుయాత్రను ఆహా్వనించారు. మహిళలు రోడ్లకు ఇరువైపు నిలబడి జెండాలు చేత పట్టుకుని రెపరెపలాడించారు. జంగంగుంట్లపాలెంలో మేళతాళాలతో స్టార్ క్యాంపెయినర్లు కదం తొక్కారు. మేడికొండూరు జెండాచెట్టు సెంటర్లో మహిళలు గుమ్మడి కాయలతో దిష్టి తీసి జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆకాంక్షించారు. 16 కి.మీ. జనప్రవాహం.. పేరేచర్ల నుంచి ఏటుకూరు బైపాస్లోని బహిరంగ సభ ప్రాంగణం వరకు రహదారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. సుమారు 16 కిలోమీటర్లకుపైగా జనప్రవాహం బస్సుయాత్ర వెంట కదలి వచ్చింది. షెడ్యూల్ కంటే నాలుగు గంటలకుపైగా బస్సుయాత్ర ఆలస్యమైంది. ఉదయం నుంచి రోడ్షో, ఆత్మీయ పలకరింపులతో ముఖ్యమంత్రి జగన్ భోజన విరామాన్ని సైతం పట్టించుకోలేదు. గుంటూరులోని హౌసింగ్ బోర్డులో భోజన విరామ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అశేష జన వాహినిని దాటుకుని అక్కడకు చేరుకునే సరికి సాయంత్రం ఆరు గంటలు అయింది. అప్పటికే సభా ప్రాంగణం వద్ద జన సందోహం తనకోసం నిరీక్షిస్తుండటంతో సీఎం జగన్ భోజన విరామం కోసం ఆగకుండా ముందుకు కదిలారు. మిర్చియార్డు నుంచి ఏటుకూరి వరకు దారిపొడవునా జనం బారులు తీరారు. భవనాలు, వీధులు నిండిపోయాయి. సీఎం జగన్ బస్సుపైకి ఎక్కి రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ సాయంత్రం ఏడు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా జనవాహిని సీఎం రాక కోసం వేచి చూసింది. సభ అనంతరం రాత్రి 7.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బుడంపాడు బైపాస్, తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావునగర్ మీదుగా రోడ్ షోలో అభిమానులను పలకరిస్తూ పెదకాకాని మండలం నంబూరు బైపాస్లో ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి 8.15 గంటలకు చేరుకున్నారు. ఘాటు మిర్చి గజమాల సిరిపురం అడ్డరోడ్డు, భీమనేనివారిపాలెంలో అక్కచెల్లెమ్మలను పలుకరిస్తూ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడికొండూరు సెంటర్లోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. అనంతరం 4 గంటలకు పేరేచర్ల సెంటర్కు చేరుకున్న యాత్ర జనసంద్రం నడుమ సాయంత్రం 5 గంటలకు నల్లపాడుకు చేరుకుంది. ప్రతి చోటా పోటెత్తిన జనవాహినితో నిర్దేశిత షెడ్యూల్ కంటే బస్సుయాత్ర ఆలస్యమైంది. నల్లపాడు శ్రీనివాస కాలనీ వద్ద అంబులెన్స్కు దారి ఇవ్వాలని కోరుతూ యాత్ర ముందుకు సాగింది. చుట్టుగుంట సెంటర్లో గుంటూరు ఘాటు మిర్చి గజమాలతో సంక్షేమ సారథి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. కరుణించిన వరుణుడు అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న సీఎం జగన్ యాత్రను స్వాగతిస్తూ వరుణుడు చిరు జల్లులతో ఆశీర్వదించాడు. అప్పటి వరకు వేడి వాతావరణంలో కొనసాగుతున్న బస్సుయాత్ర మేడికొండూరులోకి ప్రవేశించగానే చిరుజల్లులు కురిశాయి. వర్షంలోనూ మేమంతా సిద్ధమంటూ ప్రజలు రోడ్లపై బారులు తీరారు. సీఎం జగన్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తేలికపాటి వర్షం కురిసింది. అంతకుముందు శిబిరం వద్ద సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరపాడు, గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకుని ఎన్నికల సమాయత్తంపై దిశానిర్దేశం చేశారు. -
మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్ క్యాంపైనర్లుగా చేయాలి. ఈ మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ రావాలి.. మోసపోకూడదంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి గడపకూ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి గుంటూరు శివారు ఏటుకూరు వద్ద నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. ఈరోజు గుంటూరులో కనిపిస్తున్న ఈ మహా జన సముద్రం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పుడు జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు, ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అవ్వాతాత, సోదరులు, స్నేహితులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి గ్రామానికి పౌర సేవలు, విద్య, వైద్యం, రైతన్న లకు భరోసా, అక్క చెల్లెమ్మలకు సాధికారత, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సేవలు అందించిన మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా సిద్ధమేనా? గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను ఒక్క రూపాయి కూడా లంచం, వివక్షకు తావు లేకుండా 130 సార్లు బటన్ నొక్కి పారదర్శకంగా నేరుగా అందించిన ఈ ప్రభుత్వానికి, మీ జగన్కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కేందుకు, మరో వంద మందికి చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా? రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు.. ఈ ఎన్నికల యుద్ధం కేవలం చంద్రబాబుకు, జగన్కు మధ్య జరుగుతున్నది కాదు. ఈ యుద్ధం బాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, వాటిని ఆపిన బాబు దుర్మార్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి మోసాలకు, మన విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ అబద్ధాల బాబుకు ఇద్దరు వంత పాడుతున్నారు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు. 2014 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించిన బాబు ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ నమ్మబలుకుతున్నారు. మంచి కొనసాగాలో వద్దో ఆలోచించండి.. ఈ రోజు మీరంతా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో కలసి ఒక్క అంశంపై ఆలోచన చేయమని కోరుతున్నా. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గత 58 నెలలుగా జరుగుతున్న మంచిని మీరందరూ కొనసాగించేందుకే ఓటు వేసినట్లే. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీ అంతట మీరే మీకు వద్దని చెప్పినట్లేనని గుర్తుంచుకోవాలని కోరుతు న్నా. 58 నెలల క్రితం మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి ఫలానాది చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ మాదిరిగా భావించి 99 శాతం హామీలను అమలు చేసి మీ ముందుకు వచ్చి మరోసారి ఆశీస్సులు కోరుతున్నాడు. సెల్ఫోన్ లైట్లతో సంఘీభావం.. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లలో ఏ ఒక్కటీ తగ్గకుండా గెలిపించేందుకు మీరు సిద్ధమేనా? పేదల భవిష్యత్తు బాగుండాలని చేస్తున్న ఈ యుద్ధానికి మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయాలి. పాలకుడు మోసగాడైతే... ఎలాంటి వారు రాజకీయ నాయకుడిగా ఉండాలి? ఎలాంటి వారిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలన్న విషయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎందుకంటే మనం వేసే ఓటు ద్వారా రాబోయే ఐదేళ్ల జీవితం ఆ పాలకుడి చేతుల్లో పెడుతున్నాం. ఆ పాలకుడికి మంచి మనసు ఉండి మంచి చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడు అయితే మన బతుకులు అంధకారం అవుతాయి. పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకుతలం అవుతాయి. రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యల పాలవుతాయి. అవ్వాతాతల సంక్షేమం అడుగంటిపోతుంది. అందుకే ఈ వాస్తవాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా. గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య, అసెంబ్లీ అభ్యర్థులు నూరి ఫాతిమా, బలసాని కిరణ్కుమార్, మురుగుడు లావణ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, విడదల రజని, అంబటి మురళీకృష్ణ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, బత్తుల దేవానంద్ తదితరులు ఏటుకూరు సిద్ధం సభలో పాల్గొన్నారు. బాధలు విన్నాడు.. భరోసా ఇచ్చాడు.. తనను కలిసిన బాధితులకు సీఎం జగన్ ఆపన్న హస్తం సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ను పలువురు కలిసి తమవారికి వచ్చిన కష్టాలు చెప్పుకొన్నారు. వైద్యం అందించాలని కోరారు. వారి బాధలు సావధానంగా విన్న సీఎం జగన్.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన తన సోదరుడు షేక్ సుభానికి వైద్యం చేయించండన్నా అంటూ గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన బాజీబీ సీఎం జగన్ను వేడుకున్నారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని భాగ్యనగర్ కాలనీ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ వస్తున్నారని తెలుసుకుని కోమాలో ఉన్న సోదరుడిని కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్లో తీసుకొచ్చి రోడ్డుపై నిలబడింది బాజీబీ. వారిని గమనించిన సీఎం వెంటనే బస్సు దిగి సమస్యను తెలుసుకున్నారు. వీఆర్వోగా పనిచేస్తున్న సుభాని గత ఆగస్ట్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, అప్పటి నుంచి కోమాలోకి వెళ్లాడని చెబుతూ ఇప్పటి వరకు రూ.20 లక్షలు ఖర్చయ్యాయని, సీఎం సహాయనిధి ద్వారా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రూ.3 లక్షలు సాయం కూడా అందించారని సీఎం దృష్టికి తెచ్చారు. ఇక వైద్యం చేయించే స్తోమత తమకు లేదన్నారు. వారి సమస్యను విన్న సీఎం జగన్.. సుభానికి ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, దాచేపల్లి మండలం శ్రీనగర్కు చెందిన గంటెల వెంకటేశ్వర్లు, శారదల 12 ఏళ్ల కుమారుడు చరణ్కు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మేమంతా సిద్ధం యాత్రకు ధూళిపాళ్ల శివారులో సీఎం జగన్ రోడ్ షో చేస్తుండగా బస్సు వెంట ఆ బాలుడిని ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగెత్తడం సీఎం జగన్ గమనించి.. బస్సాపి వారిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే చరణ్కు వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్యానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. బాబు మోసాలకు వంతపాడుతున్న వదినమ్మ, దత్తపుత్రుడు సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాల బుర్రకథకు తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కని పిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘మీ బిడ్డకు ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించాలని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి’ అని ప్రజలను కోరుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. భారీ వర్షంలోనూ జనం ‘సిద్ధం’ భోజన విరామం కూడా లేకుండా 9 గంటల పాటు సీఎం జగన్ యాత్ర అభిమాన సముద్రం ముందు గాలి దుమారం తేలిపోయింది. ఈదురు గాలులు వీస్తున్నా జనసందోహం చెక్కు చెదరని సంకల్పంతో జననేత కోసం నిరీక్షించింది. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సుయాత్ర పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నంబూరు వరకు జరిగింది. యాత్ర మేడికొండూరు చేరుకునేసరికి ఈదురు గాలులతో వర్షం మొదలైంది. జన సంద్రమే గొడుగులా సీఎం జగన్ కాన్వాయి ముందుకు సాగింది. గుంటూరులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు పలుదఫాలుగా వర్షం పడింది. గాలుల ధాటికి పలు చోట్ల ఫ్లెక్సీలు ఒరిగిపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని నిలబెట్టడం గమనార్హం. ఏటుకూరులో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం మొత్తం తడిచి ముద్ద అయింది. ప్రతిచోటా అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర శుక్రవారం భోజన విరామం కూడా లేకుండా తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా సాగింది. గుంటూరు జిల్లాలో పేరేచర్ల నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర జనసంద్రాన్ని తలపిస్తూ రోడ్షో జరిగింది. 2014 ఫ్లాష్బ్యాక్లోకి వెళితే.. ఒక్కసారి 2014 ఫ్లాష్బ్యాక్లోకి వెళితే.. నాడు కూడా ఇదే కూటమి! మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలతో ప్రజల జీవితాలతో చెలగా టమాడారు. ఇదే చంద్రబాబు సంతకం చేసి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో పాంప్లెట్లు ముద్రించి ప్రతి ఇంటికి పంపారు. మీరు మర్చిపోతారేమోననే భయంతో టీవీలలో, పేపర్లలో ఊదరగొట్టారు. చంద్రబాబు నాటి మోసాల్లో ఒక్కసారి ముఖ్యమైన వాటిని మీకు గుర్తు చేస్తా. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మీకుగానీ, మీ ఇంటి చుట్టుపక్కల వారికిగానీ ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. మరి జరిగిందా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా? -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజైన శనివారం(ఏప్రిల్ 13) షెడ్యూల్ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన నంబూరు బైపాస్ నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కాజా, మంగళగిరి బైపాస్ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్సింగ్ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ‘గుంటూరు జిల్లా సిద్ధమా?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో మేమంతా సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్తో కలిసి బస్సు యాత్రలో పాల్గొన్నారు. –సాక్షి,అమరావతి -
Watch Live: గుంటూరు మేమంతా సిద్ధం సభ
-
భారీ జన సంద్రంతో కిక్కిరిసిన పేరేచర్ల
-
అడుగడుగునా.. ఉప్పొంగిన అభిమానం
-
సత్తెనపల్లిలో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో దృశ్యాలు
-
కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు
-
LIVE: సీఎం జగన్ బస్సు యాత్ర 13వ రోజు
-
సత్తెనపల్లిలో సీఎం జగన్ బస్సు యాత్ర డ్రోన్ దృశ్యాలు
-
YSRCP మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనగర్జన
-
జగన్ రోడ్ షో కు పోటెత్తిన జనం..!
-
గుంటూరులో సీఎం జగన్ కు ఘన స్వాగతం
-
సత్తెనపల్లెలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర దృశ్యాలు
-
బస్సు యాత్ర 13వ రోజు రూట్ మ్యాప్ ఇదే
-
Fact Check: ఈనాడు దగాకోడ్ రాతలు
సాక్షి, అమరావతి: ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుండటంతో రాష్ట్రంలో ఎల్లో సిండికేట్ బెంబేలెత్తుతోంది. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో వరుసగా రెండోసారి టీడీపీ ఓటమి ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావుల కాళ్ల కింద భూమి కంపిస్తోంది. తమ రాజకీయ జీవితానికి ముగింపు కార్డు పడిందని చంద్రబాబుకు.. తమ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని రామోజీరావుకు భయం పట్టుకుంది. తమ భవిష్యత్తు సినిమా కళ్ల ముందు కనిపిస్తోంది. ఫలితంగా దింపుడు కళ్లెం ఆశతో విద్వేష కథనాలు అల్లుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా విషం చిమ్ముతున్నారు. ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్(ఈసీ) అధికార పరిధినీ ప్రశ్నిస్తూ కట్టుకథలతో ‘ఈనాడు’ పత్రిక చెలరేగిపోతోంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీసు, అధికార యంత్రాంగాన్ని బ్లాక్మెయిల్ చేయాలని పన్నాగం పన్నింది. మొన్న ఐపీఎస్ అధికారుల పోస్టింగులను ప్రశ్నిస్తూ ఈసీనే బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నించిన ఈనాడు.. తాజాగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలే లక్ష్యంగా అబద్ధాలను వల్లెవేసింది. ‘వైకాపా కోడ్ నడుస్తోంది’ అంటూ బుధవారం ఓ విష కథనాన్ని వండి వార్చింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఈనాడు రామోజీరావు క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించే పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని దు్రష్పచార కుట్రకు తెరతీశారు. ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది పచ్చ కుట్ర. ఇటీవల రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు పత్రిక వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఇటువంటి ఘటనలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం యావత్ పోలీసు యంత్రాంగం ఈసీ మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహిస్తోంది. ఈ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ వైఎస్సార్ సీపీ నేతల ఆదేశాల ప్రకారం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని కట్టుకథలను ఈనాడు ప్రచారంలోకి తీసుకువస్తోంది. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకున్నా సరే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండాలి అన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. నిజంగా పోలీసులు ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈసీ విచారించి తగిన చర్యలు తీసుకుంటుంది. కానీ చంద్రబాబుగానీ ఈనాడు రామోజీరావుగానీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పోలీసులు నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నారు. అందుకే ఈనాడు పత్రిక ద్వారా పోలీసు అధికారులపై దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో పని చేసే పోలీసు అధికారులను బెదిరించి టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది చంద్రబాబు, రామోజీ లక్ష్యం. కానీ వారి కుట్రలను తిప్పికొడుతూ ఈసీ నిబంధనల మేరకు సక్రమ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. మొన్న ఐపీఎస్లపై అక్కసు బెడిసికొట్టి.. చంద్రబాబు హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చలామణి అయిన రామోజీరావు ప్రస్తుతమూ తన మాటే శాసనం అనేట్టుగా ఉండాలని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నదీ ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అని.. రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సాగుతుందని గానీ గుర్తించేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. తాను చెప్పిన అధికారులనే ఎస్పీలుగా నియమించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకు విరుద్ధంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఇటీవల ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించడంతో ఆయన చిందులు తొక్కారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ ఈనాడు పత్రికలో విద్వేష కథనాన్ని ప్రచురించారు. దీనిపై యావత్ పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించడం విశేషం. ఏకంగా 13 మంది ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసి మరీ టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఈనాడు పత్రికను అడ్డంపెట్టుకుని పోలీసు వ్వవస్థను, ఈసీని బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తున్నాయన్న వాస్తవం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఈసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశాలు ఉండటంతో రామోజీరావు తోక ముడిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ నోళ్లు కూడా మూతపడ్డాయి. కానీ అధికారయంత్రాంగం ఆత్మస్థైర్యం దెబ్బతీసే కుతంత్రాలు మాత్రం ఆపలేదు. -
మండుటెండలో అభిమాన సంద్రం
రొంపిచర్ల వద్ద 87 ఏళ్ల అవ్వ రాధమ్మ మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఆశగా ఎదురు చూస్తోంది. వచ్చిపోయే వాళ్లను జగన్ ఎక్కడి వరకు వచ్చాడయ్యా? అని ఆరా తీస్తోంది. ఇంత ఎండలో ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే ‘జగన్ నాకు ఎంతో మంచి చేశాడు. ఇంటికే పింఛన్ పంపించాడు. నాలాంటోళ్లకి ఆ బిడ్డ కావాలి. అందుకు ఒక్కసారి చూసిపోదామని వచ్చాన’నని బదులిచ్చింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బుధవారం 40 డిగ్రీల ఎండలోనూ జన జాతరను తలపించింది. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానం వేసవి తాపాన్ని ఎదురించింది. గొంతెండే వేడిమిలోనూ ‘నువ్వే కావాలి జగన్’ అంటూ నినదించింది. ధర్మాన్ని గెలిపించే యుద్ధంలో పల్నాట సైన్యమై ముందుకు కదిలింది. పౌరుషాల పురిటిగడ్డ సాక్షిగా విశ్వసనీయతే తమ వీరత్వమంటూ గర్జించింది. పల్లెపల్లె నుంచి పిడికిలి బిగించి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తామంతా సిద్ధమంటూ నినదించింది. 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలోని గంటావారిపాలెం రాత్రి బస శిబిరం నుంచి ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీలో చేరారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఉదయం 6.30 గంటల నుంచే శిబిరం వద్ద మహిళలు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ శిబిరం నుంచి రోడ్డుపైకి రాగానే జైజగన్ నినాదాలతో గళమెత్తారు. సాయం కోరి వచ్చిన బాధితులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్య పరిష్కారానికి సీఎం అధికారులను ఆదేశించారు. కామేపల్లికి సమీపంలోని గ్రానైట్ కటింగ్ మహిళా కూలీలు రోడ్లపై వేచి చూడటాన్ని గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్లో నుంచి కిందకి దిగి వచ్చి ప్రభుత్వ పనితీరుపై ముచ్చటించారు. వినుకొండ–కర్నూలు జాతీయ రహదారిపై ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుంచి బాపట్ల జిల్లా సంతమాగులూరు క్రాస్ మీదుగా నరసారావుపేట నియోజకవర్గం అన్నవరప్పాడులోకి బస్సు యాత్ర ప్రవేశించింది. జాతీయ రహదారిపై జన ప్రవాహం నార్కెట్పల్లి జాతీయ రహదారిపై సంతమాగులూరు జంక్షన్లో పెద్ద జన ప్రవాహమే కనిపించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు తమ ఆత్మీయ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి పూలతో నీరాజనం పలికారు. వ్యవసాయ మహిళా కూలీలు తమపాలిట రైతు బాంధవుడిని చూసేందుకు పొలాల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రొంపిచర్లలో యువత ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ జననేత రాకతో సంబరపడ్డారు. సంతగుడిపాడు, విప్లర్లలో బాణసంచా కాల్చడంతో తిరునాళ్లను తలపించింది. రొంపిచెర్ల, సంతగుడిపాడు రోడ్షో అంబరాన్ని తాకింది. సీఎం జగన్కు కంబలి కప్పి గొర్రె పిల్లను బహుమానంగా అందించారు. విప్పర్లలో మహిళలు హారతిపట్టి బస్సు యాత్రను దీవించారు. వలంటీర్లు పెద్ద ఎత్తును తరలివచ్చి ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడంలో తమకూ భాగస్వామ్యం కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ మీ వెంటే ఉంటామంటూ నినదించారు. రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఊరూరా అభిమానం నెకరికల్లులో సీఎం జగన్పై అంతులేని అభిమానం బంతిపూల వర్షం కురిపించింది. సంక్షేమ ఫలాలను అందుకున్న మహిళలు భారీగా తరలివచ్చారు. దాదాపు మధ్యాహ్నం రెండు గంటలకు కూడా నెకరికల్లులోని నారెట్పల్లి– అద్దంకి జాతీయ రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. జనసంద్రంగా మారిన మార్గంలో బస్సు యాత్ర అనుకున్న షెడ్యూల్ కంటే ఆలస్యంగా చల్లంగుండ్లకు చేరుకుంది. నెకరికల్లు, జంక్షన్, త్రిపురాపురం, నెమలిపురి మీదుగా సాగిన బస్సు యాత్ర 4 గంటల సమయంలో పెద్ద నెమలిపురం చేరుకుంది. దేవరంపాడు క్రాస్ వద్ద 4.20 గంటలకు సీఎం భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల, బైపాస్ మీదుగా రోడ్షో నిర్వహిస్తూ అయ్యప్పనగర్ బైపాస్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పిడుగురాళ్లలో పిడికిలి బిగించి.. పిడుగురాళ్ల బైపాస్లో రోడ్షో, బహిరంగ సభ సిద్ధం.. సిద్ధం’ నినాదాలతో మార్మోగింది. రోడ్లపై బారులు తీరిన ప్రజలు ఆద్యంతం సీఎం ప్రసంగాన్ని ఆలకించారు. ఏనోట విన్నా తమ ఇంటికి వచ్చిన సంక్షేమ పథకాల లిస్టు వినిపించింది. ఎన్నికల వేళ ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి చేరికలు భవిష్యత్తు గెలుపునకు ముందస్తు సంకేతాలని, పిడుగురాళ్ల బహిరంగ సభలో రెంటచింతల వేడిని మించిన.. భీకరమైన గెలుపు పవనాలు వైఎస్సార్ సీపీకి కనిపించాయంటూ పరిశీలకులు చెబుతున్నారు. తొలిసారిగా ఓటు వేస్తున్న యువత బహిరంగంగానే తమ ఓటు సీఎం జగన్కే అంటూ నినదించింది. 5.30 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 6.50 గంటల వరకు పార్టీ శ్రేణులు, లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. బహిరంగ సభ అనంతరం 7 గంటలకు బయలు దేరిన సీఎం జగన్ కొండమోడు సర్కిల్ మీదుగా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. రెడ్డిపాలెంలో రాత్రి 8.45 గంటలు అయినప్పటికీ పెద్ద సంఖ్యలో మహిళలు హారతులు, పూలతో ఘన స్వాగతం పలికారు. బస్సుపైకి ఎక్కి వారందరికీ సీఎం అభివాదం చేశారు. రాత్రి 9.08 గంటలకు ధూళిపాళ్లలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. మళ్లీ నువ్వే రావాలయ్యా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలేనికి చెందిన వెంకాయమ్మ అనే మహిళ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రగా వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఉదయం 9గంటలకే పుట్టావారిపాలెం అడ్డరోడ్డుకు వచ్చింది. తీరా ఆయన వచ్చే సమయానికి చెప్పులు తెగిపోయాయి. అయినా ఆమె చలించలేదు. కాళ్లు మండుతున్నా లెక్క చేయకుండా జగన్ను చూసేందుకు బస్సు వద్దకు పరుగు పరుగున వచ్చి ఆయనను ఆత్మీయంగా పలకరించింది. భావోద్వేగానికి గురైంది. ‘అయ్యా.. నువ్వే రావాలయ్యా..’ అంటూ ఆకాంక్షించింది. -
జాబు రావాలి అంటే ఎవరు కావాలి..? పబ్లిక్ రియాక్షన్ వేరే లెవెల్
-
ఎన్నికల ముందు గంగ తరువాత పేదల రక్తం తాగే చంద్రముఖి
-
బాబు, ఎల్లో మీడియాపై మీరు..నేను ఒక ఫ్యాక్ట్ చెక్ చేదామా.. ?
-
అయ్యా.. చంద్రబాబు రైతులకు నువ్వు ఏం చేశావ్ ? సీఎం జగన్ ఫైర్
-
చంద్రబాబుది బోగస్ రిపోర్టు.. సీఎం జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు
-
ఇక్కడ జనసముద్రాన్ని చూస్తుంటే కోటప్పకొండ తిరునాళ్ల ముందే వచ్చినట్టుంది