
(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నేతలు ఈ నెల 13న సమావేశం కానున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ అంశం, కూటమి బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించనున్నారు. శనివారం ఉదయం వర్చువల్గా జరిగే ఈ సమావేశంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పాల్గొనడం లేదు. పలు కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. నితీశ్ కుమార్కు ఇండియా కూటమి కనీ్వనర్ బాధ్యతలివ్వాలంటూ జేడీయూ కోరుతుండగా, టీఎంసీ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. ఈ అంశంపైనా నేటి సమావేశంలో నేతలు చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment