మేం దాడులకు దిగితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పారిపోతారు | TPCC Working President Mahesh Kumar Goud Warned BRS MLAs | Sakshi
Sakshi News home page

మేం దాడులకు దిగితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పారిపోతారు

Published Wed, Feb 22 2023 5:16 AM | Last Updated on Wed, Feb 22 2023 5:16 AM

TPCC Working President Mahesh Kumar Goud Warned BRS MLAs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రతిదా­డుల­కు దిగితే బీఆర్‌ఎస్‌ ఎ­మ్మె­ల్యేలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్ప­డతాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కు­మార్‌గౌడ్‌ హె­చ్చ­రించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అవినీతిపై పోస్టర్లు అంటిస్తున్నారన్న కారణంగా వరంగల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ నేత తోట పవన్‌పై దాడి చేయడం హేయమని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్ర­హం వ్యక్తంచేశారు.

తోట పవన్‌పై బీఆర్‌­ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అనుచరులు కిరాతకంగా దాడిచేశారని, హత్య చేసేందుకు యత్నించారని, వినయ్‌భాస్కర్‌తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేశ్‌కు­మార్‌ డిమాండ్‌ చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే­గా గెలిచిన దళిత నాయకుడు సాయన్నకు ప్రభుత్వం గౌరవం ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దళితులంటే గౌరవం లేదని, కనీసం అధికారిక లాంఛనాలతో కూడా సాయన్న అంత్యక్రియలు పూర్తి చేయకుండా చావులో కూడా సాయన్నకు బాధను మిగిల్చారని మహేశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement