mahesh kumar goud
-
కాంగ్రెస్ నుంచే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు కాంగ్రెస్ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే తెలంగాణకు సీఎం(Telangana CM)గా ఉంటారని వ్యాఖ్యానించిన మహేష్ గౌడ్.. ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని కూడా చూస్తామన్నాను. అది కూడా కాంగ్రెస్ నుంచే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్(Bandi Sanjay).. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించారు మహేష్ గౌడ్.దశాబ్లాలు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఒక్క బీసీ వ్యక్తిని కూడా ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శనివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్రెడ్డి.. తెలంగాణలో ఇప్పటివరకూ బీసీ వ్యక్తిని ఎందుకు ముఖ్యమంత్రిగా చూడలేకపోయామనే కోణాన్ని లేవనెత్తుతూ.. అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. దీనికి బదులుగా టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీసీ వ్యక్తిని సీఎంగా చూస్తామన్నారు. -
ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమి లేదు: మహేష్ కుమార్ గౌడ్
-
బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతో బండి సంజయ్ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. రేవంత్ మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణనతో పాటు కుల గణన చేయాలి. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తాం. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలి. సీఎం రేవంత్.. మోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు. 24-7-1994న ఓసీ నుంచి ఓబీసీలలో చేర్చారు.గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు?. రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన కానీ భారతీయతను పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయొద్దని కవితకు సూచనలు చేస్తున్నా’’ అంటూ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
‘తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ అధికారంలో రాదన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మహేష్ గౌడ్ స్పందించారు. ఢిల్లీ ఫలితాలను చూసి తెలంగాణ బీజేపీ నాయకులు అమితానంద పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది జరగదన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మా పార్టీకి రక్ష. ఇచ్చిన 6 గ్యారంటీలని అమ్మడు పరుస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిది కాంగ్రెస్. ఈ సంక్షేమ పథకాలే మళ్లీ కాంగ్రెస్ను ెగెలిపిస్తాయి. కేటీఆర్ పరిస్థితి విచిత్రంగా ఉంది.బిజెపిని అభినందించలేక లోలోపల మునిసిపోతున్నాడు. కేసీఆర్, కేటీఆర్ శకం.. ఈ రాష్ట్రంలో ముగస్తుంది. దేశవ్యాప్తంగా త్వరలోనే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది, తిరిగి అధికారంలోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. -
కులగణనే కొలమానం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వంలోగానీ, పార్టీలోగానీ ఇకముందు తీసుకునే విధానపర నిర్ణయాలన్నింటికీ కులగణనే(caste census) ప్రాతిపదికగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(mallikarjun kharge)తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జరిపిన భేటీలో నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, నిధుల కేటాయింపుల్లో కులగణన లెక్కలను కొలమానంగా తీసుకుని ముందుకెళ్లాలని.. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు నామినేటెడ్ పోస్టులు, పీసీసీ పదవుల భర్తీ దాకా ఇదే ఫార్ములాను అనుసరించాలని నిశ్చయానికి వచ్చినట్టు తెలిపాయి.రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు శుక్రవారం ఖర్గేతో భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ఖర్గే కార్యాలయంలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం పీసీసీ కూర్పుపై కేసీ వేణుగోపాల్తోనూ నేతలు విడివిడిగా భేటీ అయి తమ అభిప్రాయాలను వెల్లడించారు. కులగణన దేశానికి నమూనా కావాలి రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన అంశాన్ని రాష్ట్ర నేతలు ఖర్గేకు వివరించారు. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి మూడు, నాలుగు జిల్లాలకు కలిపి ఒక సభను ఏర్పాటు చేస్తామని.. ఆ సభలకు హాజరుకావాలని ఖర్గేను కోరారు. ఇందులో ఎస్సీ వర్గీకరణ అంశంపై గజ్వేల్లో నిర్వహించే సభకు వచ్చేందుకు ఖర్గే ఒకే చెప్పినట్టు తెలిసింది.‘‘జనాభా ప్రాతిపదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నది నాతోపాటు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రధాన ఉద్దేశం. కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపులలో ఓబీసీ, గిరిజన, దళితులు, మైనార్టీలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు ఉండాలి...’’అని ఖర్గే సూచించారని సమాచారం.తెలంగాణలో కులగణన, దాని ఆధారంగా అమలు చేసే అంశాలు దేశానికే దిక్సూచిగా నిలవాలని పేర్కొన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సైతం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను పూర్తి చేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దు.. ఇటీవల కొందరు ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ అంశం కూడా ఖర్గే వద్ద ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఒకరిద్దరు మంత్రుల తీరు నచ్చక జరిగిన ఈ భేటీతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దీన్ని ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చకు పెట్టిందని నేతలు ప్రస్తావించారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడామని... ఏ విషయమైనా నేరుగా తమతోగానీ, అధిష్టానం పెద్దలతోగానీ మాట్లాడొచ్చని సూచించామని దీపాదాస్ మున్షీ, రేవంత్రెడ్డి వివరించినట్టు తెలిసింది.ఈ క్రమంలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దని, వారితో ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని, రెండు, మూడు నెలలకోసారి సీఎల్పీ భేటీలు నిర్వహించుకోవాలని ఖర్గే సూచించారని సమాచారం. బీఆర్ఎస్ బలంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి వదంతులు, తప్పుడు సంకేతాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పాలనకు పరీక్ష అని.. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఖర్గే పేర్కొన్నట్టు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. 20మందికిపైగా వైస్ ప్రెసిడెంట్లు.. పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఖర్గే, కేసీ వేణుగోపాల్లతో రాష్ట్ర నేతలు జరిపిన భేటీలలో కొంతమేర స్పష్టత వచ్చినట్లు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను, 20 నుంచి 25 మంది వరకు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లలో బీసీ, రెడ్డి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉండాలనే భావనకు వచ్చినట్టు సమాచారం. ఇక జిల్లా నేతల ఆమోదం ఉన్న చోట్ల డీసీసీ అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
బడ్జెట్లో కేంద్రం వివక్షపై యుద్ధం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా యుద్ధం ప్రకటిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే ప్రతి పౌరుడూ తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘దేశమంటే మట్టి కాదోయ్..’ అంటూ తెలుగు గేయాన్ని గుర్తుచేసి.. తెలుగు ప్రజల ఆకాంక్షలకు, తెలుగు నేల అభివృద్ధికి బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ.. ఆదివారం ట్యాంక్బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ సవతి ప్రేమకు నిదర్శనం తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్.. దేశ సమగ్రాభివృద్ధికి కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు ఉందని మహేశ్గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో బీజేపీ సవతి ప్రేమను అవి తెలియజేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయల పన్నులు తీసుకుంటున్న కేంద్రం, కనీసం రూ.40 వేల కోట్లు కూడా రాష్ట్రానికి కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచి్చందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి, సంజయ్లకు తెలంగాణ అభివృద్ధి పట్టదా అని నిలదీశారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కక్షపూరిత వైఖరికి నిరసనగా రాజకీయాలకతీతంగా తెలంగాణ వాదులు ఏకతాటి పైకి రావాలని మహేశ్గౌడ్ విజ్ఞప్తి చేశారు. అప్పుడు అడగలేదన్నారు.. ఇప్పుడు అడుగుతున్నా మొండిచెయ్యే బీజేపీ ఎంపీల్లో తెలంగాణ డీఎన్ఏ ఉంటే ఇప్పటికైనా గొంతెత్తాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. నిధులు అడగడం లేదని పదేళ్లుగా చెప్పుకొచ్చారని, ఇప్పుడు అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషమని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పెట్టింది స్వార్థపూరిత బడ్జెట్ అని విమర్శించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర కూడా నిరసన తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్రావు, ఎగ్గె మల్లేశం, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్కుమార్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, మల్రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, నాగరిగారి ప్రీతం, రియాజ్, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐల రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్రెడ్డి, వెంకటస్వామి, సేవాదళ్ చైర్మన్ మిద్దెల జితేందర్, మహిళా కాంగ్రెస్ నాయకులు సునీతారావు పాల్గొన్నారు. మోదీ, నిర్మల దిష్టిబోమ్మలు దగ్ధం చేయండి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచి్చంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలంతా పాల్గొనాలని, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల దిష్టి»ొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
కేసీఆర్ ఫాంహౌజ్ కలలు మానాలి: టీపీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:కేసీఆర్ ఫాంహౌస్ కలలు మానుకోవాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం(జనవరి31) మహేష్కుమార్ స్పందించారు.‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన,గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన,ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారు. కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్,కాంగ్రెస్ అధికారంలో విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదం. కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్ ఫాంహౌస్లో పగటి కలలు కంటున్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్పై అవాకులు చెవాకులు పలుకుతున్నారు.ప్రజలు చీ కొట్టినా కేసీఆర్ వ్యవహార శైలి,మాటతీరులో మార్పు రాలేదు. ఇలాగే ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదు’అని మహేష్కుమార్గౌడ్ అన్నారు. -
వచ్చే నెల 5 తర్వాత ‘స్థానికం’పై స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులగణన జరగకుండా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయవంతంగా పూర్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కులగణనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను ఫిబ్రవరి 5న కేబినెట్ ముందు పెడుతుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దానిని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుందని వివరించారు. మహేశ్కుమార్గౌడ్ గురువారం గాంధీభవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్సార్కు ఉన్నంత అభిమానులు ఎవరికీ లేరని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగరవేస్తాం కులగణన నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని.. దీనిపై ఫిబ్రవరి 5 తర్వాత స్పష్టత వస్తుందని మహేశ్గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. ‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లతో అధిష్టానానికి నివేదిక ఇచ్చాం. రెండు మూడు రోజుల్లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తాం. హైదరాబాద్లో కాంగ్రెస్ బలోపేతం కోసం జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి పెట్టాం.జీహెచ్ఎంసీలో అత్యధిక సీట్లు గెలిచి మేయర్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’’అని చెప్పారు. సమయాభా వం వల్ల ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్, సీఎం నివాసంలో సమీక్షలు చేస్తున్నారని.. అందులో తప్పేముందని పేర్కొన్నారు. సూర్యాపేటలో రాహుల్ సభఫిబ్రవరి 2వ వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ సభ నిర్వహించబోతున్నామని మహేశ్గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అధికారిక నివాసంలో సీఎం ఫోటోతోపాటు రాహుల్, సోనియా గాంధీ, ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని సూచిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుండి అభివృద్ధి కోసం తెచ్చిన నిధులు ఎన్ని అని ప్రశ్నించారు. బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన పేరుతో డ్రామాలు చేస్తుండటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనే రియ ల్ ఎస్టేట్ పడిపోయిందని.. దానిని తమ ప్రభుత్వం గాడిన పెడు తోందని చెప్పారు. ఫాంహౌస్ పాలన కోరుకునేది దొరలు మాత్రమేనని, ప్రజలంతా ప్రజాపాలనే కోరుకుంటారని పేర్కొన్నారు. -
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లోనే అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు. -
బండి సంజయ్కి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్రమంత్రి బండి సంజయ్కి పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(జనవరి25) మహేష్కుమార్గౌడ్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ని గౌరవిస్తాం. ఇంధిరమ్మ త్యాగం ముందు మీరు, మీ మోదీ ఎంత. ఇంధరమ్మను బండి సంజయ్ అవమానిస్తున్నారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని రేపు నాలుగు పథకాలు ప్రారంభించి మరోసారి నిరూపించుకోబోతున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకోవాలి. పదేళ్లలో బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో అయినా గత పాలకులకు కనివిప్పు కలగాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అనుచరులకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల లిస్ట్లో పేరు లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మేం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. తప్పు చేస్తే మాత్రం చర్యలు తప్పవు’అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాగా, ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్లో మీటింగ్లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారని బండి సంజయ్ చెప్పారు. -
తెలంగాణకు పెట్టుబడులు.. కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సీఎం దావోస్ పర్యటన తెలంగాణకి ఇక ధమాకా.. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని మహేష్ గౌడ్ అన్నారు.విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్పై నమ్మకం ఉంది. రైజింగ్ 2050 నినాదం.. గేమ్ ఛేంజర్గా మారింది. తనకి తాను సుపర్ స్టార్గా చెప్పుకునే కేటీఆర్ పదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు. కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారు. కేసీఆర్కి విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. -
కేబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ మీడియాతో మాట్లాడారు.‘త్వరలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేస్తాం. ప్రభుత్వ, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారు. కేబినెట్ విస్తరణ అంశంపై సీఎం, అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపైనా సమావేశంలో చర్చ జరిగింది. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు వస్తాయి’అని మహేష్కుమార్గౌడ్ తెలిపారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి(Graduate MLC candidate)ని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్రెడ్డి పేరు చాలా మంది చెప్పారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మహేష్కుమార్ గౌడ్ తెలిపారు. అందరి రిపోర్టు కేసీ వేణుగోపాల్ వద్ద ఉందన్న మహేష్ కుమార్ గౌడ్.. పార్టీ నేతలందరూ వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఈ నెలాఖరుకు పార్టీలో అన్ని కమిటీలు వేస్తామన్న ఆయన.. పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పనిచేసిన నాయకులకే పదవులు వస్తాయని.. కార్పొరేషన్ పదవుల భర్తీ ఈ నెలాఖరుకి పూర్తవుతుందని చెప్పారు.ఇదీ చదవండి: క్లైమాక్స్కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్ -
సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు వస్తారా?
సాక్షి,ఆదిలాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనకి.. ఏడాది కాంగ్రెస్ పాలనకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు వస్తారా..అంటూ బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సఫలమయ్యాం. వచ్చే నాలుగేళ్లలో అకుంఠిత దీక్షతో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం సీట్లు గెలుచుకునేందుకు కృషి చేస్తాం. ఇప్పటి నుంచే ఈ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం ’అని చెప్పారు. ఒక్క కుర్చి.. ముగ్గురు కొట్లాట బీఆర్ఎస్లో ఒక్క కుర్చీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారని మహేశ్కుమార్ ఎద్దేవా చేశారు. ఇటు కేటీఆర్..అటు కవిత ప్రయత్నిస్తుంటే మధ్యలో హరీశ్రావు గోవిందా అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వేరే పార్టీ చూసుకోవడం ఖాయమన్నారు. ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని, మొదట పనికిరాని కేసు అన్న కేటీఆర్ ఇప్పుడు కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖచిత్రం ఉండదన్నారు. ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ కవిత ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారని ఎద్దేవా చేశారు. సంక్రాంతి తర్వాత తీపి కబురు.. సంక్రాంతి తర్వాత పార్టీ నేతలకు తీపి కబురు ఉంటుందని మహేశ్కుమార్ అన్నారు. అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ధర్నా చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలకు న్యాయంగా అందాల్సిన నిధులు అందించకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు‘‘బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు బీసీలు గుర్తుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్లో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం’’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో బహిరంగ రహస్యమే. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’’ అంటూ మహేష్ కుమార్గౌడ్ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా.?..బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?..జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?..గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?. ఎమ్బీసీ కార్పొరేషన్కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?..గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లు నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?’’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలు సంధించారు. -
‘ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించం’
నిజామాబాద్: చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడం తగదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్. మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పద్మాలయ, రామానాయుడు స్టూడియలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి చిత్ర పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు.తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, ప్రభుత్వానికి అంతా సమానమన్నారు మహేష్కుమార్గౌడ్.తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయి, ఆమె కొడుకు చావుబతుకల మధ్య ఉంటే దానిపై బీజేపీ, బీఆర్ఎస్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు.ఫార్ములా ఈ-రేస్లో అడ్డంగా దొరికిన కేటీఆర్ మొన్నటివరకూ జైలకు వెళ్లేందుకు సిద్ధమన్నారని, ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని ఎద్దేవా చేశారు.ఫ్యాన్స్కు అల్లు అర్జున్ రిక్వెస్ట్అల్లు అర్జున్కు అండగా బండి సంజయ్ -
విపక్షంగా బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: రా ష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించటంలో బీఆర్ ఎస్, బీజేపీలు విఫలమ య్యాయని పీసీసీ అధ్య క్షుడు మహేశ్కుమార్ గౌడ్ విమర్శించారు. బీ ఆర్ఎస్ పార్టీలో మూ డు ముక్కలాట, బీజేపీ లో నాలుగు ముక్కలా ట నడుస్తున్నదని ఎద్దే వా చేశారు. ‘కుర్చీ కా వాలని కేసీఆర్ కుమార్తె కవిత అడుగుతోంది. కాదు నాకే కావాలని కుమారుడు కేటీఆర్ అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే కుర్చీ లాక్కోవాలని హరీశ్రావు చూస్తున్నారు. ఇక, బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఉత్తర, దక్షిణ ధృవాలుగా పనిచేస్తున్నారు. ఈటల రాజేందర్ తూర్పు చూస్తుంటే, డి.కె.అరుణ పడమర చూస్తున్నా రు’ అని ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీ డియాతో మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ రా జకీయ ముఖచిత్రం నుంచి బీఆర్ఎస్ కనిపించకుండా పోతుందని చెప్పా రు. ఆ పార్టీ నుంచి చాలా మంది తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చా రని ప్రశ్నించారు. తాము కేటీఆర్ అరెస్టు కోసం గవర్నర్ అనుమతి కోరిన ప్పటికీ ఎందుకు అనుమతి రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు మంత్రివర్గంలో చేరాలనే ఆలోచన ఎప్పుడూ లేదని అ న్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టంచేశారు. సమగ్ర సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పాలమూరు వీర పాట విడుదల: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్స రం పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్పై రూపొందించిన ‘పాలమూ రు వీర’ అనే పాటను మహేశ్గౌడ్ శనివారం అసెంబ్లీ అవరణలో ఆవిష్క రించారు. నిర్మాత యుగంధర్గౌడ్ ఆధ్వర్యంలో కవి రేలారే ప్రసాద్ రచించిన ఈ గీతం అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ గీతానికి కళ్యాణ్ సంగీతం అందించగా, ఎంఎల్ఆర్ కార్తికేయ ఆలపించారు. -
కులదూషణ ఏ సంస్కృతికి ప్రతీక?
ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవీ స్వీకారం రోజున చేసే ప్రమాణాలకు కట్టుబడి ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలు చేయాలి. బాధ్యతలూ నిర్వర్తించాల్సి ఉంటుంది. రాగద్వేషాలకు అతీతంగా వారు ఉండి తీరాల్సిందే. ఏ ఒక్కరిపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు సైతం చేయకూడదు. అలా చేస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించిన వారు అవుతారు. ఇటీవల ఒక ప్రజా ప్రతినిధి ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా దూషించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆ ప్రజాప్రతినిధి అలా మాట్లాడవచ్చా? ఎవరో ఏదో చేశారని మొత్తం ఆ కులాన్ని టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తున్నది. ఈ విధానాన్ని అన్ని రాజకీయ పక్షాలూ ముక్తకంఠంతో ఖండించాలి. అప్పుడే ఇలాంటి వారి వైఖరిలో మార్పు వస్తుంది. ఓ సామాజిక వర్గానికి చెందిన నేత 10 ఏండ్లు పాలించిన మాత్రాన ఆయనపై కోపంతో ఈ ప్రజాప్రతినిధి ఆ నేత కులస్థుల నందరినీ దూషించడం భావ్యమేనా? ఈ ప్రజాప్రతినిధి సొంత పార్టీలో కూడా ఆయన తిట్టిన సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ నేతలకు కూడా ఈ సంబోధన వర్తిస్తుందా అనేది స్పష్టం చేయాలి. అదే పార్టీకి చెందిన పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఇదే అయితే పార్టీని, పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టినట్టే కదా! ఈ విషయంలో వెంటనే స్పందించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆ ప్రజాప్రతినిధిని వివరణ ఇవ్వాలని ఆదేశించడం శుభపరిణామం. అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠం కావాలని కోరుకోవడం ఎంతైనా అవసరం.అన్ని కులాలు, జాతుల వారితోపాటు చివరకు ఆయన దూషించిన కులం వారు కూడా ఆయనకు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది? ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకూ ఆయనే కదా ప్రజాప్రతినిధి! అలాంటిది ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దేనికి సంకేతం? ఇదేనా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఆ ఒక్క కులాన్నే కాదు... ఏ కులాన్ని దూషించే హక్కూ ఎవరికీ లేదు. ఇలా చేస్తే రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేనట్టే లెక్క. గౌరవం ఉన్న వారు ఇలా ప్రవర్తించరు.కులాలపై దూషణలకు దిగినా, ద్వేషించినా అన్ని రాజకీయ పార్టీలూ అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విధమైన సంస్కృతిని ఎవరూ ప్రోత్సహించవద్దు. ఎవరైనా ప్రోత్సహించినా తగిన శాస్తి చేయాలి. ప్రజల్లో హీరోయిజం చూపించేందుకు ఇలాంటి మార్గాన్ని ఎన్నుకోవడం దుందుడుకు చర్య అవుతుంది. అరవై, డెబ్భై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీతో అత్యంత అనుబంధం ఉన్న ఆ కులానికి చెందిన నేతలు పెద్ద పెద్ద హోదాల్లో పని చేశారు. కులరహితంగా సేవలందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా నిత్యం పాటుపడ్డారు. కులాలను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. అందరికీ తోడుగా, నీడగా వ్యవహరించారు. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భరోసా కల్పించేవారు. దేశం, తెలంగాణ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. అదే విధంగా మరో జాతీయ పార్టీలో ఆ కులానికి చెందిన నేతలకు ప్రజాప్రతినిధులుగా, గవర్నర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఏతావతా చెప్పొచ్చేదేమిటంటే... అన్ని పార్టీల్లోనూ ఈ కులస్థులు ఉన్నారనే! ఈ ఇంగితాన్ని మరచి ఒక నేత పట్ల ఉన్న ఆక్రోశంతో అతడి కులస్థుల నందరినీ తిట్టి బాధపడేలా చేయడం సరికాదు కదా! మొత్తం రాజకీయ వాతావరణమే ఈ చర్యతో దెబ్బతిన్నదనేది వాస్తవం. కుల సంఘాల వారు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండి, రాజ్యాంగబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడడం మంచి పద్ధతి. అలా కాకుండా సోషల్ మీడియా వేదికలపై ఒకరి కులాన్ని మరో కులంవారు తిడుతూ రెచ్చగొట్టుకోవడం సరికాదు. ఈ విషయంలో అందరూ సంయమనాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తెచ్చి, తమ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ప్రజాప్రతినిధులపైన ఆ పార్టీ పెద్దలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయడం సరైన మార్గం. ప్రజల చేత ఎన్నికై, ప్రజల కోసం పని చేసే నేతలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. వెలమ జాతి ఒక్కరి సొత్తు కాదు. వారు ఒక్కరి దిక్కు ఒరిగి లేరు. నిజానికి ఆ కులాన్ని తిట్టిన ప్రజాప్రతినిధి పార్టీలోనే ఎక్కువ మంది వెలమలు ఉన్నారు అనే విషయం మరిచిపోకూడదు. గత ఏడు దశాబ్దాలుగా వారు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నమాట జగమెరిగిన సత్యం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఈ దూషణతో వ్యక్తిగతంగా దిగజారుతూ, పార్టీకి కూడా ఆయన చేసిన పాపం అంటగట్టడం ఎందుకు? దేశానికి ఆపద వస్తే కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పార్టీల మధ్య ఎన్ని వైరుద్ధ్యాలు ఉన్నా భారతీయులందరూ దేశ రక్షణ, అభివృద్ధిలో ఏకతాటిపై ఉండడం సహజం. ఇది మన లక్ష్యం. ఈ విషయంలో అది తెలంగాణ అయినా, మన సొంత జిల్లా అయినా, పక్క జిల్లా అయినా అక్కడ ప్రజలు ఆపదలో ఉంటే కులమతాలకు అతీతంగా ఆదుకొని తీరుతాం. సమాజంలో మనుషులంతా సమానమే. కులాలు వేరు వేరు ఉంటాయి. ఆ కులంలో పుట్టాం... ఈ కులంలో పుట్టాం... అని చింతించుకుంటూ పోతే లాభం లేదు. ఒక చిన్న కులంలో పుట్టడం నేరం కాదు. పెద్ద కులంలో పుట్టానని పొంగిపోవడం మంచిది కాదు. ఒక కులంపై విద్వేషం చిమ్మే విధంగా మరొకరు మాట్లాడడం భావ్యం కూడా కాదు. అసలు కుల ప్రస్తావన తేవడం నేరం కిందకే వస్తుంది. కులం పేరిట దూషిస్తూ స్వలాభం పొందడం రోతపుట్టిస్తుంది.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సర్కారు కులగణనను ఓ వైపు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధి ఓ కులంపై విషం చిమ్మడం దారుణం. అసలు కులగణన ఎందుకు జరిపిస్తున్నారన్న ఎరుక ఈ ప్రజాప్రతినిధికి ఉందా? వివిధ కులాల వారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారి వారి జనాభాల నిష్పత్తుల ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికే కదా! అంటే అన్ని కులాలనూ సమానదృష్టితో చూడడానికే కదా! మరి ఈ ప్రజాప్రతినిధి ఒక కులంపై ఇంత దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సభ్యసమాజంపై ఉంది. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలూ, పౌర సమాజం మొత్తం ఇది అర్థం చేసుకొని వ్యవహరించాలి. అప్పుడే సమాజ శ్రేయస్సుకు తోడ్పాటు అందించిన వారు అవుతారు. లేకపోతే సమాజానికే ప్రమాదం. వ్యాసకర్త కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి ‘ 9849061481వెలిచాల రాజేందర్రావు -
లోకల్ బాడీ ఎన్నికలు.. కుల గణన ఆధారంగా టికెట్స్: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, కుల గణన అంశం రాష్ట్రంలో కీలకంగా మారనుంది.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇవ్వడం జరుగుతంది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారనే దిల్ రాజుకు కార్పోరేషన్ పదవి ఇచ్చాం. తెలంగాణ తల్లిని విమర్శించడం అంటే తెలంగాణను విమర్శించడమే అవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తండ్రీ కొడుకులు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు
సాక్షి, హైదరాబాద్: తండ్రీకొడుకులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ మిగలరని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. సోని యా గాంధీ లేనిదే తెలంగాణ లేదని, అధికారం పో యినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదని అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఎమ్మెల్సీలు ఆమేర్అలీ ఖాన్, బల్మూరి వెంకట్, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, అధికార ప్రతినిధి బైకాని లింగం యాదవ్లతో కలసి ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని, ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో 50 వేల ఉద్యోగాలిస్తే, తాము ఏడాదిలోనే ఇచ్చామని చెప్పారు.రాజీవ్ గాంధీ గురించి విమర్శించే అర్హత కేటీఆర్కు లేదని అన్నారు. రాజీవ్ కుటుంబం దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని, తెలంగాణ కోసం కేటీఆర్, ఆయన కుటుంబం ఏం త్యాగాలు చేసిందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ అంటున్నారని, అసలు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ గెలిపిస్తారని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటే బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన విగ్రహం దొరసానిలా ఉందన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ను ఫామ్హౌస్లో బంధించి.. కేటీఆర్, హరీశ్రావులు పిల్ల చేష్టలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, చట్టం ఎవరికీ చుట్టం కాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినీ సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పదేళ్లలో తెలంగాణకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. -
వ్యవసాయాన్ని పండుగ చేశాం!
అన్నదాత కష్టాలను క్షేత్రస్థాయిలో కళ్లారా చూసి చలించిన కాంగ్రెస్, 2022 మేలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘రైతు డిక్లరేషన్’ వెలువ రించింది. అందుకు అనుగుణంగానే బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ రూ. 72,659 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ‘రుణమాఫీ’ పథకానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం మూడు విడతలలో 22,37,848 మంది రైతులకు రూ. 17,933.18 కోట్లను విడుదల చేసింది. తాజాగా నాలుగో విడత రుణమాఫీగా మరో రూ.2,747.67 కోట్లు అందించింది. అలా ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడుతుందని రుజువు చేసింది. రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేయడం జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ నానా యాగీ చేస్తున్నాయి.దేశాభివృద్ధికి బడా వ్యాపారస్తుల కంటే రైతులే కీలకమని విశ్వసించే కాంగ్రెస్... అన్న దాతల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నో ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నిరంగాల్లో దగా పడింది. రాష్ట్రానికి వెన్నెముక లాంటి రైతులను కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నా... అప్పటి సీఎం కేసీఆర్ మాయమాటలతో అరచేతిలో స్వర్గం చూపించారు. అన్నదాత కష్టాలను క్షేత్రస్థాయిలో కళ్లారా చూసి చలించిన కాంగ్రెస్, వారి కన్నీటిని తుడవాలనే లక్ష్యంతో 2022 మేలో వరంగల్ వేదికగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు సంక్షేమ పథకాలతో ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి రూ. 54,280 కోట్లు ఖర్చు చేసి తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది.రైతులు సిరిసంపదలతో ఆనందంగా ఉంటేనే సమాజంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయనేది కాంగ్రెస్ విశ్వాసం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించాం. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, ఏడాదికి ఎకరాకు రూ. 15 వేల ‘ఇందిరమ్మ భరోసా’, అన్ని పంట లనూ సరైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయడం, వివిధ కారణాలతో నష్టపోయే పంటలకు తక్షణం నష్టపరిహారం చెల్లించడం, పంటల బీమా పథకం వర్తింపు, ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకా’న్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయడం, పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు అన్ని రకాల యాజమాన్య హక్కులు కల్పించడం, అవినీతికి మారుపేరుగా మారిన ధరణి పోర్టల్ను రద్దు చేసి దాని స్థానంలో నూతన రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి పలు రైతు ప్రయోజనకర పథకా లను ‘వరంగల్ డిక్లరేషన్’లో కాంగ్రెస్ ప్రకటించింది. ప్రజల ఆశీర్వా దాలతో అధికారంలోకి రాగానే, తాను ప్రకటించిన కార్యక్రమాలను అమలు చేయడానికి చర్యలు చేపట్టింది.ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందుండే కాంగ్రెస్ అందుకు అనుగుణంగా 2024–25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వ్యవ సాయం దాని అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ రూ. 72,659 కోట్లు కేటాయించింది. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్కు రూ. 737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ. 19.080 కోట్లు బడ్జెట్లో కేటా యించిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తామిచ్చే ప్రాధా న్యాన్ని మాటల్లో కాక చేతల్లో చూపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ‘రుణమాఫీ’ పథకానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుచిత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా,కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా మూడు దశలలో సంబంధిత రైతుల బ్యాంకుల ఖాతాల్లో వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి 2 లక్షల రూపాయలు జమ చేసింది.మొదటి విడతలో 11,50,193 మంది రైతులకు రూ. 6.098.93 కోట్లు, రెండో విడతలో 6,40,823 మంది రైతులకు రూ. 6,190.01 కోట్లు, మూడో విడతలో 4,46,832 మంది రైతులకు రూ. 5,644.24 కోట్లు... మొత్తం మూడు విడతలలో 22,37,848 మంది రైతులకు రూ. 17,933.18 కోట్లను విడుదల చేసి... ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని మరోసారి రుజువు చేసింది. కొన్నిసాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో, అందరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి పారదర్శకంగా లబ్ధిదారులందరికీ రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకుంది. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీని వాయిదాల పద్ధతిలో అసంపూర్తిగా నిర్వహించి అన్నదాతల ఆగ్రహానికి గురై అధి కారం కోల్పోయింది. అయినా బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు సమయం వచ్చినప్పుడు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయం.‘రైతు భరోసా’ ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 7,625 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే లోక్సభ ఎన్నికలు రావడంతో నిబంధనల ప్రకారం పలు పథకాల (హామీల) అమలులో కొంత జాప్యం జరిగింది. ఈ ప్రభావం ‘రైతు భరోసా’పై కూడా పడింది. ప్రస్తుతం రాబోయే సీజన్లో రైతు లకు వ్యవసాయానికి సంబంధించిన కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండాలని లబ్ధిదారులందరికీ వీలైనంత త్వరగా ‘రైతు భరోసా’ పంపిణీ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ సర్కార్ ఉంది. సంక్రాంతి పర్వదిన సందర్భంగా పంపిణీకి ఏర్పాట్లు జరుగు తున్నాయి. దీనికి తోడు రూ. 1514 కోట్ల ‘రైతు బీమా’ను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. వరికి రూ. 500 బోనస్ చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకుంది.ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల పంట నష్టం జరిగినప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సరైన రీతితో స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకుంది. పంట నష్ట సహాయంలో కేంద్రం ప్రభుత్వం వివక్ష చూపించినా, రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేక పోయారు. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములను కోల్పోయి త్యాగం చేస్తున్న రైతులకు మెరుగైన ప్రయోజనం కలిగించా లనే దృష్టితో... ఆ భూముల మార్కెట్ విలువను మూడింతలు పెంచు తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని చెప్పడానికి నిదర్శనం.పోడు భూముల హక్కుల కోసం పోరాడిన రైతులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు బహిరంగ రహస్యమే. దీనికి భిన్నంగా పోడు భూములపై హక్కులను అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతులకే అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతేకాక పొలాలకు సాగునీరు అందించేందుకు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇస్తూ... వాటికి నిధులు కేటాయించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలనే సంకల్పంతోకాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో పండే అన్ని రకాల పంట లకూ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి అన్న దాతలకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంది.రాష్ట్రం కొను గోలు చేసిన పంటల్లో కేంద్రం 25 శాతమే తీసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు కలగకూడదనే సంకల్పంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎప్పటికప్పుడు అన్ని రకాల పంటలను సేకరిస్తోంది.ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చుతుంటే... జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు పనిగట్టుకొని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ నానా యాగీ చేస్తున్నాయి. రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన అన్నదాతలపై కేసులు బనాయించి జైలు పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ది. ఇప్పుడు కాంగ్రెస్ రైతు ప్రయో జనాలను కాపాడుతుంటే వారు చూడలేకపోతున్నారు. రాష్ట్రంలోకాంగ్రెస్ అధికారంలోకి రావడం, వెంట వెంటనే తీసుకుంటున్న సత్వర చర్యలు, నిర్ణయాలతో... రైతులకు వ్యవసాయం ఒక పండు గలా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అభయహస్తం అందించిన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మహబూబ్నగర్లో నిర్వహించిన ‘రైతు పండుగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రంలోని రైతులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.-బి. మహేశ్ కుమార్ గౌడ్, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మహిళల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం వరంగల్లో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభ’లో ఆయన మాట్లాడారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రూ.6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇది మహిళలు ఏది కావాలంటే అది అమలు చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతాం: పొంగులేటి ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన తెలంగాణకో వరం: కోమటిరెడ్డి మూసీ ప్రక్షాళన తెలంగాణకు గొప్ప వరమని, ప్రధానంగా ఫ్లోరైడ్తో బాధపడుతున్న నల్లగొండతో పాటు పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది మందికి మేలు జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకు లు మూసీ కోసం రూ.7 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. వైఎస్ స్ఫూర్తితో ముందుకు: సీతక్క, కొండా సురేఖ నాడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తే, నేడు వడ్డీలేని రుణాతోపాటు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి తర్వాత అంత గొప్ప దయగల నేత, సీఎం రేవంత్రెడ్డి అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కృషి: టీపీసీసీ చీఫ్ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6,000 కోట్లు కేటాయించడం చరిత్రలో రికార్డని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. సభలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ కి నూకలు చెల్లాయని, పదేళ్ల పాలనలో యథేచ్ఛగా నీళ్లు, నిధులు, భూములు దోపిడీ చేసిన బీఆర్ఎస్ ను ప్రజలు 2023లో గద్దె దించారని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదు.. మొత్తం అన్యాయమేనని, దీనిపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు.19న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం హనుమకొండకు విచ్చేసిన టీపీసీసీ చీఫ్ ముందుగా నయీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రా న్ని బీఆర్ఎస్ అప్పుల తెలంగాణగా మార్చిందని, ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్ర మే బంగారుమయం అయ్యిందని.. పేదలు అష్టకష్టాలు పడ్డారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాను నిర్వర్తించకుండా ఫాంహౌస్కే పరిమితమయ్యాడని విమర్శించారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. తెలంగాణలో ఉనికి కోసం కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యతి్నస్తున్నదన్నారు. మూసీ ప్రక్షాళన అవసరమా, కాదా? కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేయాలన్నారు. కులగణనతో దేశానికే రోల్మోడల్.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు మహేశ్కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పది నెలల రేవంత్రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నేపథ్యంలో నిర్వహించనున్న ఈ సభ చరిత్రాత్మకంగా నిలవబోతుందన్నారు. రాహుల్గాంధీ ఆశయాలకు అనుగుణంగా రేవంత్రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కులగణన చేపడుతోందని, కులగణనతో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తుందన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నాడని, తాను జైలుకు పోవడం ఖాయమని కేటీఆర్కు తెలిసిపోయిందని చెప్పారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలిని పరిశీలించారు.సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, డాక్టర్ మురళీనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్ జిల్లాల టూర్
-
లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్... తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రేపు ‘కులగణన’ సదస్సుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ హైదరాబాద్ పర్యటన కోసం టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల ఐదో తేదీన సాయంత్రం బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహించనున్న కులగణన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ హాజరు కానున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఇందిరాభవన్లో కుల సంఘాల నేతలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్లు విశ్వేశ్వరరావు, సింహాద్రి, వెంకటనారాయణ, భూక్య, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తదితరులు పాల్గొని కులగణన సంప్రదింపుల సదస్సులో చర్చించాల్సిన అంశాల గురించి సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ రాహుల్గాంధీ గంటపాటు అన్ని వర్గాలతో భేటీ అయ్యి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు.కులగణనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కులగణన దేశానికే ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ నేత కొప్పుల రాజు, ఎంపీలు అనిల్కుమార్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, టీపీసీసీ నేతలు రోహిణ్రెడ్డి, కోట నీలిమ, పవన్ మల్లాది, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, మెట్టు సాయికుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
5న రాష్ట్రానికి రాహుల్, ఖర్గే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరో తేదీ నుంచి నిర్వహించనున్న కులగణనపై మేధావులు, విద్యార్థి నాయకులు, కుల సంఘాల నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఈ నెల ఐదో తేదీన హైదరాబాద్కు వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగే సమావేశానికి రాహుల్ హాజరవుతారని, ఇదే సమావేశానికి రావాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించామని చెప్పారు.వీలును బట్టి ఆయన కూడా హాజరవుతారని వెల్లడించారు. కులగణన కోసం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కనెక్ట్ సెంటర్ను పార్టీ నేతలతో కలిసి మహేశ్కుమార్గౌడ్ శనివారం ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంపిణీ జరగాలని అన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భాగం కావాలని పిలుపునిచ్చారు. కులగణనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేప డుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కనెక్ట్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. కులగణన ఎక్కడా బ్రేక్ లేకుండా నిష్పక్షపాతంగా, సజావుగా జరగాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.కులగణనపై పీసీసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతుందని చెప్పారు.మహేశ్వర్రెడ్డి తనకు మంచి మిత్రుడని, బీజేపీలో ఆయనకు కుర్చీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదని తెలిపారు. ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు అమలు చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఎక్కడ అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం..
-
ధరణితో భూముల్ని దర్జాగా దోచేశారు : పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్: ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ధరణి పోర్టల్పై ఆయన మాట్లాడుతూ.. ఊరు పేరు లేని సంస్థలకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్,హరీష్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ ఎన్ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు చెప్పారు. మూడేళ్ల నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆయన పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పొందంలో పేర్కొందని తెలిపారు. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్ధం ఉండాలి. మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదు. ప్రతి అంశంతో ఓట్లు దండుకోవాలనుకోవడం అవివేకం. వామపక్ష భావజాలంతో ఉండి..బీజేపీకి వెళ్ళింది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కదా అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చారు అని ఈటల ప్రధాని మోదీని అడగాలని సూచించారు. -
బీఆర్ఎస్,బీజేపీ రెచ్చగొడుతున్నాయి: పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ వన్ పరీక్షపై బీఆర్ఎస్,బీజేపీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.గాంధీభవన్లో ఆదివారం (అక్టోబర్20) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీల నేతలు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్,బీజేపీ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ బిడ్డగా నేను మీకు భరోసా ఇస్తున్నా.సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదు. జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బండి సంజయ్ చెప్పాలి.బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చింది. పదేళ్లలో టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు’అని మహేశ్గౌడ్ మండిపడ్డారు.ఇదీ చదవండి: న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్రెడ్డి -
‘సమన్వయం’తో ముందుకు!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ నెలాఖరులోగా అభ్యరి్థని ఖరారు చేయాలని భావిస్తోంది. ఎన్నికల వ్యూహాల అమలు కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలతో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారంఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందని, ప్రధానంగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, టీచర్ల బదిలీ చేపట్టడంతో పాటు ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ అంశాలను పట్టభద్రులైన యువత దృష్టికి ప్రధానంగా తీసుకెళ్లాలని సూచించారు. రుణమాఫీతో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీల ఏర్పాటు లాంటి విప్లవాత్మక కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. తక్షణమే ఓటర్ల నమోదుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను పార్టీ పక్షాన వెంటనే ప్రారంభించాలని, ఈ ప్రక్రియలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలను భాగస్వాములను చేయాలని రేవంత్రెడ్డి కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలోని యువత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉందనే విషయాన్ని మరోమారు తెలియజేయాలని, ఈ మేరకు ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీలోని అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కోరారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్లు కూడా జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్పై దాడి విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
-
మీ మేనిఫెస్టోల్లో పెట్టలేదా?
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీఆర్ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్గౌడ్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను ఆ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలేదా అని నిలదీశారు. మూసీపై ఒక్క గుడిసె కూడా ప్రభుత్వం తొలగించలేదని, అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.అందరూ గ్లోబల్ వారి్మంగ్ గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతల మెదళ్లకు మాత్రం ఆ ఆలోచన రావడం లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుíÙతమైన నదిగా మూసీ గుర్తింపు పొందిందని, ఇలాంటి పరిస్థితుల్లో మూసీని ప్రక్షాళన చేయడం వల్ల రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 26 లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు సోషల్మీడియాను ఉపయోగించి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్కుమార్ విమర్శించారు. సోషల్మీడియా కోసం బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్క్రైమ్ అధికారులను కోరామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్, జన్వాడ ఫామ్హౌజ్ల చుట్టూ కాదని, చార్మినార్, మూసీలో జరగాలని అన్నారు.గత పదేళ్లలో 1,500 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఇందులో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసినవేనని ఆరోపించారు. హైదరాబాద్ను బీఆర్ఎస్, బీజేపీ నేతలు కబళించారని, ఈ భూబకాసురులే తమ టార్గెట్ అని, పేద ప్రజలు కాదని స్పష్టంచేశారు. సమయం వచి్చనప్పుడు ఈ భూబకాసురుల పేర్లు బయటకు వస్తాయని, వారు వెళ్లే జైలు పేరు కూడా తెలుస్తుందని మహేశ్గౌడ్ వ్యాఖ్యానించారు. హైడ్రాతో భయభ్రాంతులకు గురవుతున్నది బీఆర్ఎస్ నేతలే తప్ప సామాన్య ప్రజలు కాదని అన్నారు. తలో దిక్కు దోచుకున్నారు రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ మల్లన్నసాగర్ కట్టేందుకు సీఆరీ్పఎఫ్ జవాన్లతో కొట్టించి మరీ ప్రజలను ఖాళీ చేయించిందని మహేశ్గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్ల అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు తలోదిక్కు దోచుకున్న విషయాన్ని గమనించిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ నేతల్లో ప్రజానాయకులు ఎవరున్నారని మహేశ్గౌడ్ ప్రశ్నించారు.నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటే రైతు మోసగాడు ఎవరుంటారని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ చేసిన ట్రోలింగ్లతో పద్మశాలీల గుండెలు పగిలిపోతున్నాయని మహేశ్గౌడ్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం పెట్టిన ఆ పోస్టింగ్పై కేటీఆర్, హరీశ్రావులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని మహేశ్గౌడ్ దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, టీపీసీసీ నేతలు సామా రామ్మోహన్రెడ్డి, సంధ్యారెడ్డి, భవానీరెడ్డి, బండారి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
అసమ్మతిపై కాంగ్రెస్ ‘ఫోకస్’
సాక్షి, హైదరాబాద్: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ నిర్ణయించారు.సమర్థుల కోసం అన్వేషణపీసీసీకి కొత్త చీఫ్ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి.సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు.ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్కు మహేశ్గౌడ్ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్లో
సాక్షి, హైదరాబాద్: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్కుమార్గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా...25 సెప్టెంబర్: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్: శ్రీధర్బాబు, 2 అక్టోబర్: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్ : ఉత్తమ్కుమార్రెడ్డి, 9 అక్టోబర్: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్: సీతక్క, 16 అక్టోబర్: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, 18 అక్టోబర్: కొండా సురేఖ, 23 అక్టోబర్: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, 25 అక్టోబర్: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్: తుమ్మల నాగేశ్వరరావు -
ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఇవ్వొద్దని, ముఖ్యంగా అధికారుల పోస్టింగ్ల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం, పోస్టింగుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందువల్ల ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పనిచేసుకుంటే.. రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ బాధ్యతల స్వీకారం నేపథ్యంలో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఓ హోటల్లో సీఎల్పీ సమావేశమైంది. ఈ కార్యక్రమంలో మహేశ్కుమార్గౌడ్ను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సన్మానించారు. మహేశ్గౌడ్ నియామకంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాం«దీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పారీ్టలో సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ నేతలు తీసుకోవాలని కోరారు. ‘‘పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. లోక్సభ సీట్లు గెలిచాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో కచి్చతంగా అవకాశాలు వస్తాయి. నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టే మహేశ్ గౌడ్కు పీసీసీ అధ్యక్ష పదవి వచి్చంది. బీసీల కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన. ఆయన ఆలోచన మేరకు రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభాను లెక్కించాల్సిందే. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సుప్రీం తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగోసారి గెలవడం కోసమే జమిలి ఎన్నికలు తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ప్రజల్లో ఉండేవారికే డీసీసీల బాధ్యతలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొమ్మిది నెలల కాలంలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్ చెప్పారు. అధికారం కోల్పోయిన అసహనంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ఆ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని.. తెలంగాణలో చేసి చూపించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కలి్పస్తామని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవులు వస్తాయన్నారు. ఇన్చార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు తమ జిల్లాలో పర్యటించాలని సూచించారు. కార్యకర్తల రుణం తీర్చుకోవాలి: మహేశ్గౌడ్ తాను పీసీసీ అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తానని.. పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని పీసీసీ చీఫమహేశ్కుమార్గౌడ్ తెలిపారు. పార్టీని ముందుకు నడపడంలో సమష్టి బాధ్యత అవసరమన్నారు. కార్యకర్తలు, నేతలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేసినందుకే అధికారంలోకి రాగలిగామన్న విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గుర్తించాలని.. ఆ కార్యకర్తల రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలను గెలిపించుకోవడం ద్వారా పార్టీ కార్యకర్తలను గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు పదవుల్లో కూర్చోబెట్టాలన్నారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని.. కార్యకర్తలను సమాయత్తం చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని మహేశ్గౌడ్ చెప్పారు. రాహుల్ గాం«దీని ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి గురించి ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్ర ఖ జానాకు నెలకు సగటున రూ.18 వేలకోట్ల ఆదా యం వస్తోందని.. అందులో రూ.6 వేలకోట్లు ప్రభు త్వ ఉద్యోగుల జీతాలకే పోతాయని, మరో రూ.6 వేలకోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకు చెల్లిస్తున్నామని చెప్పారు. మిగతా రూ.6 వేలకోట్లలో రూ.3 వేలకోట్లు ప్రభుత్వ పథకాల అమలు కోసం ఖర్చవుతున్నాయని, ఇంకో రూ.3 వేల కోట్లతో కొత్త పథకాల అమలు, ప్రభుత్వ నిర్వహణ జరుగుతోందని వివరించారు. ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉండటంతో దుబారా ఖర్చులు తగ్గించుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు. ⇒ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ, ఫ్యామిలీ హెల్త్ కార్డుల అంశాలను ఎమ్మెల్యేలకు సుదీర్ఘంగా వివరించారు. పాత రేషన్కార్డులు తొలగించడం లేదని.. ఈ విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని సూచించారు. ⇒ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ⇒ ఇక ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బాలూ నాయక్, పరి్ణకారెడ్డి, అమీర్ అలీఖాన్ తదితరులు మాట్లాడారు.సీఎల్పీ సమావేశానికి ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేలు! ఆదివారం రాత్రి జరిగిన సీఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా హాజరవడం గమనార్హం. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాం«దీతోపాటు ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రి సీతక్క, ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనివార్య కారణాలవల్ల సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.గాంధీ నియోజకవర్గమనే వచ్చారు: మంత్రి శ్రీధర్బాబు పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ నేత అయినప్పుడు సీఎల్పీ సమావేశానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలకు.. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్బాబు సమాధానమిచ్చారు. ఏదైనా నియోజకవర్గానికి సీఎం వచి్చనప్పుడు స్థానిక ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలవడం సాధారణమేనని చెప్పారు. సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉందని.. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని పేర్కొన్నారు. సిద్దిపేటలో సీఎం కార్యక్రమం జరిగితే హరీశ్రావు వెళ్లరా? అని ప్రశ్నించారు. -
చీఫ్ కు పార్టీ నేతల ఫిర్యాదు..
-
కులగణన చేసి తీరుతాం
గన్ఫౌండ్రీ(హైదరాబాద్): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం రవీంద్రభారతిలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కులగణనకు అంతా సిద్ధంగా ఉందని, దీనికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఎవరెంత అరిచి గీ పెట్టినా రాష్ట్రంలో కులగణన చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాహుల్గాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేశామని, వెనువెంటనే బీసీ కమిషన్ను కూడా నియమించామని గుర్తు చేశారు. కులగణనకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, ఇదే పార్లమెంట్లో కులగణన తీర్మానం చేస్తామని రాహుల్గాంధీ చెప్పారన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు బీజేపీ అసలు స్వరూపం తెలుసుకోకపోతే రాబోయేతరాలకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదు
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాటం, హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. మంగళవారం గాం«దీభవన్లో ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులరి్పంచారు. అనంతరం మహేశ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ విలీనంలో పాత్ర లేని బీజేపీ.. కాంగ్రెస్ పారీ్టకి నీతులు చెప్పాల్సిన అవసరంలేదని హితవు పలికారు.స్వాతంత్య్రానంతరం అన్ని సంస్థానాలను దేశంలో అంతర్భాగం చేయాలని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ను ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కోరారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు బీజేపీతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారని, జనసంఘ్, బీజేపీల ఆచూకీ ఎక్కడా లేదన్నారు. రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించడం బీఆర్ఎస్కు తగదని మహేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీ కుటుంబాన్ని కించపరచడం బీఆర్ఎస్ నీతిమాలిన చర్యలకు పరాకాష్టఅని విరుచుకుపడ్డారు.తొమ్మిదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకలి్పంచామని చెప్పారు. హైదరాబాద్ విలీన దినం సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని మహేశ్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డి, టీజీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ నేతలు బొల్లు కిషన్, మత్స వరలక్షి్మ, కోట్ల శ్రీనివాస్, మిద్దెల జితేందర్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు
-
టెక్నికల్ గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
-
కార్యవర్గానికి.. కొంత సమయం!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర పారీ్టకి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి కావడంతో పార్టీ పదవులు, టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగినా కార్యవర్గం ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ బాధ్యతల స్వీకరణ అనంతరం రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి, వారి సల హా మేరకు కమిటీలను కూర్చి, ఆ కమిటీలపై హైకమాండ్ ఆమోద ముద్ర వేయించుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది.పీసీసీ అధ్యక్షునిగా ఈనెల 15వ తేదీన మహేశ్గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందు బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నా యి. మహేశ్గౌడ్ ఈనెల 11న ఢిల్లీ వెళ్తారని, అధ్యక్ష పదవి అప్పగించినందుకు గాను పార్టీ పెద్దలను కలసి కృతజ్ఞతలు తెలిపేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారని గాంధీభవన్వర్గాలు చెబుతున్నాయి. ప్రచార కమిటీని నియమిస్తారా? టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించిన నేపథ్యంలో గతంలో ఉన్న మిగిలిన కమిటీలను కొత్తగా ని యమిస్తారా లేక వాటినే కొనసాగిస్తారా అనే చర్చ ప్రారంభమైంది. టీపీసీసీకి అనుబంధంగా ఏడెని మిది కమిటీలు పనిచేస్తుంటాయి. వీటిలో టీపీసీసీ ప్రచార కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమి టీ లాంటి వాటిని కొత్తగా ప్రకటిస్తారని గాం«దీభవ న్ వర్గాలంటున్నాయి. టీపీసీసీకి ప్రచార కమిటీని నియమిస్తే దానికి చైర్మన్గా ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డికి పదోన్నతి కలి్పంచి ఆ పదవిలో నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేశ్గౌడ్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.ఇక, జగ్గారెడ్డితో పాటు అంజన్కుమార్, అజారుద్దీన్, గీతారెడ్డిలు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేస్తున్నారు. సామాజిక సమీకరణల మేరకు గతంలో నియమించిన ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ల స్థానంలో కొత్త వారు వస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని, వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.వీరితో పాటు సీనియర్ ఉపాధ్యక్షులుగా పార్టీ సీనియర్ నేతలను నియమిస్తారని, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఎంత మంది ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా, అధికార ప్రతినిధుల జాబితాలో మాత్రం మార్పులు చేస్తారని సమాచారం. అన్ని పదవుల విషయంలోనూ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే నెలలో టీపీసీసీ కార్యవర్గ కూర్పు కసరత్తు జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. -
బీఆర్ఎస్ ఎదురుదాడి తిప్పికొడతా: పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్
సాక్షి,హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతానని, బీఆర్ఎస్ ఎదురు దాడిని ఎప్పటికప్పుడు తిప్పి కొడతానని తెలంగాణ నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాడర్ను సిద్ధం చేస్తానని చెప్పారు. పీసీసీ అధ్యకక్షునిగా నియామకమైన తర్వాత శనివారం(సెప్టెంబర్7) సాక్షిటీవీతో మహేష్కుమార్గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు.‘పార్టీని ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం నా ముందు ఉన్న పెద్ద టాస్క్. ఆర్గనైజేషన్లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే పదవులు ఇస్తారని నన్ను చూస్తే తెలుస్తుంది. పార్టీలో చాలా పోటీ ఉన్నాబీసీకి పీసీసీ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయింది. నాకు పదవి ఇచ్చింది. త్వరలోనే పార్టీ పదవుల భర్తీ ఉంటుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతా. -
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మా మహేశ్కుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం టీపీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి అద్భుతంగా పనిచేశారంటూ పార్టీ అధిష్టానం అభినందించింది. మహేష్కుమార్గౌడ్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్విద్యార్థి నేత నుంచిబొమ్మా మహేశ్కుమార్గౌడ్ 1980లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ద్వారా విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ఎనిమిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై యూత్కాంగ్రెస్ జాతీయకార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో స్థానం సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీపీసీసీ అధికార ప్రతినిధిగా, కార్య దర్శిగా, ప్రధానకార్యదర్శిగా పలు హోదాల్లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమ యంలో ఏపీ వేర్హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మహేశ్కుమార్గౌడ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియమితుౖలెన సమయంలోనే మహేశ్కుమార్గౌడ్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశం దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా టీపీసీసీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మహేశ్కుమార్గౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండాలని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. విధేయతకు పెద్దపీట వేస్తూ తాజాగా అధిష్టానం ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక నాలుగో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పొన్నాల లక్ష్మయ్య, కెప్టెన్.ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఎ.రేవంత్రెడ్డిల తర్వాత అధ్యక్షుడు కానున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డికి పదోన్నతి కల్పించి పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్... మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేశ్కుమార్గౌడ్కు పదోన్నతి కల్పించి అధ్యక్షుడిగా నియమించడం గమనార్హం.కరాటే ‘డాన్’....రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మహేశ్కుమార్గౌడ్ తనకు ఇష్టమైన కరాటే పట్ల ఆసక్తిని మాత్రం తగ్గనివ్వలేదు. 2006లో కరాటే బ్లాక్బెల్ట్ 6వ డాన్ పూర్తి చేసిన ఆయన రాష్ట్రంలో కరాటే క్రీడ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.చిత్తశుద్ధి, అంకితభావంతో పార్టీని బలోపేతం చేస్తా : మహేశ్కుమార్గౌడ్నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధితోపాటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు బొమ్మా మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకిత భావంతో నెరవేరుస్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకాలం నాకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.’అని ఆ ప్రకటనలో మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్, అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం తదితరులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. మహేశ్గౌడ్ను పీసీసీ అధ్యక్షుడి గా నియమించిన వార్త తెలియగానే గాంధీ భవన్లో టీపీసీసీ కల్లుగీత కార్మిక విభాగం అ«ధ్యక్షుడు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ⇒ మహేశ్కుమార్గౌడ్కు సీఎం రేవంత్రెడ్డి ఫోన్ చేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొత్త అధ్యక్షుడికి ఫోన్ చేసిన రేవంత్ అభినందనలు తెలిపారని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరినట్టు వెల్లడించాయి.మహేశ్కుమార్గౌడ్ ప్రొఫైల్పేరు: బొమ్మా మహేశ్కుమార్గౌడ్తండ్రి: గంగాధర్గౌడ్ (లేట్)పుట్టిన తేదీ: 24–02–1966జన్మస్థలం: రహత్నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లావిద్యార్హత: బీకాంరాజకీయ ప్రస్థానం: నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1986–1990) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1990–98) యూత్ కాంగ్రెస్ జాతీయకార్యదర్శి (1998–2000) పీసీసీ కార్యదర్శి (2000–2003), అధికార ప్రతినిధి (2012–2016) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి (2016–2021) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (2017–2024) -
టీపీసీసీ చీఫ్గా మహేశ్కుమార్గౌడ్!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్కు కొత్త సారథిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ సారథితోపాటు పశి్చమ బెంగాల్కు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, కేరళకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకానికి ఆమోదం తెలుపుతూ సంబంధిత పత్రంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతకం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలలుగా కసరత్తు.. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పీసీసీ అధ్యక్ష నియామకంపై గడిచిన రెండు నెలలుగా కసరత్తు జరుగుతుండగా, వివిధ సామాజిక కోణాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. పది రోజుల కిందటే మరో దఫాలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలను ఢిల్లీకి పిలిపించి ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సామాజికవర్గ నేతకే పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చారు.బీసీల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మహేశ్గౌడ్తోపాటు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ల అభ్యర్థిత్వాలపై చర్చించారు. వారి అభ్యర్థిత్వాలపై రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో నిర్ణయాధికారాన్ని అగ్రనేత సోనియా గాం«దీకి కట్టబెట్టారు. ఆమె సూచనల మేరకు విద్యార్థి దశ నుంచి పారీ్టకి సేవలందిస్తూ రాష్ట్ర నేతలందరితో సన్నిహిత సంబంధాలుగల మహేశ్ గౌడ్ వైపు ఏఐసీసీ మొగ్గుచూపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏ క్షణమైనా ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. -
ఈ ఇద్దరిలో ఎవరో?
మంత్రివర్గ విస్తరణపై అస్పష్టత రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజా భేటీలో మంత్రివర్గ కూర్పుపై అభిప్రాయ సేకరణకు పరిమితమైన అధిష్టానం.. దానిపై మరోమారు చర్చిద్దామంటూ వాయిదా వేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడి నియామకమయ్యాక దీనిపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయంటూ.. వీరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు రాష్ట్ర నేతలు ఉంచినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం. సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించాలనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చి నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలైన మహేశ్కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్లలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో జరిగిన చర్చల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, పారీ్టలో పనిచేసిన అనుభవం ఆధారంగా కొత్త మంత్రులపై నిర్ణయం ఉంటుందని సమాచారం. సుదీర్ఘ చర్చలు..: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు ప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ పదవుల భర్తీపై గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో చర్చలు జరిపారు. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది.తాజాగా ఆయా అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన రేవంత్రెడ్డి, భట్టి, ఉత్తమ్లు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్గాం«దీ, కేసీలతో మరోమారు భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్య నేతలతో విడివిడిగా కూడా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చర్చకు వచ్చిన ఆరు పేర్లు పీసీసీ పదవికి ప్రధానంగా ఆరుగురు నేతల పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రి శ్రీధర్బాబుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పారీ్టలను ధీటుగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతతో పాటు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజికవర్గ నేతలకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.ముఖ్యంగా బీసీ నేతలకు కేంద్ర ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరిగణనలోకి తీసుకుని బీసీ వర్గ నేతలవైపే హైకమాండ్ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలిసింది. వారిలో పార్టీ కార్యకలాపాల్లో మొదటినుంచీ చురుగ్గా ఉన్న మహేశ్గౌడ్ వైపు మెజార్టీ నేతలు మొగ్గు చూపగా, ఆయన ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటంతో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దృష్ట్యా, మధుయాష్కీ పేరును పరిశీలించాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.అయితే దీనిపై నిర్ణయాధికారం తమకు అప్పగించాలని, ఎవరి పేరును ప్రకటించినా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఓసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చేలా ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే దానిపై భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. -
టీపీసీసీ చీఫ్.. కసరత్తు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పలుమార్లు చర్చల అనంతరం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటు న్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్గౌడ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్కుమార్, బలరాం నాయక్ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం ఇవ్వాలని మంత్రి డి.శ్రీధర్బాబు, సీనియర్ నేత జీవన్రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిలో ఒకరిని ఈ నెల ఆరో తేదీలోగా పీసీసీ చీఫ్గా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మరోమారు అధిష్టానం చర్చించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారితో చర్చించాక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మహేశ్కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.మంత్రివర్గం రేసులో బాలూనాయక్, టి. రామ్మోహన్రెడ్డిమంత్రివర్గ విస్తరణలో నల్లగొండ జిల్లాకు చెందిన లంబాడా సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎన్. బాలూనాయక్కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గిరిజన వర్గాల నుంచి ఆదివాసీలకు ఇప్పటికే కేబినెట్లో స్థానం కల్పించినందున లంబాడా సామాజికవర్గానికి కూడా అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కోటాలో బాలూనాయక్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బాలూనాయక్కు మంత్రి పదవి లభిస్తే డిప్యూటీ స్పీకర్గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదే జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయంపైనా బుధవారం నాటి చర్చల్లో స్పష్టత రానుంది.పీసీసీ చీఫ్గా నా పేరు పరిశీలించండిఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి కోరిన మహేశ్కుమార్గౌడ్సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన కలిశారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే మహేశ్కుమార్గౌడ్ ఖర్గేను కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలవడం తెలిసిందే. -
డీఎస్ నా రాజకీయ గురువు : ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్
నిజామాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్లో గల మూన్నూరుకాపు కల్యాణ మండపంలో ఆయనకు పార్టీ శ్రేణులు నిర్వహించిన సన్మానసభ మాట్లాడారు. కాంగ్రెస్లో కష్టపడి పని చేస్తే గుర్తింపు వస్తుందన్నారు. మారుమూల గిరిజన గ్రామమైన రాహత్నగర్ నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, టీపీసీసీలో పనిచేశానన్నారు. రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఏం రేవంత్రెడ్డితో చొరవతోనే ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి కాంగ్రెస్కు చిప్ప ఇచ్చా రని శాసనమండలి సమావేశాలలో తాను ఎమ్మెల్సీ కవితతో అన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను తీరుస్తుందన్నారు. ప్రజాగ్రహానికి గురై కేసీఆర్ ఇంటికి పోయాడన్నారు. ప్రజల చేతనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వదిలేసిన 30 వేల ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలను అందించిందన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో మరో లక్ష ఉద్యోగాలు అందిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ (డీఎస్) తన రాజకీయ గురువని స్పష్టం చేశారు. 1983లో డీఎస్ ద్వారా తాను ఎన్ఎస్యూఐలోకి వచ్చినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. బీజేపీ ఓట్ల కోసం మతం, ప్రాంతాల వారీగా విభజన చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, నాయకులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీవిప్ ఈరవత్రి ఆనిల్, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్రెడ్డి, తాహెర్బిన్హందాన్, బాడ్సిశేఖర్గౌడ్, గడుగు గంగాధర్, నగర అధ్యక్షులు కేశవేణు, మాజీ మున్సిపల్ చైర్మన్ భక్తవత్సలం(ఢిల్లీ), దిగంబర్పవార్, దిలీప్పవార్, అశోక్గౌడ్, జయసింహాగౌడ్, రామార్తి గోపి, ప్రీతం, వైశాక్షి సంతోష్, వేణుగోపాల్యాదవ్, రాజనరేందర్గౌడ్, మాజీ కార్పొరేటర్ సాయిలు, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, పంచరెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
TS: కాంగ్రెస్ ఎప్పటికీ మారదా.. ఇంతకీ ఏం జరిగింది?
కాంగ్రెస్ అనేది ఓ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..? పార్టీలోకి ఎవరు వస్తారో? ఎవరు బయటకు వెళ్లిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా గందరగోళంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అంతే.. అధికారం వచ్చినా అంతే.. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. నేతల మనోభావాలను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పటికీ మారదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ టీ.కాంగ్రెస్లో ఏం జరిగింది? తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అభ్యర్ధుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది. రెండు ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కాని రాత్రికి రాత్రే కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి దయాకర్.. మహేష్ గౌడ్లలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మళ్ళుతున్న నేపధ్యంలో బీసీ నేత అయిన మహేష్గౌడ్ను తప్పిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెష్కి నష్టం తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్ను తప్పించడానికి నిర్ణయించింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడాన్ని అర్దం చేసుకొవచ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియనే సరిగా జరగలేదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాన్చాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి.. అవకాశం దక్కని నేతలను బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేసారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సజావుగా జరిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది. కాని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. అభ్యర్ధులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్ కి అవకాశం కల్పించలేని పరిస్తితి వస్తే.. కనీసం ఆయనకు పరిస్తితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి.. నామినేషన్ పర్వంలో ఆయన్ను భాగస్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయకపోవడం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దల తీరు మారకపోతే ఎలా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరిని కలుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు. -
ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అందుకోనున్నారు. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని గుర్తు చేశారు. బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించిందని అన్నారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందని తెలిపారు. తన సేవలు గుర్తించి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేస్తే పదవులు వస్తాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం శాసన మండలిలో తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు బల్మూరి వెంకట్. 9 సంవత్సరాలు తనతో పాటు ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ఎన్ఎస్యూఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని అన్నారు. చదవండి: మంత్రి పొన్నంకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ -
MLC: నామినేషన్ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు(కాంగ్రెస్) నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు.. రేపు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా 1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) 2. పేరు: బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
డీఎస్ పక్కా ప్లాన్! టికెట్ కన్ఫామ్ అయ్యాకే పార్టీ మార్పు.. సంజయ్ పోటీ అక్కడినుంచేనా?
ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్లో చేరికతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీలో వార్ మొదలైందా? అర్బన్ సీటు సంజయ్కు కన్ఫామ్ అయిందా? మరి నిజామాబాద్ అర్బన్పై ఆశలు పెట్టుకున్నవారు ఏం చేయాలి? పార్టీలో మొదలైన మాటల యుద్ధాన్ని ఎవరు చల్లార్చుతారు? సంజయ్ వల్ల కాంగ్రెస్కు లాభమా? నష్టమా? వాచ్ దిస్ స్టోరీ.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తన పెద్ద కుమారుడు సంజయ్ను ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేర్చారు. సంజయ్ గాంధీభవన్లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఎంతమంది అడ్డుకున్నా ఈ విషయంలో డీఎస్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్లో తనకున్న పట్టు.. తన రాజకీయ అనుభవం ఏంటో పార్టీలోని ప్రత్యర్థులకు చూపించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొడుకు సంజయ్తో కలిసి కాంగ్రెస్లో చేరి 24 గంటలు తిరక్కుండానే డీఎస్ పీచేముడ్ అనడంతో ఒక్కసారిగా ధర్మపురి ఫ్యామిలీ పాలిటిక్స్ బట్టబయలయ్యాయి. డీఎస్ ఫ్యామిలీ పొలిటికల్ ఎపిసోడ్ పక్కనపెట్టి.. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ రాజకీయాలు పరిశీలిస్తే సరికొత్త వార్కు తెరతీసినట్లయింది. డీఎస్ పక్కా ప్లాన్ తోనే తన కొడుకు సంజయ్ కు టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకునే తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చారన్న చర్చ ఊపందుకుంది. నిజామాబాద్ అర్బన్లో మున్నూరు కాపుల బలమెక్కువగా ఉండటం డీఎస్ కుమారుడికి కలిసొచ్చే అంశం. ఇప్పటికి రెండుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఆయనకు పార్టీలోను, ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి మున్నూరు కాపు బిడ్డను గెలిపించుకోవాలనే గట్టి పట్టుదలతో ఆ సామాజికవర్గీయులంతా ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. చదవండి: ఎంపీ అర్వింద్కు కొత్త టెన్షన్.. నిజామాబాద్లో రసవత్తర రాజకీయం! మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా.. తనకూ, తన తండ్రికి తమ వర్గంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ఈసారి నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలన్నది సంజయ్ యోచనగా ఉంది. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సై అన్నట్టుగా ఇప్పటికైతే ఓ ప్రచారం ఊపందుకుంది. కానీ సంజయ్ మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.. తన గ్రౌండ్ వర్కంతా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంజయ్ రాకను ఆది నుంచీ స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తమ అభ్యంతరాలను ఏఐసీసీకి కూడా నివేదించారు. సీనియర్ నేత, పార్టీకి ఎంతో సేవ చేసిన డీఎస్ వస్తే పర్లేదు గానీ.. సంజయ్ అవసరమా అన్నట్టుగా బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. సంజయ్ రాకను అడ్డుకునేందుకు అంతర్గతంగా పావులు కదిపారు. కానీ డీఎస్ తన పంతం నెగ్గించుకుని కొడుకు సంజయ్ను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..? దీంతో ఇంతకాలం నిజామాబాద్ అర్బన్పై ఆశలు పెట్టుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితేంటన్న చర్చ కాంగ్రెస్లో మొదలైంది. సంజయ్కు టిక్కెట్ కన్ఫామ్ అయిందంటూ సాగుతున్న ప్రచారాన్ని మహేష్ గౌడ్ కొట్టిపారేస్తున్నారు. టిక్కెట్ ఖరారైందంటూ ఇప్పట్నుంచే ఎవరైనా చెప్పుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ.. పరోక్షంగా సంజయ్ కు చురకలంటించే యత్నం చేశారు. తన తమ్ముడు, బీజేపీ ఎంపీ అరవింద్తో కొనసాగుతున్న పొల్టికల్ వార్లో భాగంగా.. అవసరమైతే అరవింద్ పైనే పోటీకి దిగుతానంటూ కూడా సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్టీలోని సంజయ్ ప్రత్యర్థులు దాన్ని కూడా అడ్వంటేజ్గా మార్చుకుంటున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతుండటంతో.. సంజయ్ను అక్కడే తన తమ్ముడిపై బరిలో దింపాలని కూడా అధిష్ఠానం ముందు తమ సూచనలు ఉంచినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వర్గం...మరోవైపు సంజయ్ వర్గం కాంగ్రెస్ బరిలో గిరిగీసి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీలతో కాకుండా..పార్టీలోని ప్రత్యర్థులతోనే ఎవరికి వారు పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్లో కొనసాగుతోంది. మొత్తం మీద నిజామాబాద్ అర్బన్లో ఒకవైపు డీఎస్ ఫ్యామిలీలో అంతర్గత యుద్ధం..మరో వైపు హస్తం పార్టీలో టిక్కెట్ పోరు అక్కడి కేడర్లో ఉత్కంఠను రేపుతోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్డెస్క్ -
ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయొచ్చు : మహేష్ కుమార్ గౌడ్
-
మేం దాడులకు దిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోతారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రతిదాడులకు దిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతిపై పోస్టర్లు అంటిస్తున్నారన్న కారణంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్పై దాడి చేయడం హేయమని మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తోట పవన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అనుచరులు కిరాతకంగా దాడిచేశారని, హత్య చేసేందుకు యత్నించారని, వినయ్భాస్కర్తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేశ్కుమార్ డిమాండ్ చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత నాయకుడు సాయన్నకు ప్రభుత్వం గౌరవం ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దళితులంటే గౌరవం లేదని, కనీసం అధికారిక లాంఛనాలతో కూడా సాయన్న అంత్యక్రియలు పూర్తి చేయకుండా చావులో కూడా సాయన్నకు బాధను మిగిల్చారని మహేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
‘హాథ్సే హాథ్ జోడో’ ఇన్చార్జీల నియామకం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 26వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్న హాథ్సే హాథ్జోడో యాత్రల కోసం కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీ లను నియమించింది. యాత్రలను క్షేత్రస్థాయి నుంచి సమన్వయం చేయడం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులకు బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుమతి మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
గాంధీ భవన్ వద్ద రచ్చ రచ్చ.. అలిగి వెళ్లిపోయిన వీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ఇందుకు మరోసారి వేదిక అయ్యింది. సీనియర్ నేత వీ హన్మంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో గాంధీ భవన్ నుంచి వీహెచ్ బయటకు వచ్చేశారు. క్రికెట్ టోర్నమెంట్కు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రేను ఆహ్వానించేందుకు వీహెచ్ గాంధీభవన్కు వెళ్లారు. అయితే.. ఆ సమయంలో మహేష్ గౌడ్, వీహెచ్ మధ్య వాగ్వాదం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్కు ఠాక్రేను వీహెచ్ ఆహ్వానించగా.. 22వ తేదీన ఇన్ఛార్జి షెడ్యూల్ ఖాళీగా లేదని మహేష్ గౌడ్ బదులిచ్చారు. దీంతో ఇన్ఛార్జి వస్తానంటే నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావంటూ వీహెచ్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఆపై బయటకు వచ్చేసిన వీహెచ్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ‘‘ఈ కార్యక్రమం పీసీసీ ప్రెసిడెంట్ పెట్టలేదని, తాను పెట్టానని మహేష్ గౌడ్ తనతో అన్నాడని, పీసీసీ ప్రెసిడెంట్కే లేని అభ్యంతరం అతనికి ఎందుకని? ఎవరికి వారే ఇక్కడ లీడర్ ఉన్నారంటూ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారాయన. -
ప్రజలు మీ పని పట్టే ఆలోచనలో ఉన్నారు.. హరీష్ రావుకు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు.. మీకు పదవులు వచ్చాయంటే అది సోనియా భిక్ష అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మహేష్ కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లను చూసిన సముద్రం వంటిది. పదవులే పరమావధిగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తారు. కాంగ్రెస్ పని అయిపోయిందని హరీష్ రావు చెప్పడం కాదు.. ప్రజలు మీ పని పట్టే పనిలో ఉన్నారు. పార్టీలో తెలంగాణ అనే పదం లేకుండా బీఆర్ఎస్ను ఏర్పాటు చేసుకున్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు. సోనియా భిక్ష వల్లే మీకు పదవులు వచ్చాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అధికారం మీద కాంక్ష లేదు. అందుకే దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా పదవి చేపట్టకుండగా మన్మోహన్ సింగ్ను ప్రధానిని చేశారు. ఈ నెల 20, 21,22 తేదీలో ఏఐసీసీ ఇంచార్జ్ తెలంగాణ పర్యటనకు రానున్నారు. కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతారు. హత్ సే హత్ జోడో యాత్ర, పార్టీ బలోపేతం మీద చర్చిస్తారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు తప్పుల తడకగా ఉంది. టీచర్ల ఎమ్మెల్సీలో కూడా అదే కుట్ర చేస్తున్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ ప్రకటన చేశారు. ప్రతీ నెల ఒకటో తేదీన రావాల్సిన జీతాలు, సమయానికి రావడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రెండు నెలలు పాదయాత్రలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 26 నుంచి జరగనున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్లో భాగంగా రెండు నెలల పాటు పార్టీ శ్రేణులు రాష్ట్రమంతటా పాదయాత్రలు నిర్వహించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బి. మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చా రు. హాథ్ సే హాథ్ జోడోతోపాటు ఈనెల 9న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న సర్పంచ్ల ధర్నాపై శనివారం గాంధీభవన్ నుంచి డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల చైర్మన్లతో ఆయన జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను తెలంగాణలోని పల్లెపల్లెకు తీసుకెళ్లాలని కోరారు. ఈనెల 9న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న ధర్నాకు సర్పంచ్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్రంలోని దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బి.మహేశ్కుమార్గౌడ్ స్పష్టం చేశారు. జగన్లాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ ఎస్టీ సెల్ సమావేశంలో మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ..బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆయా వర్గాలకు జరిగిన లబ్దిని వివరించడం ద్వారా రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాల మద్దతును కాంగ్రెస్ పార్టీకి కూడగట్టాలని ఆయన కోరారు. సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాములు నాయక్, మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్పై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్పై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి అధిష్టానం దూతలు రంగంలోకి దిగారు. సంక్షోభ నివారణ బాధ్యతలు రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్కు అప్పజెప్పుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ మంగళవారం ఫోన్ చేశారు. సాయంత్రం సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేయాలని దిగ్విజయ్ సూచించారు. ఈ మేరకు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కు వస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నేతలతో దిగ్విజయ్ భేటీ కానున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని దిగ్విజయ్ చెప్పారని పేర్కొన్నారు. కాగా ముందస్తు నిర్ణయం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు భేటీకావాల్సి ఉంది. అయితే దిగ్విజయ్ సింగ్ ఫోన్తో వారు వెనక్కి తగ్గారు. తాజా పరిణామాల నేపథ్యంలో సాయంత్రం జరగాల్సిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాయిదా పడింది. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మహేష్ గౌడ్, కోదండరెడ్డి భేటీ అయ్యారు. సాయంత్రం సీనియర్ల సమావేశం వాయిదా వేయాలని కోరారు. చదవండి: తెలంగాణ పీసీసీలో విభేదాలపై ప్రియాంక నజర్ -
ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని తమ పార్టీ తీర్మానించిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్ శుక్రవారం చెప్పారు. వజ్రోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని ఆలపిస్తామని, దీన్ని తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర గీతంగా మారుస్తామని తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో టీఎస్ను టీజీగా మారుస్తామన్నారు. సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాల డిజైన్ను శనివారం విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్లో ఎలాంటి వివాదం లేదని ఉద్ఘాటించారు. అన్ని గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ద్వంద్వ నీతిని గమనించాలి: మల్లు రవి తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ ద్వంద్వ నీతిని గమనించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి కోరారు. అంబేడ్కర్ పేరును సచివాలయానికి పెట్టినందుకు కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ గతంలో చెప్పారని, ఆ వ్యాఖ్యలను ఇప్పటికీ ఉపసంహరించుకోలే దన్నారు. కాగా, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూపొందిన తెలంగాణ తల్లిపై కాంగ్రెస్ లో భిన్నభిప్రాయాలు విన్పిస్తున్నాయి. గురువారం సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నివాసంలో జరిగిన సీనియర్ల భేటీలో ఈ విషయంపై చర్చ జరిగిందని సమా చారం. రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందిస్తామన్న రేవంత్ ప్రకటన గురించి ప్రస్తావన రాగా...ప్రాంతీయ పార్టీల మాదిరిగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కాంగ్రెస్కు ఉండదని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. -
నెల రోజుల్లో కాంగ్రెస్లోకి ఆశ్చర్యకర చేరికలు
సాక్షి, హైదరాబాద్: నెల రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలోకి ఆశ్చర్యకర చేరికలుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా మాట్లాడుతున్నారని, వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన వెల్లడించారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఈనెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన విజయవంతం చేసేందుకు మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం గాంధీభవన్లో జరిగింది. సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు అంజన్కుమార్ యాదవ్, బొల్లు కిషన్, రాచమళ్ల సిద్దేశ్వర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రసాద్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చదవండి: టీఆర్ఎస్కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు గుడ్బై! బీజేపీలోకి ప్రదీప్రావు? -
రాహుల్ గురించి ఎర్రబెల్లి మాట్లాడితే సిగ్గేస్తోంది
సాక్షి,హైదరాబాద్: క్లబ్లకు వెళ్లి పత్తాలాడే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా రాహుల్గాంధీ గురించి మాట్లాడటం చూస్తుంటే సిగ్గేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వివాహ వేడుకల్లో పాల్గొన్న రాహుల్గాంధీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. అమరవీరుల త్యాగాల మీద పదవులు అనుభవిస్తోన్న టీఆర్ఎస్ నేతలు దిగజారి రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. -
డ్రగ్స్పై సిట్ ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లో వెలుగు చూసిన పబ్లో డ్రగ్స్ వినియోగం కేసులో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ కోరారు. ఆదివారం గాంధీభవన్లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కేసులో ఏసీపీకి మెమో ఇచ్చి సీఐని సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. నిజాయితీగా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై ఒక డాక్టర్గా, గవర్నర్ తమిళిసై స్పందించాలని మహేశ్గౌడ్ కోరారు. అన్ని పబ్లు మూసివేయాలి నగరంలోని అన్ని పబ్లను మూసివేయాలని మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. తన కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పబ్కు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. స్నేహితులతో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్న తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. -
9 నుంచి కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రతిఒక్కరు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వడ్ల కొనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని, 30 లక్షల ధాన్యం కొనుగోలు చేశామని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఆఖరు గింజ కొనేంతవరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని, మళ్ళీ కళ్లాల్లోకి వెళ్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధ్యయనానికి కాంగ్రెస్ నుంచి ఒక బృందం ఛత్తీస్గఢ్కు వెళ్లనుందన్నారు. -
కవిత ఎందుకు బంగారమైంది..?
హైదరాబాద్సిటీ: నిజామాబాద్ ఎంపీ కవిత ఏం చేసిందని బంగారమైందో మంత్రి కేటీఆర్ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మహేశ్కుమార్గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే కేటీఆర్ మంత్రి అయ్యాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిందేమిటో అదే వేదిక మీదున్న డి.శ్రీనివాస్ను అడిగితే తెలిసేది కదా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గత చరిత్ర విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. సంస్కారం లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. అమెరికాలో నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని మహేశ్కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగులను చెప్పులతో కొట్టాలన్న కేటీఆర్ను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. -
కారు బోల్తా: టీపీసీసీ నాయకుడికి గాయాలు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నగర్ మండలం బాన్సువాడ క్రాస్ రోడ్డు వద్ద శనివారం టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్కుమార్ గౌడ్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... మహేష్కుమార్ను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ విషయం తెలిసిన తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆసుపత్రికి చేరుకుని... మహేష్కుమార్ను పరామర్శించారు.