‘తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు’ | TPCC President Mahesh Goud On Delhi Election Results | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు’

Published Sat, Feb 8 2025 9:57 PM | Last Updated on Sat, Feb 8 2025 10:14 PM

TPCC President Mahesh Goud On Delhi Election Results

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ అధికారంలో రాదన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మహేష్‌ గౌడ్‌ స్పందించారు. ఢిల్లీ ఫలితాలను చూసి తెలంగాణ బీజేపీ నాయకులు అమితానంద పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది జరగదన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మా పార్టీకి రక్ష. ఇచ్చిన 6 గ్యారంటీలని అమ్మడు పరుస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిది కాంగ్రెస్. ఈ సంక్షేమ పథకాలే మళ్లీ కాంగ్రెస్‌ను ెగెలిపిస్తాయి. కేటీఆర్ పరిస్థితి విచిత్రంగా ఉంది.బిజెపిని అభినందించలేక లోలోపల మునిసిపోతున్నాడు. కేసీఆర్‌, కేటీఆర్‌ శకం.. ఈ రాష్ట్రంలో  ముగస్తుంది. దేశవ్యాప్తంగా త్వరలోనే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది, తిరిగి అధికారంలోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement